#తమిళనాడు రాజకీయాలు 🚩🥱 #జనసేన #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯
*విజయ్ విజయం.. జనాలను నమ్మించారు❗*
MAY 4, 2026🎯
తమిళనాడులో విజయ్ సాధిస్తున్న ఆధిక్యం చూసి ఏపీ సహా దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో, మరి ముఖ్యంగా జనసేన నేతల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. కులం, మతం, ప్రాంతం అనే గీతలను దాటి ఓటరు నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందో తమిళనాడు ఫలితాలు చూపుతున్నాయనే చెప్పుతూనే, ఏపీలో ఓటర్లు ఇలా చూడరని.. ఓటు వేసేవారు కులం, మతం, డబ్బు చూసే ఓటు వేస్తారని అంటున్నారు.
నిజానికి జనసేన నేతలు చెబుతున్న వాదన సరైనది కాదు. ఎందుకంటే ఇది కొత్త ఉదాహరణ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలుగు ప్రజలు ఇదే విషయాన్ని
నిరూపించారు. అన్న ఎన్టీఆర్ గారి ప్రవేశం, పార్టీ స్థాపన చేసిన కొద్ది నెలల్లోనే ఎన్నికలకు వెళ్లి, అప్పటివరకు తిరుగులేని శక్తిగా ఉన్న పార్టీపై ఘన విజయం సాధించడం అందరికీ తెలిసిందే. అప్పటికి ఆయన మద్రాస్లో సినిమాలు చేసుకునే నటుడు మాత్రమే. అయినా ప్రజలు వ్యక్తిత్వాన్ని, నమ్మకాన్ని చూసి ఓటేశారు గానీ కులాన్ని కాదు.
ప్రజల నమ్మకం. రాజకీయాల్లో గెలవాలంటే ఒకే సూత్రం “నేను వస్తే మీకు మంచి చేస్తాను, అభివృద్ధి చేస్తాను” అని చెప్పడమే కాదు, అది ప్రజలకు నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం కలిగిన చోటే ఓట్లు పడతాయి.
ఇక్కడే విజయ్ వ్యూహం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇతర పార్టీలతో పొత్తులు, లోపాయికారీ ఒప్పందాలు లేకుండా, సింగిల్గా పోటీ చేస్తూ ప్రజల్లోకి వెళ్లాడు. ప్రతి సభలో ఒకే మాట చెప్పాడు. “నా పార్టీ నుంచి పోటీ చేసే ప్రతి అభ్యర్థిని విజయ్ గానే భావించి ఓటు వేయండి”. ఈ మాటే ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అభ్యర్థిని కాదు, నాయకుడిని నమ్మి ఓటు వేయడం.. ఇదే ట్రెండ్ ఇప్పుడు తమిళనాడులో కనిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే, ప్రజలు విజయ్పై నమ్మకం ఉంచి ఓటు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
విజయ్ విజయంపై జనసేన నాయకులు ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో ఈ చర్చ మొదలైంది. “మా నాయకుడు పొత్తు పెట్టుకోకపోతే గెలవలేడు”, “ఏపీలో కులాలు, మతాలు చూసే ఓటు వేస్తారు” అని చెప్పడం విడ్డూరంగా ఉంది. జనసేన అధినేత పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన స్వతంత్రంగా పోటీ చేసి గెలవాలనే దానికంటే, ఒక పార్టీ కోసం, ఆ పార్టీ అధినేత కోసమే రాజకీయాలు చేస్తున్నారనే భావన ఏపీ జనాల్లో బలంగా ఉంది. అందుకే ఆయనకు పెద్దగా ఆదరణ లభించడం లేదు.
టీవీలు, పత్రికలు లేకపోయినా తన స్వరంతోనే ప్రజల్లోకి వెళ్లిన విజయ్, తన ఆలోచనలను స్పష్టంగా ప్రజలకు చెప్పారు. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా పోటీ చేస్తానని ప్రకటించి, అన్ని చోట్ల సామాన్య అభ్యర్థులను నిలబెట్టారు. తన డ్రైవర్కే టికెట్ ఇచ్చి గెలిపించమని కోరారు.
అదే సమయంలో, పవన్ కళ్యాణ్ పార్టీలో మాత్రం నామినేషన్
వేసే ముందు రోజు వరకూ పక్క పార్టీలో ఉన్న సంపన్నులకు టికెట్లు ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. గెలిచిన తర్వాత కూడా మరో 15 సంవత్సరాలు సీఎం చంద్రబాబు కోసమే పనిచేస్తానని చెప్పిన వ్యక్తిని జనాలు ఎలా నమ్ముతారు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అందుకే విజయ్ విజయాన్ని తక్కువ చేసి చూపకుండా, తమ తప్పులను గుర్తించుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
జనసేన అధినేత చెప్పినట్లుగా "కనీసం కులం చూసైనా ఓటు వేయండి” అని విజయ్ ఎక్కడా చెప్పలేదు. అధికారంలో ఉన్నవారు చేసిన తప్పులను చూపిస్తూ, “నేను వస్తే వాటిని సరిచేస్తా” అని చెప్పాడు. అదే ప్రజల్లో నమ్మకం కలిగించింది.
పార్టీ పెట్టకముందే ఒక పార్టీ కోసం తన అభిమానులు పోరాడాలని విజయ్ ఎప్పుడూ పిలుపునివ్వలేదు. ఒకసారి ఆయన ఈ ఎన్నికల్లో చేసిన ప్రసంగాలు పరిశీలిస్తే, జనసేన నేతలు చెబుతున్నది వాస్తవం కాదని స్పష్టమవుతుంది.