**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 12**
మన **హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం**లో భాగంగా ఈరోజు **పదవ చౌపాయి** యొక్క విశేషాలను తెలుసుకుందాం. నిన్నటి చౌపాయికి కొనసాగింపు ఈ చౌపాయి, సూక్ష్మ రూపం స్వీకరించిన, ఘోరమైన వికట రూపం తీసుకున్న, అతి బలవంతుడిలా భీమ రూపం తీసుకున్న ఏదైనా రాముని కోసమే అని ఈ రెండు చౌపాయి ల అర్దం.
-----
**పదవ చౌపాయి**
**భీమ రూప ధరి అసుర సంహారే |**
**రామచంద్ర కే కాజ సవారే ||**
**ప్రతిపదార్థం:**
* **భీమ రూప ధరి:** అత్యంత భయంకరమైన, శక్తివంతమైన రూపాన్ని ధరించి
* **అసుర సంహారే:** రాక్షసులను అంతం చేసినవాడా\!
* **రామచంద్ర కే:** శ్రీరామచంద్రుని యొక్క
* **కాజ:** పనులను (కార్యములను)
* **సవారే:** చక్కబెట్టినవాడా (సఫలం చేసినవాడా)\!
-----
**విస్తృత ఆధ్యాత్మిక వివరణ:**
**1. భీమ రూపం (శక్తి ప్రదర్శన):**
నిన్నటి చౌపాయిలో 'బికట' రూపం గురించి చెప్పుకున్నాం, ఇక్కడ 'భీమ' రూపం అంటే పర్వతం అంతటి బలాన్ని ప్రదర్శించడం.
ధర్మానికి ఆటంకం కలిగించే రాక్షసులను (అసుర ప్రవృత్తిని) అణచివేయడానికి హనుమంతుడు ఈ రూపాన్ని దాల్చాడు.
ఎక్కడ, ఎలా ఉండాలో అది తెలిసిన వాడు హనుమంతుడు. మనం ఎన్ని భావాలు ప్రకటించినా రూపాన్ని మార్చుకోలేము. కానీ హనుమత్ స్వామి కామరూపుడు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా రూపాన్ని మార్చుకో గలడు. అసుర సంహారం చేసినప్పుడు కావాలంటే రూపాన్ని పెద్దది చెయ్యగలడు. అమ్మవారి దగ్గరకి వెళ్ళినప్పుడు చిన్నవానిగా, వినయంగా ఉండగలడు.
తన శక్తి అంతా తన అధీనంలో ఉన్నవాడే ఈశ్వరుడు. ఆ ఈశ్వరత్వాన్ని స్వామివారు చూపిస్తున్నారు.
అసుర సంహారం చేసినప్పుడు భీమరూపం చూస్తేనే రాక్షసులకు హడల్. అలాంటి రూపంతో ఏ ఏ అసురుడిని ఎలా ఎలా చంపాడనేది రామాయణం లో చాలా విస్తారంగా చెప్పారు.
మొట్టమొదట సముద్ర లంఘన సమయంలో నే సింహిక ను చంపటం కోసం శరీరాన్ని 100 యోజనాలు పెంచి, మళ్ళీ సూక్ష్మంగా అయి సహరించాడు.
లంకలోకి పిల్లి పిల్లంత పరిమాణం లో వెళ్ళి లంకిణిని కొట్టాడు,అదే సమయం లో లంకిణి సోదరి అయిన కర్కటి హనుమ పాదమును కదలకుండా గట్టిగా పట్టుకుంది,ఎంతకు వదలక పోతే గట్టిగా కాలు విదిల్చి దాన్ని సంహరించాడు ఇది రామాయణం లో లేదు కానీ, పరాశర సంహిత వంటి గ్రంథాలు చెప్పాయి.
హనుమ లంకిణిని బ్రతికించాడు. కర్కటిని సంహరించాడు కర్కటి సామాన్యు రాలు కాదు. మహా భయంకరమైన రాక్షసి. దానిని సంహరించి లంకా నగరంలోకి వెళ్ళబోతుంటే. అప్పుడు బ్రహ్మదేవుడు ఎదురొచ్చి స్వామివారికి నమస్కరించి స్తోత్రం చేశాడు.
ఇది 27 నామాల మహా మంత్రం మొత్తం సుందరకాండ ను ఈ స్తోత్రం లో పెట్టాడు బ్రహ్మ గారు. దీన్ని నిత్యం పఠించడం వల్ల భయంకరైన వ్యాధులు కూడా నయం అవుతాయి అని స్వయంగా పరమ శివుడు చెప్పాడు ఆ స్తోత్రం మన యూట్యూబ్ చానెల్ లో ఉంది కావాలి అనుకుంటే అక్కడ వినండి
(https://youtu.be/2PG3sLYyoxo?si=-ZpzDQHQltSKsRiu
#🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్ )
సుగ్రీవాదులందరూ హనుమంతుని పాదాలకు నమస్కారం చేస్తుంటే, ఆయన రామపాదాలను ధ్యానం చేస్తున్నారు. కొన్ని వేల సూర్యుల కాంతి ఆయన శరీరం నుంచి వెలువడుతున్నది. ప్రసన్నంగా ఉన్నాడు ప్రతాపంతో ఉన్నాడు. ఆయన గర్జిస్తే మొత్తం దానవులు బెంబేలెత్తి పోతున్నారు. అలాంటి రూపంతో ఉన్న ప్రతాప, ప్రసన్నాంజనేయమూర్తి సుందరహనుమన్మంత్రమూర్తిగా చెప్పబడుతున్నది అందుకు 'భీమరూప ధరి అసుర సంహారే'. భీమరూపం ధరించి కర్కటి అనే రాక్షసిని సంహరించాడు.
మనలోని కామ, క్రోధ, లోభాలనే అసురులను సంహరించడానికి హనుమంతుని ఈ 'భీమ రూప' ధ్యానం మనకు కొండంత బలాన్ని ఇస్తుంది.
**2. రామచంద్ర కే కాజ సవారే (కార్య సాధకుడు):**
సూక్ష్మ రూపం కానీ, వికట రూపం కానీ, భీమ రూపం కానీ ఎందుకు ధరించాడు. స్వామి...? అంటే 'రామచంద్రకే కాజసఁవారే' అని చెప్పారు.రామచంద్రమూర్తి కార్యాన్ని చక్కబెట్టడం కోసమని స్వామి అన్ని రూపాలు ధరించాడు.
యుద్ధం చేసేటప్పుడు కూడా హనుమంతుడు ఎలా వచ్చేవాడో చెప్పారు. యుద్ధకాండలో రాముడు, హనుమంతుడు చేసే యుద్ధఘట్టాలు చాలా రమణీయంగా ఉంటాయి
యుద్ధం చేస్తున్నప్పుడు చేతికి దొరికిన ఒక పెద్ద రాయి తీసుకుని ఒకసారి రావణుని మీదకి పరిగెత్తాడు హనుమ స్వామి ఎర్రని కళ్ళతోను, ఎర్రని ముఖంతోను ఉన్నాడు. రావణునికి స్వామి కాలాంతక యమునిలా కనబడుతున్నాడు. మండుతున్న అగ్నివలె కోటి సూర్యుల కాంతితో ఉన్నాడు. 'ఓ దుష్టా! నిలువురా! నిలువు' అంటూ అరుస్తున్నాడు. ఆ విధంగా రాక్షసులను భయపెడుతున్న స్వామిని ధ్యానం చేస్తే మనకు రక్ష.ఇది నారద పురాణం చెప్పిన రహస్యం
స్వామివారి భీమరూపమైనా, వికటరూపమైనా, సూక్ష్మరూపమైనా భక్తులకు రక్షాస్వరూపములే. ఏదీ శిక్షా స్వరూపం కాదు.
అసురసంహారం చేసేటప్పుడు స్వామి తోక నేలకు కొట్టి గర్జించి నిలబడి నప్పుడు పర్వతమంతరూపంతో గోచరించాడన్నారు. అసురసంహారం చేసిన హనుమ స్వరూపంలో ఉన్న ప్రతాపం రావణాసురునికి సుందరకాండలోనే తాను పంపినవా రందరినీ అంత అవలీలగా కొట్టి ఏ అలసట లేకుండా వచ్చి సభలో కూర్చున్నప్పుడే తెలిసింది.
ఇంతకు మునుపు నేను చూసిన వారెవరిలో ఇంతటి బల, పరాక్రమం లేదు అని రావణుడే అన్నాడు అందుకు భీమ రూప ధరి అసుర సంహారే
రామచంద్ర కే కాజ సవారే - రామ కార్యం కోసం అవన్నీ చేశాడు కానీ ఇప్పుడు చెయ్యమంటే చేస్తాడా ? లోక రక్షణే రామకార్యం, విష్ణుకార్యం. విష్ణువు పనే.. కాబట్టి ఈరోజు నుండి ప్రారంభం చేసి అందరం రోజు ఒక్కసారి హనుమాన్ చాలీసా పారాయణ లోక క్షేమం కోసం, ధర్మ రక్షణ కోసం, ప్రపంచ శాంతి కోసం,చేద్దాం మీకు ఎప్పుడూ కుదిరితే అప్పుడే మన కోసం ధర్మం కోసం,దేశం కోసం పారాయణం చేయండి.
రామచంద్రుని కార్యం సీతమ్మను తీసుకురావడం, రావణుని చంపడం మాత్రమే రామకార్యం కాదు. లోకరక్షణ రామకార్యం. దానికి సహకరించిన శక్తి ఆంజనేయస్వామి.ఆ శక్తి మనకు కూడా సహకరించి మనల్ని కూడా రక్షించు గాక.
రామాయణంలో రాముడు పడ్డ ప్రతి కష్టాన్ని హనుమంతుడు తీర్చాడు. సీతమ్మ జాడ కనిపెట్టడం, లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటం, యుద్ధంలో విజయం చేకూర్చడం.. ఇలా రాముని ప్రతి కార్యాన్ని హనుమంతుడు తన భుజస్కంధాలపై వేసుకుని సఫలం (సవారే) చేశాడు. అందుకే రాముడికి హనుమంతుడు ప్రాణ సమానుడైన భక్తుడయ్యాడు. అలాగే మనం కూడా ధర్మం కోసం ఈ చిన్న అడుగు వేస్తే రామునికి ప్రియమైన భక్తులం అవుతాం..
-----
**తులసీదాసు గారి సందేశం:**
తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా **"కార్యదక్షత"** గురించి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఒక పనిని కేవలం చేయడం వేరు, దాన్ని పరిపూర్ణంగా (సక్సెస్ఫుల్గా) ముగించడం వేరు. హనుమంతుడు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా, తన ప్రభువుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనులను చక్కబెట్టేవాడు. మనం కూడా మన వృత్తిలో, బాధ్యతల్లో హనుమంతుని వలె కార్యసాధకులం కావాలని ఈ సందేశం.
-----
**జై శ్రీరామ్\! జై హనుమాన్\!**