వరి కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను సంయుక్తంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి కుష్బూ గుప్తా, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్
ప్రస్తుతం జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోళ్లు పారదర్శకంగా, వేగవంతంగా జరిగేలా జిల్లా కలెక్టర్ శ్రీమతి కుష్బూ గుప్తా, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గార్లు సంయుక్తంగా అడ్డాకల్ మండలంలోని వేముల గ్రామం వరి కొనుగోలు కేంద్రాన్ని అలాగే అడ్డాకల్ గ్రామంలోని రైస్ మిల్లును సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులతో నేరుగా మాట్లాడి ధాన్యం తూకం, నాణ్యత పరిశీలన, టోకెన్ల జారీ, రవాణా తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునే ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే రైస్ మిల్లులో నిల్వలు, ధాన్యం దిగుమతి–ఎగుమతి ప్రక్రియ, మిల్లింగ్ పనితీరును పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. రైతులకు చెల్లింపులు సకాలంలో జరిగేలా చూడాలని, కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
వరి కొనుగోలు ప్రక్రియలో ఎక్కడైనా అక్రమాలు, అవినీతి లేదా రైతులను ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు తలెత్తకుండా రెవెన్యూ, సివిల్ సప్లైస్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేపడుతున్న వరి కొనుగోలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.
#MahabubnagarPolice
#📰 వార్తలు