అన్నదాతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా రైతు డిస్కం ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ రోజు రైతు డిస్కం, రేపు ఉచిత విద్యుత్పై కోతలు, ఎల్లుండి విద్యుత్ రంగ ప్రైవేటీకరణ దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
అసైన్డ్ భూముల విషయంలోనూ ఎన్నికల హామీలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోంది. రైతుల హక్కులు, పేదల భూములు, తెలంగాణ ప్రజల ఆస్తుల రక్షణ కోసం పోరాటం కొనసాగుతుంది, అవసరమైతే మరో ఉద్యమానికైనా సిద్ధమని టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు నల్గొండ వేదికగా జరిగిన రైతుల రౌండ్ టేబుల్ సమావేశంలో తేల్చి చెప్పారు.
#telangana