#💪పాజిటీవ్ స్టోరీస్ 16 ఏళ్లకే మాఫియా డాన్ అవ్వాలని స్నేహితుడితో కలిసి కన్న తల్లినే హతమార్చిన కొడుకు
9 తులాల బంగారం కాజేసి పరార్, పలాసకు వెళ్తుండగా పట్టుకున్న పోలీసులు
విజయనగరం జిల్లా రాజాం గ్రామంలో నివాసం ఉంటు ఇటీవల పదవ తరగతి పూర్తి చేసిన ముంజేటి సతీష్, స్పందన(34) దంపతుల కుమారుడు
స్కూల్లో అమ్మాయికి ప్రేమ లేఖ రాశాడని యాజమాన్యం చెప్పడంతో, బుద్ధిగా ఉండాలని పలుమార్లు కొడుకుకు నచ్చజెప్పిన తల్లి
దీంతో తల్లిపై కక్ష పెంచుకున్న బాలుడు
తన తండ్రి, తల్లిని వదిలేసి వేరే మహిళతో ఉంటున్నాడని, మనం ముంబై వెళ్లి మాఫియా డాన్లు అవుదామని చెప్పిన మరో బాలుడితో చెప్పిన నిందితుడు
తల్లి ఇంట్లో లేని సమయం చూసి స్నేహితుడిని పిలిచి, తొమ్మిదిన్నర తులాల బంగారం, రూ.5 వేల నగదు తీసుకుని బ్యాగులో వేసుకొని అనంతరం స్నేహితుడి సహాయంతో కత్తితో పొడిచి చంపిన నిందితుడు
16 కత్తి పోట్లు పొడిచి, చనిపోయిందని నిర్ధారించుకుని, చీరతో చుట్టి, మృతదేహాన్ని పక్కనే ఉన్న కోనేరులో పడేసిన నిందితులు
ఈ నెల 4వ తేదీన జరిగిన ఈ హత్యను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయగా కొడుకే హత్య చేశాడని పోలీసుల నిర్ధారణ
హత్య తర్వాత నిందితులు భువనేశ్వర్, ముంబై, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలు తిరిగి పలాసకు వెళ్తుండగా చిలకలపాలెం వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు