P.Venkateswara Rao
1.7K views
8 hours ago
#🏆TataIPL2026 #వైభవ్ సూర్య వంశీ🏏 *సెంచరీలు కాదు..అదే నా లక్ష్యం: వైభవ్ సూర్యవంశీ❗* Uppala Shivaprasad May 28 2026🏏 సెంచరీల కంటే ఐపీఎల్ ట్రోఫీ గెలవడమే తన ప్రధాన లక్ష్యమని రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్, యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. సెంచరీలు వస్తూనే ఉంటాయని, తన ఫోకస్ అంతా జట్టుకు ఉపయోగపడటం, టైటిల్ గెలవడంపైనే ఉందని స్పష్టం చేశాడు. ఆ ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బుధవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈగెలుపుతో రాజస్థాన్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంటిబాట పట్టింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97) సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. అసాధారణమైన ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఫైనల్ చేరేందుకు ప్రయత్నిస్తాం.. ఈ సందర్భంగా మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. తన బ్యాటింగ్ ప్రణాళికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఈ విజయంతో లభించే సానుకూల దృక్పథాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తూ.. తదుపరి మ్యాచ్‌వైపు అడుగులు వేస్తాం. వచ్చే మ్యాచ్‌లో కూడా ఇదే తరహా ప్రదర్శనతో విజయం సాధించి ఫైనల్ చేరేందుకు ప్రయత్నిస్తాం. నేను ప్రతి మ్యాచ్‌కు ముందు ఆలోచిస్తాను. కానీ అతిగా ఆలోచించను. నేను ఏ విషయంలోనైతే మెరుగుపడాలని భావిస్తానో దానిపైనే ఫోకస్ పెడతాను. ప్రతీ మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థి జట్టులో బౌలర్లు ఎవరున్నారు. ఆ పిచ్‌పై వారిని నేను ఎలా ఎదుర్కోవాలి. బౌండరీల పరిమాణం ఎంత ఉంది? వంటి విషయాల గురించి ఆలోచిస్తాను. ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతో ఆడటానికి ప్రయత్నిస్తాను. నేను అలా ఆడినప్పుడు బౌలర్లు ఒత్తిడిలోకి వెళ్తారు. కాబట్టి నేను దాన్నే కొనసాగిస్తూ మ్యాచ్‌పై ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నిస్తాను. ఔటైన తర్వాతే తెలిసింది.. నేను ఔటైన తర్వాతే సెంచరీ రికార్డ్ గురించి నాకు తెలిసింది. ఆ సమయంలో నా ఏకైక లక్ష్యం జట్టుకు నా వంతుగా ఎంత వీలైతే అంత సహకారం అందించడమే. ఎందుకంటే సెంచరీలు ఎలాగైనా వస్తూనే ఉంటాయి. కానీ ప్రస్తుతం మా దృష్టి అంతా ట్రోఫీని ఎలా గెలవాలనే దానిపైనే ఉంది. నేను ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తే.. దానిపై కష్టపడతాను. ప్రత్యర్థి జట్టు ఏం ప్లాన్ చేస్తోందో నేను పట్టించుకోను. అది వారి ప్రణాళిక. నా ప్లాన్ ఏంటనే దానిపైనే నేను దృష్టి పెడతాను. కేవలం సాధారణ క్రికెట్ ఆడటానికే ప్రయత్నిస్తాను.'అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.