మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు,పేదల పాలిటి పెన్నిధి,మహానటుడు,విశ్వవిఖ్యాత,నట సార్వభౌమ దివంగత నందమూరి తారకరామారావు గారి 103వ జయంతి ఈ సుదినం! ( 28 - 5 - 2026)!
లేదా
తెలుగువారి ఆత్మగౌరవాన్ని,ప్రత్యేకతను,గొప్పతనాన్ని దేశ వ్యాప్తంగా,అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన ఓక మహా పురుషుడు ఈ దివంగత ఎన్టీఆర్ గారు (ఎన్టోడు )!
ఆయన ముఖ్యమంత్రిగా వున్న కాలంలో 2 రూపాయలకు కిలో బియ్యం ప్రవేశపెట్టి పేదవారి కడుపు నింపిన దార్శనికుడు ఈ నందమూరి తారక రాముడు.ముఖ్యంగా ఆయన అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయరంగంలో జోడు గుర్రాల మీద స్వారీ చేసి కూడా విశేషంగా రాణించి కోట్లాది మంది తెలుగు ప్రజానీకం గుండెల్లో,హృదయాల్లో ఎప్పటికి మరచిపోలేని విధంగా శాశ్వతస్థానం సంపాదించుకున్న గొప్ప ప్రజా నాయకుడు,నటనా కోవిధుడు ఈ యావత్ తెలుగు జాతి మెచ్చిన ఈ దివంగత నందమూరి తారకరామారావు గారు (ఎన్టీఆర్).అయితే ముఖ్యంగా ఆయన నటించిన పౌరాణిక చిత్రాలు లవకుశ,శ్రీకృష్ణా పాండవ్యం,శ్రీనాధ కవి సార్వభౌమ,శ్రీ కృష్ణార్జున యుద్ధం,దాన వీర సూర కర్ణ,శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర వంటి ఎన్నో చిత్రాలలో తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించి అశేష తెలుగు ప్రజానీకం యొక్క నీరాజనాలు అందుకున్న గొప్ప చరిత్ర ఈ మేటి చెయ్యి తిరిగిన కళాకారుడు ఎన్టీఆర్ గారిది.ఇక ఆయన గారికి ఉన్న ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయన పోషించిన శ్రీ కృష్ణుడు పాత్రకు అశేష తెలుగు సినిమా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.మరి కొంతమంది వీరాభిమానులు అయితే ఆయన పోషించిన శ్రీ కృష్ణుని చిత్రంతో కూడిన పటాన్ని సైతం ఇంట్లో పెట్టుకొని మరీ పూజించారు అనేది ప్రతి ఒక్కరు అగీకరించే నగ్న సత్యం.అలాగే ఆయన నీతి న్యాయానికి పట్టం కట్టి,అవినీతి,అన్యాయం పై ప్రతిఘటించే,ఈ సమాజానికి పట్టిన కుళ్లును తుడిచివేసే,దేశభక్తి ప్రతిబింబించే అసాధారణ పాత్రలు ఎన్నింటినో సాంఘిక చిత్రాల్లో పోషించి కోట్లాది మంది తెలుగు సినిమా ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకున్న మేరుగ రణధీరుడు ఈ దివంగత ఎన్టీఆర్ గారు.ఓక విధంగా చెప్పాలంటే ఆయననొక దైవాంశ సంభూతిడిగా సైతం యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులు భావించారు కూడా.ఆయన నటించిన,విశేష ప్రేక్షకాదరణ పొందిన అనేక చిత్రాలలో నా దేశం,జస్టిస్ చౌదరి,బొబ్బిలి పులి, కొండవీటి సింహం,మేజర్ చంద్రకాంత్ వంటి ఈ సమాజాన్ని ప్రభావితం చేసే సందేశాత్మక చిత్రాలు ఓక మచ్చు తునక మాత్రమే.అదే విధంగా ఆయన రాజకీయాలలో సైతం పెను సంచలనాలకు కేంద్రబిందువు అయ్యారు.ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలంలో పలు జనరంజక సంక్షేమ పథకాలను పేద,బడుగు,బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టి వారిని అన్ని విధాలా ఆదుకున్న కారణజన్ముడు,మహాపురుషుడు ఈ నందమూరి తారక రామారావు అనడంలో ఎలాంటి సందేహం లేదు.అంతేగాకుండా నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా కూడా ఎన్నిక అయ్యి తెలుగు వారి సత్తా ఏమిటో దేశ వ్యాప్తంగా చాటి చెప్పడమే కాకుండా దేశ రాజకీయాలను కూడా ఒంటిచేత్తో శాసించిన బహుముఖ ప్రజ్ఞాశాలి,అమోఘ ప్రతిభా సంపన్నుడు ఈ నందమూరి తారకరాముడు అనే మాట అక్షర సత్యం.
ఏదిఏమైనా తెలుగు రాష్ట్ర ప్రజానీకం యావత్తు మరో పది కాలాల పాటు గుర్తుపెట్టుకునే ఓక ఆదర్శమూర్తి, స్ఫూర్తి ప్రదాత,రాజకీయ నాయకుడు అంటే ఎలాంటి మహోన్నత విలువలతో పాలన అందించాలో బాగా తెలిసిన ఓక మంచి పరిపాలన దక్షకుడు ఈ దివంగత నందమూరి తారకరామారావు గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఏమైనా ఈ తెలుగు నేలకు, గడ్డకు ఆయన అందించిన అజరామమైన,వెలకట్టలేని సేవలను ఆయన 103వ జయంతి అయిన ఈ ప్రత్యేక సందర్బంగా ప్రతి తెలుగువారు మనసా,వాచ,కర్మణ ఒక్కసారి స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి తెలుగు ప్రజానీకం భుజస్కందాలపై ఎంతైనా వుంది.అమర్ రహే,అమర్ రహే! జోహార్ దివంగత ఎన్టీఆర్ గారు!
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
#నందమూరి తారక రామారావు