బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
612 views
10 hours ago
అవినీతి కుళ్ళు,కంపు కొడుతున్న నేటి రాజకీయాలను ప్రక్షాళన చేయాలంటే ఓక్క ఉన్నత విద్యావంతులైన యువతకే సాధ్యం! ముఖ్యంగా నేటి రాజకీయాలలో నీతి,నైతిక విలువలు అనేవి పూర్తిగా అడగంటిపోయాయి అనేది ఎవరు కాదనలేని వాస్తవం.ఎందుకంటే ముఖ్యంగా ఈ సమాజంలో విద్యావంతులైన యువతకు బ్రష్టుపట్టిన నేటి రాజకీయాలలో ఉన్నత స్థానం అంటూ లేకుండా పోయింది.ఓక వేళ చదువుకున్న యువతకు నేటి రాజకీయాలలో అవకాశం వస్తున్న అది బహు స్వల్పమే అంటే నూటికి కేవలం 30 % శాతం మాత్రమే. అదేమీ దురదృష్టమో గాని ఎక్కువగా నేటి రాష్ట్ర రాజకీయాలను అవినీతి మకిలి అంటిన వారు, దౌర్జన్యకారులు,ప్రజల ఆస్తులను కొల్లగొట్టే దుర్మార్గపు వ్యవహారశైలి వున్న వారే శాసిస్తుండటం ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి అత్యంత బాధాకరమైన,ఆందోళన కలిగించే విషయం.కాబట్టి ఈ ఆనారోగ్య,అనాగరిక పరిస్థితుల్లో మార్పు రావాలంటే మరింతమంది ఉన్నత విద్యావంతులైన యువత రాజకీయాలలోకి రావాలి,ప్రజలకు స్ఫూర్తిదాయకమైన, ఆదర్శవంతమైన,నీతి,నిజాయితితో కూడిన పాలన అందించాలి.అడుగడుగున ఉడుకు రక్తంతో కదంతొక్కే యువత అనుకోవాలే గాని కొండల్ని సైతం పిండి చేయగలరు,నేటి రాజకీయాలలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చే సత్తా వారి సొంతం.ఇందులో ఎలాంటి సందేహానికి తావు లేదు. ఏదిఏమైనా నేటి ఉన్నత విద్యావంతులైన యువత అత్యంత వివేకంతో ఆలోచించి తమ మేధస్సునంతా ఉపయోగించి నేటి రాజకీయాలకు అనుసంధానం చేయగలిగితే,పనిలో పనిగా ప్రజల మెప్పు,మద్దతు పొందగలిగితే రాబోయే కాలం అంతా మెజారిటీ విద్యావంతులైన యువత మాత్రమే రాజకీయాలను శాసించే రోజు అతి దగ్గరలోనే వుంది అనే మాట అక్షర సత్యం.ఏమైన విద్యావంతులైన యువతకు రాజకీయాలలో ముందున్నది అంతా మంచి కాలమే,అయితే అందుకు అత్యంత ఆశావాద దృక్పధం,అంతులేని దృఢ చిత్తంతో ముందడుగు వేయగలిగితే రాబోయే కాలంలో ఓక ఆరోగ్యవంతమైన రాజకీయాలకు వారు బీజం వేసినవారవుతారు, తద్వారా ప్రజలకు నిజమైన శ్రీరామచంద్రుని రామరాజ్యస్థాపనకు సాకారం చేకూర్చిన వారవుతారు! జయ జయహో విద్యావంతులైన యువత! మేరా హిందూస్తాన్ మహాన్!✍️✍️✍️ - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా. #ఏపీ రాజకీయాలు