Venkatesh JSP
409 views
10 days ago
దివంగత మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నాదెండ్ల భాస్కర రావు గారికి నివాళులర్పించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల పరమపదించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారి చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళవారం నివాళులర్పించారు. గత నెల 22 వ తేదీన శ్రీ భాస్కరరావు గారి మృతి వార్త తెలుసుకొన్న వెంటనే శ్రీ భాస్కరరావు గారి కుమారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మాత్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. అప్పట్లో సైనస్ సమస్య వల్ల శాస్త్ర చికిత్స చేయించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేరుగా నివాళులర్పించినందుకు రావడానికి వీలు పడలేదు. ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో వైద్యుల సూచన మేరకు మంగళవారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్‌లో భాస్కరరావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నమస్కరించారు. అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని, కుటుంబ సభ్యులకు పరామర్శించి, ధైర్యం చెప్పారు. #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్