ఫాలో అవ్వండి
Satya Vadapalli
@13077355
12,990
పోస్ట్
22,938
ఫాలోవర్స్
Satya Vadapalli
7K వీక్షించారు
1 రోజుల క్రితం
విద్యాభ్యాసానికి ప్రారంభం - అక్షరాభ్యాసం ! అక్షరాలను దిద్దించడంతో విద్యాభ్యాసం ప్రారంభం అవుతుంది. "అక్షరం " అంటే క్షయము లేనిది, నాశనం లేనిది అని అర్ధం. మనం సంపాదించే సంపదల్లో ఏదైనా నశిస్తుంది కానీ....అక్షర సంపద, విద్యా సంపద మాత్రం నశించదు. అటువంటి అక్షరాభ్యాసాన్ని ప్రారంభించే ముందు సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమేసదా..." అని చదువుల తల్లి అయిన శ్రీ సరస్వతీ దేవిని ప్రార్ధించడం ఆచారం! చదువుల తల్లి...అక్షరాల అధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణిని, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతిజన్మదినo - మాఘ మాసం శుక్ల పక్ష పంచమి. ఈ సంధర్భంగా జరుపుకునే పండుగే - శ్రీ పంచమి . దీనికే వసంత పంచమి అని కుడా పేరు. విద్యలకు అధిదేవత అయిన శ్రీ సరస్వతీ దేవి బ్రహ్మదేవుడి దేవేరి. తెల్లటి పద్మంపైన నిలుచుని, ఒక కాలు నిలువుగాను, మరొక కాలు దానిపైన అడ్డముగానూ ఉంచుకుని తెల్లని దుస్తులు, పువ్వులు, తెల్లని పూసల కంఠహారం ధరించి వీణను, పుస్తకములను చేతులందు ధరించి ఉంటుందని శ్రీ సరస్వతీ దేవిని గురించి పద్మ పురాణం పేర్కొంది. అంటే సరస్వతీ దేవి అహింసా దేవత! చల్లని తల్లి! బ్రహ్మవైవర్త పురాణం లో కూడా ఈ విషయమే ఉంది. ఈ పురాణంలో దుర్గ, సావిత్రి, శ్రీ మహాలక్ష్మి, సరస్వతి, శ్రీ రాధాదేవి...అనే ఐదుగురు ప్రకృతి శక్తులనీ..వీరిలో మూడో శక్తులని, వీరిలో సరస్వతి పరమాత్మనుంచి వచ్చిన ఉద్భవించిన వాణికి, విద్య, ఙ్ఞాన ,బుద్ధులనీ చెప్తోంది. అటువంటి ఙ్ఞానప్రదాయిని కరుణ వుంటేనే విద్యాప్రాప్తి, ఙ్ఞానప్రాప్తి కలుగుతుంది అని పురాణ వచనం. శ్రీ సరస్వతీ దేవి జన్మదినమైన శ్రీ పంచమి పండుగకు దక్షిణభారతం లో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. శ్రీ పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చెస్తే అపారమైన ఙ్ఞానం లభిస్తుంది ..నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుంది అనే శాస్త్ర వచనం. ఈ రోజున ఉదయాన్నే లేచి, స్నానాది క్రతువులు తీర్చుకుని, అమ్మ వారి పూజలు తెల్లటి వస్త్రాలు, పూసలతో అలంకరణ చేసి, పాలు, వెన్న...అలాంటి మొదలైన పదార్ధాలు నివేదన చేసి, ఆ తరువాయి చిన్న పిల్లలకు విద్య ని ఆరంభం చేసినచో ఆ చిన్నారులకు ఆ సరస్వతీ దేవి విద్యను ప్రసాదిస్తుంది. ఈ రోజున, శ్రీ సరస్వతి దేవితో పాటు, వినాయకుడు, శ్రీ మహా విష్ణువు,, పరమ శివుడు, సూర్య భగవానుడు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు. యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా సామాం పాతు సరస్వతి భగవతీ నిశ్శేష జాడ్యాపహా!! #వసంత పంచమి శుభాకాంక్షలు #వసంత పంచమి శుభాకాంక్షలు💐 #శ్రీ పంచమి శుభాకాంక్షలు #🙏🏻భక్తి సమాచారం😲 #దేవుళ్ళ స్టేటస్
Satya Vadapalli
587 వీక్షించారు
1 రోజుల క్రితం
బ్రహ్మ మాత్రమే సత్యం. బ్రహ్మాండం అసత్యం. నిజానికి గుర్తు విభూతి. బాబా ధునిలోని ఊది వ్యాధి, బాధలను తొలగిస్తుంది. కానీ ఊది యొక్క నిగూఢమైన తత్త్వార్థం వివేకంతో కూడిన పూర్ణ వైరాగ్యం ఇవ్వగలిగిన దక్షిణ ఇచ్చి ప్రాపంచిక విషయాల యందు వైరగ్యాన్ని సాధించిన తరువాత మెల్లగా నివృత్తి మార్గం అర్థమవుతుంది. విభూతి దక్షిణల జత అంటే వివేక వైరాగ్యాల జంట. విభూతి యొక్క గూఢార్థాన్ని, భావార్థాన్ని, పరమార్థాన్ని గ్రహించిన సాయి భక్తులు తమ యొక్క యోగక్షేమాల కొరకు ఊదిని కోరుకుంటారు. బ్రహ్మ జ్ఞాన లీల నా వద్దకందరూ కోరికలతో వచ్చేవారే! బ్రహ్మజ్ఞానం కోరుకునేవారు దొరకటం నా అదృష్టం! బాబా తక్షణమే భక్తులకు బ్రహ్మజ్ఞానం ప్రసాదిస్తారని విని రాను పోనూ టాంగా కట్టించుకుని వచ్చిన ఒక ధనవంతునితో అని బాబా తమ లీల ప్రారంభించారు. 5 రూపాయలు అప్పుగా తెమ్మని బాలాను వర్తకుల దగ్గరికి పంపసాగారు. జ్ఞానం కావాలంటే పంచ ప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం భగవంతునికి అర్పించాలి. నాకవసరమైన 5 రూపాయలకన్నా ఎన్నో రెట్లు ధనం నీ దగ్గర ఉంది. అయినా డబ్బే నీ పాలిట బ్రహ్మం. దానిపై మోహం నశిస్తే కానీ జ్ఞానం లభించదు. సాయి నామమే మృత్యుంజయ మంత్రం 1886లో తాను అల్లా వద్దకు వెడుతున్నానని, మూడు రోజుల వరకు తమ దేహాన్ని భద్రపరచమని మహల్సాపతికి చెప్పి దేహత్యాగం చేశారు సాయి. మూడు రోజులు తరువాత తిరిగి వచ్చి 32 సం.లు అదే దేహంతో సంచరించిన సాయిబాబా మృత్యుంజయుడే. కేవలం ఆ మృత్యుంజయత్వం తమ దేహానికే పరిమితం కాదు. ఎందరో భక్తుల్ని మృత్యుముఖం నుండి రక్షించారు బాబా. కొందరిని మరణించిన తరువాత కూడా బ్రతికించారు. నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను.. నా నామం పలుకుతుంది.. నా మట్టి సమాధానమిస్తుంది’’ అని అభయమిచ్చి నేటికీ నెరవేస్తున్నారు. సాయి మృత్యుంజయులు. సాయి నామం మృత్యుంజయ మంత్రం. సాయినాధునిపై మనఃపూర్వమైన భక్తి విశ్వాసం కలిగి వున్న వారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యం కల్గుతుంది. బాబా కథలు వింటే గర్వాంధకారాలు, సకల రోగాలు నశించి శాంతి, తృప్తి, ఆనందం ధైర్యం కలుగుతుంది. సాయి నామాన్ని స్మరించడంవలన చెడు మాట్లాడటం, చెడు వినటం వలన కలిగే పాపాలు తొలగిపోతాయి. ప్రపంచంలో అన్నిటికన్నా శక్తివంతమైన పరమ సత్యం సాయిబాబా. #🙏🏻భక్తి సమాచారం😲 #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🕉ఓం సాయి రామ్🕉 #🕉️ ఓం శ్రీ సాయి రామ్🙏 #సాయిబాబా
See other profiles for amazing content