ఫాలో అవ్వండి
v. v. guptha
@299580595
8,456
పోస్ట్
10,247
ఫాలోవర్స్
v. v. guptha
145 వీక్షించారు
#🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు 07-02-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - బుద్ధిలో స్థిరముగా ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉంటే, అది కూడా అహో సౌభాగ్యము’’ ప్రశ్న:-ఏ పిల్లలకైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో, వారి గుర్తులేమిటి? జవాబు:-వారు నోటి ద్వారా జ్ఞానాన్ని వినిపించకుండా ఉండలేరు. వారు ఆత్మిక సేవలో తమ ఎముక-ఎముకను స్వాహా చేస్తారు. వారికి ఆత్మిక జ్ఞానాన్ని వినిపించడములో చాలా సంతోషము కలుగుతుంది. వారు సంతోషములోనే నాట్యము చేస్తూ ఉంటారు. వారు తమ కన్నా పెద్దవారికి చాలా గౌరవాన్ని ఇస్తారు, వారి నుండి నేర్చుకుంటూ ఉంటారు. పాట:-ఈ ప్రపంచము మారినా... ▶ ఓంశాంతి. పిల్లలు పాటలోని రెండు లైన్లు విన్నారు. ఇది ప్రతిజ్ఞకు సంబంధించిన పాట. ఎవరికైనా నిశ్చితార్థము జరిగినప్పుడు, స్త్రీ-పురుషులు ఒకరినొకరు ఎప్పుడూ విడిచిపెట్టమని ప్రతిజ్ఞ చేస్తారు. కొంతమందికి ఒకరితో ఒకరికి పడకపోతే విడిచిపెట్టేస్తారు కూడా. ఇక్కడ పిల్లలైన మీరు ఎవరితో ప్రతిజ్ఞ చేస్తారు? ఈశ్వరునితో. వారితోనే పిల్లలైన మీకు లేక ప్రేయసులైన మీకు నిశ్చితార్థము జరిగింది, కానీ ఈ విధముగా విశ్వానికి యజమానులుగా తయారుచేసేవారిని కూడా విడిచిపెట్టేస్తారు. ఇక్కడ పిల్లలైన మీరు కూర్చున్నారు, ఇప్పుడు అనంతమైన బాప్ దాదా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. ఇక్కడ మీకు ఏ అవస్థ అయితే ఉంటుందో, అది అక్కడ సెంటర్ లో ఉన్నప్పుడు ఉండదు. ఇక్కడ బాప్ దాదా వచ్చి ఉన్నారని మీరు భావిస్తారు. అక్కడ సెంటర్ లో ఉన్నప్పుడు బాబా వినిపించిన మురళీ వచ్చిందని భావిస్తారు. ఇక్కడికి మరియు అక్కడికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అనంతమైన తండ్రి సమ్ముఖములో మీరు కూర్చొన్నారు. అక్కడైతే సమ్ముఖముగా ఉండరు. సమ్ముఖముగా వెళ్ళి మురళీ వినాలని కోరుకుంటారు. బాబా వచ్చి ఉన్నారని ఇక్కడ పిల్లల బుద్ధిలోకి వచ్చింది. ఇతర సత్సంగాలలో, ఫలానా స్వామీజీ వస్తారని భావిస్తారు కదా. కానీ ఈ ఆలోచన కూడా అందరికీ ఏకరసముగా ఉండదు. చాలామంది బుద్ధియోగమైతే వేరే వైపులకు భ్రమిస్తూ ఉంటుంది. కొంతమందికి పతి గుర్తుకువస్తారు, కొంతమందికి సంబంధీకులు గుర్తుకువస్తారు. ఆ ఒక్క గురువుపై కూడా బుద్ధియోగము నిలవదు. స్వామీజీ స్మృతిలో కూర్చుని ఉండేవారు ఎవరో అరుదుగా ఉంటారు. ఇక్కడ కూడా అలాగే. అందరూ శివబాబా స్మృతిలో ఉంటారని కూడా కాదు. బుద్ధి ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది, మిత్ర-సంబంధీకులు మొదలైనవారు గుర్తుకువస్తూ ఉంటారు. మొత్తం సమయమంతా ఒక్క శివబాబా స్మృతిలోనే ఉంటే ఇక అది అహో సౌభాగ్యము. కానీ స్థిరమైన స్మృతిలో ఎవరో అరుదుగా ఉంటారు. ఇక్కడ తండ్రి సమ్ముఖములో ఉన్నట్లయితే చాలా సంతోషముండాలి. అతీంద్రియ సుఖము గురించి గోపీ వల్లభుని గోప-గోపికలను అడగండి, ఇది ఇక్కడి గాయనమే. ఇక్కడ మీరు తండ్రి స్మృతిలో కూర్చున్నారు. ఇప్పుడు మనము ఈశ్వరుని ఒడిలో ఉన్నామని, తర్వాత దైవీ ఒడిలో ఉంటామని మీకు తెలుసు. ఈ చిత్రములో ఈ కరెక్షన్ చేయాలి, ఇది వ్రాయాలి అని కొంతమంది బుద్ధిలో సేవ యొక్క ఆలోచనలు కూడా నడుస్తూ ఉంటాయి. కానీ మంచి పిల్లలెవరైతే ఉంటారో వారు - ఇప్పుడైతే తండ్రి నుండి వినాలని భావిస్తారు, ఇంకే సంకల్పాలను రానివ్వరు. తండ్రి జ్ఞాన రత్నాలతో జోలిని నింపడానికి వచ్చారు కనుక తండ్రితోనే బుద్ధియోగాన్ని జోడించాలి. నంబరువారుగా ధారణ చేసేవారైతే తప్పకుండా ఉంటారు. కొంతమంది మంచి రీతిలో విని ధారణ చేస్తారు, కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు. బుద్ధియోగము వేరే వైపులకు పరిగెడుతూ ఉంటే ధారణ జరగదు, కచ్చాగానే (అపరిపక్వముగానే) ఉండిపోతారు. 1-2 సార్లు మురళీ విన్నా కూడా ధారణ జరగకపోతే, ఇక ఆ అలవాటు పక్కా అయిపోతూ ఉంటుంది. ఇక తర్వాత ఎంతగా వింటూ ఉన్నా సరే, వారికి ధారణ జరగదు, వారు ఎవ్వరికీ వినిపించలేకపోతారు. ఎవరికైతే ధారణ జరుగుతుందో, వారికి సేవ పట్ల అభిరుచి ఉంటుంది. అటువంటివారు ఉత్సాహముతో ఉప్పొంగుతూ ఉంటారు. మేము వెళ్ళి జ్ఞాన ధనాన్ని దానము చేయాలని అనుకుంటారు ఎందుకంటే ఈ ధనము ఒక్క తండ్రి వద్ద తప్ప ఇంకెవ్వరి వద్ద లేదు. అందరికీ ఒకే విధముగా ధారణ జరగదని, అందరూ ఒకే విధముగా ఉన్నత పదవిని పొందలేరని కూడా తండ్రికి తెలుసు, అందుకే బుద్ధి వేరే వైపులకు భ్రమిస్తూ ఉంటుంది. అటువంటివారి భవిష్య భాగ్యము అంత ఉన్నతముగా తయారవ్వదు. కొంతమంది స్థూల సేవలో తమ ఎముక-ఎముకను ఇస్తారు. అందరినీ సంతుష్టపరుస్తారు. భోజనము తయారుచేస్తూ, తినిపిస్తూ ఉంటారు, ఇది కూడా ఒక సబ్జెక్టు కదా. ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో, వారు నోటితో జ్ఞానాన్ని వినిపించకుండా ఉండలేరు. అప్పుడు బాబా చూస్తారు కూడా - వీరికి దేహాభిమానమైతే లేదు కదా, పెద్దవారి పట్ల గౌరవాన్ని ఉంచుతున్నారా లేదా అని. పెద్ద మహారథుల పట్ల గౌరవము ఉంచవలసి ఉంటుంది. అయితే కొంతమంది చిన్నవారు కూడా తెలివైనవారిగా అయిపోతారు, అప్పుడు పెద్దవారు కూడా చిన్నవారికి గౌరవాన్ని ఇవ్వవలసి ఉండవచ్చు, ఎందుకంటే ఆ చిన్నవారి బుద్ధి గ్యాలప్ చేస్తుంది (వేగముగా ముందుకు వెళ్తుంది). సేవ పట్ల ఉన్న అభిరుచిని చూసి, వీరు మంచి సేవ చేస్తారని తండ్రి అయితే సంతోషిస్తారు కదా. రోజంతా ప్రదర్శనీలలో అర్థం చేయించే అభ్యాసము చేయాలి. ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు కదా, ఇంకే ఉపాయము లేదు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, రాజులు, రాణులు, ప్రజలు అందరూ ఇక్కడే తయారవుతారు. ఎంత సేవ చేయాలి. ఇప్పుడు మనము బ్రాహ్మణులుగా అయ్యామనైతే పిల్లల బుద్ధిలో ఉంది. ఇంటిలో గృహస్థములో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ, ఎవరి అవస్థ వారిది ఉంటుంది కదా. అలాగని ఇళ్ళు-వాకిళ్ళనైతే వదిలిపెట్టకూడదు. తండ్రి అంటారు, ఇంటిలో ఉండండి కానీ బుద్ధిలో ఈ నిశ్చయము ఉంచుకోవాలి - పాత ప్రపంచము సమాప్తమయ్యే ఉంది అని. మనకు ఇప్పుడు తండ్రితోనే పని ఉంది. కల్పక్రితము ఎవరైతే జ్ఞానాన్ని తీసుకున్నారో, వారే తీసుకుంటారని కూడా మీకు తెలుసు. క్షణము తర్వాత క్షణము యథావిధిగా రిపీట్ అవుతోంది. ఆత్మలో జ్ఞానముంటుంది కదా. తండ్రి వద్ద కూడా జ్ఞానముంటుంది. పిల్లలైన మీరు కూడా తండ్రి వలె తయారవ్వాలి. పాయింట్లను ధారణ చేయాలి. అన్ని పాయింట్లూ ఒకే సమయములో అర్థం చేయించడము జరగదు. వినాశనము కూడా ఎదురుగా ఉంది. ఇది ఇంతకుముందు జరిగిన అదే వినాశనము. సత్య, త్రేతాయుగాలలోనైతే ఎటువంటి యుద్ధము జరగదు. చాలా ధర్మాలు ఏర్పడిన తర్వాత, సైన్యాలు మొదలైనవి ఏర్పడినప్పుడు యుద్ధాలు ప్రారంభమవుతాయి. మొట్టమొదట ఆత్మలు సతోప్రధాన స్థితిలో దిగుతాయి, ఆ తర్వాత సతో, రజో, తమో స్థితులలోకి వస్తాయి. రాజధాని ఏ విధముగా స్థాపనవుతోంది అనేదంతా కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు, శివబాబా వచ్చి మాకు ఖజానాలను ఇస్తున్నారని బుద్ధిలో ఉంచుకోవాలి, వాటిని బుద్ధిలో ధారణ చేయాలి. మంచి-మంచి పిల్లలు నోట్స్ వ్రాస్తారు, వ్రాయడము మంచిదే, అప్పుడు బుద్ధిలోకి టాపిక్స్ వస్తాయి. ఈ రోజు ఫలానా టాపిక్ పై అర్థం చేయించాలని భావిస్తారు. తండ్రి అంటారు, నేను మీకు ఎంత ఖజానాను ఇచ్చాను. సత్య, త్రేతాయుగాలలో మీ వద్ద అపారమైన ధనముండేది, ఆ తర్వాత వామ మార్గములోకి వెళ్ళడముతో ఆ ధనము తగ్గిపోతూ వచ్చింది. సంతోషము కూడా తగ్గిపోతూ వచ్చింది. ఏదో ఒక వికర్మ జరగడము మొదలవుతుంది. కిందికి దిగుతూ-దిగుతూ కళలు తగ్గిపోతూ ఉంటాయి. సతోప్రధాన, సతో, రజో, తమో స్థితులు ఉంటాయి. సతో నుండి రజోలోకి వస్తారు, అప్పుడు ఒక్కసారిగా వచ్చేస్తారని కాదు, మెల్లమెల్లగా దిగుతారు. తమోప్రధానములో కూడా మెల్లమెల్లగా మెట్లు దిగుతూ వస్తారు, కళలు తగ్గుతూ ఉంటాయి, రోజురోజుకు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు జంప్ చేయాలి. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. దీని కోసం సమయము కూడా కావాలి. ఎక్కితే వైకుంఠ రసాన్ని చవి చూస్తారు... అని అంటూ ఉంటారు. కామము యొక్క చెంపదెబ్బ తగలడముతో పూర్తిగా చూర్ణమైపోతారు, ఎముక-ఎముక విరిగిపోతుంది. కొంతమంది మనుష్యులు స్వయాన్ని జీవహత్య చేసుకుంటారు, అది ఆత్మహత్య కాదు, దానిని జీవహత్య అని అంటారు. ఇక్కడైతే తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి, తండ్రిని స్మృతి చేయాలి, ఎందుకంటే తండ్రి నుండి రాజ్యాధికారము లభిస్తుంది. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి - నేను తండ్రిని స్మృతి చేసి భవిష్యత్తు కోసం ఎంత సంపాదన చేసుకున్నాను? ఎంతగా అంధులకు చేతికర్రగా అయ్యాను? ఈ పాత ప్రపంచము మారుతోంది అని ఇంటి-ఇంటికీ సందేశాన్ని ఇవ్వాలి. తండ్రి కొత్త ప్రపంచము కోసం రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మెట్ల చిత్రములో అంతా చూపించారు. ఈ చిత్రాలు తయారుచేయడములో కృషి చేయవలసి ఉంటుంది. ఎవరైనా సరే సహజముగా అర్థం చేసుకునే విధముగా ఈ చిత్రాలను తయారుచేయాలని, రోజంతా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ప్రపంచములోని వారంతా అయితే ఇక్కడకు రారు. దేవీ-దేవతా ధర్మమువారే వస్తారు. మీ సేవ అయితే ఎంతగానో జరగనున్నది. మన ఈ క్లాస్ ఎప్పటివరకు నడుస్తోంది అనేది మీకు తెలుసు. వారైతే కల్పము యొక్క ఆయుష్షు లక్షల సంవత్సరాలని భావిస్తారు. అందుకే శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూ ఉంటారు. అంతిమము వచ్చినప్పుడు సర్వుల సద్గతిదాత వస్తారని, మా శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి గతి ఏర్పడుతుందని, ఆ తర్వాత మేము కూడా వెళ్ళి జ్యోతిలో కలిసిపోతామని వారు భావిస్తారు. కానీ అలా జరగదు. మనము అమరుడైన తండ్రి ద్వారా సత్యాతి-సత్యమైన అమరకథను వింటున్నామని మీకు ఇప్పుడు తెలుసు. కావున అమరుడైన తండ్రి ఏదైతే చెప్తారో, దానిని అంగీకరించాలి కూడా, వారు కేవలం - నన్ను స్మృతి చేయండి, పవిత్రముగా అవ్వండి అని చెప్తున్నారు. లేకపోతే శిక్షలు కూడా చాలా అనుభవించవలసి ఉంటుంది, పదవి కూడా తక్కువది లభిస్తుంది. సేవలో కృషి చేయాలి. దధీచి ఋషి ఉదాహరణ ఉంది కదా. వారు ఎముకలను కూడా సేవలో పెట్టారు. తమ శరీరము పట్ల కూడా ధ్యాస పెట్టకుండా రోజంతా సేవలో ఉండడము, దీనినే సేవలో ఎముకలను ఇవ్వడమని అంటారు. ఒకటి, ఎముకలతో చేసే దైహిక సేవ, రెండవది, ఎముకలతో చేసే ఆత్మిక సేవ. ఆత్మిక సేవ చేసేవారు ఆత్మిక జ్ఞానాన్నే వినిపిస్తూ ఉంటారు. ధనాన్ని దానము చేస్తూ సంతోషములో నాట్యము చేస్తూ ఉంటారు. ప్రపంచములో మనుష్యులేదైతే సేవ చేస్తూ ఉంటారో, అదంతా దైహిక సేవ. వారు శాస్త్రాలను వినిపిస్తారు, అది ఆత్మిక సేవ కాదు. ఆత్మిక సేవనైతే కేవలం తండ్రి మాత్రమే వచ్చి నేర్పిస్తారు. స్పిరిచ్యుల్ తండ్రియే వచ్చి స్పిరిచ్యుల్ పిల్లలను (ఆత్మలను) చదివిస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు సత్యయుగీ కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడ మీ ద్వారా ఎటువంటి వికర్మలు జరగవు. అది ఉన్నదే రామ రాజ్యము. అక్కడ ఉండేది కొద్దిమంది మాత్రమే. ఇప్పుడైతే రావణ రాజ్యములో అందరూ దుఃఖితులుగా ఉన్నారు కదా. ఈ జ్ఞానమంతా కూడా మీ బుద్ధిలో నంబరువారు పురుషార్థానుసారముగా ఉంది. ఈ మెట్ల చిత్రములోనే జ్ఞానమంతా వచ్చేస్తుంది. తండ్రి అంటారు, ఈ అంతిమ జన్మ పవిత్రముగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మీరు ఏ విధముగా అర్థం చేయించాలంటే, దానితో మనుష్యులకు - మేము సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయ్యాము, స్మృతియాత్రతోనే మళ్ళీ సతోప్రధానముగా అవుతాము అని తెలియాలి. ఇది చూసినప్పుడు - ఈ జ్ఞానము ఇంకెవ్వరి వద్దా లేదని అర్థమవుతుంది. ఈ మెట్ల చిత్రములో ఇతర ధర్మాల సమాచారము ఎక్కడ ఉందని అంటారు. ఆ విషయాలు ఈ సృష్టి చక్రము చిత్రములో వ్రాయబడి ఉన్నాయి. ఇతర ధర్మాలవారు కొత్త ప్రపంచములోకైతే రారు, వారికి శాంతి లభిస్తుంది. భారతవాసులే స్వర్గములో ఉండేవారు కదా. తండ్రి కూడా భారత్ లోకే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు, అందుకే భారత్ యొక్క ప్రాచీన యోగాన్ని అందరూ కోరుకుంటారు. తప్పకుండా కొత్త ప్రపంచములో కేవలం భారత్ యే ఉండేదని ఈ చిత్రాల ద్వారా వారు స్వయం కూడా అర్థం చేసుకుంటారు. తమ ధర్మము గురించి కూడా అర్థం చేసుకుంటారు. ధర్మ స్థాపన చేయడానికి క్రైస్ట్ వచ్చారు కానీ ఈ సమయములో వారు కూడా తమోప్రధానముగా ఉన్నారు. రచయిత మరియు రచన యొక్క ఈ జ్ఞానము ఎంత గొప్పది. మీరు ఈ విధముగా చెప్పవచ్చు - మాకు ఎవరి ధనము అవసరము లేదు, ధనాన్ని మేమేమి చేసుకుంటాము, మీరు కూడా వినండి, ఇతరులకు కూడా వినిపించండి, ఈ చిత్రాలు మొదలైనవి ముద్రించండి. ఈ చిత్రాలను ఉపయోగించుకోవాలి. ఈ జ్ఞానము వినిపించేందుకు హాల్ కట్టించండి, ఇకపోతే మేము ధనము తీసుకుని ఏమి చేస్తాము, మీ ఇంటి కళ్యాణమే జరుగుతుంది, మీరు కేవలం ఏర్పాట్లు చేయండి. రచయిత మరియు రచనల జ్ఞానము చాలా బాగుందని చాలామంది వచ్చి చెప్తారు. ఇదంతా మనుష్యులే అర్థం చేసుకోవాలి. విదేశీయులు ఈ జ్ఞానాన్ని విని చాలా ఇష్టపడతారు, చాలా సంతోషిస్తారు. మేము కూడా తండ్రితో యోగాన్ని జోడించినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని భావిస్తారు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఈ జ్ఞానాన్ని అయితే భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరని అర్థం చేసుకుంటారు. ఖుదా స్వర్గాన్ని స్థాపన చేసారని అంటారు కానీ వారు ఎలా వస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. మీ మాటలు విని సంతోషిస్తారు, ఆ తర్వాత పురుషార్థము చేసి యోగము నేర్చుకుంటారు, తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యేందుకు పురుషార్థము చేస్తారు. సేవ కోసమైతే ఎంతగానో ఆలోచించాలి. భారత్ లో నైపుణ్యాన్ని చూపిస్తే బాబా విదేశాలకు కూడా పంపిస్తారు. ఈ సంస్థ విదేశాలకు కూడా వెళ్తుంది. ఇప్పుడింకా సమయముంది కదా. కొత్త ప్రపంచము తయారయ్యేందుకు సమయమేమీ పట్టదు. ఎక్కడైనా భూకంపాలు మొదలైనవి జరిగితే, 2-3 సంవత్సరాలలో పూర్తిగా కొత్త ఇళ్ళు మొదలైనవి నిర్మిస్తారు. పనివారు చాలా మంది ఉండి, మొత్తం సామానంతా సిద్ధముగా ఉన్నట్లయితే, ఇక తయారవ్వడానికి సమయమేమీ పట్టదు. విదేశాలలో ఇళ్ళు ఎలా తయారవుతాయి - మినిట్ మోటర్ (నిమిషములో తయారవుతాయి). మరి స్వర్గములో ఇంకెంత త్వరగా తయారవుతూ ఉండవచ్చు. అక్కడ బంగారము, వెండి మొదలైనవి మీకు చాలా లభిస్తాయి, మీరు గనుల నుండి బంగారము, వెండి, వజ్రాలు తీసుకుని వస్తారు. అన్ని నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. ఇక్కడ సైన్స్ వారి గర్వము ఎంతగా ఉంది. ఈ సైన్స్ మళ్ళీ అక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ నేర్చుకున్నవారు మళ్ళీ తర్వాత జన్మను అక్కడ తీసుకుని దీనిని ఉపయోగిస్తారు. ఆ సమయములోనైతే మొత్తము ప్రపంచమంతా కొత్తగా అవుతూ ఉంటుంది, రావణ రాజ్యము సమాప్తమైపోతుంది, పంచ తత్వాలు కూడా నియమానుసారముగా మన సేవలో ఉంటాయి. స్వర్గము తయారవుతుంది. అక్కడ ఎటువంటి ఉపద్రవాలు జరగవు, రావణ రాజ్యమే ఉండదు, అందరూ సతోప్రధానముగా ఉంటారు. అన్నింటికంటే మంచి విషయమేమిటంటే - పిల్లలైన మీకు తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి. తండ్రి ఖజానాను ఇస్తారు, దానిని ధారణ చేసి ఇతరులకు దానమివ్వాలి. ఎంతగా దానమిస్తారో, అంతగా జమ అవుతూ ఉంటుంది. సేవే చేయకపోతే ధారణ ఎలా జరుగుతుంది? సేవలో బుద్ధిని ఉపయోగించాలి. సేవ అయితే చాలా ఎక్కువ చేయడానికి అవకాశముంది. రోజురోజుకు ఉన్నతిని పొందాలి. స్వయము యొక్క ఉన్నతిని కూడా చేసుకోవాలి. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. సదా ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి. జ్ఞాన ధనాన్ని దానము చేసి సంతోషములో నాట్యము చేయాలి. స్వయము ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయించాలి. 2. తండ్రి ఏదైతే జ్ఞాన ఖజానాను ఇస్తారో, దానితో తమ జోలిని నింపుకోవాలి. నోట్స్ వ్రాసుకోవాలి. ఆ తర్వాత టాపిక్స్ పై అర్థం చేయించాలి. జ్ఞాన ధనాన్ని దానము చేయడానికి ఉత్సాహముతో ఉప్పొంగుతూ ఉండాలి. వరదానము:-సత్యత యొక్క మహానత ద్వారా సదా సంతోషపు ఊయలలో ఊగే అథారిటీ స్వరూప భవ సత్యత యొక్క అథారిటీ స్వరూపము కల పిల్లల యొక్క గాయనము ఏమిటంటే - సత్యము ఉన్న చోట మనసు ఆనందముతో నాట్యము చేస్తుంది. సత్యము అనే నావ కదులుతుంది కానీ మునిగిపోదు. మిమ్మల్ని కూడా ఎవరు ఎంతగా కదిలించేందుకు ప్రయత్నించినా కానీ మీరు సత్యత యొక్క మహానత ద్వారా ఇంకా సంతోషపు ఊయలలో ఊగుతూ ఉంటారు. వారు మిమ్మల్ని కదిలించడము లేదు, కానీ మీ ఊయలను ఊపుతున్నారు. ఇది కదిలించడము కాదు, ఊపడము వంటిది. అందుకే మీరు వారికి ధన్యవాదాలు తెలపండి - మీరు ఊపుతూ ఉండండి మరియు మేము తండ్రితో కలిసి ఊగుతూ ఉంటాము అని. స్లోగన్:-సర్వ శక్తుల లైట్ సదా తోడుగా ఉన్నట్లయితే మాయ సమీపముగా రాలేదు.   అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి ఏకత, స్వచ్ఛత, సూక్ష్మత, మధురత మరియు మనసు-వాణి-కర్మలలో మహానత - ఈ 5 విషయాలు ప్రతి ఒక్కరి యొక్క ప్రతి అడుగులో కనిపించినట్లయితే బాబా ప్రత్యక్షత సహజముగా జరుగుతుంది. ఇప్పటివరకు సంస్కారాలలో ఏదైతే భిన్నత్వము కనిపిస్తుందో, దానిని ఏకతలోకి తీసుకురావాలి. ఏకత కోసం ఇతరుల సలహాలకు గౌరవాన్ని ఇవ్వండి, (హాజీ-హాజీ) సరేనండి, సరేనండి అంటూ మీ ఆలోచనలను తప్పకుండా చెప్పండి, ఆ తర్వాత ఏకత యొక్క బంధములో బంధింపబడండి, ఈ ఏకతయే సఫలతకు సాధనము. "
v. v. guptha
504 వీక్షించారు
#🇮🇳 మన దేశ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు 06-02-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడిది ఎక్కే కళ యొక్క సమయము, భారత్ నిరుపేద నుండి షావుకారుగా అవుతుంది, మీరు తండ్రి నుండి సత్యయుగీ రాజ్యాధికారము యొక్క వారసత్వాన్ని తీసుకోండి’’ ప్రశ్న:-తండ్రి యొక్క ఏ టైటిల్ ను శ్రీకృష్ణునికి ఇవ్వలేరు? జవాబు:-తండ్రి పేదల పెన్నిధి. శ్రీకృష్ణుడిని అలా అనరు. వారు చాలా ధనవంతుడు, వారి రాజ్యములో అందరూ షావుకారులుగా ఉంటారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడు అందరికన్నా నిరుపేదగా ఉన్నది భారత్. భారత్ నే షావుకారుగా తయారుచేస్తారు. మన భారత్ స్వర్గముగా ఉండేది, ఇప్పుడు అలా లేదు, మళ్ళీ ఆ విధముగా తయారవ్వనున్నది అని మీరంటారు. పేదల పెన్నిధి అయిన బాబాయే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. పాట:-చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది... ▶ ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మ గుప్తమైనది మరియు శరీరము ప్రత్యక్షముగా ఉంటుంది. ఆత్మను ఈ కనుల ద్వారా చూడలేము, అది గుప్తముగా ఉంది. ఆత్మ తప్పకుండా ఉంది, కానీ ఈ శరీరముతో కప్పబడి ఉంది, అందుకే ఆత్మ గుప్తముగా ఉందని అంటారు. ఆత్మ స్వయంగా అంటుంది - నేను నిరాకారిని, ఇక్కడ సాకారములోకి వచ్చి గుప్తము అయ్యాను. ఆత్మలది నిరాకారీ ప్రపంచము, అక్కడైతే గుప్తముగా ఉండే విషయమేమీ లేదు. పరమపిత పరమాత్మ కూడా అక్కడే ఉంటారు, వారిని సుప్రీమ్ అని అంటారు, వారు ఉన్నతోన్నతమైన ఆత్మ, అతీతముగా ఉండే పరమ ఆత్మ. తండ్రి అంటారు - ఎలాగైతే మీరు గుప్తముగా ఉన్నారో, అలాగే నేను కూడా గుప్తముగా రావలసి ఉంటుంది. నేను గర్భ జైలులోకి రాను. నాకు శివ అన్న ఒక్క పేరే కొనసాగుతూ వస్తుంది. నేను ఈ తనువులోకి వచ్చినా కూడా నా పేరు మారదు. వీరి ఆత్మకు ఏదైతే శరీరము ఉందో, ఆ శరీరము యొక్క పేరు మారుతుంది. నన్ను అయితే శివ అనే అంటారు - నేను ఆత్మలందరికీ తండ్రిని. ఆత్మలైన మీరు ఈ శరీరములో గుప్తముగా ఉన్నారు, ఈ శరీరము ద్వారా కర్మలు చేస్తారు. నేను కూడా గుప్తముగా ఉన్నాను. ఆత్మ ఈ శరీరముతో కప్పబడి ఉంది అని పిల్లలకు ఈ జ్ఞానము ఇప్పుడు లభిస్తుంది. ఆత్మ గుప్తముగా ఉంది, శరీరము ప్రత్యక్షముగా ఉంది. నేను కూడా అశరీరినే. గుప్తమైన తండ్రి ఈ శరీరము ద్వారా వినిపిస్తారు. మీరు కూడా గుప్తమైనవారే, శరీరము ద్వారా వింటారు. భారత్ ను మళ్ళీ నిరుపేద నుండి షావుకారుగా తయారుచేయడానికి బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. మీరు - మా భారత్ అని అంటారు. ప్రతి ఒక్కరూ తమ-తమ రాష్ట్రాల విషయములో - మా గుజరాత్, మా రాజస్థాన్ అని అంటారు. మాది-మాది అని అనడము వలన దాని పట్ల మోహము కలుగుతుంది. మన భారత్ నిరుపేదగా ఉంది అని అందరూ అనుకుంటారు, కానీ మన భారత్ షావుకారుగా ఎప్పుడు ఉండేది, ఎలా ఉండేది అనేది వారికి తెలియదు. పిల్లలైన మీకు చాలా నషా ఉంటుంది. మన భారత్ చాలా షావుకారుగా ఉండేది, దుఃఖమనే మాటే ఉండేది కాదు. సత్యయుగములో వేరే ఏ ధర్మమూ ఉండేది కాదు, ఒక్క దేవీ-దేవతా ధర్మమే ఉండేది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు మంచి రీతిలో అర్థం చేసుకుంటున్నారు. మన భారత్ చాలా షావుకారుగా ఉండేది. ఇప్పుడు చాలా నిరుపేదగా ఉంది. ఇప్పుడు మళ్ళీ తండ్రి షావుకారుగా తయారుచేయడానికి వచ్చారు. భారత్ సత్యయుగములో చాలా షావుకారుగా ఉండేది, అప్పుడు దేవీ-దేవతల రాజ్యముండేది, మరి ఆ రాజ్యము ఏమైపోయింది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఋషులు, మునులు మొదలైనవారు కూడా, మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదు అని అనేవారు. తండ్రి అంటారు, సత్యయుగములో కూడా దేవీ-దేవతలకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉండేది కాదు. మేము మెట్లు దిగుతూ కలియుగములోకి వెళ్ళిపోతామని - ఒకవేళ దేవతలకు కూడా ఈ జ్ఞానమున్నట్లయితే ఇక వారికి రాజ్యాధికారము యొక్క సుఖము ఉండదు, చింత కలుగుతుంది. మేము సతోప్రధానముగా ఉండేవారము, మళ్ళీ మేము సతోప్రధానముగా ఎలా అవ్వాలి అనే చింత మీకు ఉంది. ఆత్మలమైన మనము నిరాకారీ ప్రపంచములో ఉండేవారము, అక్కడ నుండి మళ్ళీ సుఖధామములోకి ఎలా వచ్చాము, ఈ జ్ఞానము కూడా మీకు ఉంది. మనము ఇప్పుడు ఎక్కే కళలో ఉన్నాము. ఇది 84 జన్మల మెట్ల వరుస. డ్రామానుసారముగా ప్రతి ఒక్క పాత్రధారి నంబరువారుగా తమ-తమ సమయమనుసారముగా వచ్చి పాత్రను అభినయిస్తారు. పేదల పెన్నిధి అని ఎవరిని అంటారు అన్నది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఇది ప్రపంచానికి తెలియదు. పాటలో కూడా విన్నారు - భక్తులందరూ ఏ రోజు కోసమైతే వేచి ఉన్నారో, చివరికి ఆ రోజు నేడు వచ్చింది... భగవంతుడు ఎప్పుడు వచ్చి భక్తులైన మనల్ని ఈ భక్తి మార్గము నుండి విడిపించి సద్గతిలోకి తీసుకువెళ్తారు అన్నది ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బాబా ఈ శరీరములోకి మళ్ళీ వచ్చేసారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు అంటే వారు తప్పకుండా వస్తారు. నేను శ్రీకృష్ణుడి తనువులోకి వస్తానని కూడా వారు అనరు. అలా కాదు. తండ్రి అంటారు, శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంది, వారి అనేక జన్మల అంతిమములో ఇది అంతిమ జన్మ. ఎవరైతే మొదటి నంబరులో ఉండేవారో, వారిప్పుడు చివరిలో ఉన్నారు, తతత్వమ్ (ఇది మీకు కూడా వర్తిస్తుంది). నేనైతే సాధారణ తనువులోకి వస్తాను, మీరు 84 జన్మలను ఎలా అనుభవించారు అన్నది నేను వచ్చి మీకు తెలియజేస్తాను. సిక్కులు కూడా ఏక్ ఓంకార్, పరమపిత పరమాత్మ అయిన తండ్రి అని భావిస్తారు, వారు తప్పకుండా మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేవారు. మరి మనము కూడా దేవతలుగా ఎందుకు అవ్వకూడదు. ఎవరైతే ఇంతకుముందు దేవతలుగా అయ్యి ఉంటారో, వారు తండ్రికి పూర్తిగా అతుక్కుపోతారు. స్వయాన్ని దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని ఒక్కరు కూడా భావించరు. ఇతర ధర్మాల చరిత్ర చాలా చిన్నది, కొందరిది 500 సంవత్సరాల చరిత్ర, మరికొందరిది 1250 సంవత్సరాల చరిత్ర. మీ చరిత్ర 5000 సంవత్సరాలది. దేవతా ధర్మమువారే స్వర్గములోకి వస్తారు, ఇతర ధర్మాల వారు తర్వాతే వస్తారు. దేవతా ధర్మమువారు కూడా డ్రామానుసారముగా ఇప్పుడు ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. వారు మళ్ళీ కన్వర్ట్ అయ్యి తమ-తమ ధర్మాలలోకి తిరిగి వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. బాబా స్వర్గాన్ని స్థాపన చేసేవారు కావున మేము స్వర్గములో ఎందుకు ఉండము, మేము తండ్రి నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటామని మీరు కూడా భావిస్తారు. ఇలా భావించేవారు మన ధర్మానికి చెందినవారని ఋజువవుతుంది. అలా కానీ వారు ఇక్కడకు రానే రారు. వారు పరాయి ధర్మములోకి మేము ఎందుకు వెళ్ళాలి అని అంటారు. కొత్త ప్రపంచమైన సత్యయుగములో దేవతలకు చాలా సుఖముండేదని, అక్కడ బంగారు మహళ్ళు ఉండేవని పిల్లలైన మీకు తెలుసు. సోమనాథ మందిరములో ఎంత బంగారముండేది. ఇటువంటి ధర్మము ఇంకేదీ ఉండదు. సోమనాథ మందిరమంతటి భారీ మందిరము ఇంకేదీ ఉండదు, అందులో చాలా వజ్ర-వైఢూర్యాలుండేవి. బుద్ధుడు మొదలైనవారికి వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఏమీ ఉండవు. ఏ తండ్రి అయితే పిల్లలైన మిమ్మల్ని ఇంత ఉన్నతముగా తయారుచేసారో, వారికి మీరు ఎంత గౌరవాన్ని ఇచ్చారు! గౌరవాన్ని ఇవ్వడము జరుగుతుంది కదా. మంచి కర్మలు చేసి వెళ్ళారని భావిస్తారు. అన్నింటికన్నా మంచి కర్మ పతిత-పావనుడైన తండ్రియే చేసి వెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. అన్నింటికన్నా ఉత్తమోత్తమ సేవను అనంతమైన తండ్రే వచ్చి చేస్తారని మీ ఆత్మ అంటుంది. వారు మనల్ని నిరుపేదల నుండి ధనవంతులుగా, బికారుల నుండి రాకుమారులుగా తయారుచేస్తారు. ఎవరైతే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారో, వారినిప్పుడు ఎవరూ గౌరవించడము లేదు. ఉన్నతోన్నతమైన మందిరము అని గాయనము చేయబడిన దానిని దోచుకుని వెళ్ళిపోయారు. లక్ష్మీ-నారాయణుల మందిరాన్ని ఎప్పుడూ ఎవ్వరూ దోచుకోలేదు. సోమనాథ మందిరాన్ని దోచుకున్నారు. భక్తి మార్గములో కూడా చాలా ధనవంతులుంటారు. రాజులలో కూడా నంబరువారుగా ఉంటారు కదా. ఎవరైతే ఉన్నత పదవి కలవారు ఉంటారో, వారికి తక్కువ పదవి వారు గౌరవాన్ని ఇస్తారు. దర్బారులో కూడా నంబరువారుగా కూర్చుంటారు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. ఇక్కడ పతిత రాజుల దర్బారు ఉంటుంది. పావన రాజుల దర్బారు ఎలా ఉంటుంది - వారి వద్ద ఇంత ధనముందంటే వారి ఇళ్ళు కూడా అంత బాగుంటాయి. తండ్రి మనల్ని చదివిస్తున్నారని, స్వర్గ స్థాపనను చేయిస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనము స్వర్గము యొక్క మహారాజా-మహారాణులుగా అవుతాము, మళ్ళీ మనము పడిపోతూ, పడిపోతూ భక్తులుగా అవుతాము, అప్పుడు మొట్టమొదట శివబాబాకు పూజారులుగా అవుతాము. ఎవరైతే మనల్ని స్వర్గానికి యజమానులుగా చేసారో, వారినే పూజిస్తాము. వారు మనల్ని చాలా షావుకార్లుగా చేస్తారు. ఇప్పుడు భారత్ ఎంత పేదగా ఉంది, ఏ భూమినైతే ఇంతకుముందు 500 రూపాయలకు తీసుకున్నామో, ఈ రోజు దాని విలువ 5000 రూపాయల కన్నా కూడా ఎక్కువైపోయింది. ఇవన్నీ కృత్రిమమైన ధరలు. అక్కడైతే భూమికి ధర ఉండదు, ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఎంతో భూమి ఉంటుంది, మధురమైన నదుల వద్ద మీ మహళ్ళు ఉంటాయి. మనుష్యులు చాలా కొద్దిమందే ఉంటారు. ప్రకృతి దాసిగా ఉంటుంది. ఫలాలు, పుష్పాలు మంచి-మంచివి లభిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఎంత శ్రమ చేయవలసి ఉంటుంది, అయినా కానీ భోజనము లభించదు. మనుష్యులు చాలా ఆకలి, దప్పికలతో మరణిస్తుంటారు. పాట వినడముతో మీ రోమాలు నిక్కబొడుచుకోవాలి. తండ్రిని పేదల పెన్నిధి అని అంటారు. పేదల పెన్నిధి యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నారు కదా! ఎవరిని షావుకార్లుగా తయారుచేస్తారు? వారు ఎక్కడికైతే వస్తారో, తప్పకుండా అక్కడున్నవారినే షావుకార్లుగా తయారుచేస్తారు కదా. మనము పావనము నుండి పతితముగా అవ్వడానికి 5 వేల సంవత్సరాలు పడుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాబా వెంటనే పతితము నుండి పావనముగా తయారుచేస్తారు, ఉన్నతోన్నతముగా తయారుచేస్తారు, ఒక్క సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా, నేను మీ వాడిని అని అంటారు. బాబా అంటారు - బిడ్డ, నీవు విశ్వానికి యజమానిగా ఉండేవాడివి. కొడుకు జన్మించగానే వారసునిగా అవుతాడు, ఎంత సంతోషము కలుగుతుంది. కూతురిని చూస్తే ముఖము కిందకు దిగిపోతుంది. ఇక్కడైతే ఆత్మలందరూ కొడుకులు. 5 వేల సంవత్సరాల క్రితము మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు తెలిసింది. బాబా మనల్ని అలా తయారుచేసారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారు అన్నది తెలియదు. లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. శివజయంతిని జరుపుకుంటారు, కేవలం లింగాన్ని పెట్టి పెద్ద-పెద్ద మందిరాలను నిర్మిస్తారు. కానీ వారు ఎలా వచ్చారు, వచ్చి ఏం చేసారు అన్నది ఏమీ తెలియదు, దీనిని అంధ విశ్వాసము, అంధ శ్రద్ధ అని అంటారు. మన ధర్మము ఏది, ఎప్పుడు స్థాపనయ్యింది అన్నది వారికి తెలియదు. ఇతర ధర్మాల వారికి వారి ధర్మము గురించి తెలుసు, బుద్ధుడు ఎప్పుడు వచ్చారు, తిథి-తారీఖులు ఏమిటి అన్నది కూడా వారికి తెలుసు. శివబాబాకు, లక్ష్మీ-నారాయణులకు ఎటువంటి తిథి, తారీఖులు లేవు. 5 వేల సంవత్సరాల విషయాన్ని లక్షల సంవత్సరాలని వ్రాసేసారు. లక్షల సంవత్సరాల విషయమనేట్పపటికి ఎవరికి గుర్తుకొస్తుంది? భారత్ లో దేవీ-దేవతా ధర్మము ఎప్పుడు ఉండేది అనేది అర్థం చేసుకోరు. లక్షల సంవత్సరాల లెక్కలోనైతే భారత్ జనాభా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. భారత్ యొక్క భూమి కూడా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. లక్షల సంవత్సరాలలో ఎంతమంది మనుష్యులు జన్మిస్తారు, ఇప్పటికి లెక్కలేనంతమంది మనుష్యులు అయిపోయి ఉండాలి. కానీ అంతమందైతే లేరు, ఇంకా జనాభా తగ్గిపోయింది. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ విషయాలను మనుష్యులు విన్నప్పుడు ఏమంటారంటే - ఈ విషయాలనైతే మేము ఎప్పుడూ వినలేదు, అలాగే ఏ శాస్త్రాలలోనూ చదవలేదు. ఇవి అద్భుతమైన విషయాలు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రము యొక్క జ్ఞానముంది. వీరు అనేక జన్మల అంతిమములో కూడా అంతిమములో ఇప్పుడు పతితాత్మగా ఉన్నారు. ఎవరైతే సతోప్రధానముగా ఉండేవారో వారు ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు, మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. ఆత్మలైన మీకిప్పుడు శిక్షణ లభిస్తోంది. ఆత్మ చెవుల ద్వారా వింటున్నప్పుడు శరీరము ఊగుతుంది ఎందుకంటే ఆత్మ వింటుంది కదా. ఆత్మలమైన మనము తప్పకుండా 84 జన్మలు తీసుకుంటాము, 84 జన్మలలో 84 తల్లిదండ్రులు తప్పకుండా లభించి ఉంటారు, ఇది కూడా లెక్క కదా. మనము 84 జన్మలు తీసుకుంటామని బుద్ధిలోకి వస్తుంది, అలాగే తక్కువ జన్మలు తీసుకునేవారు కూడా ఉంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. శాస్త్రాలలో ఏమేమి వ్రాసేసారు అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీ విషయములో కనీసం 84 జన్మలు అని అయినా అంటారు కానీ నా కోసమైతే లెక్కలేనన్ని, అనేక జన్మలని అంటారు. కణకణములోకి, రాయిరప్పలలోకి నన్ను తోసేసారు. ఎక్కడ చూసినా నీవే నీవు, కృష్ణుడే కృష్ణుడు అని అంటారు. మథుర, బృందావనములో ఈ విధముగా అంటూ ఉంటారు. కృష్ణుడే సర్వవ్యాపి అని అంటారు. రాధ వర్గానికి చెందినవారు ఎక్కడ చూసినా రాధయే రాధ, నీవు రాధయే, నేను రాధయే అని అంటారు. ఒక్క తండ్రి మాత్రమే పేదల పెన్నిధి. ఏ భారత్ అయితే అన్నింటికన్నా షావుకారుగా ఉండేదో, ఇప్పుడది అన్నింటికన్నా పేదదిగా అయ్యింది, అందుకే నేను భారత్ లోకే రావలసి ఉంటుంది. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా, ఇందులో ఏ మాత్రము తేడా రాదు. డ్రామాలో ఏ షూటింగ్ అయితే జరిగిపోయిందో, అది యథావిధిగా రిపీట్ అవుతుంది, ఇందులో పైసా అంత తేడా కూడా రాదు. డ్రామా గురించి కూడా తెలిసి ఉండాలి. డ్రామా అంటే డ్రామా. అవి హద్దులోని డ్రామాలు, ఇది అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలు ఎవ్వరికీ తెలియవు. పేదల పెన్నిధి అని నిరాకార భగవంతుడినే అనుకుంటారు, శ్రీకృష్ణుడిని అనుకోరు. శ్రీకృష్ణుడైతే ధనవంతుడిగా, సత్యయుగ రాకుమారుడిగా అవుతారు. భగవంతునికైతే తనదంటూ శరీరము లేదు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా తయారుచేస్తారు, మీకు రాజయోగము యొక్క శిక్షణనిస్తారు. చదువుతో బ్యారిస్టరు మొదలైనవారిగా అయి, ఆ తర్వాత సంపాదిస్తారు. తండ్రి కూడా మిమ్మల్ని ఇప్పుడు చదివిస్తున్నారు. మీరు భవిష్యత్తులో నరుని నుండి నారాయణునిగా అవుతారు. మీ జన్మ అయితే జరుగుతుంది కదా. అంతేకానీ స్వర్గము సముద్రము నుండి బయటకు వస్తుందని కాదు. శ్రీకృష్ణుడు కూడా జన్మ తీసుకున్నారు కదా. ఆ సమయములో కంసపురి మొదలైనవేవీ లేవు. శ్రీకృష్ణుని పేరు ఎంతగా గాయనము చేయబడుతుంది, అతని తండ్రికి అంతటి గాయనము లేదు. అతని తండ్రి ఎక్కడ ఉన్నారు? తప్పకుండా శ్రీకృష్ణుడు ఎవరో ఒకరికి కుమారుడు కదా. శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నప్పుడు కొంతమంది పతితులు కూడా ఉంటారు. ఆ పతితులు కూడా పూర్తిగా సమాప్తమైపోయినప్పుడు శ్రీకృష్ణుడు సింహాసనముపై కూర్చుంటారు, తన రాజ్యాధికారాన్ని తీసుకుంటారు, అప్పటినుండే వారి కాలము ప్రారంభమవుతుంది. లక్ష్మీ-నారాయణుల నుండే ఆ కాలము ప్రారంభమవుతుంది. వీరి రాజ్యము ఇంత సమయము ఉంటుంది, ఆ తర్వాత వారిది ఇంత సమయము ఉంటుంది అని మీరు పూర్తి లెక్కను వ్రాస్తారు. ఈ కల్పము ఆయువు పెద్దదిగా ఉండదని మనుష్యులు అర్థం చేసుకుంటారు. 5 వేల సంవత్సరాల పూర్తి లెక్క ఉంది. ఇది పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది కదా. నిన్న మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారము, తండ్రియే మనల్ని అలా తయారుచేసారు, అందుకే మనము వారి శివజయంతిని జరుపుకుంటున్నాము. మీకు అందరి గురించి తెలుసు. క్రైస్టు, గురునానక్ మొదలైనవారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అన్న జ్ఞానము మీకు ఉంది. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు యథావిధిగా రిపీట్ అవుతాయి. ఈ చదువు ఎంత సహజమైనది. మీకు స్వర్గము గురించి తెలుసు. తప్పకుండా భారత్ స్వర్గముగా ఉండేది. భారత్ అవినాశీ ఖండము. భారత్ కు ఉన్నంత మహిమ ఇంకెవ్వరికీ ఉండదు. అందరినీ పతితుల నుండి పావనముగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుంటూ అన్ని చింతలను వదిలేయాలి. సతోప్రధానముగా అవ్వాలన్న ఒక్క చింతనే పెట్టుకోవాలి. 2. పేదల పెన్నిధి అయిన బాబా భారత్ ను నిరుపేద నుండి షావుకారుగా తయారుచేయడానికి వచ్చారు, వారికి పూర్తి-పూర్తి సహాయకులుగా అవ్వాలి. తమ కొత్త ప్రపంచాన్ని గుర్తు చేసుకుంటూ సదా సంతోషముగా ఉండాలి. వరదానము:-హృదయములో సదా ఒక్క రాముడినే ఇముడ్చుకొని సత్యమైన సేవను చేసే మాయాజీత్, విజయీ భవ హనుమంతుడి విశేషతను ఏమని చూపిస్తారంటే - అతను సదా సేవాధారిగా, మహావీరునిగా ఉండేవారు, అందుకే స్వయము కాలిపోకుండా తోక ద్వారా లంకను కాల్చేసారు అని. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే సదా సేవాధారిగా ఉంటారో, వారే మాయ యొక్క అధికారాన్ని సమాప్తము చేయగలుగుతారు. ఎవరైతే సేవాధారి కారో, వారు మాయా రాజ్యాన్ని కాల్చలేరు. హనుమంతుని హృదయములో సదా ఒక్క రాముడే నివసించేవారు, అదే విధముగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ హృదయములో ఉండకూడదు, మీ దేహపు స్మృతి కూడా ఉండకూడదు, అప్పుడే మాయాజీతులుగా, విజయులుగా అవుతారు. స్లోగన్:-ఏ విధముగా ఆత్మ మరియు శరీరము కంబైండ్ గా ఉన్నాయో, అదే విధముగా మీరు తండ్రితోపాటు కంబైండ్ గా ఉండండి.   అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి సంగఠనలో ప్రతి ఒక్కరి విశేషతలను చూడటము, విశేషతలనే గ్రహించటము మరియు బలహీనతలను తొలగించే ప్రయత్నము చెయ్యటము - ఇదే ఏకతతో కూడిన సంగఠనను ధృఢము చేసేందుకు విధి. ఏ విధముగానైతే మీ అందరి యొక్క లేవడము, మాట్లాడటము, నడవటము ఒకే విధముగా ఉన్నాయో, అందరివీ ఒకే విధమైన మాటలు, ఒకే గతి, ఒకే రీతి, ఒకే నీతి ఉన్నాయో, అదే విధముగా సంస్కారాలు కూడా సమానముగా కనిపించాలి. భిన్నత్వము ఉన్నప్పటికీ పరస్పరము ఒకరి పట్ల ఒకరు విశ్వాసము ఉంచి, అందరి ఆలోచనలకు గౌరవాన్ని ఇవ్వండి, ఇదే ఏకతకు ఆధారము. "
v. v. guptha
360 వీక్షించారు
#📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి 06-02-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడిది ఎక్కే కళ యొక్క సమయము, భారత్ నిరుపేద నుండి షావుకారుగా అవుతుంది, మీరు తండ్రి నుండి సత్యయుగీ రాజ్యాధికారము యొక్క వారసత్వాన్ని తీసుకోండి’’ ప్రశ్న:-తండ్రి యొక్క ఏ టైటిల్ ను శ్రీకృష్ణునికి ఇవ్వలేరు? జవాబు:-తండ్రి పేదల పెన్నిధి. శ్రీకృష్ణుడిని అలా అనరు. వారు చాలా ధనవంతుడు, వారి రాజ్యములో అందరూ షావుకారులుగా ఉంటారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడు అందరికన్నా నిరుపేదగా ఉన్నది భారత్. భారత్ నే షావుకారుగా తయారుచేస్తారు. మన భారత్ స్వర్గముగా ఉండేది, ఇప్పుడు అలా లేదు, మళ్ళీ ఆ విధముగా తయారవ్వనున్నది అని మీరంటారు. పేదల పెన్నిధి అయిన బాబాయే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. పాట:-చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది... ▶ ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మ గుప్తమైనది మరియు శరీరము ప్రత్యక్షముగా ఉంటుంది. ఆత్మను ఈ కనుల ద్వారా చూడలేము, అది గుప్తముగా ఉంది. ఆత్మ తప్పకుండా ఉంది, కానీ ఈ శరీరముతో కప్పబడి ఉంది, అందుకే ఆత్మ గుప్తముగా ఉందని అంటారు. ఆత్మ స్వయంగా అంటుంది - నేను నిరాకారిని, ఇక్కడ సాకారములోకి వచ్చి గుప్తము అయ్యాను. ఆత్మలది నిరాకారీ ప్రపంచము, అక్కడైతే గుప్తముగా ఉండే విషయమేమీ లేదు. పరమపిత పరమాత్మ కూడా అక్కడే ఉంటారు, వారిని సుప్రీమ్ అని అంటారు, వారు ఉన్నతోన్నతమైన ఆత్మ, అతీతముగా ఉండే పరమ ఆత్మ. తండ్రి అంటారు - ఎలాగైతే మీరు గుప్తముగా ఉన్నారో, అలాగే నేను కూడా గుప్తముగా రావలసి ఉంటుంది. నేను గర్భ జైలులోకి రాను. నాకు శివ అన్న ఒక్క పేరే కొనసాగుతూ వస్తుంది. నేను ఈ తనువులోకి వచ్చినా కూడా నా పేరు మారదు. వీరి ఆత్మకు ఏదైతే శరీరము ఉందో, ఆ శరీరము యొక్క పేరు మారుతుంది. నన్ను అయితే శివ అనే అంటారు - నేను ఆత్మలందరికీ తండ్రిని. ఆత్మలైన మీరు ఈ శరీరములో గుప్తముగా ఉన్నారు, ఈ శరీరము ద్వారా కర్మలు చేస్తారు. నేను కూడా గుప్తముగా ఉన్నాను. ఆత్మ ఈ శరీరముతో కప్పబడి ఉంది అని పిల్లలకు ఈ జ్ఞానము ఇప్పుడు లభిస్తుంది. ఆత్మ గుప్తముగా ఉంది, శరీరము ప్రత్యక్షముగా ఉంది. నేను కూడా అశరీరినే. గుప్తమైన తండ్రి ఈ శరీరము ద్వారా వినిపిస్తారు. మీరు కూడా గుప్తమైనవారే, శరీరము ద్వారా వింటారు. భారత్ ను మళ్ళీ నిరుపేద నుండి షావుకారుగా తయారుచేయడానికి బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. మీరు - మా భారత్ అని అంటారు. ప్రతి ఒక్కరూ తమ-తమ రాష్ట్రాల విషయములో - మా గుజరాత్, మా రాజస్థాన్ అని అంటారు. మాది-మాది అని అనడము వలన దాని పట్ల మోహము కలుగుతుంది. మన భారత్ నిరుపేదగా ఉంది అని అందరూ అనుకుంటారు, కానీ మన భారత్ షావుకారుగా ఎప్పుడు ఉండేది, ఎలా ఉండేది అనేది వారికి తెలియదు. పిల్లలైన మీకు చాలా నషా ఉంటుంది. మన భారత్ చాలా షావుకారుగా ఉండేది, దుఃఖమనే మాటే ఉండేది కాదు. సత్యయుగములో వేరే ఏ ధర్మమూ ఉండేది కాదు, ఒక్క దేవీ-దేవతా ధర్మమే ఉండేది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు మంచి రీతిలో అర్థం చేసుకుంటున్నారు. మన భారత్ చాలా షావుకారుగా ఉండేది. ఇప్పుడు చాలా నిరుపేదగా ఉంది. ఇప్పుడు మళ్ళీ తండ్రి షావుకారుగా తయారుచేయడానికి వచ్చారు. భారత్ సత్యయుగములో చాలా షావుకారుగా ఉండేది, అప్పుడు దేవీ-దేవతల రాజ్యముండేది, మరి ఆ రాజ్యము ఏమైపోయింది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఋషులు, మునులు మొదలైనవారు కూడా, మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదు అని అనేవారు. తండ్రి అంటారు, సత్యయుగములో కూడా దేవీ-దేవతలకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉండేది కాదు. మేము మెట్లు దిగుతూ కలియుగములోకి వెళ్ళిపోతామని - ఒకవేళ దేవతలకు కూడా ఈ జ్ఞానమున్నట్లయితే ఇక వారికి రాజ్యాధికారము యొక్క సుఖము ఉండదు, చింత కలుగుతుంది. మేము సతోప్రధానముగా ఉండేవారము, మళ్ళీ మేము సతోప్రధానముగా ఎలా అవ్వాలి అనే చింత మీకు ఉంది. ఆత్మలమైన మనము నిరాకారీ ప్రపంచములో ఉండేవారము, అక్కడ నుండి మళ్ళీ సుఖధామములోకి ఎలా వచ్చాము, ఈ జ్ఞానము కూడా మీకు ఉంది. మనము ఇప్పుడు ఎక్కే కళలో ఉన్నాము. ఇది 84 జన్మల మెట్ల వరుస. డ్రామానుసారముగా ప్రతి ఒక్క పాత్రధారి నంబరువారుగా తమ-తమ సమయమనుసారముగా వచ్చి పాత్రను అభినయిస్తారు. పేదల పెన్నిధి అని ఎవరిని అంటారు అన్నది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఇది ప్రపంచానికి తెలియదు. పాటలో కూడా విన్నారు - భక్తులందరూ ఏ రోజు కోసమైతే వేచి ఉన్నారో, చివరికి ఆ రోజు నేడు వచ్చింది... భగవంతుడు ఎప్పుడు వచ్చి భక్తులైన మనల్ని ఈ భక్తి మార్గము నుండి విడిపించి సద్గతిలోకి తీసుకువెళ్తారు అన్నది ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బాబా ఈ శరీరములోకి మళ్ళీ వచ్చేసారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు అంటే వారు తప్పకుండా వస్తారు. నేను శ్రీకృష్ణుడి తనువులోకి వస్తానని కూడా వారు అనరు. అలా కాదు. తండ్రి అంటారు, శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంది, వారి అనేక జన్మల అంతిమములో ఇది అంతిమ జన్మ. ఎవరైతే మొదటి నంబరులో ఉండేవారో, వారిప్పుడు చివరిలో ఉన్నారు, తతత్వమ్ (ఇది మీకు కూడా వర్తిస్తుంది). నేనైతే సాధారణ తనువులోకి వస్తాను, మీరు 84 జన్మలను ఎలా అనుభవించారు అన్నది నేను వచ్చి మీకు తెలియజేస్తాను. సిక్కులు కూడా ఏక్ ఓంకార్, పరమపిత పరమాత్మ అయిన తండ్రి అని భావిస్తారు, వారు తప్పకుండా మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేవారు. మరి మనము కూడా దేవతలుగా ఎందుకు అవ్వకూడదు. ఎవరైతే ఇంతకుముందు దేవతలుగా అయ్యి ఉంటారో, వారు తండ్రికి పూర్తిగా అతుక్కుపోతారు. స్వయాన్ని దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని ఒక్కరు కూడా భావించరు. ఇతర ధర్మాల చరిత్ర చాలా చిన్నది, కొందరిది 500 సంవత్సరాల చరిత్ర, మరికొందరిది 1250 సంవత్సరాల చరిత్ర. మీ చరిత్ర 5000 సంవత్సరాలది. దేవతా ధర్మమువారే స్వర్గములోకి వస్తారు, ఇతర ధర్మాల వారు తర్వాతే వస్తారు. దేవతా ధర్మమువారు కూడా డ్రామానుసారముగా ఇప్పుడు ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. వారు మళ్ళీ కన్వర్ట్ అయ్యి తమ-తమ ధర్మాలలోకి తిరిగి వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. బాబా స్వర్గాన్ని స్థాపన చేసేవారు కావున మేము స్వర్గములో ఎందుకు ఉండము, మేము తండ్రి నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటామని మీరు కూడా భావిస్తారు. ఇలా భావించేవారు మన ధర్మానికి చెందినవారని ఋజువవుతుంది. అలా కానీ వారు ఇక్కడకు రానే రారు. వారు పరాయి ధర్మములోకి మేము ఎందుకు వెళ్ళాలి అని అంటారు. కొత్త ప్రపంచమైన సత్యయుగములో దేవతలకు చాలా సుఖముండేదని, అక్కడ బంగారు మహళ్ళు ఉండేవని పిల్లలైన మీకు తెలుసు. సోమనాథ మందిరములో ఎంత బంగారముండేది. ఇటువంటి ధర్మము ఇంకేదీ ఉండదు. సోమనాథ మందిరమంతటి భారీ మందిరము ఇంకేదీ ఉండదు, అందులో చాలా వజ్ర-వైఢూర్యాలుండేవి. బుద్ధుడు మొదలైనవారికి వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఏమీ ఉండవు. ఏ తండ్రి అయితే పిల్లలైన మిమ్మల్ని ఇంత ఉన్నతముగా తయారుచేసారో, వారికి మీరు ఎంత గౌరవాన్ని ఇచ్చారు! గౌరవాన్ని ఇవ్వడము జరుగుతుంది కదా. మంచి కర్మలు చేసి వెళ్ళారని భావిస్తారు. అన్నింటికన్నా మంచి కర్మ పతిత-పావనుడైన తండ్రియే చేసి వెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. అన్నింటికన్నా ఉత్తమోత్తమ సేవను అనంతమైన తండ్రే వచ్చి చేస్తారని మీ ఆత్మ అంటుంది. వారు మనల్ని నిరుపేదల నుండి ధనవంతులుగా, బికారుల నుండి రాకుమారులుగా తయారుచేస్తారు. ఎవరైతే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారో, వారినిప్పుడు ఎవరూ గౌరవించడము లేదు. ఉన్నతోన్నతమైన మందిరము అని గాయనము చేయబడిన దానిని దోచుకుని వెళ్ళిపోయారు. లక్ష్మీ-నారాయణుల మందిరాన్ని ఎప్పుడూ ఎవ్వరూ దోచుకోలేదు. సోమనాథ మందిరాన్ని దోచుకున్నారు. భక్తి మార్గములో కూడా చాలా ధనవంతులుంటారు. రాజులలో కూడా నంబరువారుగా ఉంటారు కదా. ఎవరైతే ఉన్నత పదవి కలవారు ఉంటారో, వారికి తక్కువ పదవి వారు గౌరవాన్ని ఇస్తారు. దర్బారులో కూడా నంబరువారుగా కూర్చుంటారు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. ఇక్కడ పతిత రాజుల దర్బారు ఉంటుంది. పావన రాజుల దర్బారు ఎలా ఉంటుంది - వారి వద్ద ఇంత ధనముందంటే వారి ఇళ్ళు కూడా అంత బాగుంటాయి. తండ్రి మనల్ని చదివిస్తున్నారని, స్వర్గ స్థాపనను చేయిస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనము స్వర్గము యొక్క మహారాజా-మహారాణులుగా అవుతాము, మళ్ళీ మనము పడిపోతూ, పడిపోతూ భక్తులుగా అవుతాము, అప్పుడు మొట్టమొదట శివబాబాకు పూజారులుగా అవుతాము. ఎవరైతే మనల్ని స్వర్గానికి యజమానులుగా చేసారో, వారినే పూజిస్తాము. వారు మనల్ని చాలా షావుకార్లుగా చేస్తారు. ఇప్పుడు భారత్ ఎంత పేదగా ఉంది, ఏ భూమినైతే ఇంతకుముందు 500 రూపాయలకు తీసుకున్నామో, ఈ రోజు దాని విలువ 5000 రూపాయల కన్నా కూడా ఎక్కువైపోయింది. ఇవన్నీ కృత్రిమమైన ధరలు. అక్కడైతే భూమికి ధర ఉండదు, ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఎంతో భూమి ఉంటుంది, మధురమైన నదుల వద్ద మీ మహళ్ళు ఉంటాయి. మనుష్యులు చాలా కొద్దిమందే ఉంటారు. ప్రకృతి దాసిగా ఉంటుంది. ఫలాలు, పుష్పాలు మంచి-మంచివి లభిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఎంత శ్రమ చేయవలసి ఉంటుంది, అయినా కానీ భోజనము లభించదు. మనుష్యులు చాలా ఆకలి, దప్పికలతో మరణిస్తుంటారు. పాట వినడముతో మీ రోమాలు నిక్కబొడుచుకోవాలి. తండ్రిని పేదల పెన్నిధి అని అంటారు. పేదల పెన్నిధి యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నారు కదా! ఎవరిని షావుకార్లుగా తయారుచేస్తారు? వారు ఎక్కడికైతే వస్తారో, తప్పకుండా అక్కడున్నవారినే షావుకార్లుగా తయారుచేస్తారు కదా. మనము పావనము నుండి పతితముగా అవ్వడానికి 5 వేల సంవత్సరాలు పడుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాబా వెంటనే పతితము నుండి పావనముగా తయారుచేస్తారు, ఉన్నతోన్నతముగా తయారుచేస్తారు, ఒక్క సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా, నేను మీ వాడిని అని అంటారు. బాబా అంటారు - బిడ్డ, నీవు విశ్వానికి యజమానిగా ఉండేవాడివి. కొడుకు జన్మించగానే వారసునిగా అవుతాడు, ఎంత సంతోషము కలుగుతుంది. కూతురిని చూస్తే ముఖము కిందకు దిగిపోతుంది. ఇక్కడైతే ఆత్మలందరూ కొడుకులు. 5 వేల సంవత్సరాల క్రితము మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు తెలిసింది. బాబా మనల్ని అలా తయారుచేసారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారు అన్నది తెలియదు. లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. శివజయంతిని జరుపుకుంటారు, కేవలం లింగాన్ని పెట్టి పెద్ద-పెద్ద మందిరాలను నిర్మిస్తారు. కానీ వారు ఎలా వచ్చారు, వచ్చి ఏం చేసారు అన్నది ఏమీ తెలియదు, దీనిని అంధ విశ్వాసము, అంధ శ్రద్ధ అని అంటారు. మన ధర్మము ఏది, ఎప్పుడు స్థాపనయ్యింది అన్నది వారికి తెలియదు. ఇతర ధర్మాల వారికి వారి ధర్మము గురించి తెలుసు, బుద్ధుడు ఎప్పుడు వచ్చారు, తిథి-తారీఖులు ఏమిటి అన్నది కూడా వారికి తెలుసు. శివబాబాకు, లక్ష్మీ-నారాయణులకు ఎటువంటి తిథి, తారీఖులు లేవు. 5 వేల సంవత్సరాల విషయాన్ని లక్షల సంవత్సరాలని వ్రాసేసారు. లక్షల సంవత్సరాల విషయమనేట్పపటికి ఎవరికి గుర్తుకొస్తుంది? భారత్ లో దేవీ-దేవతా ధర్మము ఎప్పుడు ఉండేది అనేది అర్థం చేసుకోరు. లక్షల సంవత్సరాల లెక్కలోనైతే భారత్ జనాభా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. భారత్ యొక్క భూమి కూడా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. లక్షల సంవత్సరాలలో ఎంతమంది మనుష్యులు జన్మిస్తారు, ఇప్పటికి లెక్కలేనంతమంది మనుష్యులు అయిపోయి ఉండాలి. కానీ అంతమందైతే లేరు, ఇంకా జనాభా తగ్గిపోయింది. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ విషయాలను మనుష్యులు విన్నప్పుడు ఏమంటారంటే - ఈ విషయాలనైతే మేము ఎప్పుడూ వినలేదు, అలాగే ఏ శాస్త్రాలలోనూ చదవలేదు. ఇవి అద్భుతమైన విషయాలు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రము యొక్క జ్ఞానముంది. వీరు అనేక జన్మల అంతిమములో కూడా అంతిమములో ఇప్పుడు పతితాత్మగా ఉన్నారు. ఎవరైతే సతోప్రధానముగా ఉండేవారో వారు ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు, మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. ఆత్మలైన మీకిప్పుడు శిక్షణ లభిస్తోంది. ఆత్మ చెవుల ద్వారా వింటున్నప్పుడు శరీరము ఊగుతుంది ఎందుకంటే ఆత్మ వింటుంది కదా. ఆత్మలమైన మనము తప్పకుండా 84 జన్మలు తీసుకుంటాము, 84 జన్మలలో 84 తల్లిదండ్రులు తప్పకుండా లభించి ఉంటారు, ఇది కూడా లెక్క కదా. మనము 84 జన్మలు తీసుకుంటామని బుద్ధిలోకి వస్తుంది, అలాగే తక్కువ జన్మలు తీసుకునేవారు కూడా ఉంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. శాస్త్రాలలో ఏమేమి వ్రాసేసారు అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీ విషయములో కనీసం 84 జన్మలు అని అయినా అంటారు కానీ నా కోసమైతే లెక్కలేనన్ని, అనేక జన్మలని అంటారు. కణకణములోకి, రాయిరప్పలలోకి నన్ను తోసేసారు. ఎక్కడ చూసినా నీవే నీవు, కృష్ణుడే కృష్ణుడు అని అంటారు. మథుర, బృందావనములో ఈ విధముగా అంటూ ఉంటారు. కృష్ణుడే సర్వవ్యాపి అని అంటారు. రాధ వర్గానికి చెందినవారు ఎక్కడ చూసినా రాధయే రాధ, నీవు రాధయే, నేను రాధయే అని అంటారు. ఒక్క తండ్రి మాత్రమే పేదల పెన్నిధి. ఏ భారత్ అయితే అన్నింటికన్నా షావుకారుగా ఉండేదో, ఇప్పుడది అన్నింటికన్నా పేదదిగా అయ్యింది, అందుకే నేను భారత్ లోకే రావలసి ఉంటుంది. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా, ఇందులో ఏ మాత్రము తేడా రాదు. డ్రామాలో ఏ షూటింగ్ అయితే జరిగిపోయిందో, అది యథావిధిగా రిపీట్ అవుతుంది, ఇందులో పైసా అంత తేడా కూడా రాదు. డ్రామా గురించి కూడా తెలిసి ఉండాలి. డ్రామా అంటే డ్రామా. అవి హద్దులోని డ్రామాలు, ఇది అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలు ఎవ్వరికీ తెలియవు. పేదల పెన్నిధి అని నిరాకార భగవంతుడినే అనుకుంటారు, శ్రీకృష్ణుడిని అనుకోరు. శ్రీకృష్ణుడైతే ధనవంతుడిగా, సత్యయుగ రాకుమారుడిగా అవుతారు. భగవంతునికైతే తనదంటూ శరీరము లేదు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా తయారుచేస్తారు, మీకు రాజయోగము యొక్క శిక్షణనిస్తారు. చదువుతో బ్యారిస్టరు మొదలైనవారిగా అయి, ఆ తర్వాత సంపాదిస్తారు. తండ్రి కూడా మిమ్మల్ని ఇప్పుడు చదివిస్తున్నారు. మీరు భవిష్యత్తులో నరుని నుండి నారాయణునిగా అవుతారు. మీ జన్మ అయితే జరుగుతుంది కదా. అంతేకానీ స్వర్గము సముద్రము నుండి బయటకు వస్తుందని కాదు. శ్రీకృష్ణుడు కూడా జన్మ తీసుకున్నారు కదా. ఆ సమయములో కంసపురి మొదలైనవేవీ లేవు. శ్రీకృష్ణుని పేరు ఎంతగా గాయనము చేయబడుతుంది, అతని తండ్రికి అంతటి గాయనము లేదు. అతని తండ్రి ఎక్కడ ఉన్నారు? తప్పకుండా శ్రీకృష్ణుడు ఎవరో ఒకరికి కుమారుడు కదా. శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నప్పుడు కొంతమంది పతితులు కూడా ఉంటారు. ఆ పతితులు కూడా పూర్తిగా సమాప్తమైపోయినప్పుడు శ్రీకృష్ణుడు సింహాసనముపై కూర్చుంటారు, తన రాజ్యాధికారాన్ని తీసుకుంటారు, అప్పటినుండే వారి కాలము ప్రారంభమవుతుంది. లక్ష్మీ-నారాయణుల నుండే ఆ కాలము ప్రారంభమవుతుంది. వీరి రాజ్యము ఇంత సమయము ఉంటుంది, ఆ తర్వాత వారిది ఇంత సమయము ఉంటుంది అని మీరు పూర్తి లెక్కను వ్రాస్తారు. ఈ కల్పము ఆయువు పెద్దదిగా ఉండదని మనుష్యులు అర్థం చేసుకుంటారు. 5 వేల సంవత్సరాల పూర్తి లెక్క ఉంది. ఇది పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది కదా. నిన్న మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారము, తండ్రియే మనల్ని అలా తయారుచేసారు, అందుకే మనము వారి శివజయంతిని జరుపుకుంటున్నాము. మీకు అందరి గురించి తెలుసు. క్రైస్టు, గురునానక్ మొదలైనవారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అన్న జ్ఞానము మీకు ఉంది. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు యథావిధిగా రిపీట్ అవుతాయి. ఈ చదువు ఎంత సహజమైనది. మీకు స్వర్గము గురించి తెలుసు. తప్పకుండా భారత్ స్వర్గముగా ఉండేది. భారత్ అవినాశీ ఖండము. భారత్ కు ఉన్నంత మహిమ ఇంకెవ్వరికీ ఉండదు. అందరినీ పతితుల నుండి పావనముగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుంటూ అన్ని చింతలను వదిలేయాలి. సతోప్రధానముగా అవ్వాలన్న ఒక్క చింతనే పెట్టుకోవాలి. 2. పేదల పెన్నిధి అయిన బాబా భారత్ ను నిరుపేద నుండి షావుకారుగా తయారుచేయడానికి వచ్చారు, వారికి పూర్తి-పూర్తి సహాయకులుగా అవ్వాలి. తమ కొత్త ప్రపంచాన్ని గుర్తు చేసుకుంటూ సదా సంతోషముగా ఉండాలి. వరదానము:-హృదయములో సదా ఒక్క రాముడినే ఇముడ్చుకొని సత్యమైన సేవను చేసే మాయాజీత్, విజయీ భవ హనుమంతుడి విశేషతను ఏమని చూపిస్తారంటే - అతను సదా సేవాధారిగా, మహావీరునిగా ఉండేవారు, అందుకే స్వయము కాలిపోకుండా తోక ద్వారా లంకను కాల్చేసారు అని. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే సదా సేవాధారిగా ఉంటారో, వారే మాయ యొక్క అధికారాన్ని సమాప్తము చేయగలుగుతారు. ఎవరైతే సేవాధారి కారో, వారు మాయా రాజ్యాన్ని కాల్చలేరు. హనుమంతుని హృదయములో సదా ఒక్క రాముడే నివసించేవారు, అదే విధముగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ హృదయములో ఉండకూడదు, మీ దేహపు స్మృతి కూడా ఉండకూడదు, అప్పుడే మాయాజీతులుగా, విజయులుగా అవుతారు. స్లోగన్:-ఏ విధముగా ఆత్మ మరియు శరీరము కంబైండ్ గా ఉన్నాయో, అదే విధముగా మీరు తండ్రితోపాటు కంబైండ్ గా ఉండండి.   అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి సంగఠనలో ప్రతి ఒక్కరి విశేషతలను చూడటము, విశేషతలనే గ్రహించటము మరియు బలహీనతలను తొలగించే ప్రయత్నము చెయ్యటము - ఇదే ఏకతతో కూడిన సంగఠనను ధృఢము చేసేందుకు విధి. ఏ విధముగానైతే మీ అందరి యొక్క లేవడము, మాట్లాడటము, నడవటము ఒకే విధముగా ఉన్నాయో, అందరివీ ఒకే విధమైన మాటలు, ఒకే గతి, ఒకే రీతి, ఒకే నీతి ఉన్నాయో, అదే విధముగా సంస్కారాలు కూడా సమానముగా కనిపించాలి. భిన్నత్వము ఉన్నప్పటికీ పరస్పరము ఒకరి పట్ల ఒకరు విశ్వాసము ఉంచి, అందరి ఆలోచనలకు గౌరవాన్ని ఇవ్వండి, ఇదే ఏకతకు ఆధారము. "
v. v. guptha
541 వీక్షించారు
"🌹 శివ బాబా 🌹 06-02-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడిది ఎక్కే కళ యొక్క సమయము, భారత్ నిరుపేద నుండి షావుకారుగా అవుతుంది, మీరు తండ్రి నుండి సత్యయుగీ రాజ్యాధికారము యొక్క వారసత్వాన్ని తీసుకోండి’’ ప్రశ్న:-తండ్రి యొక్క ఏ టైటిల్ ను శ్రీకృష్ణునికి ఇవ్వలేరు? జవాబు:-తండ్రి పేదల పెన్నిధి. శ్రీకృష్ణుడిని అలా అనరు. వారు చాలా ధనవంతుడు, వారి రాజ్యములో అందరూ షావుకారులుగా ఉంటారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడు అందరికన్నా నిరుపేదగా ఉన్నది భారత్. భారత్ నే షావుకారుగా తయారుచేస్తారు. మన భారత్ స్వర్గముగా ఉండేది, ఇప్పుడు అలా లేదు, మళ్ళీ ఆ విధముగా తయారవ్వనున్నది అని మీరంటారు. పేదల పెన్నిధి అయిన బాబాయే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. పాట:-చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది... ▶ ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మ గుప్తమైనది మరియు శరీరము ప్రత్యక్షముగా ఉంటుంది. ఆత్మను ఈ కనుల ద్వారా చూడలేము, అది గుప్తముగా ఉంది. ఆత్మ తప్పకుండా ఉంది, కానీ ఈ శరీరముతో కప్పబడి ఉంది, అందుకే ఆత్మ గుప్తముగా ఉందని అంటారు. ఆత్మ స్వయంగా అంటుంది - నేను నిరాకారిని, ఇక్కడ సాకారములోకి వచ్చి గుప్తము అయ్యాను. ఆత్మలది నిరాకారీ ప్రపంచము, అక్కడైతే గుప్తముగా ఉండే విషయమేమీ లేదు. పరమపిత పరమాత్మ కూడా అక్కడే ఉంటారు, వారిని సుప్రీమ్ అని అంటారు, వారు ఉన్నతోన్నతమైన ఆత్మ, అతీతముగా ఉండే పరమ ఆత్మ. తండ్రి అంటారు - ఎలాగైతే మీరు గుప్తముగా ఉన్నారో, అలాగే నేను కూడా గుప్తముగా రావలసి ఉంటుంది. నేను గర్భ జైలులోకి రాను. నాకు శివ అన్న ఒక్క పేరే కొనసాగుతూ వస్తుంది. నేను ఈ తనువులోకి వచ్చినా కూడా నా పేరు మారదు. వీరి ఆత్మకు ఏదైతే శరీరము ఉందో, ఆ శరీరము యొక్క పేరు మారుతుంది. నన్ను అయితే శివ అనే అంటారు - నేను ఆత్మలందరికీ తండ్రిని. ఆత్మలైన మీరు ఈ శరీరములో గుప్తముగా ఉన్నారు, ఈ శరీరము ద్వారా కర్మలు చేస్తారు. నేను కూడా గుప్తముగా ఉన్నాను. ఆత్మ ఈ శరీరముతో కప్పబడి ఉంది అని పిల్లలకు ఈ జ్ఞానము ఇప్పుడు లభిస్తుంది. ఆత్మ గుప్తముగా ఉంది, శరీరము ప్రత్యక్షముగా ఉంది. నేను కూడా అశరీరినే. గుప్తమైన తండ్రి ఈ శరీరము ద్వారా వినిపిస్తారు. మీరు కూడా గుప్తమైనవారే, శరీరము ద్వారా వింటారు. భారత్ ను మళ్ళీ నిరుపేద నుండి షావుకారుగా తయారుచేయడానికి బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. మీరు - మా భారత్ అని అంటారు. ప్రతి ఒక్కరూ తమ-తమ రాష్ట్రాల విషయములో - మా గుజరాత్, మా రాజస్థాన్ అని అంటారు. మాది-మాది అని అనడము వలన దాని పట్ల మోహము కలుగుతుంది. మన భారత్ నిరుపేదగా ఉంది అని అందరూ అనుకుంటారు, కానీ మన భారత్ షావుకారుగా ఎప్పుడు ఉండేది, ఎలా ఉండేది అనేది వారికి తెలియదు. పిల్లలైన మీకు చాలా నషా ఉంటుంది. మన భారత్ చాలా షావుకారుగా ఉండేది, దుఃఖమనే మాటే ఉండేది కాదు. సత్యయుగములో వేరే ఏ ధర్మమూ ఉండేది కాదు, ఒక్క దేవీ-దేవతా ధర్మమే ఉండేది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు మంచి రీతిలో అర్థం చేసుకుంటున్నారు. మన భారత్ చాలా షావుకారుగా ఉండేది. ఇప్పుడు చాలా నిరుపేదగా ఉంది. ఇప్పుడు మళ్ళీ తండ్రి షావుకారుగా తయారుచేయడానికి వచ్చారు. భారత్ సత్యయుగములో చాలా షావుకారుగా ఉండేది, అప్పుడు దేవీ-దేవతల రాజ్యముండేది, మరి ఆ రాజ్యము ఏమైపోయింది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఋషులు, మునులు మొదలైనవారు కూడా, మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదు అని అనేవారు. తండ్రి అంటారు, సత్యయుగములో కూడా దేవీ-దేవతలకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉండేది కాదు. మేము మెట్లు దిగుతూ కలియుగములోకి వెళ్ళిపోతామని - ఒకవేళ దేవతలకు కూడా ఈ జ్ఞానమున్నట్లయితే ఇక వారికి రాజ్యాధికారము యొక్క సుఖము ఉండదు, చింత కలుగుతుంది. మేము సతోప్రధానముగా ఉండేవారము, మళ్ళీ మేము సతోప్రధానముగా ఎలా అవ్వాలి అనే చింత మీకు ఉంది. ఆత్మలమైన మనము నిరాకారీ ప్రపంచములో ఉండేవారము, అక్కడ నుండి మళ్ళీ సుఖధామములోకి ఎలా వచ్చాము, ఈ జ్ఞానము కూడా మీకు ఉంది. మనము ఇప్పుడు ఎక్కే కళలో ఉన్నాము. ఇది 84 జన్మల మెట్ల వరుస. డ్రామానుసారముగా ప్రతి ఒక్క పాత్రధారి నంబరువారుగా తమ-తమ సమయమనుసారముగా వచ్చి పాత్రను అభినయిస్తారు. పేదల పెన్నిధి అని ఎవరిని అంటారు అన్నది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఇది ప్రపంచానికి తెలియదు. పాటలో కూడా విన్నారు - భక్తులందరూ ఏ రోజు కోసమైతే వేచి ఉన్నారో, చివరికి ఆ రోజు నేడు వచ్చింది... భగవంతుడు ఎప్పుడు వచ్చి భక్తులైన మనల్ని ఈ భక్తి మార్గము నుండి విడిపించి సద్గతిలోకి తీసుకువెళ్తారు అన్నది ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బాబా ఈ శరీరములోకి మళ్ళీ వచ్చేసారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు అంటే వారు తప్పకుండా వస్తారు. నేను శ్రీకృష్ణుడి తనువులోకి వస్తానని కూడా వారు అనరు. అలా కాదు. తండ్రి అంటారు, శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంది, వారి అనేక జన్మల అంతిమములో ఇది అంతిమ జన్మ. ఎవరైతే మొదటి నంబరులో ఉండేవారో, వారిప్పుడు చివరిలో ఉన్నారు, తతత్వమ్ (ఇది మీకు కూడా వర్తిస్తుంది). నేనైతే సాధారణ తనువులోకి వస్తాను, మీరు 84 జన్మలను ఎలా అనుభవించారు అన్నది నేను వచ్చి మీకు తెలియజేస్తాను. సిక్కులు కూడా ఏక్ ఓంకార్, పరమపిత పరమాత్మ అయిన తండ్రి అని భావిస్తారు, వారు తప్పకుండా మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేవారు. మరి మనము కూడా దేవతలుగా ఎందుకు అవ్వకూడదు. ఎవరైతే ఇంతకుముందు దేవతలుగా అయ్యి ఉంటారో, వారు తండ్రికి పూర్తిగా అతుక్కుపోతారు. స్వయాన్ని దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని ఒక్కరు కూడా భావించరు. ఇతర ధర్మాల చరిత్ర చాలా చిన్నది, కొందరిది 500 సంవత్సరాల చరిత్ర, మరికొందరిది 1250 సంవత్సరాల చరిత్ర. మీ చరిత్ర 5000 సంవత్సరాలది. దేవతా ధర్మమువారే స్వర్గములోకి వస్తారు, ఇతర ధర్మాల వారు తర్వాతే వస్తారు. దేవతా ధర్మమువారు కూడా డ్రామానుసారముగా ఇప్పుడు ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. వారు మళ్ళీ కన్వర్ట్ అయ్యి తమ-తమ ధర్మాలలోకి తిరిగి వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. బాబా స్వర్గాన్ని స్థాపన చేసేవారు కావున మేము స్వర్గములో ఎందుకు ఉండము, మేము తండ్రి నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటామని మీరు కూడా భావిస్తారు. ఇలా భావించేవారు మన ధర్మానికి చెందినవారని ఋజువవుతుంది. అలా కానీ వారు ఇక్కడకు రానే రారు. వారు పరాయి ధర్మములోకి మేము ఎందుకు వెళ్ళాలి అని అంటారు. కొత్త ప్రపంచమైన సత్యయుగములో దేవతలకు చాలా సుఖముండేదని, అక్కడ బంగారు మహళ్ళు ఉండేవని పిల్లలైన మీకు తెలుసు. సోమనాథ మందిరములో ఎంత బంగారముండేది. ఇటువంటి ధర్మము ఇంకేదీ ఉండదు. సోమనాథ మందిరమంతటి భారీ మందిరము ఇంకేదీ ఉండదు, అందులో చాలా వజ్ర-వైఢూర్యాలుండేవి. బుద్ధుడు మొదలైనవారికి వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఏమీ ఉండవు. ఏ తండ్రి అయితే పిల్లలైన మిమ్మల్ని ఇంత ఉన్నతముగా తయారుచేసారో, వారికి మీరు ఎంత గౌరవాన్ని ఇచ్చారు! గౌరవాన్ని ఇవ్వడము జరుగుతుంది కదా. మంచి కర్మలు చేసి వెళ్ళారని భావిస్తారు. అన్నింటికన్నా మంచి కర్మ పతిత-పావనుడైన తండ్రియే చేసి వెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. అన్నింటికన్నా ఉత్తమోత్తమ సేవను అనంతమైన తండ్రే వచ్చి చేస్తారని మీ ఆత్మ అంటుంది. వారు మనల్ని నిరుపేదల నుండి ధనవంతులుగా, బికారుల నుండి రాకుమారులుగా తయారుచేస్తారు. ఎవరైతే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారో, వారినిప్పుడు ఎవరూ గౌరవించడము లేదు. ఉన్నతోన్నతమైన మందిరము అని గాయనము చేయబడిన దానిని దోచుకుని వెళ్ళిపోయారు. లక్ష్మీ-నారాయణుల మందిరాన్ని ఎప్పుడూ ఎవ్వరూ దోచుకోలేదు. సోమనాథ మందిరాన్ని దోచుకున్నారు. భక్తి మార్గములో కూడా చాలా ధనవంతులుంటారు. రాజులలో కూడా నంబరువారుగా ఉంటారు కదా. ఎవరైతే ఉన్నత పదవి కలవారు ఉంటారో, వారికి తక్కువ పదవి వారు గౌరవాన్ని ఇస్తారు. దర్బారులో కూడా నంబరువారుగా కూర్చుంటారు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. ఇక్కడ పతిత రాజుల దర్బారు ఉంటుంది. పావన రాజుల దర్బారు ఎలా ఉంటుంది - వారి వద్ద ఇంత ధనముందంటే వారి ఇళ్ళు కూడా అంత బాగుంటాయి. తండ్రి మనల్ని చదివిస్తున్నారని, స్వర్గ స్థాపనను చేయిస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనము స్వర్గము యొక్క మహారాజా-మహారాణులుగా అవుతాము, మళ్ళీ మనము పడిపోతూ, పడిపోతూ భక్తులుగా అవుతాము, అప్పుడు మొట్టమొదట శివబాబాకు పూజారులుగా అవుతాము. ఎవరైతే మనల్ని స్వర్గానికి యజమానులుగా చేసారో, వారినే పూజిస్తాము. వారు మనల్ని చాలా షావుకార్లుగా చేస్తారు. ఇప్పుడు భారత్ ఎంత పేదగా ఉంది, ఏ భూమినైతే ఇంతకుముందు 500 రూపాయలకు తీసుకున్నామో, ఈ రోజు దాని విలువ 5000 రూపాయల కన్నా కూడా ఎక్కువైపోయింది. ఇవన్నీ కృత్రిమమైన ధరలు. అక్కడైతే భూమికి ధర ఉండదు, ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఎంతో భూమి ఉంటుంది, మధురమైన నదుల వద్ద మీ మహళ్ళు ఉంటాయి. మనుష్యులు చాలా కొద్దిమందే ఉంటారు. ప్రకృతి దాసిగా ఉంటుంది. ఫలాలు, పుష్పాలు మంచి-మంచివి లభిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఎంత శ్రమ చేయవలసి ఉంటుంది, అయినా కానీ భోజనము లభించదు. మనుష్యులు చాలా ఆకలి, దప్పికలతో మరణిస్తుంటారు. పాట వినడముతో మీ రోమాలు నిక్కబొడుచుకోవాలి. తండ్రిని పేదల పెన్నిధి అని అంటారు. పేదల పెన్నిధి యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నారు కదా! ఎవరిని షావుకార్లుగా తయారుచేస్తారు? వారు ఎక్కడికైతే వస్తారో, తప్పకుండా అక్కడున్నవారినే షావుకార్లుగా తయారుచేస్తారు కదా. మనము పావనము నుండి పతితముగా అవ్వడానికి 5 వేల సంవత్సరాలు పడుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాబా వెంటనే పతితము నుండి పావనముగా తయారుచేస్తారు, ఉన్నతోన్నతముగా తయారుచేస్తారు, ఒక్క సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా, నేను మీ వాడిని అని అంటారు. బాబా అంటారు - బిడ్డ, నీవు విశ్వానికి యజమానిగా ఉండేవాడివి. కొడుకు జన్మించగానే వారసునిగా అవుతాడు, ఎంత సంతోషము కలుగుతుంది. కూతురిని చూస్తే ముఖము కిందకు దిగిపోతుంది. ఇక్కడైతే ఆత్మలందరూ కొడుకులు. 5 వేల సంవత్సరాల క్రితము మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు తెలిసింది. బాబా మనల్ని అలా తయారుచేసారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారు అన్నది తెలియదు. లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. శివజయంతిని జరుపుకుంటారు, కేవలం లింగాన్ని పెట్టి పెద్ద-పెద్ద మందిరాలను నిర్మిస్తారు. కానీ వారు ఎలా వచ్చారు, వచ్చి ఏం చేసారు అన్నది ఏమీ తెలియదు, దీనిని అంధ విశ్వాసము, అంధ శ్రద్ధ అని అంటారు. మన ధర్మము ఏది, ఎప్పుడు స్థాపనయ్యింది అన్నది వారికి తెలియదు. ఇతర ధర్మాల వారికి వారి ధర్మము గురించి తెలుసు, బుద్ధుడు ఎప్పుడు వచ్చారు, తిథి-తారీఖులు ఏమిటి అన్నది కూడా వారికి తెలుసు. శివబాబాకు, లక్ష్మీ-నారాయణులకు ఎటువంటి తిథి, తారీఖులు లేవు. 5 వేల సంవత్సరాల విషయాన్ని లక్షల సంవత్సరాలని వ్రాసేసారు. లక్షల సంవత్సరాల విషయమనేట్పపటికి ఎవరికి గుర్తుకొస్తుంది? భారత్ లో దేవీ-దేవతా ధర్మము ఎప్పుడు ఉండేది అనేది అర్థం చేసుకోరు. లక్షల సంవత్సరాల లెక్కలోనైతే భారత్ జనాభా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. భారత్ యొక్క భూమి కూడా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. లక్షల సంవత్సరాలలో ఎంతమంది మనుష్యులు జన్మిస్తారు, ఇప్పటికి లెక్కలేనంతమంది మనుష్యులు అయిపోయి ఉండాలి. కానీ అంతమందైతే లేరు, ఇంకా జనాభా తగ్గిపోయింది. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ విషయాలను మనుష్యులు విన్నప్పుడు ఏమంటారంటే - ఈ విషయాలనైతే మేము ఎప్పుడూ వినలేదు, అలాగే ఏ శాస్త్రాలలోనూ చదవలేదు. ఇవి అద్భుతమైన విషయాలు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రము యొక్క జ్ఞానముంది. వీరు అనేక జన్మల అంతిమములో కూడా అంతిమములో ఇప్పుడు పతితాత్మగా ఉన్నారు. ఎవరైతే సతోప్రధానముగా ఉండేవారో వారు ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు, మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. ఆత్మలైన మీకిప్పుడు శిక్షణ లభిస్తోంది. ఆత్మ చెవుల ద్వారా వింటున్నప్పుడు శరీరము ఊగుతుంది ఎందుకంటే ఆత్మ వింటుంది కదా. ఆత్మలమైన మనము తప్పకుండా 84 జన్మలు తీసుకుంటాము, 84 జన్మలలో 84 తల్లిదండ్రులు తప్పకుండా లభించి ఉంటారు, ఇది కూడా లెక్క కదా. మనము 84 జన్మలు తీసుకుంటామని బుద్ధిలోకి వస్తుంది, అలాగే తక్కువ జన్మలు తీసుకునేవారు కూడా ఉంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. శాస్త్రాలలో ఏమేమి వ్రాసేసారు అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీ విషయములో కనీసం 84 జన్మలు అని అయినా అంటారు కానీ నా కోసమైతే లెక్కలేనన్ని, అనేక జన్మలని అంటారు. కణకణములోకి, రాయిరప్పలలోకి నన్ను తోసేసారు. ఎక్కడ చూసినా నీవే నీవు, కృష్ణుడే కృష్ణుడు అని అంటారు. మథుర, బృందావనములో ఈ విధముగా అంటూ ఉంటారు. కృష్ణుడే సర్వవ్యాపి అని అంటారు. రాధ వర్గానికి చెందినవారు ఎక్కడ చూసినా రాధయే రాధ, నీవు రాధయే, నేను రాధయే అని అంటారు. ఒక్క తండ్రి మాత్రమే పేదల పెన్నిధి. ఏ భారత్ అయితే అన్నింటికన్నా షావుకారుగా ఉండేదో, ఇప్పుడది అన్నింటికన్నా పేదదిగా అయ్యింది, అందుకే నేను భారత్ లోకే రావలసి ఉంటుంది. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా, ఇందులో ఏ మాత్రము తేడా రాదు. డ్రామాలో ఏ షూటింగ్ అయితే జరిగిపోయిందో, అది యథావిధిగా రిపీట్ అవుతుంది, ఇందులో పైసా అంత తేడా కూడా రాదు. డ్రామా గురించి కూడా తెలిసి ఉండాలి. డ్రామా అంటే డ్రామా. అవి హద్దులోని డ్రామాలు, ఇది అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలు ఎవ్వరికీ తెలియవు. పేదల పెన్నిధి అని నిరాకార భగవంతుడినే అనుకుంటారు, శ్రీకృష్ణుడిని అనుకోరు. శ్రీకృష్ణుడైతే ధనవంతుడిగా, సత్యయుగ రాకుమారుడిగా అవుతారు. భగవంతునికైతే తనదంటూ శరీరము లేదు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా తయారుచేస్తారు, మీకు రాజయోగము యొక్క శిక్షణనిస్తారు. చదువుతో బ్యారిస్టరు మొదలైనవారిగా అయి, ఆ తర్వాత సంపాదిస్తారు. తండ్రి కూడా మిమ్మల్ని ఇప్పుడు చదివిస్తున్నారు. మీరు భవిష్యత్తులో నరుని నుండి నారాయణునిగా అవుతారు. మీ జన్మ అయితే జరుగుతుంది కదా. అంతేకానీ స్వర్గము సముద్రము నుండి బయటకు వస్తుందని కాదు. శ్రీకృష్ణుడు కూడా జన్మ తీసుకున్నారు కదా. ఆ సమయములో కంసపురి మొదలైనవేవీ లేవు. శ్రీకృష్ణుని పేరు ఎంతగా గాయనము చేయబడుతుంది, అతని తండ్రికి అంతటి గాయనము లేదు. అతని తండ్రి ఎక్కడ ఉన్నారు? తప్పకుండా శ్రీకృష్ణుడు ఎవరో ఒకరికి కుమారుడు కదా. శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నప్పుడు కొంతమంది పతితులు కూడా ఉంటారు. ఆ పతితులు కూడా పూర్తిగా సమాప్తమైపోయినప్పుడు శ్రీకృష్ణుడు సింహాసనముపై కూర్చుంటారు, తన రాజ్యాధికారాన్ని తీసుకుంటారు, అప్పటినుండే వారి కాలము ప్రారంభమవుతుంది. లక్ష్మీ-నారాయణుల నుండే ఆ కాలము ప్రారంభమవుతుంది. వీరి రాజ్యము ఇంత సమయము ఉంటుంది, ఆ తర్వాత వారిది ఇంత సమయము ఉంటుంది అని మీరు పూర్తి లెక్కను వ్రాస్తారు. ఈ కల్పము ఆయువు పెద్దదిగా ఉండదని మనుష్యులు అర్థం చేసుకుంటారు. 5 వేల సంవత్సరాల పూర్తి లెక్క ఉంది. ఇది పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది కదా. నిన్న మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారము, తండ్రియే మనల్ని అలా తయారుచేసారు, అందుకే మనము వారి శివజయంతిని జరుపుకుంటున్నాము. మీకు అందరి గురించి తెలుసు. క్రైస్టు, గురునానక్ మొదలైనవారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అన్న జ్ఞానము మీకు ఉంది. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు యథావిధిగా రిపీట్ అవుతాయి. ఈ చదువు ఎంత సహజమైనది. మీకు స్వర్గము గురించి తెలుసు. తప్పకుండా భారత్ స్వర్గముగా ఉండేది. భారత్ అవినాశీ ఖండము. భారత్ కు ఉన్నంత మహిమ ఇంకెవ్వరికీ ఉండదు. అందరినీ పతితుల నుండి పావనముగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుంటూ అన్ని చింతలను వదిలేయాలి. సతోప్రధానముగా అవ్వాలన్న ఒక్క చింతనే పెట్టుకోవాలి. 2. పేదల పెన్నిధి అయిన బాబా భారత్ ను నిరుపేద నుండి షావుకారుగా తయారుచేయడానికి వచ్చారు, వారికి పూర్తి-పూర్తి సహాయకులుగా అవ్వాలి. తమ కొత్త ప్రపంచాన్ని గుర్తు చేసుకుంటూ సదా సంతోషముగా ఉండాలి. వరదానము:-హృదయములో సదా ఒక్క రాముడినే ఇముడ్చుకొని సత్యమైన సేవను చేసే మాయాజీత్, విజయీ భవ హనుమంతుడి విశేషతను ఏమని చూపిస్తారంటే - అతను సదా సేవాధారిగా, మహావీరునిగా ఉండేవారు, అందుకే స్వయము కాలిపోకుండా తోక ద్వారా లంకను కాల్చేసారు అని. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే సదా సేవాధారిగా ఉంటారో, వారే మాయ యొక్క అధికారాన్ని సమాప్తము చేయగలుగుతారు. ఎవరైతే సేవాధారి కారో, వారు మాయా రాజ్యాన్ని కాల్చలేరు. హనుమంతుని హృదయములో సదా ఒక్క రాముడే నివసించేవారు, అదే విధముగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ హృదయములో ఉండకూడదు, మీ దేహపు స్మృతి కూడా ఉండకూడదు, అప్పుడే మాయాజీతులుగా, విజయులుగా అవుతారు. స్లోగన్:-ఏ విధముగా ఆత్మ మరియు శరీరము కంబైండ్ గా ఉన్నాయో, అదే విధముగా మీరు తండ్రితోపాటు కంబైండ్ గా ఉండండి.   అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి సంగఠనలో ప్రతి ఒక్కరి విశేషతలను చూడటము, విశేషతలనే గ్రహించటము మరియు బలహీనతలను తొలగించే ప్రయత్నము చెయ్యటము - ఇదే ఏకతతో కూడిన సంగఠనను ధృఢము చేసేందుకు విధి. ఏ విధముగానైతే మీ అందరి యొక్క లేవడము, మాట్లాడటము, నడవటము ఒకే విధముగా ఉన్నాయో, అందరివీ ఒకే విధమైన మాటలు, ఒకే గతి, ఒకే రీతి, ఒకే నీతి ఉన్నాయో, అదే విధముగా సంస్కారాలు కూడా సమానముగా కనిపించాలి. భిన్నత్వము ఉన్నప్పటికీ పరస్పరము ఒకరి పట్ల ఒకరు విశ్వాసము ఉంచి, అందరి ఆలోచనలకు గౌరవాన్ని ఇవ్వండి, ఇదే ఏకతకు ఆధారము. " #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి
See other profiles for amazing content