20 ప్లాస్టిక్ వస్తువులు ఇస్తే చాలు.. ఒక పూట భోజనం ఫ్రీగా పెడతారు ఈయన!
ముంబైలోని భాండూప్ ప్రాంతానికి చెందిన శక్తి యాదవ్ గారు 'Buy Food With Plastic' అనే ఒక సరికొత్త కార్యక్రమం ద్వారా పేద ప్రజల ఆకలిని తీరుస్తూ.. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.
తన చిన్నప్పుడు వారి ఇల్లు మురుగునీటితో నిండిపోవడానికి ప్లాస్టిక్ వ్యర్థాలే కారణమని గ్రహించిన ఆయన, 20 ప్లాస్టిక్ బాటిళ్లు ఇచ్చే ఎవరికైనా ఒక పూట వేడివేడి భోజనం అందించే పద్ధతిని మొదలుపెట్టారు. ఈ అద్భుతమైన ఆలోచన ద్వారా ఇప్పటివరకు 45,000 మందికి పైగా భోజనం అందించడమే కాకుండా, ఒక లక్షకు పైగా ప్లాస్టిక్ వస్తువులను సేకరించి వాటిని రీసైక్లింగ్ ద్వారా ఉపయోగకరమైన వస్తువులుగా మార్చి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.
కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఈ సామాజిక బాధ్యతలో పాల్గొంటున్న ఈయన చేస్తున్న పని ఇప్పుడు పర్యావరణ పరిరక్షణలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
#talradiotelugu #GoodNews #BuyFoodWithPlastic #ShaktiYadav #PlasticRecycling #FoodForPlastic #MumbaiInitiative #EnvironmentalAwareness #talradio #touchalife
#🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్