ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯
• 112 views
Telugu Desam Party (TDP)
320 views 5 days ago
నేనూ రైతు బిడ్డనే, వ్యవసాయంలో నాకు ఎక్కువ కమిట్‌మెంట్ ఉంటుంది. నా రైతు కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో నిత్యం అండగా నిలుస్తున్నాం. #AnnadathaSukhibhava3 #PMKisan #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
12 likes
9 shares
P.Venkateswara Rao
639 views 3 days ago
#🟡తెలుగుదేశం పార్టీ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 * #చంద్రబాబు బలహీనపడుతున్నారా❓* MARCH 16, 2026🎯 రాజకీయనాయకులు సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ రాటుదేలుతారు! అనుభవం వారిని మరింత దృఢంగా తయారుచేస్తుంది. ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీల్లో అయితే వ్యక్తిస్వామ్యమే నడుస్తుంది. అధినాయకుడి మాటకు తిరుగుండదు. పార్టీ నాయకుల మనుగడ, అస్తిత్వం అధినేత దయాదాక్షిణ్యాలపై, ఆగ్రహానుగ్రహాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను ఏలుతున్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి భిన్నంగా ఉంది. నాలుగున్నర దశాబ్దాల రాజకీయానుభవం ఉన్న దిగ్గజం, నాలుగోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని సుదీర్ఘకాలంగా ఏలిన చరిత్రను తన పేరిట లిఖించుకున్న చంద్రబాబునాయుడు ఇప్పుడు బేల పలుకులు పలుకుతున్నారు. ఆయన దయాలబ్ధమైన పదవుల్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఆయన మాటలనే ఖాతరు చేయడం లేదని అర్థమవుతోంది. ఎమ్మెల్యేలు గాడితప్పడం.. పార్టీనే అథఃపాతాళానికి తొక్కేస్తుందని.. ఈ అనుభవజ్ఞుడైన రాజకీయ కోవిదుడికి తెలుసు. కానీ, వారిని గాడిలో పెట్టడంలో ఆయన సఫలం కాలేకపోతున్నారు. ఇందుకు దారితీస్తున్న కారణాలు ఏమిటి? పార్టీలో ఎలాంటి అవ్యవస్థ రాజ్యమేలుతోంది? క్రమశిక్షణ, కనీస నిజాయితీ మెజారిటీలో కరవవుతున్న ఈ పోకడలు తెలుగుదేశం ప్రస్థానాన్ని ఏ దిశగా నడిపిస్తున్నాయి? పరిణామాలు, పర్యవసానాల విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ.. ‘చంద్రబాబు బలహీనపడుతున్నారా?.. వేరీజ్ కమాండ్? వేరీజ్ కంట్రోల్?’ 'కమాండ్ కంట్రోల్'.. సాధారణంగా మిలిటరీ ఆపరేషన్స్ లో మాత్రమే ప్రముఖంగా వినిపించే పదం ఇది. సైనిక సిబ్బందిని, ఆయుధాల్ని, పరికరాల్ని, వాహనాల్ని, వ్యూహాల్ని ప్రతి దానినీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, పదునుపెట్టుకుంటూ, మార్చుకుంటూ.. విజయం దిశగా నడిపించడంలో కేంద్రబిందువుగా వ్యవహరించే వ్యవస్థను కమాండ్ కంట్రోల్ అని అంటుంటారు. రాజకీయాల్లోకి, సాధారణ పరిపాలనలోకి, అన్ని రకాల వ్యవస్థల్లో వివిధ పనుల నిర్వహణ తీరులోకి ఈ పదం ఎప్పుడు ప్రవేశించిందో ఇదమిత్థంగా తేల్చిచెప్పడం చాలా కష్టం కానీ.. రాజకీయాల్లోకి ఈ పదం ప్రబలంగా ప్రవేశించడంలో మాత్రం.. హైటెక్ నాయకుడిగా కొన్ని దశాబ్దాలుగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్న నారా చంద్రబాబునాయుడు పాత్ర చాలానే ఉంటుందని ఊహించవచ్చు. ఇప్పుడు మాత్రం కేవలం పోలీసు వ్యవస్థలో మాత్రమే కాదు.. పుష్కరాలు వంటివి జరిగినా, టీటీడీలో అయినా, రాష్ట్ర పరిపాలనలో అయినా ప్రతిచోటా కమాండ్ కంట్రోల్ అనేది సర్వసాధారణం అయిపోయింది. చంద్రబాబు ప్రతి చిన్నదానికి కమాండ్ కంట్రోల్ వాడేస్తుంటారు. కానీ, ఈ పదబంధాన్ని విడగొట్టి చూసినప్పుడు ఆ పదాల్ని చంద్రబాబునాయుడు నాయకత్వానికి అన్వయించి చూసినప్పుడు.. కించిత్ ఆశ్చర్యం కలుగుతుంది. మునుపటి స్థాయిలో చంద్రబాబులో కమాండ్ గానీ, కంట్రోల్ గానీ ఇంకా మిగిలున్నాయా? అనే సందేహం కలుగుతుంది. పట్టుతప్పుతున్నారనే అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. ఆయనను ఎంతగా సమర్థించేవారు, ఆరాధించేవారు కూడా అవునని ఒప్పుకోవడానికి తగినట్టుగా ఆయనే అలాంటి కొన్ని సంకేతాలను ప్రజల్లోకి పంపారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. ఆత్మసమీక్ష చేసుకుంటూ నోరుజారారో.. లేదా, అంతర్మధనం తాళలేక ఆక్రోశం వెళ్లగక్కే ప్రయత్నంలో జాగ్రత్త మరచిపోయారో స్పష్టంగా తేల్చలేం. కానీ.. రాజకీయ దురంధరుడిగా అభిమానులు చెప్పుకునే తన హవా సన్నిగిల్లుతోందని ఆయన బయటపడ్డారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబును మించిన సీనియర్లు, సీనియారిటీ పరంగా ఆయనతో సమఉజ్జీలు ఇంకా చాలా మందే ఉంటారు. ఒకప్పట్లో చంద్రబాబును ఖాతరు చేయకుండా తలెగరేసి స్వతంత్రంగా వ్యవహరించి, తర్వాతి పరిణామాల్లో గత్యంతరంలేక ఆయన పంచన చేరిన వారు, సర్దుకుపోతున్నవారు కూడా అనేకులు ఉంటారు. ఇలాంటి వారు ఎవరైనా ఇప్పటికి కూడా ఆయనకు కొరకరాని కొయ్యలా మారి ఇబ్బంది పెడుతోంటే.. సహజమేలే అని సరిపెట్టుకోవచ్చు. అలాకాకుండా.. నిన్నకాక మొన్న రాజకీయ రంగ ప్రవేశం చేసి, ప్రజాజీవితంలో ఇంకా బొడ్డూడని నాయకులు కూడా.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిని, రాష్ట్ర అధినేతను బేఖాతరు చేస్తున్నారంటే అది చాలా సీరియస్ విషయమే. ప్రజలకోసం పనిచేయడమూ, లేదా, పనిచేసినట్లుగా కనిపించడమూ మాత్రమే కాదు.. ఎన్నికల్లో మళ్లీ మళ్లీ గెలవాలంటే ఇంకా చాలా చాలా ఫ్యాక్టర్స్ అవసరం అవుతాయనే సంగతి.. అనేక ఓటములను కూడా చవిచూసిన చంద్రబాబుకు చాలా బాగా తెలుసు. ప్రజలలో ప్రభుత్వం యొక్క పరువు ప్రతిష్ఠలు ఏ కొంచెం దెబ్బతిన్నా కూడా భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆయనకు తెలుసు. అందుకే ఎమ్మెల్యేలు ఎంతగా దారితప్పుతున్నా.. తాను మాత్రం.. అందరినీ దారిలో పెడుతున్నట్టుగా మాట్లాడుతుంటారు. సుద్దులు వల్లిస్తుంటారు. ఫరెగ్జాంపుల్.. లిక్కర్ వ్యాపారాల్లో సిండికేట్లను ప్రోత్సహించవద్దు.. ఇసుకవ్యాపారంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దు.. వంటి డైలాగులే అనుకుందాం. ఇవన్నీ ప్రజలను నమ్మించడానికి తాను వల్లించే మాటలే తప్ప.. ఆచరణలో ఎవరికి వారు దోపిడీ పర్వం కొనసాగించవచ్చునని బహుశా చంద్రబాబుకు కూడా లోలోన ఉంటుందేమో. కానీ.. ప్రజల్ని నమ్మించడానికి ఆయన ఇలాంటి మాటలు చెబుతుంటారు. దోచుకునే వారిని చూసీచూడనట్టు ఉపేక్షిస్తుంటారు. మరీ బజార్న పడి.. పార్టీ పరువుపోకుండా ఉంటే చాలు.. ప్రతిఒక్కరూ వచ్చే ఎన్నికల్లో డబ్బు వెదజల్లడానికి సరిపడా స్వయం సమృద్ధంగా తయారుకావాలనే ఆలోచన ఆయనకు కూడా ఉంటుంది. కానీ.. చంద్రబాబుకు కూడా వెరపు పుట్టేలాగా బరితెగించిన వారి విషయం ఏమిటి? తన సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికల్లో అలాంటి బరితెగించిన ఎమ్మెల్యేల వివరాలు తెలుసుకున్నప్పటికీ.. వారిని ఏమీ అనలేని స్థితిలో అధినేత ఉన్నారు. వారి దందాలు ఇప్పటికీ అలాగే సాగుతున్నాయి. పార్టీ పరువు గంగలో కలవడం నిత్యకృత్యంగా జరుగుతూనే ఉంది. పరోక్షంగా తన మాటల్లో చంద్రబాబే ఇదంతా ఒప్పుకుంటున్నారు. మూడో వంతు ఎమ్మెల్యేలు దారి తప్పినట్టే.. చంద్రబాబునాయుడు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఒక ముచ్చట పంచుకున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేల్లో నలభై మంది ఎమ్మెల్యేలు గాడితప్పినట్టుగా ఆయన వెల్లడించారు. వారందరినీ వ్యక్తిగతంగా పిలిపించి వన్ టూ వన్ మాట్లాడానని, మందలించానని చెప్పారు. ఆ తర్వాత సుమారు 15 మంది ఎమ్మెల్యేల పనితీరులో మార్పు వచ్చిందని, మిగిలిన 25 మంది ఇంకా దారిలోకి రాలేదని చంద్రబాబు స్వయంగా చెప్పారు. వారిలో నలుగురైదుగురిపై త్వరలోనే కఠిన చర్యలు ఉంటాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ మాటలు వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు వ్యక్తిస్వామ్యం పార్టీలుగా ఉంటాయి. పార్టీలో ఎంతటి పోటుగాళ్లు అయినా సరే.. అధినేతకు జడుసుకుంటూ ఉంటారు. తమ రాజకీయ భవిష్యత్తు అంతా ఒకే వ్యక్తి చేతిలో ఉంటుంది గనుక.. ఆయన చెప్పుచేతల్లో మెలగుతూ ఉంటారు. ఆయనకు ఆగ్రహం తెప్పించడానికి సాహసించరు. ఆయనే స్వయంగా తప్పుపట్టి హెచ్చరించిన తర్వాత.. ఇక చస్తే మరోసారి అలాంటి పనులు చేయాలనుకోరు. కానీ.. తెలుగుదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్చరించినా సరే ఎవరూ ఖాతరు చేయడం లేదంటే ఏమని అనుకోవాలి? చంద్రబాబు చెప్పిన మాట వినకపోయినా కూడా పార్టీలో తమ రాజకీయ భవిష్యత్తుకు ధోకా ఏమీ ఉండదనే ధీమా వారిలో ఎలా ఏర్పడి ఉంటుంది? అంతేనా లేకపోతే.. ప్రస్తుతం దక్కిన ఎమ్మెల్యే పదవి చాలు.. చంద్రబాబు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు.. అయిన కాడికి దోచుకుని వచ్చే ఎన్నికలలో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుందాం అనే ఆలోచనకు ఆయన చెప్పిన ఎమ్మెల్యేలు వస్తున్నారా? అనేది ప్రశ్నార్థకం. చంద్రబాబు మాటలను విశ్లేషిస్తే గనుక చాలా ప్రమాదకరమైన గణాంకాలు కనిపిస్తాయి. తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు 135 మంది మాత్రమే. వారిలో 40 మంది గాడి తప్పారంటే దాని అర్థం మూడో వంతు ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టిపోయారని. మళ్లీ ఆ దారి తప్పిన ఎమ్మెల్యేలలో లెక్కలను కూడా గమనించాలి. ఇంటెలిజెన్స్ నివేదికలలో తమ పేరు నెగటివ్ గా చంద్రబాబు దృష్టికి వెళ్లిందని సూచనమాత్రంగా తెలిస్తేనే వారు భయపడాలి. కానీ ముఖ్యమంత్రి చెబుతున్న ప్రకారం ఆయన వారందరినీ స్వయంగా పిలిచి మాట్లాడి హెచ్చరించారు. వారి పనితీరు లో ఉన్న లోపాలను వారికే తెలియచెప్పారు. వారి అవినీతి చిట్టాలను వారి ముందే పెట్టారు. రాష్ట్ర పరిపాలన కోసం మాత్రమే కాదు పార్టీని చక్కబెట్టుకోవడానికి కూడా ఇంటెలిజెన్స్ యంత్రాంగాన్ని సమర్థంగా వాడుకునే చంద్రబాబు నాయుడు తాను రాబట్టిన అన్ని వివరాలను వారి సముఖంలోనే ఉంచి మరి వారిని హెచ్చరించడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత వాళ్లు దెబ్బకు సెట్ అయి ఉండాలి. చంద్రబాబు మాటల ప్రకారం అలా జరగలేదు. 40లో కేవలం 15 మంది మాత్రమే దారిలోకి వచ్చారు. మిగిలిన పాతికమంది ఇంకా పెడసరంగానే వ్యవహరిస్తున్నట్లుగా మనం భావించాలి. ఇంతకంటే ప్రమాదకరమైన మాట ఏంటంటే.. వారిలో నలుగురైదుగురిపై కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు చెబుతున్నారు. అంటే ఏమిటన్న మాట? హెచ్చరించినా కూడా దారిలోకి రానటువంటి కనీసం 20 మంది ఎమ్మెల్యేలను ఏమీ చేయలేని దుర్బల స్థితిలో చంద్రబాబు ఉన్నారన్నమాట. 45 ఏళ్ల పైగా అనుభవం ఉన్న రాజకీయ నాయకుడికి ఎంత అవమానకరమైన పరిస్థితి ఇది! చంద్రబాబు మాటనే పట్టించుకోనంతగా ఎమ్మెల్యేలు ముదిరిపోయారంటే వారికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనేది కీలక ప్రశ్న. ఎవరిని కట్టడి చేయగలిగారు..? చంద్రబాబు పైకి అనేక ధర్మపన్నాలు చెబుతుంటారు. ఇసుక, మద్యం సిండికేట్ల విషయంలో ఎమ్మెల్యేలకు అలాగే చెప్పారు. ఉదాహరణకు జేసీ ప్రభాకరరెడ్డి విషయాన్నే తీసుకుంటే.. ఆయన బహిరంగంగా.. లిక్కర్ వ్యాపారం ఎవరు చేసినా సరే.. తమకు పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని బెదిరించారు. లేకపోతే ఊరుకోం అని అన్నారు. ఆయనను చంద్రబాబు ఏం చేయగలిగారు? చూడబోతే చంద్రబాబులో ఈ దుర్బల స్థితి ఇప్పుడే మొదలైనట్టుగా లేదు. మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పటికే ఆయన పట్టు కాస్త సడలిందని ఎరిగిన వారు అంటుంటారు. అప్పట్లో ఒక మంత్రి మీద కోపగించుకున్న చంద్రబాబు.. ఆయనను కేబినెట్ నుంచి తప్పించాలని తలపోస్తే.. సదరు మంత్రిగారి భార్య లోకల్ గా ఇతర నాయకులద్వారా చంద్రబాబుకు ఓ ఫత్వా పంపిందిట. తన భర్తను తొలగిస్తే.. తమ వద్ద ఎంతెంత డబ్బు తీసుకుని తమకు టికెట్ మరియు పదవి ఇచ్చారో మీడియా ముఖంగా చెబుతానని హెచ్చరించారట. చివరికరి చంద్రబాబే చర్యలు తీసుకోకుండా తగ్గాల్సి వచ్చింది. అలాగే.. తనకు సన్నిహితుడైన ఒక సీనియర్ నాయకుడి కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు విముఖంగా ఉన్నప్పుడు.. వైస్రాయి ఎపిసోడ్ దగ్గరినుంచి ఆయన పుట్టుమచ్చల సహా బయటపెడతానని కూడా వారి కుటుంబం నుంచి బెదిరింపు వచ్చినట్టుగా, చంద్రబాబు వాటికి తలొగ్గినట్టుగా చెబుతుంటారు. ఆ పరిణామాలన్నీ గమనిస్తే.. ఆయన పార్టీ నేతలను కట్టడి చేయలేకపోవడం అనేది.. ఇప్పటి వ్యవహారమే కాదు. గతంలోనే మొదలైందని మనకు అర్థమవుతుంది. వేటు వేయడంలో వివక్షలు కూడా.. పార్టీ నాయకులు తప్పులు చేస్తూ ఉండడం చాలా సహజం. అధికారంలోకి వచ్చిన పార్టీలో అయితే.. ఒక్కసారిగా కొమ్ములు మొలిచినట్టు భావించే నాయకులు కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవడంలోనూ చంద్రబాబు చాలా వివక్ష చూపిస్తున్నారని, తేడాలు పాటిస్తున్నారని కూడా పార్టీలో తరచుగా వినపడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి కొత్తల్లో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూల మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆయన ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి గెలిచిన నాయకుడు. అయితే చంద్రబాబు.. వెంటనే ఆయనను పక్కన పెట్టేశారు. సత్యవేడు నియోజకవర్గంలో కనీసం ఎమ్మెల్యేకు దక్కవలసిన ప్రోటోకాల్ మర్యాదలు కూడా దక్కనివ్వకుండా అధికారుల్ని ట్యూన్ చేసేశారు. అక్కడ వేరే పార్టీ ఇన్చార్జిని పెట్టారు. ఇలా అన్ని రకాలుగానూ అవమానించారు. ఇన్ని రకాల దారి తప్పిన ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీలో ఇప్పటికి కూడా.. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీద ఆగ్రహించినట్టుగా చంద్రబాబు మరొకరి మీద కోపం చూపించలేదు. ఇదంతా గమనిస్తే.. దళితులను మాత్రమే ఆయన టార్గెట్ చేస్తున్నారా? వారిని మాత్రమే వదిలించుకోవాలని చూస్తున్నారా? సంపన్న పార్టీకి అండగా ఉండగల ఎమెల్యేలు దారి తప్పినాసరే.. చూసీచూడనట్టు పోతారా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. త్వరలోనే వేటు వేస్తానని ఆయన అంటున్న నలుగురైదుగురు ఎవరు? అనేదానిపై కూడా చాలా అంశాలు ఆధారపడి ఉంటాయి. ఆయన వివక్షల తీరు బయటకు వస్తుంది. పుత్రవాత్సల్యం గండంగా మారుతున్న వేళ.. చంద్రబాబునాయుడు తన పుత్రవాత్సల్యాన్ని దాచుకోలేకపోతున్నారు. లోకేష్ ను ఈ టర్మ్స్ లోనే ముఖ్యమంత్రిగా చూడాలనేది ఆయన ప్లాన్. అందుకోసం లోకేష్ టీం అనదగిన, లోకేష్ కు అన్ని రకాలుగానూ అణిగిమణిగి పడిఉండే వారికి అనేకులకు గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు. మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. సీనియర్లను పక్కకు నెట్టారు. అయితే.. అలాంటి లోకేష్ దళంలో పలువురు దారితప్పుతున్న ఎమ్మెల్యేల్లో ఉన్నట్టుగా సమాచారం. చంద్రబాబు స్వయంగా హెచ్చరించినా సరే.. వారు లోకేష్ అండ చూసుకుని.. ఆయనను ఖాతరు చేయడం లేదని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. పోతే పోన్లెద్దూ ఉపేక్షిద్దాం.. కొడుకు లోకేష్ కోటరీ, వర్గం పార్టీలో బలపడితే.. లోకేష్ బలంగా ఉంటాడు.. అని చంద్రబాబు సర్దుకుపోతే గనుక.. మొదటికే మోసం వస్తుంది. లోకేష్ కోటరీ ఎమ్మెల్యేల ఆగడాలు శృతిమించితే.. పార్టీకే పుట్టగతులు లేకుండా పోతాయని చంద్రబాబు గ్రహించాలి. కేవలం పార్టీని మళ్లీ మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి మాత్రమే కాదు.. చంద్రబాబు సమర్థుడైన నాయకుడిగా పేరు తెచ్చుకోవాలంటే.. తప్పులు చేస్తున్న వారిని ఎక్కడికక్కడ కట్టడి చేయగలగాలి. ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే చాలా ప్రమాదమే ఎదురవుతుంది. చేతులు కాలిన తర్వాత పట్టుకోవడానికి ఆకులు కూడా మిగలవు. ..ఎల్. విజయలక్ష్మి
11 likes
10 shares