Mohan
738 views
2 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #ktr #ktrtrs 💰 30 వేల కోట్ల ఆస్తులపై రేవంత్‌ కన్ను 🆘🚈 మెట్రో లూటీకి ముఖ్యమంత్రి స్కెచ్‌ 📣⛔ వాటిని తన కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అనుచరులకు కట్టబెట్టేందుకు భారీ కుంభకోణం 🚨 అందుకే ఎల్అండ్‌టీని రాష్ట్రం నుంచి తరిమేసిండ్రు 💰 రూ.14 వేల కోట్ల అప్పును రాష్ట్రంపై రుద్దుతున్న రేవంత్ 🚇 మెట్రో రైల్‌ పేరుతో రేవంత్‌, కిషన్‌రెడ్డి డ్రామా 📢 బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గత సర్కార్‌ ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు ఎందుకు ఆమోదం తెలుపలేదు? 🎯 తుగ్లక్‌, హిట్లర్‌ కలయికలా రేవంత్‌రెడ్డి పాలన 💥 శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్‌ శ్రేణులతో సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజం మెట్రో రైల్‌కు అనుసంధానంగా ఉన్న దాదాపు 250 ఎకరాల విలువైన భూములు, రూ.30,000 కోట్ల విలువైన మెట్రో రైల్‌ ఆస్తులను రేవంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులకు కట్టబెట్టేందుకు స్కెచ్‌ వేసిండు. అందుకే ఎల్‌అండ్‌టీని బ్లాక్‌ మెయిల్‌ చేసి రాష్ట్రం నుంచి తరిమేసిండు. రేవంత్‌ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎల్‌అండ్‌టీ 14 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రజల మీద రుద్దుతున్నడు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన లక్డీకాపూల్‌ -పటాన్‌చెరు మెట్రో విస్తరణకు ఎందుకు ఆమోదం తెలుపలేదు? ఉత్తరప్రదేశ్‌లోని చిన్నచిన్న నగరాలకు మెట్రో ప్రాజెక్టులు ఇచ్చిన కేంద్రం, తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి చూపింది. రేవంత్‌, కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌లో కొట్టుకుంటున్నట్టు నటిస్తూ, ఢిల్లీలో మాత్రం ఒకటై తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నరు.