🪷158లింగమహాపురాణం🪷
🍀అష్టాక్షరి నారాయణ , ద్వాదశాక్షరి వాసుదేవ మంత్ర మహిమ🍀
#నూటయాభైఎనిమిదోభాగం#
శౌనకాది మునులు సూత మహర్షిని "రోమహర్షణ మహర్షీ! ఏ మంత్ర జపముతోమానవులు సంసార బంధాల నుండివిముక్తి పొందగలరుఏమంత్రజపoతో మోక్ష ప్రాప్తి కలుగుతుంది? ఏ మంత్రం అశుభముల నుంచి కాపాడి శుభ ఫలితములు ఇస్తుంది?ఆమంత్రములగురించి తెలియజేయండి" అని కోరారు.
సూత మహర్షి సరేనని ఇలా చెప్పసాగాడు.
"మునులారా! పూర్వము వశిష్ఠ మహర్షి మీవలెనే అడిగిన ప్రశ్నకు బ్రహ్మదేవుడు ఇచ్చిన సమాధానం మీకు వివరిస్తాను. విష్ణువు దేవతలకు అధిపతి. మానవుల పాపములు పోగొట్టి మోక్షము ప్రసాదించు కరుణా మూర్తి. నారాయణ నామస్మరణ పగలురాత్రిచేయుచూ,మనస్సు శరీరము ఆయన యందే లగ్నం చేస్తూ ఎవడు ఉంటాడో, అతడే జ్ఞానము కలిగిన పండితుడు అవుతాడు.
"ఓం నమో నారాయణాయ" అని అష్టాక్షరి మంత్రాన్ని గానీ, "ఓంనమోభగవతేవాసుదేవాయ" అనేద్వాదశాక్షరిమంత్రాన్ని గానీ ఏ వ్యక్తి మనస్సులో నిరంతరం జపిస్తూ ఉంటాడో అతను మోక్షము తప్పక పొందుతాడు. ఎవరైతే భోజ్య (తినే) పదార్థాలు, పేయ (త్రాగే) పదార్థాలు, లేహ్య (నాకదగిన) పదార్థాలునారాయణమంత్రంతోఅభిమంత్రించితీసుకుంటారో వారికి ఆ పదార్థాలు మహిమ కలిగి శారీరక మానసిక పుష్టికి దోహదం చేస్తాయి.
నారాయణ మంత్రం జపించే, స్మరించే ప్రదేశంలో అశుభలక్ష్మి ఉండలేక పారిపోతుంది. శ్రీహరి లక్ష్మీదేవి సమేతుడైన ఆ వ్యక్తి ఇంటిలో,దేహములోనివసిస్తాడు. నారాయణ మంత్రం, వాసుదేవ మంత్రం సర్వార్ధ సిద్ది ప్రదాయకము అనడంలో అణుమాత్రం సందేహం లేదు.
ద్వాదశాక్షరి అయిన "ఓం నమో భగవతే వాసుదేవాయ"జపము చేయువారు తమ బంధు మిత్ర కుటుంబ సభ్యులతో కలసి విష్ణులోకం చేరుతారు.
ఈ మంత్ర జపము వేదముల తత్త్వములను ప్రాప్తింపచేయు ప్రాచీనమైన సాధనము అని పెద్దలు చెబుతారు.ద్వాదశాక్షరి మంత్ర మహత్మ్యం తెలిపే కథ ఒకటి మీకు చెబుతాను.
పూర్వము విద్వాంసుడైన బ్రాహ్మణుడికి ఐతరేయుడు అనే కుమారుడు జన్మించాడు. కుమారునికి జాతకర్మలు చేసిన తరువాత తగిన వయస్సులో ఉపనయనం చేసివిద్యాభ్యాసం ప్రారంభించాడు.కానీఐతరేయుడు ఒక్క అక్షరమైనా పలకలేక పోయేవాడు. జిహ్వ (నాలుక) శబ్దం చేయలేక కదలకుండా ఉండిపోయేది.
బ్రాహ్మణుడు చింతించి వేద పండితులైనకుమారులుకావాలని ద్వితీయ వివాహం చేసుకుని అనేక మంది పుత్రులకు జన్మ నిచ్చాడు. వారందరు పెరిగి పెద్దవారు వేదాధ్యయనము చేసి తమ విద్యాబలముతో ధనికులైనారు.
ఐతరేయుడి తల్లి దుఖించి కుమారునితో "నా సవతి పుత్రులు వేదవిద్వాంసులై గౌరవము,ధనముపొందు
తున్నారు.నీవుఈఅభాగ్యురాలికి జన్మించి విద్యావిహీనుడివి అయ్యావు. మానవుడై పుట్టిన వాడు జీవించుటకు ఏదో ఒక పని చేయాలి. నీవు తగిన పని చూసుకొనుము"అనిచెప్పడంతో ఐతరేయుడు తల్లికి నమస్కరించి బయలుదేరాడు.
ఐతరేయుడుయజ్ఞముజరుగుతున్నయజ్ఞస్థలమునకువెళ్లాడుఅక్కడ మంత్రోచ్ఛారణ చేస్తున్న బ్రాహ్మణులు ఐతరేయునిచూసి నిశ్చేష్టులయ్యారు.మంత్రోచ్ఛారణ ఆగిపోయింది.గొంతులు ఎవరోకట్టేసినట్టుమూగవోయాయి. అక్కడి హోమగుండం లో ప్రజ్వరిల్లుతున్న అగ్నిని చూడ గానే ఐతరేయుడి కంఠం నుండి "ఓంనమోభగవతేవాసుదేవాయ" అనే శబ్దం ఉచ్ఛస్వరంతో బయటకు వచ్చింది.
యజ్ఞం చేస్తున్న బ్రాహ్మణులకు ఆ వాసుదేవ మంత్ర శబ్దం విన గానే పోయిన వాక్కు తిరిగి వచ్చింది. మంత్రోచ్ఛారణ పునః ప్రారంభం అయ్యింది. యజ్ఞం సమాప్తం కాగానే బ్రాహ్మణులు ఐతరేయునిపూజించారు.భోజనతాంబులాలుపెట్టినతరువాత ధనము, వస్త్రములతో సన్మానించారు. ఐతరేయుడు వాసుదేవ శబ్దాన్ని "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే ద్వాదశాక్షరిమంత్రంగాచేసుకుని మనస్సులో జపించసాగాడు.
మంత్ర సిద్ధి ఐతరేయుడికి లభించింది.జ్ఞానసిద్దిలభించింది.సిద్ధచారణులు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారు. ద్వాదశాక్షరి మంత్ర జపముతో తనకు లభించిన ధన కనక వస్తువులు ఇంటికి తీసుకెళ్లి తల్లికినమస్కరించిసమర్పించాడు. తల్లి ఐతరేయుని చూసి మురిసిపోయి ఆశీర్వదించింది. వాసుదేవ మంత్ర జపముతో ఐతరేయుడు అనతికాలం లోనే తల్లితో సహా వైకుంఠం వెళ్లాడు. విష్ణువు సానిధ్యం పొందాడు.
మునులారా! ద్వాదశాక్షర వాసుదేవమంత్రంపాపవిముక్తులను చేసి విష్ణు సానిధ్యం కలిగిస్తుందిఅనేదినిస్సందేమైనది. ఈ ద్వాదశాక్షరి మంత్ర మహత్మ్య కథ విన్నవారుమహా పాపవిముక్తిపొందుతారు. వైకుంఠంలో నివాసము పొందుతారు" అని సూత మహర్షి కథ ముగించాడు.
.*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
https://chat.whatsapp.com/DnFG7pWG3BkH6MKxaSFRFb #🌅శుభోదయం#🙏శుభాకాంక్షలు#🙏ఓం నమః శివాయ🙏ૐ
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺