#🔊తెలుగు చాట్రూమ్😍 #💪పాజిటీవ్ స్టోరీస్ #షేర్ చాట్ బజార్👍 #😃మంచి మాటలు #🆕Current అప్డేట్స్📢
#మేడ్చల్ జిల్లా నాలుగో మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ ప్రెస్ మీట్
కార్మిక హక్కుల కోసం ఐక్యంగా పోరాటం
- అశోక్, చంద్రశేఖర్
అక్టోబర్ 25, 26న మేడ్చల్ జిల్లా సీఐటీయూ మహాసభలు
కార్మిక వర్గ సమస్యలను చర్చించి, ఉద్యమ కార్యక్రమాలకు దిశానిర్దేశం చేయడానికి సీఐటీయూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
4వ మహాసభలు అక్టోబర్ 25, 26న చర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ హాల్లో జరుగనున్నాయని జిల్లా అధ్యక్షుడు ఎ.అశోక్, కార్యదర్శి జె.చంద్రశేఖర్ లు తెలిపారు.
శుక్రవారం కమలానగర్లోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మిక చట్టాల పేరుతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త లేబర్ కోడ్స్ తో కనీస వేతనాలు, పని గంటలు, సామాజిక భద్రత, ట్రేడ్ యూనియన్ హక్కులు, వీటి అమలుతో కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, ప్రైవేట్ రంగ కార్మికులు, నిర్మాణ కార్మికులు అందరూ భద్రత కోల్పోతారని హెచ్చరించారు. లేబర్ కోడ్స్ అమలు అంటే కార్మికులను మూలంగా అణగదొక్కే ప్రయత్నం. కార్మిక చట్టాలను రద్దు చేసి యజమానులకే అనుకూలంగా మార్చడం జరుగుతోంది. దీనివల్ల వేతనాలు తగ్గడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, పెన్షన్ సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలు మరింత పెరుగుతాయి అని నాయకులు అన్నారు. ప్రైవేటీకరణ, కాంట్రాక్టు విధానం, కార్మిక హక్కుల ఉల్లంఘన, నిరుద్యోగం వంటి సమస్యలతో కార్మికవర్గం తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహాసభల్లో సమగ్ర కార్యాచరణ రూపుదిద్దుకోనుంది అని చెప్పారు. కనీస వేతనం రూ.26వేలు అమలు, కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్ చేయడం, సామాజిక భద్రత, పెన్షన్ హక్కులు, మహిళా కార్మికుల రక్షణ, అసంఘటిత రంగ కార్మికుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై తీర్మానాలు ఆమోదిస్తామని తెలిపారు. పరిశ్రమలలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు యూనియన్ స్థాయి అవగాహన, సంఘటిత పోరాటం అవసరం. వేలాది కార్మికులను సంఘటితం చేయడమే ఈ మహాసభల ప్రధాన లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జి. శ్రీనివాసులు ఉన్నికృష్ణ, గణేష్, బి.వి.సత్యనారాయణ తదితరులు