Mohan
803 views
7 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #ktr #ktrtrs ❇️ పంట కొనుగోళ్ళపైన లెక్కలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలి. ❇️ ముఖ్యమంత్రి చెప్పినట్లు 80 శాతం కొనుగోళ్ళు పూర్తయ్యాయని నిరూపిస్తే ఏ శిక్షకైనా తాము సిద్ధం. ❇️ రాష్ట్రంలో గన్నీ బ్యాగులు దొరకడం లేదు కానీ గన్నులు మాత్రం విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ❇️ అన్నదాతల పరిస్థితిపైన, పంట కొనుగోళ్ళ సంక్షోభంపైన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ #కేటీఆర్ 👇 🔹 రాష్ట్రంలో పంట కొనుగోళ్ళ సంక్షోభం తీవ్రంగా ఉన్నదని, దీన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా అవాస్తవాలు చెప్తున్నారని మండిపడ్డారు. 🔹 ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిన పంట కొనుగోళ్ళ పైన, పంటల వారీగా లెక్కలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 🔹 రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో స్వయంగా పర్యటించిన తాను, కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న రైతన్నల దుస్థితిని చూసిన తర్వాత ప్రభుత్వానికి నిన్న ఒక బహిరంగ లేఖ రాస్తే.. ముఖ్యమంత్రితో పాటు మంత్రి అబద్ధాలు, అటెన్షన్ డైవర్షన్ ముచ్చట్లు చెప్పారని మండిపడ్డారు. 🔹 కనీసం రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలోనైనా అత్యంత కీలకమైన ఈ పంట కొనుగోళ్ళ సంక్షోభంపైన చర్చించాలని, రైతన్నల కష్టాలే ఏకైక ఎజెండాగా రేపటి క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.