BRS.Yugendar
605 views
1 days ago
#📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #Adminpost వరంగల్ జిల్లా. Date:17-05-2026. పర్వతగిరి క్యాంపు కార్యాలయం నందు వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామ ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ దేనని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు, త్వరలో మన రాష్ట్రంలో జరగబోయే SIR ప్రక్రియపై కార్యకర్తలతో చర్చించి, క్షేత్రస్థాయిలో ఎలా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేశారు, ఈసారి పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టబోతున్నామని ఒకవైపు సభ్యత్వ నమోదు కార్యక్రమం, మరోవైపు కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతి బూత్ లెవెల్ కమిటీకి ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు, కార్యకర్తల కష్టసుఖాలలో ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పట్టాపురం ఏకాంతం గౌడ్ గార్లు మరియు చింత నెక్కొండ గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️రాజకీయాలు

More like this