TV49 News
817 views
11 days ago
తూర్పుగోదావరి జిల్లా, కపిలేశ్వరపురం మండలం, వల్లూరు గ్రామ దళితవాడలో రోడ్డుపై మట్టి వేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పంటకాలువలో చేపట్టిన పూడికతీత పనుల్లో భాగంగా తీసిన మట్టిని దళితవాడలోని సీసీ రోడ్డుపై వేసినట్లు కాలనీవాసులు తెలిపారు. ఈ రోడ్డుకు ఆనుకుని సుమారు 30 ఇళ్లు ఉండటంతో పాటు జగనన్న కాలనీకి వెళ్లే ప్రధాన మార్గం కూడా ఇదేనని పేర్కొన్నారు. రోడ్డు పొడవునా మట్టి దిబ్బలు ఉండటంతో నడిచేందుకు కూడా ఇబ్బందిగా మారిందని, పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. #andhra pradesh #🤘Lets Moj #కోనసీమ #తూర్పుగోదావరి #మన తూర్పుగోదావరి జిల్లా