Hashtagnews.net
516 views
14 hours ago
న్యూక్లియర్ ఎనర్జీ ఇనిస్టిట్యూట్ (NEI), యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం (USISPF) సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన ‘యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా’ సదస్సులో గౌరవ ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ @Nara Lokesh గారితో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉంది.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వంలో న్యూక్లియర్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, AI ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, డేటా సెంటర్ ఎకోసిస్టమ్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.₹10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ పెట్టుబడుల లక్ష్యంతో… విశాఖపట్నాన్ని AI & డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చేస్తూ… ఏపీని భవిష్యత్ సాంకేతిక మరియు పారిశ్రామిక శక్తిగా నిలబెట్టే ప్రయత్నాలు వేగంగా కొనసాగుతున్నాయి.పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, అనుకూల పారిశ్రామిక విధానాలతో AI రంగానికి అవసరమైన గ్రీన్ ఎనర్జీ అందించడంలో అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ఈ సదస్సు వేదికగా స్పష్టం చేయడం జరిగింది. #🟡తెలుగుదేశం పార్టీ