#😊పాజిటివ్ కోట్స్🤗 #📸నా ఫోటోగ్రఫీ #💑రిలేషన్ షిప్ కోట్స్ #📱మొబైల్ ఫోటోగ్రఫీ📸 #❤️లవ్ కోట్స్✍🏼 అల్లజీన యు'మినూన బిల్ గైజ్ _ వీరు అగోచరాలను (కంటితో చూడకుండానే) విశ్వసి స్తారు- దైవభీతి పరుల మొట్టమొదటి లక్షణం ఏమంటే, వారు చైతన్యవంతంగా ఆమోదించిన దానిని నిఖార్సుగా ఆచరిస్తూ విశాల హృదయులై వుంటారు. ఈ కలయికల ఏకత్వం వారి మనస్సులో అగోచరాలను విశ్వసించే విధులు నిర్వర్తించి, ప్రవక్తల పరంపరను ఆమోదించి, పరలోకం పట్ల దృఢమైన నమ్మకం కలుగచేస్తుంది. ఈ సమ్మిళితమైన విశ్వాసమే ఒక వ్యక్తికి ఈ భువిలో ఒక ప్రత్యేకతను ప్రసాదిస్తుంది. ఈ విశ్వాసం, మానవ సమాజాన్ని సంస్కరించి తన చుట్టూ సమీకరించేందుకు అందించబడింది. సమస్త మానవాళికి ఈ విశ్వాసమే శిక్షణ గరుపుతుంది. ఈ విశ్వాసపు చల్లని నీడలో మానవ సమాజం తమ నైజానికి అనుగుణమైన సంపూర్ణ జీవితం గడపగలుగుతుంది. చైతన్యవం తమైన ఆచరణ, విశ్వాసం, నిర్మాణాత్మక జీవనం, విధి విధానాల ప్రణాళికాబద్ధతల సమైక్య రూపంగా ఉన్న ఈ జీవితం మనిషికి ఎంతో అవసరం.
ముత్తఖీల ఈ గుణ విశేషణాలను పరిశీలిస్తే సమస్త మానవాళి సంస్కరణకు, సాఫల్యకర ఆచరణకు ఈ గుణవిశేషణాలు తప్పనిసరి అని అర్ధమవుతుంది. ఈ సృష్టి, ఆత్మలు ఉనికిలోకి తెచ్చిన ఆ మహోన్నత శక్తి ఈ అగోచర పరదాలకు ఆవలివైపునే ఉంది. ఆత్మలు వాటి సత్యత, సృష్టితాలు, వాటి నిర్మాత, వాటి కార్యనిర్వాహక వర్గం మొత్తం మన ఊహల పరదాలకు ఆవలి వైపున ఉన్నాయి.
అగోచరాలను (గైబ్) విశ్వసించడం ద్వారానే మనిషి, పశువు నుండి వేరుపడగలుగుతాడు. తన ఉత్తమ స్థానాన్ని పొందగలుగుతాడు. పశువు యొక్క జీవితం, ఆలోచనలు చాలా పరిమితంగా ఉంటాయి. ఈ సృష్టి కేవలం ఈ ముక్తసరి హద్దులకు లోబడినది కాదని దాని మూలాలు చాలా విశాలంగావున్నాయని మనిషి మాత్రమే తెలుసుకోగలుగుతాడు. మనిషిలోని ఈ అంతర్గత జ్ఞానమే అతనికి సహాయ కారిగా నిలుస్తుంది.
మనిషి యొక్క ఈ ఆలోచనల పయనం, తన ఉనికికి కారణం, దాని సత్యతలు. ఈ విశ్వకర్మా గారపు ప్రణాళికాబద్ధత, దానిని నిర్వహిస్తున్న ప్రచండ శక్తి, దాని వాస్తవికతల వైపునకు సాగుతాయి. ఈ విషయంగా మనిషి ఆలోచనలు. ఈ విశ్వవ్యవస్థకు అవల ఏ మేధ పనిచేస్తూ వుందో దానిని గుర్తిస్తాయి. మనిషి మేధస్సుమీద, విశేషమైన ప్రభావం చూపుతుంది. ఈ భూఖండంపై నివసించే మనిషిపై విశేషంగా ప్రభావం చూపుతుంది. హ్రస్వదృష్టితో, సంకుచితంగా ఒక చిన్న హద్దులో జీవించే మనిషి, విశాలమైన భావనలు, ఈ సృష్టికి ఆవలకు సైతం చేరగలిగిన ఆలోచనలు గల మనిషి ఒకేలా జీవించ లేరు. విశాలత్వం మనిషి అంతర్గతాన్ని, బాహ్యాలన్నీ ఆవరిస్తుంది. దాని పిలుపులు హితవులు మనిషి అంతరంగం స్వీకరిస్తూ, జీర్ణం చేసుకుంటూ ఉంటుంది. ఈ జీవితం చాలా విశాలమైనదని, తనకు కనిపిస్తున్న దానికన్నా చాలా విశాలమైనదని మనిషి తెలుసుకుంటాడు. ప్రతి కాల, మానాలకంటే తన పరిమిత ఇహలోక జీవితం కంటే చాలా విశాలమైందని గ్రహిస్తాడు. ఈ జ్ఞానం ద్వారా తన కళ్ళకు తెలియని ఒక సత్యం రహస్యంగా దాగి వుందని తెలుసుకుంటాడు. ఆయన ద్వారానే ఈ విశ్వకర్మాగారం ఉనికిలోకి వచ్చిందని గ్రహిస్తాడు. విశ్వప్రభువు, విధాత యొక్క సత్యత, దాని సాక్ష్యాలను గ్రహించగలిగే నయనాలు పొందుతాడు. కాని ఆయన వాస్తవికత మన ఊహలకు ఆలోచనలకు అతీతమైంది.
అగోచర విశ్వాసం మనిషిలో సైద్ధాంతిక దృఢత్వం కలుగచేస్తుంది. మార్గభ్రష్టత్వపు ప్రమాదం
నుండి మనిషిని రక్షిస్తుంది. ఆచరణా మైదానవు పరిధి స్పష్టం అవుతుంది. దేనికోసం తాను జన్మిం చలేదో, దాని నుండి రక్షింపబడతాడు. ఏ అంశాలు తనకు నష్టదాయకాలో వాటి నుండి కాపాడబడ తాడు. తనను తమ కబంధహస్తాలలో బంధించాలని చూచే దుష్టవాంఛల నుండి కాపాడబడతాడు.
మనిషికి ఆలోచనా శక్తి అల్లాహ్ నుండి ప్రసాదించబడింది. తద్వారా మనిషి దైవప్రతినిధి (ఖిలాఫత్) తత్వపు హక్కు నెరవేర్చాలి. ఈ ఆలోచనా శక్తికి అవసరమైన వనరులన్నింటిని ఈ కారణంగానే మనిషికి అత్యంత సమీపంగా ఉంచబడ్డాయి. మనిషి ఈ వనరులన్నింటిని గమనించాలి. ఆలోచించాలి. సత్యం గ్రహించాలి. అందుకు తగిన విధంగా పనిచేయాలి. ఫలితాలను సాధించాలి. జీవితాన్ని సమున్నతపర్చుకోవాలి. జీవితాన్ని వెలుగుమయంతో పాటు సౌందర్యవంతం కూడా చేసుకోవాలి. వీటితో ఆత్మీయ శక్తిని కూడా పొందాలి. తద్వారా ఈ విశ్వవ్యవస్థ, దాని సృష్టికర్తతో సహేతుకమైన, నిరంతరమైన సంబంధం కలిగి ఉండగలుగుతాడు. ఏదైతే తెలియదో దానిని అగోచర విశ్వాసానికి అప్పగించాలి. ఏదైతే తన ఆలోచనలకు, ఊహలకు అందలేదో దానిని అగోచరత్వానికి అప్పగించడమే. శ్రేయస్కరం.
కేవలం బుద్ధి, ఊహలపై ఆధారపడి ఈ విశ్వవ్యవస్థ, అందులోని మనిషి యొక్క జీవిత లక్ష్యం, వీటి వెనుక పనిచేస్తున్న దేవుని హస్తం వగైరాలను మనిషి కనుగొనలేడు. అందుకు దైవవాణి సహకారం, అవసరం అవుతుంది. ఈ సహకారాన్ని బుద్ధి అంగీకరించకపోవచ్చు. బుద్ధి పునాదిపై అగోచరా లను కనుగొనే ప్రయత్నం ఒక వృధా ప్రయాస మాత్రమే. ఈ ప్రయత్నం మనిషి జీవిత కాలాన్ని హరించివేస్తుంది. ఈ ప్రయత్నం ద్వారా మనిషిపొందేది ఏమీ లేదు. దేనికొరకు మానవ సృజన జరగలేదో. ఆ విషయాలపై తన బుద్ధిని ఉపయోగిం చటం మనిషికి నష్టదాయకం అవుతుంది.
కనుక మనిషి తన బుద్ధి, ఆలోచనలను, అంతర్బహ్యాలు, గోచర, అగోచరాలు సృజించిన, ఎరిగిన ఆ మహోన్నత శక్తికి అప్పగించివేయాలి. ఆ శక్తియే అన్నింటిని ఆవహించి వుంది. ఈ కారణం గానే దైవ భయభక్తిపరుల గుణ విశేషణలో అగోచరా లను విశ్వసించటం తప్పనిసరి అయింది.
అగోచరాలపై విశ్వాసమే మనిషిని జంతు ప్రపంచం నుండి ప్రత్యేకించింది. ప్రతి కాలంలోని భౌతిక పూజారుల వలెనే నేటి భౌతిక పూజారులు కూడా మనిషిని జంతువుగా, భౌతిక పూజారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జంతు ప్రపం చంలో లోతైన ఆలోచనలు ఉండవు. దేనినైతే వీరు 'అభివృద్ధి' అని పిలుస్తున్నారో అది మొత్తంగా భౌతిక లాలస తప్ప మరేమీ కాదు. ఈ భౌతిక లాలస, మనోకాంక్షల భక్తి నుండి తమ విశ్వాసాన్ని కాపాడుకొమ్మని అల్లాహ్ హితవు గరిపాడు. ఇందుకు వారిలోని ఉత్తమ గుణ విశేషణంగా "వీరు అగోచరా లను విశ్వసిస్తారు" అని చెప్పబడింది.