Follow
v. v. guptha
@299580595
8,425
Posts
10,313
Followers
v. v. guptha
519 views
1 days ago
#🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి 15-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - మీ స్వధర్మము శాంతి, సత్యమైన శాంతి శాంతిధామములో లభించగలదు, ఈ విషయాన్ని అందరికీ వినిపించాలి, స్వధర్మములో ఉండాలి’’ ప్రశ్న:-ఏ జ్ఞానము ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది, దానిని మీరు ఇప్పుడు మాత్రమే చదువుకుంటారు? జవాబు:-పాప-పుణ్యాల జ్ఞానము. భారతవాసులు ఎప్పుడైతే తండ్రిని నిందించడము మొదలుపెడతారో, అప్పుడు పాపాత్ములుగా అవుతారు మరియు ఎప్పుడైతే తండ్రిని మరియు డ్రామాను తెలుసుకుంటారో, అప్పుడు పుణ్యాత్ములుగా అవుతారు. ఈ చదువును పిల్లలైన మీరు ఇప్పుడే చదువుకుంటారు. అందరికీ సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమేనని మీకు తెలుసు. మనుష్యులు, మనుష్యులకు సద్గతిని అనగా ముక్తి-జీవన్ముక్తులను ఇవ్వలేరు. పాట:-ఈ పాపపు ప్రపంచము నుండి... ▶ ఓంశాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇది పాపాత్ముల ప్రపంచము, భారత్ పుణ్యాత్ముల ప్రపంచముగా ఉండేదని, అక్కడ దేవీ-దేవతల రాజ్యముండేదని భారత్ కోసమే చెప్తారు. ఈ భారత్ సుఖధామముగా ఉండేది, ఆ సమయములో ఇతర ఖండాలేవీ ఉండేవి కావు, ఒక్క భారత్ మాత్రమే ఉండేది. ప్రశాంతత మరియు సుఖము ఆ సత్యయుగములో ఉండేవి, దానిని స్వర్గమని అంటారు. ఇది నరకము. భారత్ యే స్వర్గముగా ఉండేది, ఇప్పుడు నరకముగా తయారయ్యింది. నరకములో ప్రశాంతత మరియు సుఖ-శాంతులు ఎక్కడి నుండి వస్తాయి. కలియుగాన్ని నరకము అని అంటారు. కలియుగ అంతిమాన్ని మరింత రౌరవ నరకము అని అనడము జరుగుతుంది, దుఃఖధామము అని అనడము జరుగుతుంది. లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉన్నప్పుడు భారత్ యే సుఖధామముగా ఉండేది. ఆ సమయములో భారతవాసుల గృహస్థ ధర్మము పవిత్రముగా ఉండేది. పవిత్రత కూడా ఉండేది, సుఖ-శాంతులు కూడా ఉండేవి, అపారమైన సంపద కూడా ఉండేది. ఇప్పుడు ఆ భారత్ యే పతితముగా అయ్యింది, అందరూ వికారులుగా అయ్యారు. ఇది దుఃఖధామము. భారత్ సుఖధామముగా ఉండేది మరియు ఎక్కడైతే ఆత్మలమైన మనము నివాసముంటామో - అది శాంతిధామము. శాంతి ఆ శాంతిధామములోనే లభించగలదు. ఆత్మ శాంతిగా అక్కడ మాత్రమే ఉండగలదు, దానిని స్వీట్ హోమ్ (మధురమైన ఇల్లు), నిరాకారీ ప్రపంచము అని అంటారు. అది ఆత్మల ఇల్లు. అక్కడ ఉన్నప్పుడు ఆత్మ శాంతిలో ఉంటుంది. అంతేకానీ, శాంతి అడవులకు వెళ్ళినంత మాత్రాన ఏమీ లభించదు. శాంతిధామమైతే అదే. సత్యయుగములో సుఖము కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. ఇక్కడ దుఃఖధామములో శాంతి ఉండదు. శాంతి శాంతిధామములో లభిస్తుంది. సుఖధామములో కూడా కర్మలు జరుగుతాయి, శరీరము ద్వారా పాత్రను అభినయించవలసి ఉంటుంది. ఈ దుఃఖధామములో సుఖ-శాంతులు ఉన్న మనుష్యులు ఒక్కరు కూడా లేరు. ఇది భ్రష్టాచారీ పతితధామము, అందుకే పతిత-పావనుడిని పిలుస్తారు. కానీ ఆ తండ్రి గురించి ఎవరికీ తెలియదు, అందుకే అనాథలుగా అయిపోయారు. అనాథలుగా అయిన కారణముగా పరస్పరములో కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. ఎంత దుఃఖము-అశాంతి, కొట్లాటలు ఉన్నాయి. ఇది ఉన్నదే రావణ రాజ్యము. రామ రాజ్యాన్ని కోరుకుంటారు. రావణ రాజ్యములో సుఖము లేదు, శాంతి లేదు. రామ రాజ్యములో సుఖము, శాంతి రెండూ ఉండేవి. అక్కడ పరస్పరములో ఎప్పుడూ కొట్లాడుకునేవారు కాదు, గొడవపడేవారు కాదు, అక్కడ 5 వికారాలు ఉండనే ఉండవు. ఇక్కడ 5 వికారాలు ఉన్నాయి. వాటిలో మొదట దేహాభిమానము ముఖ్యమైనది. ఆ తర్వాత కామము, క్రోధము. భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు ఈ వికారాలు ఉండేవి కావు. అక్కడ దేహీ-అభిమానులుగా ఉండేవారు. ఇప్పుడు మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. దేవతలు దేహీ-అభిమానులుగా ఉండేవారు. దేహాభిమానము కల మనుష్యులు ఎప్పుడూ ఎవరికీ సుఖాన్ని ఇవ్వలేరు. ఒకరికొకరు దుఃఖాన్నే ఇచ్చుకుంటారు. ఎవరైనా లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా, పదమపతులుగా ఉన్నంత మాత్రాన వారు సుఖముగా ఉన్నారని అనుకోకండి. అలా కాదు. అదంతా మాయ ఆర్భాటము. ఇది మాయ రాజ్యము. ఇప్పుడు దీని వినాశనము కోసం ఈ మహాభారత యుద్ధము ఎదురుగా నిలబడి ఉంది. దీని తర్వాత మళ్ళీ స్వర్గ ద్వారాలు తెరుచుకోనున్నాయి. అర్ధకల్పము తర్వాత మళ్ళీ నరక ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. భక్తి చేసినప్పుడు భగవంతుడు లభిస్తారని భారతవాసులు అంటారు. బాబా అంటారు - ఎప్పుడైతే భక్తి చేస్తూ-చేస్తూ పూర్తిగా కిందకు వచ్చేస్తారో, అప్పుడు స్వర్గ స్థాపన చేయడానికి అనగా భారత్ ను స్వర్గముగా తయారుచేయడానికి నేను రావలసి ఉంటుంది. స్వర్గముగా ఉన్న భారత్ నరకముగా ఎలా తయారయ్యింది? రావణుడు తయారుచేశాడు. గీతా భగవానుడి ద్వారా మీకు రాజ్యము లభించింది, 21 జన్మలు స్వర్గములో రాజ్యము చేసారు. ఆ తర్వాత భారత్ ద్వాపరము నుండి కలియుగములోకి వచ్చింది, అనగా దిగే కళ ఏర్పడింది, అందుకే ఓ పతిత-పావనా రండి అని అందరూ పిలుస్తూ ఉంటారు. పతిత మనుష్యులకు పతిత ప్రపంచములో సుఖ, శాంతులు లభించనే లభించవు. వారు ఎంత దుఃఖాన్ని అనుభవిస్తారు. ఈ రోజు డబ్బు దొంగలించబడుతుంది, మరొక రోజు దివాలా తీస్తారు, ఇంకొక రోజు రోగగ్రస్థులుగా అవుతారు. అంతా దుఃఖమే దుఃఖము కదా. ఇప్పుడు మీరు సుఖ-శాంతుల వారసత్వాన్ని పొందేందుకు పురుషార్థము చేస్తున్నారు, తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థము చేస్తున్నారు. సదా సుఖమయముగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. సదా దుఃఖమయముగా చేసేది రావణుడు. ఈ విషయాలు భారతవాసులకు తెలియదు. సత్యయుగములో దుఃఖపు విషయాలు ఉండవు. ఎప్పుడూ ఏడవవలసిన అవసరముండదు. సదా సుఖమే సుఖముంటుంది. అక్కడ దేహాభిమానము లేదా కామము, క్రోధము మొదలైనవి ఉండవు. ఎప్పటివరకైతే 5 వికారాలను దానమివ్వరో, అప్పటివరకు దుఃఖము యొక్క గ్రహణము తొలగదు. దానము ఇచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుందని అంటారు కదా. ఈ సమయములో మొత్తం భారత్ కు 5 వికారాల గ్రహణము పట్టి ఉంది. ఎప్పటివరకైతే ఈ 5 వికారాలను దానమివ్వరో, అప్పటివరకు 16 కళల సంపూర్ణ దేవతలుగా అవ్వలేరు. తండ్రి సర్వుల సద్గతిదాత. గురువు లేకుండా గతి లభించదని అంటారు. కానీ, గతి అనే మాట యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. మనుష్యుల గతి-సద్గతి అనగా ముక్తి-జీవన్ముక్తి. అవి తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఈ సమయములో సర్వుల సద్గతి జరుగనున్నది. ఢిల్లీని కొత్త ఢిల్లీ, పాత ఢిల్లీ అని అంటారు. కానీ ఇప్పుడైతే అది కొత్తగా లేదు. కొత్త ప్రపంచములో కొత్త ఢిల్లీ ఉంటుంది. పాత ప్రపంచములో పాత ఢిల్లీ ఉంటుంది. తప్పకుండా యమునా నది తీరము ఉండేది, ఢిల్లీ పరిస్తాన్ (స్వర్గము) గా ఉండేది. సత్యయుగము ఉండేది కదా. అక్కడ దేవీ-దేవతలు రాజ్యము చేసేవారు. ఇప్పుడైతే పాత ప్రపంచములో పాత ఢిల్లీ ఉంది. కొత్త ప్రపంచములోనైతే ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. భారతవాసులు ఇది మర్చిపోయారు. కొత్త భారత్, కొత్త ఢిల్లీ ఉన్నప్పుడు వారి రాజ్యముండేది, వేరే ఖండమేదీ ఉండేది కాదు. ఇది ఎవ్వరికీ తెలియదు. గవర్నమెంట్ ఇదంతా చదివించదు. వారు చదివించే హిస్టరీలో మొత్తమంతా లేదని వారికి తెలుసు. వారు చదివించే హిస్టరీలో ఇస్లాములు, బౌద్ధులు వచ్చినప్పటి నుండి ఉన్న విషయాలు ఉన్నాయి. లక్ష్మీ-నారాయణుల రాజ్యము గురించి ఎవ్వరికీ తెలియదు. మొత్తం సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అనేది తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు బంగారుయుగముగా ఉండేది. ఇప్పుడు ఆ భారత్ యే ఎలా అయిపోయిందో చూడండి. మళ్ళీ భారత్ ను వజ్ర సమానముగా ఎవరు తయారుచేస్తారు? తండ్రి అంటారు, మీరు చాలా పాపాత్ములుగా అయిపోయినప్పుడు మిమ్మల్ని పుణ్యాత్ములుగా చేయడానికి నేను వస్తాను. ఈ డ్రామా తయారై ఉంది, దీని గురించి ఎవరికీ తెలియదు. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. నాలెడ్జ్ ఫుల్ ఒక్క తండ్రి మాత్రమే, వారు వచ్చి చదివిస్తున్నారు. మనుష్యులు, మనుష్యులకు ఎప్పుడూ సద్గతిని ఇవ్వలేరు. దేవీ-దేవతలుగా ఉన్నప్పుడు అందరూ ఒకరికొకరు సుఖాన్ని ఇచ్చేవారు. ఎవ్వరూ అనారోగ్యముగా, రోగగ్రస్థులుగా అయ్యేవారు కారు. ఇక్కడైతే అందరూ రోగులే. దీనిని మళ్ళీ స్వర్గముగా తయారుచేయడానికి ఇప్పుడు తండ్రి వచ్చారు. తండ్రి స్వర్గాన్ని తయారుచేస్తారు, రావణుడు నరకాన్ని తయారుచేస్తాడు. ఇది ఒక ఆట, దీని గురించి ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాల జ్ఞానము ఫిలాసఫీ, అది భక్తి మార్గము. అదేమీ సద్గతి మార్గము కాదు. ఇదేమీ శాస్త్రాల ఫిలాసఫీ కాదు. తండ్రి ఏ శాస్త్రాలను వినిపించరు. ఇక్కడ ఉన్నది స్పిరిచ్యువల్ నాలెడ్జ్. తండ్రిని స్పిరిచ్యువల్ ఫాదర్ అని అంటారు. వారు ఆత్మల తండ్రి. తండ్రి అంటారు, నేను మనుష్య సృష్టికి బీజరూపుడను కావున నేను నాలెడ్జ్ ఫుల్. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షము యొక్క ఆయువు ఎంత, ఇది ఎలా వృద్ధి చెందుతుంది, ఆ తర్వాత భక్తి మార్గము ఎలా మొదలవుతుంది, ఇదంతా నాకు తెలుసు. పిల్లలైన మీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను, ఇక మీరు యజమానులుగా అయిపోతారు. ఈ జ్ఞానము మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, తర్వాత మాయమైపోతుంది. మళ్ళీ, సత్య, త్రేతాయుగాలలో ఈ జ్ఞానము యొక్క అవసరముండదు. ఈ జ్ఞానము కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంది. దేవతలలో ఈ జ్ఞానము లేదు. కావున ఈ జ్ఞానము పరంపరగా రాదు. ఇది పిల్లలైన మీకు కేవలం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, దీని ద్వారా మీరు జీవన్ముక్తులవుతారు, తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. మీ వద్దకు ఎంతోమంది వస్తారు, మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని అడుగుతారు. కానీ ఇలా అనడము తప్పు. ఎలాగైతే శరీరము యొక్క ఇంద్రియాలు ఉన్నాయో, అలా మనసు-బుద్ధి ఆత్మ యొక్క ఇంద్రియాలు. ఆత్మను రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలదిగా తండ్రియే వచ్చి తయారుచేస్తారు, అది సత్య, త్రేతాయుగాల వరకు కొనసాగుతుంది. మళ్ళీ రాతిబుద్ధి కలవారిగా అయిపోతారు. ఇప్పుడు మీరు మళ్ళీ రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతారు. మీ పారసబుద్ధిలో మాలిన్యము చేరుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పారసబుద్ధి కలవారిగా ఎలా అవ్వాలి? తండ్రి అంటారు - హే ఆత్మ, నన్ను స్మృతి చేయండి. స్మృతియాత్రతో మీరు పవిత్రముగా అవుతారు మరియు నా వద్దకు వచ్చేస్తారు. ఇకపోతే, మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని ఎవరైతే అడుగుతారో, వారికి ఇలా చెప్పండి - ఇక్కడ శాంతి ఎలా ఉండగలదు, ఇది ఉన్నదే దుఃఖధామము, ఎందుకంటే ఇక్కడ వికారాలు ప్రవేశించి ఉన్నాయి. శాంతి వారసత్వము అనంతమైన తండ్రి నుండి మాత్రమే లభించగలదు. ఆ తర్వాత రావణుడి సాంగత్యము లభించడముతో పతితులుగా అయిపోతారు, మళ్ళీ తండ్రి ద్వారా పావనముగా అయ్యేందుకు ఒక్క క్షణము పడుతుంది. ఇప్పుడు మీరు తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. తండ్రి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తారు మరియు రావణుడు జీవనబంధనము యొక్క శాపాన్ని ఇస్తాడు, అందుకే దుఃఖమే దుఃఖము ఉంది. డ్రామాను కూడా తెలుసుకోవాలి. దుఃఖధామములో ఎవరికీ సుఖ-శాంతులు లభించవు. శాంతి అనేది ఆత్మలమైన మన స్వధర్మము, శాంతిధామము ఆత్మల ఇల్లు. ఆత్మ అంటుంది - నా స్వధర్మము శాంతి, అక్కడ ఈ వాయిద్యాన్ని (శరీరాన్ని) మోగించను, అక్కడ నేను కూర్చుండిపోతాను. కానీ ఎంతవరకని కూర్చుని ఉంటారు. కర్మలైతే చేయవలసిందే కదా. ఎప్పటివరకైతే మనుష్యులు డ్రామాను అర్థం చేసుకోరో, అప్పటివరకు దుఃఖితులుగా ఉంటారు. తండ్రి అంటారు, నేను ఉన్నదే పేదల పెన్నిధిని. ఇక్కడకు పేదలే వస్తారు. షావుకారుల కొరకైతే స్వర్గము ఇక్కడే ఉంది. వారి భాగ్యములో స్వర్గ సుఖము లేదు. తండ్రి అంటారు, నేను పేదల పెన్నిధిని. షావుకారులను పేదవారిగా మరియు పేదవారిని షావుకారులుగా చేస్తాను. షావుకారులు అంతటి ఉన్నత పదవిని పొందలేరు, ఎందుకంటే ఇక్కడ షావుకారులకు నషా ఉంటుంది. అయితే, ప్రజలలోకి వస్తారు. స్వర్గములోకైతే తప్పకుండా వస్తారు. కానీ ఉన్నత పదవిని పేదవారే పొందుతారు. పేదవారు షావుకారులుగా అవుతారు. ధనవంతులకు తాము ధనవంతులమనే దేహాభిమానము ఉంది కదా. కానీ బాబా అంటారు - ఈ ధనము-వస్తువులన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. వినాశనము జరగనున్నది. దేహీ-అభిమానులుగా అవ్వడములో చాలా శ్రమ ఉంది. ఈ సమయములో అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. నేను 84 జన్మలను పూర్తి చేసానని ఆత్మ అంటుంది. నాటకము పూర్తవుతుంది, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడిది కలియుగ అంతిమము మరియు సత్యయుగ ఆది యొక్క సంగమము. తండ్రి అంటారు, నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత భారత్ ను మళ్ళీ వజ్ర సమానముగా తయారుచేయడానికి వస్తాను. ఈ చరిత్ర-భౌగోళికాల గురించి తండ్రి మాత్రమే తెలియజేయగలరు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు పావనముగా తప్పకుండా అవ్వాలి. డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుని దుఃఖధామములో ఉంటూ కూడా దుఃఖాల నుండి ముక్తులుగా అవ్వాలి. 2. ధన, సంపదలు మరియు షావుకారుతనము యొక్క నషాను వదిలి దేహీ-అభిమానులుగా ఉండేందుకు పురుషార్థము చేయాలి. వరదానము:-వికారాల వంశము యొక్క అంశాన్ని కూడా సమాప్తము చేసే సర్వ సమర్పణ మరియు ట్రస్టీ భవ ఎవరైతే సమయానికి పనికొస్తుందని పాత సంస్కారాల ఆస్తిని కొంత పక్కకు తీసి పెట్టుకుంటారో, వారిని మాయ ఏదో ఒక విధముగా పట్టుకుంటుంది. పాత రిజిస్టరుకు సంబంధించిన ఒక చిన్న భాగము మిగిలి ఉన్నా సరే పట్టుబడతారు. మాయ చాలా తీక్షణమైనది, దాని క్యాచింగ్ పవర్ తక్కువేమీ కాదు, అందుకే వికారాల వంశము యొక్క అంశాన్ని కూడా సమాప్తము చేయండి. కొద్దిగా కూడా ఏ మూలలోనూ పాత ఖజానా యొక్క గుర్తు కూడా ఉండకూడదు - అటువంటి వారినే సర్వ సమర్పణులు, ట్రస్టీలు మరియు యజ్ఞ స్నేహీలు, సహయోగులని అంటారు. స్లోగన్:-ఎవరి విశేషత కారణముగానైనా వారి పట్ల విశేషమైన స్నేహము ఏర్పడితే, అది కూడా మోహమే.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ మధురతయే మహానత, దీని ద్వారా మనసు మరియు మాటలలోని చేదుతనము సమాప్తమైపోతుంది, క్రోధాగ్ని శీతలమైపోతుంది. బాప్ దాదా తమ పిల్లలు ప్రతి ఒక్కరినీ శీతల దేవతలుగా తయారుచేయాలని అనుకుంటున్నారు, అందుకే మధురతా గుణాన్ని ధారణ చేయండి. మీ ముఖము కూడా మధురముగా ఉండాలి. మధురతా గుణముతో నిండుగా అవ్వండి, మీ సంపర్కములోకి ఎవరు వచ్చినా సరే వారిని మధురమైన మాటలు మరియు శక్తిశాలి దృష్టితో నిండుగా చేయండి. "
v. v. guptha
795 views
2 days ago
#🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 14-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - దేవతలుగా అవ్వాలంటే, అమృతాన్ని తాగండి మరియు తాగించండి, అమృతాన్ని తాగేవారే శ్రేష్ఠాచారులుగా అవుతారు’’ ప్రశ్న:-ఈ సమయములో సత్యయుగీ ప్రజలు ఏ ఆధారముగా తయారవుతున్నారు? జవాబు:-ఎవరైతే ఈ జ్ఞానముతో ప్రభావితులవుతారో, చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటారో, కానీ చదువును చదవరో, శ్రమ చేయలేకపోతారో, వారు ప్రజలుగా అవుతారు. ప్రభావితులవ్వడమంటే ప్రజలుగా అవ్వడము. సూర్యవంశీ రాజా-రాణులుగా అయ్యేందుకైతే శ్రమించాలి. చదువు పట్ల పూర్తి అటెన్షన్ ఉండాలి. స్మృతి చేస్తూ మరియు చేయిస్తూ ఉన్నట్లయితే ఉన్నత పదవి లభించగలదు. పాట:-నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు... ▶ ఓంశాంతి. మా జీవితము పూర్వము వజ్ర సమానముగా ఉండేది, ఇప్పుడు గవ్వ సమానముగా అయ్యింది అని పిల్లలు పాటలో విన్నారు. ఇదైతే సాధారణమైన విషయము. బాబా చాలా సులువైన పద్ధతిలో అర్థం చేయిస్తారు, అందుకు చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. సత్యనారాయణుని కథను వినిపించినప్పుడు చిన్న-చిన్న పిల్లలు కూడా కూర్చుండిపోతారు. కానీ ఆ సత్సంగాలు మొదలైనవాటిలో ఏవైతే వినిపిస్తారో, అవన్నీ కథలు. ఆ కథలు జ్ఞానమేమీ కాదు, అవి తయారై, తయారుచేయబడిన కథలు. గీతా కథ, రామాయణ కథ, అలానే రకరకాల శాస్త్రాలు ఉన్నాయి, వాటిలోని కథలను కూర్చుని వినిపిస్తారు. అవన్నీ కథలే. కథల వలన లాభమేమైనా ఉంటుందా! ఇది సత్యనారాయణుని కథ అనగా నరుని నుండి నారాయణునిగా అయ్యే సత్యమైన కథ. ఇది వినడముతో మీరు నరుని నుండి నారాయణునిగా అవుతారు. ఇది అమరకథ కూడా. రండి, మీకు అమరకథను వినిపిస్తాము, దానితో మీరు అమరలోకానికి వెళ్ళిపోతారు అని మీరు ఆహ్వానాన్ని ఇస్తారు. ఇలా చెప్పినా కూడా ఎవరూ అర్థం చేసుకోరు. శాస్త్రాల కథలను వింటూ వస్తారు కానీ ఏమీ లభించదు. లక్ష్మీ-నారాయణుల మందిరాలకు వెళ్తారు, పదండి, దర్శనము చేసుకుని వద్దాము, మహాత్ముల దర్శనము చేసుకుని వద్దాము అని అంటారు. ఇది ఒక ఆచారము, పద్ధతి వలె కొనసాగుతూ వస్తుంది. ఋషులు, మునులు మొదలైనవారెవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో, వారికి తల వంచి నమస్కరిస్తూ వచ్చారు. రచయిత మరియు రచనల కథ గురించి తెలుసా అని అడిగితే, తెలియదు అని అంటారు. ఈ రచయిత మరియు రచనల కథ అయితే చాలా సహజమైనది అని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇది అల్ఫ్ మరియు బే (భగవంతుడు మరియు రాజ్యాధికార వారసత్వము) యొక్క కథ. ప్రదర్శనీలకు ఎవరైతే వస్తారో, వారు కథను బాగానే వింటారు కానీ పవిత్రముగా అవ్వరు. ఈ వికారాలలోకి వెళ్ళే ఆచారము, పద్ధతి కూడా అనాది అయినదని వారు భావిస్తారు. మందిరాలలో దేవతల ఎదురుగా వెళ్ళి, మీరు సంపూర్ణ నిర్వికారులు... అని పాడుతారు, మళ్ళీ బయటకు వచ్చి ఏమంటారంటే - వికారాలలోకి వెళ్ళడమనేది అనాదిగా కొనసాగుతూ వస్తున్న పద్ధతి, వికారాలు లేకుండా ప్రపంచము ఎలా నడుస్తుంది, లక్ష్మీ-నారాయణులు మొదలైనవారికి కూడా పిల్లలుండేవారు కదా అని. ఇటువంటివారికి ఏమని చెప్పాలి! దేవతలను మనుష్యులతో సమానులని అనలేము కదా. దేవతలు కూడా మనుష్యులే, లక్ష్మీ-నారాయణుల రాజ్యములో ఎంత సుఖముగా ఉండేవారు. పిల్లలైన మీకు తండ్రి చాలా సహజమైన విషయాన్ని తెలియజేస్తున్నారు, తప్పకుండా ఇక్కడ భారత్ లోనే స్వర్గముండేది, లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. వారి చిత్రాలు కూడా ఉన్నాయి, సత్యయుగములో వారి రాజ్యముండేదని అందరూ నమ్ముతారు. అక్కడ ఎవ్వరూ దుఃఖితులుగా ఉండేవారు కాదు, వారు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు, వారి మందిరాలు కూడా చాలా పెద్ద-పెద్దవి నిర్మించబడ్డాయి. వారు 5000 సంవత్సరాల క్రితం ఉండేవారు, ఇప్పుడు వారు లేరు. ఇప్పుడైతే ఇది కలియుగ అంతిమము. మనుష్యులు పరస్పరము కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. భగవంతుడైతే పైన నిర్వాణధామములోనే ఉంటారు. వాస్తవానికి ఆత్మలమైన మనము కూడా అక్కడే ఉండేవారము, పాత్రను అభినయించేందుకని ఇక్కడకు వస్తాము. మొదట మనము లక్ష్మీ-నారాయణుల రాజ్యములో ఉండేవారము. అక్కడ చాలా సుఖము, ఆనందము ఉండేవి, ఆ తర్వాత మనము 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. 84 జన్మల చక్రమని అంటూ ఉంటారు కూడా. మనము సూర్యవంశములో 1250 సంవత్సరాలు రాజ్యము చేసాము. అక్కడ అపారమైన సుఖముండేది, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు, వజ్ర వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. మనము రాజ్యము చేసాము, ఆ తర్వాత 84 జన్మలలోకి రావాల్సి ఉంటుంది. ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికాల చక్రము తిరుగుతూ ఉంటుంది. అర్ధకల్పము సుఖముండేది, రామ రాజ్యములో ఉండేవారము, ఆ తర్వాత మనుష్యుల సంఖ్య వృద్ధి అవుతూ వచ్చింది. సత్యయుగములో 9 లక్షల మంది ఉండేవారు. సత్యయుగ అంతిమానికి వృద్ధి చెంది, 9 లక్షల నుండి 2 కోట్ల మంది అయ్యారు, ఆ తర్వాత త్రేతాలో 12 జన్మలు చాలా సుఖ-శాంతులతో ఉండేవారు. ఒకే ధర్మముండేది. ఆ తర్వాత ఏమయ్యింది. రావణ రాజ్యము ప్రారంభమయ్యింది. రామ రాజ్యము మరియు రావణ రాజ్యము గురించి ఎంత సహజమైన పద్ధతిలో అర్థం చేయిస్తానో చూడండి. చిన్న-చిన్న పిల్లలకు కూడా ఇలా చెప్పాలి. ఆ తర్వాత ఏమి జరిగింది? బంగారము, వజ్ర-వైఢూర్యాలతో కూడిన పెద్ద-పెద్ద మహళ్ళు భూకంపాలలో లోపలికి వెళ్ళిపోయాయి. భారతవాసులు వికారులుగా అవ్వడం వలనే భూకంపాలు వచ్చాయి, ఆ తర్వాత రావణ రాజ్యము ప్రారంభమయ్యింది, పవిత్రుల నుండి అపవిత్రులైపోయారు. బంగారు లంక లోపలికి వెళ్ళిపోయిందని అంటారు కూడా. ఎంతోకొంత మిగిలి ఉంటుంది కదా, దానితోనే మందిరాలు మొదలైనవి నిర్మించి ఉండవచ్చు. భక్తి మార్గము ప్రారంభమయ్యింది మరియు మనుష్యులు వికారులుగా అవ్వడము మొదలుపెట్టారు. ఇక రావణ రాజ్యము కొనసాగడముతో ఆయుష్షు కూడా తగ్గిపోయింది. మనము నిర్వికారీ యోగుల నుండి వికారీ భోగులుగా అయిపోయాము, యథా రాజా-రాణి తథా ప్రజా, అందరూ వికారులుగా అయిపోయారు. ఈ కథ ఎంత సహజమైనది. చిన్న-చిన్న కన్యలు కూడా ఈ కథను వినిపించినట్లయితే, పెద్ద-పెద్ద వ్యక్తులు తల దించుకుంటారు. ఇప్పుడు తండ్రి కూర్చుని వినిపిస్తున్నారు, వారే జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు. అచ్ఛా, ద్వాపరములో భోగులుగా, పతితులుగా అయిపోయారు, ఆ తర్వాత ఇతర ధర్మాలు కూడా ప్రారంభమవుతూ వచ్చాయి. అమృతము యొక్క నషా ఏదైతే ఉండేదో, అది సమాప్తమైపోయింది. కొట్లాటలు-గొడవలు మొదలయ్యాయి. ద్వాపరము నుండి మొదలుకుని మనము దిగజారుతూ వచ్చాము, కలియుగములో మనము ఇంకా వికారులుగా అయిపోయాము. హనుమాన్, గణేష్... మొదలైనవారి రాతి మూర్తులను తయారుచేస్తూ వచ్చాము. రాతి బుద్ధి కలవారిగా అవ్వడము మొదలయ్యింది కావున రాతి పూజను చేయడము మొదలుపెట్టారు. భగవంతుడు రాయి-రప్పలలో ఉన్నారని భావించేవారు. ఇలా చేస్తూ-చేస్తూ భారత్ పరిస్థితి ఇలా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ తండ్రి చెప్తున్నారు - విషాన్ని వదిలి అమృతాన్ని తాగి పవిత్రముగా అవ్వండి మరియు మళ్ళీ రాజ్యాన్ని తీసుకోండి, విషాన్ని వదిలినట్లయితే మీరు మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. కానీ విషాన్ని వదలరు. విషము కోసం ఎంతగా కొడుతూ ఉంటారు, విసిగిస్తూ ఉంటారు. అందుకే ద్రౌపది పిలిచింది కదా. అమృతము తాగకుండా మనము దేవతలుగా అవ్వలేము కదా అన్నది మీరు అర్థం చేసుకున్నారు. సత్యయుగములోనైతే రావణుడు ఉండనే ఉండడు. తండ్రి అంటారు, ఎప్పటివరకైతే శేష్ఠాచారులుగా అవ్వరో, అప్పటివరకు స్వర్గములోకి రాలేరు. ఎవరైతే శ్రేష్ఠాచారులుగా ఉండేవారో, వారు ఇప్పుడు భ్రష్టాచారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అమృతాన్ని తాగి శ్రేష్ఠాచారులుగా అవ్వాలి. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. మీరు గీతను మర్చిపోయారా ఏమిటి? గీతను రచించింది నేను కానీ పేరు శ్రీకృష్ణుడిది వేసారు. ఈ లక్ష్మీ-నారాయణులకు ఈ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు? తప్పకుండా భగవంతుడే ఇచ్చి ఉంటారు. ముందు జన్మలో భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు, కానీ పేరు శ్రీకృష్ణుడిది వేసారు. ఈ విషయాలను అర్థం చేయించే ప్రాక్టీస్ చేయాలి. ఇది చాలా సహజమైన కథ. బాబాకు ఎంత సమయము పట్టింది. ఇంత సహజమైన విషయాన్ని కూడా అరగంటలో అర్థం చేసుకోలేరు, అందుకే తండ్రి అంటారు - ఎవరికైనా కేవలం ఒక చిన్న కథను కూర్చుని అర్థం చేయించండి. చేతిలోకి చిత్రాన్ని తీసుకోండి. సత్యయుగములో లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉంటుంది, తర్వాత త్రేతాలో సీతా-రాముల రాజ్యము ఉంటుంది... ఆ తర్వాత ద్వాపరములో రావణ రాజ్యము మొదలైంది. ఇది ఎంత సహజమైన కథ. తప్పకుండా మనమే దేవతలుగా ఉండేవారము, తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యాము. ఇప్పుడు స్వయాన్ని దేవతలుగా భావించని కారణముగా హిందువులని చెప్పుకుంటారు. ధర్మ శ్రేష్ఠులుగా, కర్మ శ్రేష్ఠులుగా ఉన్నవారు ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయిపోయారు. ఈ విధముగా చిన్న-చిన్న కుమారీలు కూర్చుని భాషణ చేసినట్లయితే, మొత్తము సభ అంతా బాగుంది, బాగుంది అని అంటారు. బాబా అన్ని సెంటర్ల వారికి వినిపిస్తున్నారు. ఇప్పుడు ఈ పెద్ద-పెద్దవారు నేర్చుకోకపోతే, చిన్న-చిన్న కుమారీలకు నేర్పించండి. కుమారీల పేర్లు కూడా ఉన్నాయి. ఢిల్లీ, బొంబాయిలో చాలా మంచి-మంచి కుమారీలు ఉన్నారు, చదువుకున్నవారు ఉన్నారు. వారైతే లేచి నిలబడాలి. వారు ఎంతో చేయగలరు. ఒకవేళ కుమారీలు లేచి నిలబడినట్లయితే, పేరు ప్రసిద్ధమవుతుంది. షావుకారుల ఇళ్ళల్లో ఉండేవారు, కష్టం మీద ధైర్యము చేస్తారు. వారికి వారి షావుకారుతనము యొక్క నషా ఉంటుంది. కట్నము మొదలైనవి లభిస్తే ఇక అంతే. కుమారీలు వివాహము చేసుకుని నల్ల ముఖము చేసుకుంటారు, అప్పుడు అందరి ముందు తల వంచవలసి ఉంటుంది. తండ్రి ఎంత సహజముగా అర్థం చేయిస్తున్నారు. కానీ పారసబుద్ధి కలవారిగా అవ్వాలి అన్న ఆలోచనే రాదు. ఈ రోజుల్లో చదువుకోనివారు కూడా ఎమ్.పి లుగా, ఎమ్.ఎల్.ఎ లుగా అయ్యారు చూడండి. చదువు ద్వారా ఎలా అవుతారో చూడండి. ఈ చదువైతే చాలా సహజమైనది. దీనిని ఇతరులకు కూడా వెళ్ళి నేర్పించాలి. కానీ శ్రీమతమనుసారముగా నడుచుకోకపోతే చదువుకోరు కూడా. చాలా మంచి-మంచి కుమారీలు ఉన్నారు కానీ వారు వారి నషాలోనే ఉన్నారు. కొంచెం పని చేసి, మేము ఎంతో పని చేసామని అనుకుంటారు. ఇప్పుడింకా చాలా పని చేయాలి. ఈ రోజులలో కుమారీలు ఫ్యాషన్లలోనే ఉంటున్నారు. అక్కడైతే సహజమైన అలంకరణ ఉంటుంది. ఇక్కడైతే ఎంత కృత్రిమమైన అలంకరణను చేసుకుంటూ ఉంటారు. కేవలం జుట్టును అలంకరించుకునేందుకే ఎంత డబ్బును ఖర్చు పెడతారు. ఇదంతా మాయ ఆర్భాటము. మాయా రావణ రాజ్యము పతనమవుతుంది, మళ్ళీ రామ రాజ్యము ఉదయించడము జరుగుతుంది. ఇప్పుడు రామ రాజ్యము స్థాపనవుతుంది. కానీ మీరు శ్రమ అయితే చేయండి కదా, లేదంటే మీరు ఏమవుతారు! ఒకవేళ చదువుకోకపోతే, అక్కడకు వెళ్ళి సాధారణ ప్రజలుగా అవుతారు. నేటి గొప్ప-గొప్ప వ్యక్తులు అక్కడ ప్రజలలోకి వస్తారు. షావుకారులు కేవలం బాగుంది-బాగుంది అని చెప్పి, తమ-తమ వ్యాపారాలలో నిమగ్నమైపోతారు. చాలా బాగా ప్రభావితులవుతారు, ఆ తర్వాత ఏమిటి! ఆఖరికి ఏమి జరుగుతుంది. అక్కడకు వెళ్ళి ప్రజలుగా అవుతారు. ప్రభావితులవ్వడము అనగా ప్రజలుగా అవ్వడము. ఎవరైతే శ్రమిస్తారో, వారు రామ రాజ్యములోకి వస్తారు. వివరణ అయితే చాలా సహజమైనది. ఎవరైనా ఈ కథ యొక్క నషాలో ఉన్నట్లయితే, వారి నావ తీరానికి చేరుతుంది. మనము శాంతిధామములోకి వెళ్తాము, ఆ తర్వాత సుఖధామములోకి వస్తాము. కేవలం స్మృతి చేస్తూ, చేయిస్తూ ఉండాలి, అంతే, అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. చదువు పట్ల అటెన్షన్ పెట్టాలి. చిత్రాలు చేతిలో ఉండాలి. బాబా లక్ష్మీ-నారాయణులను పూజించేవారు, అప్పట్లో వారి చిత్రము జేబులో ఉండేది. చిన్న చిత్రాలు కూడా ఉంటాయి, లాకెట్ లో కూడా ఉంటాయి. వాటి గురించి అర్థం చేయించాలి. వీరు బాబా, వీరి నుండి వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు పావనముగా అవ్వండి, తండ్రిని స్మృతి చేయండి. ఈ బ్యాడ్జిలలో ఎంత జ్ఞానము ఉంది. వీటిలో జ్ఞానమంతా ఉంది. వీటిపై అర్థం చేయించడము చాలా సహజము. సెకెండులో తండ్రి నుండి స్వర్గము యొక్క జీవన్ముక్తి వారసత్వము లభిస్తుంది. ఎవరైనా అర్థం చేయిస్తే, వారు జీవన్ముక్తి పదవికి అధికారులుగా అయిపోతారు. ఇకపోతే, చదువు అనుసారముగా ఉన్నత పదవిని పొందుతారు. స్వర్గములోకైతే అసలు వస్తారు కదా, చివరిలోనైనా వస్తారు కదా. వృద్ధి అయితే జరగనున్నది. దేవీ-దేవతా ధర్మము ఉన్నతమైనది, వారు కూడా తయారవుతారు కదా. ప్రజలైతే లక్షల సంఖ్యలో తయారవుతారు. సూర్యవంశీయులుగా అవ్వడములో శ్రమ ఉంది. సేవ చేసేవారే మంచి పదవిని పొందుతారు. వారి పేర్లు కూడా ప్రసిద్ధి చెందాయి - కుమారకా ఉన్నారు, జనక్ ఉన్నారు, వారు సెంటర్లను బాగా సంభాళిస్తున్నారు. ఎటువంటి గొడవలు లేవు. తండ్రి అంటారు - చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు. అయినా అటువంటి మాటలను మాట్లాడుతూ ఉంటారు. అలాంటివారు అక్కడికి వెళ్ళి ఏమవుతారు. ఇంత సహజమైన సేవను కూడా చేయరు. చిన్న-చిన్న కుమారీలు కూడా అర్థం చేయించగలరు, వినిపించగలరు. వానర సైన్యము కూడా ప్రసిద్ధమైనది. రావణుడి జైలులో చిక్కుకుని ఉన్న సీతలను విడిపించాలి. కథలైతే ఏవేవో తయారుచేసేసారు. ఈ విధముగా ఎవరైనా భాషణ చేయాలి. భాషణ చేసిన తర్వాత కుమారీలు ఏమని చెప్తూ ఉంటారంటే - ఫలానావారు చాలా ప్రభావితులయ్యారు అని. అయితే, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అని వారిని అడగండి. వారు ఇతరులకు - వీరి జ్ఞానము చాలా బాగుందని కేవలం ఇంతే చెప్తారు. వారు స్వయము ఏమీ అర్థం చేసుకోరు. దాని వలన లాభమేముంది. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. పారసబుద్ధి కలవారిగా అయ్యేందుకు చదువు పట్ల పూర్తి ధ్యానముంచాలి. శ్రీమతమనుసారముగా చదువుకోవాలి మరియు చదివించాలి. హద్దు సంపదల నషాను, ఫ్యాషన్లు మొదలైనవాటిని వదిలి, ఈ అనంతమైన సేవలో నిమగ్నమవ్వాలి. 2. చెడు వినవద్దు, చెడు చూడవద్దు... ఎలాంటి వ్యర్థమైన విషయాలు మాట్లాడకూడదు. ఎవరిపైనా ప్రభావితులవ్వకూడదు. అందరికీ సత్యనారాయణుని చిన్న కథను వినిపించాలి. వరదానము:-కొత్త జీవితము యొక్క స్మృతితో కర్మేంద్రియాలపై విజయము ప్రాప్తి చేసుకునే మరజీవా భవ ఏ పిల్లలైతే పూర్తిగా మరజీవాగా అయ్యారో, వారికి కర్మేంద్రియాల ఆకర్షణ ఉండదు. మరజీవాగా అయ్యారు అనగా అన్ని వైపుల నుండి మరణించారు, పాత ఆయువు సమాప్తమయింది. కొత్త జన్మ జరిగినప్పుడు కొత్త జన్మలో, కొత్త జీవితములో కర్మేంద్రియాలకు ఎలా వశమవ్వగలరు? బ్రహ్మాకుమార, కుమారీల కొత్త జీవితములో - అసలు కర్మేంద్రియాలకు వశమవ్వడమంటే ఏమిటి అనే జ్ఞానానికి కూడా అతీతముగా ఉండాలి. కొద్దిగా కూడా శూద్రత్వపు శ్వాస అనగా సంస్కారము లోపల ఎక్కడా ఆ శ్వాస మిగిలి ఉండిపోకూడదు. స్లోగన్:-అమృతవేళ హృదయములో పరమాత్ముని స్నేహాన్ని ఇముడ్చుకున్నట్లయితే ఇంకే స్నేహము ఆకర్షించలేదు.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ సంగఠనలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు సదా నమ్రచిత్తము అనే సింహాసనముపై విరాజమానమై ఉండండి. ఈ సింహాసనముపైనే కూర్చుని, బాధ్యత అనే కిరీటాన్ని ధారణ చేసి భవిష్య పదవిని తయారుచేసుకోండి. సింహాసనముపై నుండి దిగకండి, దానిపైనే కూర్చుని పని చేయండి, అప్పుడు సఫలత లభిస్తూ ఉంటుంది. దీని కొరకు ‘ముందు మీరు’ అన్న పాఠము పక్కాగా ఉండాలి, దీని ద్వారా మీ సంస్కారాలు అందరితోనూ సహజముగానే కలిసిపోతాయి. "
v. v. guptha
882 views
3 days ago
#🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు 13-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు ఎటువంటి ప్రపంచానికి యజమానులుగా అవుతున్నారంటే, అక్కడ ఎటువంటి హద్దులు ఉండవు, యోగబలముతో మొత్తం విశ్వము యొక్క రాజ్యాధికారాన్ని తీసుకోవడము, ఇది కూడా అద్భుతమే’’ ప్రశ్న:-డ్రామా యొక్క ఏ బంధనములో తండ్రి కూడా బంధించబడి ఉన్నారు? జవాబు:-బాబా అంటారు - నేను పిల్లలైన మీ సమ్ముఖములోకి రావాల్సిందే, నేను ఈ బంధనములో బంధించబడి ఉన్నాను. ఎప్పటివరకైతే నేను రానో, అప్పటివరకు చిక్కుముడి విడిపోదు. ఇకపోతే, నేను మీపై ఎటువంటి కృపను చూపించేందుకో లేక ఆశీర్వదించేందుకో రాను. నేను మరణించినవారినేమీ బ్రతికించను. నేను మిమ్మల్ని పతితము నుండి పావనముగా చేసేందుకు వస్తాను. పాట:-మిమ్మల్ని పొంది మేము... ఓంశాంతి. పాటలోని పదాలను విని పిల్లలైన మీ రోమాలు నిక్కబొడుచుకోవాలి, ఎందుకంటే మీరు సమ్ముఖములో కూర్చుని ఉన్నారు. మొత్తము ప్రపంచములో ఎంతోమంది విద్వాంసులు, పండితులు, ఆచార్యులు ఉన్నప్పటికీ, అనంతమైన తండ్రి ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తారు అన్న విషయము మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. ఇది పిల్లలకు మాత్రమే తెలుసు. నేను ఏమై ఉన్నా, ఎలా ఉన్నా, మీ వాడినే - అని పిల్లలు అంటారు కూడా. మీరు ఏమై ఉన్నా, ఎలా ఉన్నా, నా పిల్లలే అని తండ్రి కూడా అంటారు. వారు ఆత్మలందరికీ తండ్రి అని మీకు కూడా తెలుసు. వారిని అందరూ పిలుస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, రావణుడి నీడ ఎంతగా ఉందో చూడండి. ఎవరినైతే మనము పరమపిత పరమాత్మ అని అంటున్నామో, వారిని పిత అని అనడముతో సంతోషము ఎందుకు కలగడము లేదు అనేది ఒక్కరు కూడా అర్థం చేసుకోలేరు, ఈ విషయాన్ని మర్చిపోయారు. ఆ బాబాయే మనకు వారసత్వాన్ని ఇస్తారు. ఇంత సహజమైన ఈ విషయాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోలేరని తండ్రి స్వయమే అర్థం చేయిస్తున్నారు. ఓ ఖుదా, ఓ రామా... అని ఎవరినైతే మొత్తము ప్రపంచమంతా పిలుస్తుందో, వారు వీరే అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. అలా పిలుస్తూ-పిలుస్తూ ప్రాణాలు వదిలేస్తారు. ఇక్కడ ఆ తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. మీ బుద్ధి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది. బాబా కల్పక్రితం వలె వచ్చి ఉన్నారు. కల్ప-కల్పము బాబా వచ్చి పతితుల నుండి పావనులుగా చేసి దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకువెళ్తారు. సర్వుల పతిత-పావనుడైన తండ్రి అని పాడుతారు కూడా. ఇప్పుడు పిల్లలైన మీరు వారి సమ్ముఖములో కూర్చున్నారు. మీరు మోస్ట్ బిలవెడ్ స్వీట్ చిల్డ్రన్ (అత్యంత ప్రియమైన మధురమైన పిల్లలు). ఇది భారతవాసుల విషయమే. తండ్రి కూడా భారత్ లోనే జన్మ తీసుకుంటారు. తండ్రి అంటారు, నేను భారత్ లో జన్మ తీసుకుంటాను కావున తప్పకుండా భారతవాసులే ప్రియమనిపిస్తారు. అందరూ భగవంతుడినే స్మృతి చేస్తారు. ఎవరు ఏ ధర్మానికి చెందినవారో, వారు తమ ధర్మస్థాపకుడిని స్మృతి చేస్తారు. మేము ఆది సనాతన ధర్మానికి చెందినవారిగా ఉండేవారము అని భారతవాసులకే తెలియదు. భారత్ యే ప్రాచీన దేశము అని బాబా అర్థం చేయిస్తున్నారు, దానికి మనుష్యులు, కేవలం భారత్ యే ఉండేదని ఎవరు చెప్పారు అని అడుగుతారు. అనేకానేక మాటలు వింటుంటారు. ఒకరు ఒకటి చెప్తారు, ఇంకొకరు ఇంకొకటి చెప్తారు. కొందరు - ‘గీతను శివ పరమాత్మయే వినిపించారని ఎవరు చెప్పారు, శ్రీకృష్ణుడు కూడా పరమాత్మయే కదా, వారు వినిపించారు, పరమాత్మ సర్వవ్యాపి, ఈ ఆటంతా వారిదే, ఇవన్నీ భగవంతుని రూపాలే, భగవంతుడే అనేక రూపాలను ధరించి లీలలు చేస్తారు, భగవంతుడు ఏది కావాలనుకుంటే అది చేయగలరు’ అని అంటారు. మాయ కూడా ఎంత ప్రబలమైనది అనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. బాబా, మేము వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము, నరుని నుండి నారాయణునిగా అవుతామని ఈ రోజు అంటారు. రేపు ఇక్కడ ఉండరు. ఎంతమంది వెళ్ళిపోయారు, విడాకులిచ్చేసారు అనేది మీకు తెలుసు కూడా. వారు మమ్మాను కారులో తీసుకువెళ్ళేవారు కానీ ఈ రోజు లేరు. ఇటువంటి మంచి-మంచి వారు కూడా మాయ సాంగత్యములోకి వచ్చి ఎలా పడిపోతారంటే, ఇక పూర్తిగా కింద పడిపోతారు. ఎవరైతే కల్పక్రితం అర్థం చేసుకున్నారో, వారే అర్థం చేసుకుంటారు. ఈ రోజు ప్రపంచములో ఏమవుతుందో చూడండి మరియు పిల్లలైన మీరు ఎలా తయారవుతున్నారో చూసుకోండి. పాటను విన్నారు కదా. మేము ఎటువంటి వారసత్వాన్ని తీసుకుంటామంటే, దాని ద్వారా మేము మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతామని చెప్తారు. అక్కడ హద్దు విషయాలేవీ ఉండవు. ఇక్కడ హద్దులు ఉన్నాయి. మా ఆకాశములోకి మీ విమానము వచ్చినట్లయితే షూట్ చేసేస్తాము అని అంటారు. అక్కడైతే హద్దు విషయాలేవీ ఉండవు. పాటలు కూడా పాడుతారు కానీ అర్థమేమీ తెలియదు. తప్పకుండా బాబా ద్వారా మళ్ళీ మేము విశ్వానికి యజమానులుగా అవుతున్నామని మీకైతే తెలుసు. అనేక సార్లు ఈ 84 జన్మల చక్రములో తిరిగారు. కొద్ది సమయమే దుఃఖము పొందారు, సుఖమైతే ఎంతో ఉంటుంది, అందుకే బాబా అంటారు, నేను పిల్లలైన మీకు అపారమైన సుఖాన్ని ఇస్తాను, ఇప్పుడిక మాయతో ఓడిపోకండి. బాబాకు చాలామంది పిల్లలు ఉన్నారు. అందరూ ఒకే విధమైన సుపుత్రులుగా ఉండలేరు. కొంతమందికి 5-7 మంది పిల్లలుంటారు - వారిలో ఒకరిద్దరు కుపుత్రులుగా ఉంటే బాగా విసిగించేస్తారు. లక్షల-కోట్ల రూపాయలను పోగొట్టేస్తారు. తండ్రి చూస్తే పూర్తిగా ధర్మాత్మగా ఉంటారు, పిల్లలు చూస్తే పూర్తిగా సున్నా ఖాతాతో ఉంటారు. బాబా ఇటువంటి ఉదాహరణలను ఎన్నో చూసారు. మొత్తము ప్రపంచమంతా ఈ అనంతమైన తండ్రికి సంతానమని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అంటారు, నా జన్మ స్థలము ఈ భారత్. ప్రతి ఒక్కరికీ తమ స్వస్థలం పట్ల గౌరవముంటుంది. వేరే స్థానములో శరీరాన్ని వదిలినట్లయితే, వారిని తమ స్వగ్రామానికి తీసుకువస్తారు. తండ్రి కూడా భారత్ లోనే వస్తారు. భారతవాసులైన మీకు మళ్ళీ అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. పిల్లలైన మీరు అంటారు - మేము మళ్ళీ దేవతలుగా, విశ్వానికి యజమానులుగా అవుతున్నాము. మేమే యజమానులుగా ఉండేవారము, ఇప్పుడు ఎలాంటి గతి ఏర్పడింది, ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చి పడ్డాము. 84 జన్మలను అనుభవిస్తూ, అనుభవిస్తూ ఈ పరిస్థితి ఏర్పడింది. డ్రామానైతే అర్థం చేసుకోవాలి కదా. దీనిని గెలుపు-ఓటముల ఆట అని అంటారు. ఈ ఆట భారత్ కు చెందినదే, ఇందులో మీ పాత్ర ఉంది. ఈ డ్రామాలో బ్రాహ్మణులైన మీది అందరికన్నా ఉన్నతోన్నతమైన పాత్ర. మీరు విశ్వమంతటికీ యజమానులుగా అవుతారు, చాలా సుఖాన్ని అనుభవిస్తారు. మీ అంతటి సుఖాన్ని ఇంకెవ్వరూ అనుభవించలేరు. దాని పేరే స్వర్గము. ఇది నరకము. ఇక్కడి సుఖము కాకిరెట్టతో సమానము. నేడు లక్షాధికారులుగా ఉన్నారు, మరుసటి జన్మలో ఏమవుతారు అనేది ఏమీ తెలియదు. ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచము. సత్యయుగము పుణ్యాత్ముల ప్రపంచము. మీరు పుణ్యాత్ములుగా అవుతున్నారు కావున ఎప్పుడూ కూడా పాపము చేయకూడదు. ఎప్పుడూ బాబాతో స్పష్టముగా వ్యవహరించాలి. తండ్రి అంటారు - ద్వాపరము నుండి మొదలుకుని నాతోపాటు ధర్మరాజు సదా ఉండనే ఉన్నారు. సత్య, త్రేతాయుగాలలో నాతోపాటు ధర్మరాజు ఉండరు. ద్వాపరము నుండి మీరు నా పేరు మీద దాన-పుణ్యాలను చేస్తూ వస్తున్నారు. ఈశ్వరార్పణము అని అంటారు కదా. గీతలో శ్రీకృష్ణుని పేరు వేయడముతో - శ్రీకృష్ణార్పణము అని వ్రాశారు. రిటర్న్ ఇచ్చేవారైతే ఒక్క తండ్రి మాత్రమే, అందుకే శ్రీకృష్ణార్పణము అని అనడము తప్పు. ఈశ్వరార్పణము అని అనడము కరక్టు. శ్రీగణేశార్పణము అని అనడము వలన ఏమీ లభించదు. అయినా సరే, ఆ భావనకు అందరికీ ఏదో ఒకటి ఇస్తూ వచ్చాను. నా గురించైతే అసలు ఎవరికీ తెలియదు. మనము అంతటినీ శివబాబాకు సమర్పణ చేస్తున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. నేను మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చానని బాబా కూడా అంటారు. ఇప్పుడు ఉన్నదే దిగే కళ. రావణ రాజ్యములో ఏవైతే దాన-పుణ్యాలు చేస్తారో, అవి పాపాత్ములకే ఇస్తారు. కళలు తగ్గుతూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా లభించినా సరే, అది అల్పకాలము కోసమే. ఇప్పుడైతే మీకు 21 జన్మల కోసం లభిస్తుంది. దానిని రామ రాజ్యము అని అంటారు. అక్కడ ఈశ్వరుని రాజ్యముందని అనరు. రాజ్యము దేవీ-దేవతలది. తండ్రి అంటారు, నేను రాజ్యము చేయను. మీ ఆది సనాతన దేవి-దేవతా ధర్మము ఏదైతే ఉండేదో, అది ఇప్పుడు కనుమరుగైపోయింది, అది ఇప్పుడు మళ్ళీ స్థాపనవుతోంది. తండ్రి అయితే ఎలాగూ కళ్యాణకారియే, వారిని సత్యమైన బాబా అని అంటారు. వారు తమ యొక్క మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల సత్య జ్ఞానాన్ని మీకు ఇస్తున్నారు. బాబా మీకు అనంతమైన చరిత్ర-భౌగోళికాలను వినిపిస్తారు. ఇది ఎంత గొప్ప సంపాదన. మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. కానీ వారు ఆ హింసాత్మక చక్రాన్ని చూపించారు. వాస్తవానికి ఇది జ్ఞాన చక్రము. కానీ ఈ జ్ఞానమైతే కనుమరుగైపోతుంది. ఇవి మీ ముఖ్యమైన చిత్రాలు. ఒక వైపు త్రిమూర్తి, మరొకవైపు కల్పవృక్షము మరియు చక్రము. బాబా అర్థం చేయించారు, శాస్త్రాలలోనైతే కల్పము యొక్క ఆయుష్షు లక్షల సంవత్సరాలని రాసేశారు. మొత్తము దారమంతా చిక్కులు పడి ఉంది. తండ్రి తప్ప ఇంకెవ్వరూ చిక్కు ముడులను విప్పలేరు. తండ్రి స్వయం సమ్ముఖములోకి వచ్చారు. వారు అంటున్నారు - నేను డ్రామానుసారముగా రావలసే ఉంటుంది, నేను ఈ డ్రామాలో బంధించబడి ఉన్నాను, నేను రాకపోవడమనేది జరగనే జరగదు. అలాగని నేను వచ్చి మరణించినవారిని బ్రతికిస్తానని లేదా ఎవరినైనా అనారోగ్యము నుండి విడిపిస్తానని కాదు. బాబా, మాపై కృప చూపించండి అని చాలామంది పిల్లలు అంటారు. కానీ ఇక్కడ కృప మొదలైన విషయాలేవీ లేవు. మీరు నన్ను - మాకు ఎటువంటి నష్టము కలగకుండా మమ్మల్ని ఆశీర్వదించండి అని ఇలా పిలవలేదు కదా. మీరు నన్ను - ఓ పతిత-పావనా రండి, దుఃఖహర్త-సుఖకర్త రండి అనే పిలుస్తారు. శరీరానికి దుఃఖహర్తలుగానైతే డాక్టర్లు కూడా ఉంటారు. నేనేమైనా దాని కోసం వస్తానా! కొత్త ప్రపంచమైన స్వర్గానికి యజమానులుగా చేయండి లేక శాంతిని ఇవ్వండి అని మీరు అంటారు. అంతేకానీ, మీరు వచ్చి మమ్మల్ని అనారోగ్యము నుండి బాగుచేయండి అని అనరు. సదా కోసం శాంతి లేదా ముక్తి అయితే లభించదు, పాత్రనైతే అభినయించాల్సిందే. ఎవరైతే చివరిలో వస్తారో, వారికి ఎంత శాంతి లభిస్తుంది. ఇప్పటివరకు వస్తూనే ఉన్నారు. ఇంత సమయమైతే శాంతిధామములో ఉన్నారు కదా. డ్రామానుసారముగా ఎవరి పాత్ర ఉంటే, వారే వస్తారు. పాత్ర మారదు. బాబా అర్థం చేయిస్తున్నారు, శాంతిధామములోనైతే చాలా-చాలామంది ఆత్మలు ఉంటారు, వారు చివరిలో వస్తారు. ఈ డ్రామా తయారై ఉంది. చివరిలో రావాల్సినవారు చివరిలోనే రావాల్సి ఉంటుంది. ఈ వృక్షము తయారై ఉంది. ఈ చిత్రాలు మొదలైనవేవైతే తయారుచేసారో, వాటన్నింటి గురించి మీరు అర్థం చేయించాలి. ఇంకా కూడా చిత్రాలు వెలువడుతూ ఉంటాయి, కల్పక్రితం వలె వెలువడుతాయి. 84 జన్మల విస్తారము కల్పవృక్షము చిత్రములో కూడా ఉంది, డ్రామా చక్రము చిత్రములో కూడా ఉంది. ఇప్పుడు మెట్ల వరుస చిత్రాన్ని కూడా తయారుచేసారు. మనుష్యులకు ఏమీ తెలియదు. పూర్తిగా బుద్ధిహీనులు వలె ఉన్నారు. జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు అయిన పరమపిత పరమాత్మ ఈ తనువు ద్వారా మమ్మల్ని చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి అంటారు, ఎవరైతే మొట్టమొదట విశ్వానికి యజమానిగా ఉండేవారో, నేను వారిలోనే వస్తాను. తప్పకుండా మేము కూడా బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులుగా అవుతామని మీకు కూడా తెలుసు. గీతలోనైతే ఈ విషయాలు లేవు. తండ్రి అంటారు - ఇతను స్వయమే నారాయణుడి పూజను చేసేవారు, రైలులో ప్రయాణిస్తూ కూడా గీతను చదివేవారు. ఇతను పెద్ద ధర్మాత్మ అని మనుష్యులు అనుకునేవారు. ఇప్పుడు ఆ విషయాలన్నింటినీ మర్చిపోతూ ఉంటారు. ఎంతైనా, ఇతను గీత మొదలైనవన్నీ చదివారు కదా. నాకు ఇవన్నీ తెలుసు అని బాబా అంటారు. ఇప్పుడు మీరు ఆలోచించండి - మేము ఎవరి ముందు కూర్చుని ఉన్నాము? ఎవరి ద్వారానైతే విశ్వానికి యజమానులుగా అవుతారో, వారిని పదే-పదే ఎందుకు మర్చిపోతున్నారు? తండ్రి అంటారు, నేను మీకు 16 గంటలు ఫ్రీ టైమ్ ఇస్తాను, మిగిలిన సమయములో స్వయము యొక్క సేవ చేసుకోండి. స్వయము యొక్క సేవ చేసుకుంటున్నారంటే విశ్వ సేవను చేస్తున్నట్లు. ఎంత పురుషార్థము చేయండంటే, కర్మలు చేస్తూ తక్కువలో తక్కువ 8 గంటలు తండ్రిని స్మృతి చేయండి. ప్రస్తుతం రోజంతటిలో 8 గంటలు స్మృతి చేయలేరు. ఆ అవస్థ ఎప్పుడైతే ఏర్పడుతుందో, అప్పుడు వీరు చాలా సేవ చేస్తున్నారని భావిస్తారు. మేము చాలా సేవ చేస్తున్నామని అనుకోకండి. భాషణ చాలా ఫస్ట్ క్లాస్ గా చేస్తారు కానీ యోగము అస్సలు లేదు. యోగము యొక్క యాత్రే ముఖ్యమైనది. తండ్రి అంటారు, తలపై వికర్మల భారము చాలా ఉంది, అందుకే ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయండి. 2 నుండి 5 గంటల వరకు ఫస్ట్ క్లాస్ వాయుమండలము ఉంటుంది. ఆత్మ రాత్రివేళ ఆత్మాభిమానిగా అవుతుంది, దానిని నిద్ర అని అంటారు, అందుకే తండ్రి అంటారు, ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మన్మనాభవ. ఇది పైకి ఎక్కే కళ కోసం మంత్రము. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. తండ్రితో స్పష్టముగా మరియు సత్యముగా ఉంటూ నడుచుకోవాలి. మీరు కళ్యాణకారీ తండ్రికి పిల్లలు, అందుకే సర్వుల కళ్యాణము చేయాలి. సుపుత్రులుగా అవ్వాలి. 2. కర్మలు చేస్తూ కూడా తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతిలో తప్పకుండా ఉండాలి. స్మృతియే ముఖ్యమైనది - దీనితోనే వికర్మల భారాన్ని తొలగించుకోవాలి. వరదానము:-దాతగా అయి ప్రతి సెకండు, ప్రతి సంకల్పములో దానమిచ్చే ఉదారచిత్త, మహాదానీ భవ దాత పిల్లలైన మీరు తీసుకునేవారు కాదు, ఇచ్చేవారు. ప్రతి సెకండు, ప్రతి సంకల్పములో ఇవ్వాలి, ఎప్పుడైతే ఇటువంటి దాతలుగా అవుతారో, అప్పుడు ఉదారచిత్తులు, మహాదానులు అని అంటారు. ఇటువంటి మహాదానులుగా అయినట్లయితే మహాన్ శక్తి యొక్క ప్రాప్తి స్వతహాగా కలుగుతుంది. కానీ ఇచ్చేందుకు స్వయము యొక్క భాండాగారము నిండుగా ఉండాలి. ఏదైతే తీసుకోవాలో, అదంతా తీసేసుకున్నారు, ఇక ఇవ్వడమే మిగిలి ఉంది. కావున ఇస్తూ ఉండండి, ఇవ్వడముతో భాండాగారము ఇంకా నిండుతూ ఉంటుంది. స్లోగన్:-ప్రతి సబ్జెక్టులోనూ ఫుల్ మార్కులు జమ చేసుకోవాలంటే గంభీరత గుణాన్ని ధారణ చేయండి.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ నమ్రచిత్త ఆత్మలు సహజముగానే సుఖదాతలుగా అవ్వగలరు కానీ అభిమానము నమ్రచిత్తులుగా అవ్వనివ్వదు. నమ్రచిత్తులుగా లేకపోతే సేవ జరగదు. సేవాధారుల విశేషత ఏమిటంటే - వారు సదా నమ్రచిత్తులుగా ఉంటారు. స్వయము వంగి ఉంటే అప్పుడు ఇతరులను వంగేలా చేయగలరు. ఎంతగా నమ్రచిత్తులుగా ఉంటారో, అంతగా నిర్మాణము చేస్తారు. ఎక్కడైతే నిర్మానత ఉంటుందో, అక్కడ అధికార దర్పము ఉండదు, ఆత్మికత ఉంటుంది. ఏ విధముగా బాబా ఎంతో నమ్రచిత్తులై వస్తారో, అదే విధముగా ఫాలో ఫాదర్ చేయండి. "
v. v. guptha
643 views
5 days ago
#📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి 11-04-2026 ప్రాత:మురళిఓంశాంతి‘‘అవ్యక్త బాప్ దాదా’’ రివైజ్ 11-04-26 మధువనం ‘‘అంతర్ముఖీ పిల్లలూ - జ్ఞాన రూప అవస్థలో ఉంటూ ఈ మహావాక్యాలను ధారణ చేయండి, అప్పుడు స్వయము మరియు ఇతర ఆత్మల కళ్యాణము చెయ్యగలరు’’ (దాదీల డైరీ నుండి) పురుషార్థీ పిల్లలు ప్రతి ఒక్కరూ ముందుగా అంతర్ముఖ అవస్థను తప్పకుండా ధారణ చేయాలి. అంతర్ముఖతలో చాలానే కళ్యాణము ఇమిడి ఉంది, ఈ అవస్థతోనే అచంచలత్వము, స్థిరత్వము, ఓర్పు, నిర్మానచిత్తము మొదలైన దైవీ గుణాల ధారణ జరగగలదు మరియు సంపూర్ణ జ్ఞానమయ అవస్థ ప్రాప్తించగలదు. అంతర్ముఖులుగా లేని కారణముగా వారికి సంపూర్ణ జ్ఞాన రూప అవస్థ ప్రాప్తించదు ఎందుకంటే ఏయే ‘‘మహావాక్యాలు’’ అయితే సమ్ముఖములో వినటము జరుగుతుందో, ఒకవేళ ఆ మహావాక్యాల యొక్క లోతుల్లోకి వెళ్ళి గ్రహించకపోతే, కేవలం ఆ మహావాక్యాలను విని రిపీట్ చేసినట్లయితే ఆ మహావాక్యాలు కేవలం వాక్యాలుగా అయిపోతాయి. ఎవరైతే జ్ఞాన రూప అవస్థలో ఉంటూ మహావాక్యాలను వినరో, ఆ మహావాక్యాలపై మాయ నీడ పడుతుంది. ఇప్పుడు, ఇలా మాయ యొక్క అశుద్ధమైన వైబ్రేషన్లతో నిండిన మహావాక్యాలను విని కేవలం రిపీట్ చెయ్యటము వలన స్వయము మరియు ఇతరుల కళ్యాణము జరగటానికి బదులుగా అకళ్యాణమైపోతుంది, అందుకే ఓ పిల్లలూ, పూర్తిగా అంతర్ముఖీగా అయిపోండి. మీ ఈ మనసు మందిరము వంటిది. ఎలా అయితే మందిరము నుండి సదా సుగంధము వస్తూ ఉంటుందో అలా మనసనే మందిరము ఎప్పుడైతే పవిత్రముగా అవుతుందో, అప్పుడు సంకల్పాలు కూడా పవిత్రమైనవి ఇమర్జ్ అవుతాయి. ఎలా అయితే మందిరములో కేవలం పవిత్రమైన దేవీ-దేవతల చిత్రాలనే పెట్టడము జరుగుతుందో, రాక్షసుల చిత్రాలను పెట్టరో, అలాగే పిల్లలైన మీరు మీ మనసు లేక హృదయము రూపీ మందిరాన్ని సర్వ ఈశ్వరీయ గుణాలనే మూర్తులతో అలంకరించండి, ఆ గుణాలు ఏమిటంటే - నిర్మోహము, నిర్లోభము, నిర్భయము, ఓర్పు, నిరహంకారము మొదలైనవి, ఎందుకంటే ఇవన్నీ మీ దివ్య లక్షణాలే. పిల్లలైన మీరు మీ మనసనే మందిరాన్ని ప్రకాశమయముగా అనగా సంపూర్ణ శుద్ధముగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనసనే మందిరము ప్రకాశమయముగా అవుతుందో, అప్పుడే మీ ప్రియమైన ప్రకాశమయమైన వైకుంఠ దేశములోకి వెళ్లగలుగుతారు. కావున ఇప్పుడు మీ మనసును ఉజ్వలముగా చేసుకునేందుకు ప్రయత్నము చేయాలి మరియు మనసు సహితముగా వికారీ కర్మేంద్రియాలను వశము చేసుకోవాలి. కానీ కేవలం మీ కొరకే కాకుండా ఇతరుల కొరకు కూడా ఇదే దివ్య సేవను చేయాలి. వాస్తవానికి సేవ యొక్క అర్థం అతి సూక్ష్మమైనది మరియు లోతైనది. ఎవరైనా పొరపాటు చేస్తే కేవలం వారిని సావధానపరచటం మాత్రమే సేవ కాదు. అలా కాదు, వారికి సూక్ష్మరీతిలో మీ యోగశక్తిని అందించి, వారి అశుద్ధ సంకల్పాలను భస్మము చేయటము, ఇదే సర్వోత్తమమైన సత్యమైన సేవ, మరియు దానితో పాటుగా స్వయము పట్ల కూడా అటెన్షన్ పెట్టుకోవాలి. కేవలం వాచా మరియు కర్మణాలోనే కాకుండా మనసులోనైనా సరే ఏవైనా అశుద్ధ సంకల్పాలు ఉత్పన్నమైతే వాటి వైబ్రేషన్లు ఇతరుల వద్దకు వెళ్ళి సూక్ష్మ రీతిలో అకళ్యాణము చేస్తాయి. ఆ భారము స్వయముపైనే పడుతుంది మరియు ఆ భారమే బంధనమైపోతుంది, అందుకే - ఓ పిల్లలూ, స్వయము సావధానులుగా ఉండండి మరియు ఇతరుల కొరకు కూడా అదే దివ్య సేవను చేయండి, ఇదే సేవాధారీ పిల్లలైన మీ యొక్క అలౌకిక కర్తవ్యము. ఇటువంటి సేవ చేసేవారు మళ్ళీ తమ కొరకు ఎటువంటి సేవను తీసుకోకూడదు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా అనుకోకుండా పొరపాటు జరిగినా కూడా దానిని మీ బుద్ధియోగ బలముతో సదా కొరకు కరక్ట్ చేసుకోవాలి. ఇటువంటి తీవ్ర పురుషార్థులు కొంచెము సూచన లభించినా కానీ దానిని వెంటనే గ్రహించి పరివర్తన చేసుకుంటారు మరియు భవిష్యత్తు కొరకు మంచి రీతిలో అటెన్షన్ పెట్టి నడుచుకుంటారు, ఇదే విశాలబుద్ధి కల పిల్లల కర్తవ్యము. ఓ నా ప్రాణమైన పిల్లలూ, పరమాత్మ ద్వారా రచింపబడిన ఈ అవినాశీ రాజస్వ జ్ఞాన యజ్ఞములో తనువు, మనసు, ధనములను సంపూర్ణ రీతిలో స్వాహా చెయ్యటములోని రహస్యము చాలా సూక్ష్మమైనది. ఏ క్షణమైతే మీరు - నేను తనువు, మనసు, ధనముల సహితముగా యజ్ఞములో స్వాహా అయిపోయాను అనగా అర్పణమై మరణించాను అని అంటారో, ఆ క్షణము నుండి మొదలుకుని మీదంటూ ఏదీ ఉండదు. అందులో కూడా ముందుగా తనువు, మనసులను సంపూర్ణ రీతిలో సేవలో పెట్టాలి. ఎప్పుడైతే మీ సర్వస్వమూ యజ్ఞము కోసమే అనగా పరమాత్మ కోసమే ఉంటుందో, అప్పుడిక మీ కోసమంటూ ఏదీ ఉండలేదు, అప్పుడు ధనాన్ని కూడా వ్యర్థముగా పోగొట్టలేరు, మనసు కూడా అశుద్ధ సంకల్ప-వికల్పాల వైపుకు పరుగెత్తలేదు ఎందుకంటే పరమాత్మకు అర్పించేశారు. వాస్తవానికి పరమాత్మ ఉన్నదే శుద్ధ, శాంత స్వరూపము, ఈ కారణముగా అశుద్ధ సంకల్పాలు స్వతహాగానే శాంతిస్తాయి. ఒకవేళ మనసును మాయ చేతిలో పెట్టినట్లయితే మాయకు వెరైటీ రూపాలు ఉన్న కారణముగా అది అనేక రకాల వికల్పాలను ఉత్పన్నము చేసి మనసు అనే గుర్రము పైకి ఎక్కి సవారీ చేస్తుంది. ఒకవేళ పిల్లలెవరికైనా ఇప్పటివరకు కూడా సంకల్ప-వికల్పాలు వస్తున్నాయంటే అర్థం చేసుకోవాలి - మనసు ఇప్పుడింకా పూర్ణ రీతిలో స్వాహా అవ్వలేదు అనగా మనసు ఈశ్వరీయ మనసుగా అవ్వలేదు, అందుకే ఓ సర్వస్వ త్యాగీ పిల్లలూ, ఈ గుహ్యమైన రహస్యాలను అర్థం చేసుకుని కర్మలు చేస్తూ సాక్షీగా అయ్యి స్వయాన్ని చూసుకుంటూ చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. స్వయముగా గోపీ వల్లభుడు తమ ప్రియమైన గోప-గోపికలైన మీకు ఏమని అర్థం చేయిస్తున్నారంటే - మీలోని ప్రతి ఒక్కరికీ వాస్తవికమైన సత్యమైన ప్రేమ ఏది! ఓ ప్రాణులారా, మీకు ఇతరులు ఇచ్చే ప్రేమపూర్వకమైన అటెన్షన్ ను మీరు స్వీకరించాలి ఎందుకంటే ఎంతటి ప్రియమైన పుష్పమో, అంతే శ్రేష్ఠమైన పాలన ఉంటుంది. పుష్పాన్ని విలువైనదిగా చేయడానికి తోటమాలి దానిని ముళ్ళ నుండి బయటకు తియ్యాల్సే ఉంటుంది, అలాగే మీకు కూడా ఎవరైనా అటెన్షన్ ఇప్పించినట్లయితే, వారు నాకు పాలన చేస్తున్నారు అనగా నా సేవ చేస్తున్నారు అని భావించాలి. ఆ సేవకు అనగా ఆ పాలనకు గౌరవము ఇవ్వాలి, ఇదే సంపూర్ణముగా అయ్యేందుకు యుక్తి, ఇదే జ్ఞాన సహితమైన ఆంతరిక సత్యమైన ప్రేమ. ఈ దివ్య ప్రేమలో ఇతరుల పట్ల చాలా గౌరవము ఉండాలి. ప్రతి విషయములోనూ ముందుగా స్వయాన్నే సావధానపరుచుకోవాలి, ఇదే నిర్మానచిత్తమైన, అతి మధురమైన అవస్థ. ఇలా ప్రేమపూర్వకముగా నడుచుకోవటం ద్వారా మీకు ఇక్కడే ఆ సత్యయుగీ మనోహరమైన రోజులు ఆంతరికముగా అనుభూతి అవుతాయి. అక్కడైతే ఈ ప్రేమ సహజముగానే ఉంటుంది, కానీ ఈ సంగమయుగపు అతి మధురమైన సమయములో ఇతరుల కొరకు సర్వీస్ చేసేందుకు ఇది అతి మధురమైన, రమణీకమైన ప్రేమ, ఈ శుద్ధమైన ప్రేమయే విశ్వములో గాయనము చేయబడింది. చైతన్య పుష్పాలైన మీరు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ హర్షితముఖులుగా ఉండాలి ఎందుకంటే నిశ్చయబుద్ధి కలిగి ఉన్న కారణముగా మీ నరనరాలలో సంపూర్ణ ఈశ్వరీయ శక్తి ఇమిడి ఉంటుంది. ఇటువంటి ఆకర్షణా శక్తి తన దివ్య చమత్కారాన్ని తప్పకుండా చూపిస్తుంది. ఏ విధముగా నిర్దోషి అయిన చిన్న పిల్లవాడు శుద్ధముగా, పవిత్రముగా ఉన్న కారణముగా సదా నవ్వుతూ ఉంటాడో మరియు తన రమణీకమైన చరిత్ర ద్వారా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడో, అలా మీలోని ప్రతి ఒక్కరిదీ ఇటువంటి ఈశ్వరీయ రమణీకమైన జీవితముగా ఉండాలి, దీని కోసం మీరు ఏ యుక్తి ద్వారానైనా సరే మీ ఆసురీ స్వభావాలపై విజయాన్ని ప్రాప్తి చేసుకోవాలి. మీరు ఎవరినైనా క్రోధమనే వికారానికి వశమై మీ ఎదురుగా వస్తున్నారు అని చూసినప్పుడు మీరు వారి ఎదురుగా జ్ఞాన స్వరూపులై బాల్యపు మధురమైన రీతిలో నవ్వుతూ ఉన్నట్లయితే వారు స్వయమే శాంతచిత్తులైపోతారు అనగా విస్మృతి స్వరూపము నుండి స్మృతిలోకి వచ్చేస్తారు. వారికి తెలియకపోయినా కానీ, సూక్ష్మరీతిలో వారిపై విజయము పొంది యజమానిగా అవ్వటము, ఇదే యజమానిగా మరియు బాలకునిగా అయ్యే సర్వోత్తమమైన శిరోమణి విధి. ఈశ్వరుడు ఎలా అయితే సంపూర్ణ జ్ఞాన స్వరూపుడో అలాగే సంపూర్ణ ప్రేమ స్వరూపుడు కూడా. ఈశ్వరునిలో రెండు గుణాలు ఇమిడి ఉన్నాయి కానీ మొదట జ్ఞానము, ఆ తర్వాత ప్రేమ. ఒకవేళ ఎవరైనా ముందు జ్ఞాన స్వరూపులుగా అవ్వకుండా కేవలం ప్రేమ స్వరూపులుగా అయినట్లయితే ఆ ప్రేమ అశుద్ధ ఖాతాలోకి తీసుకువెళ్తుంది. అందుకే ప్రేమను మర్జ్ చేసి ముందుగా జ్ఞాన స్వరూపులుగా అయ్యి రకరకాల రూపాలలో వచ్చే మాయపై విజయాన్ని పొంది ఆ తర్వాత ప్రేమ స్వరూపులుగా అవ్వాలి. ఒకవేళ జ్ఞానము లేకుండా ప్రేమలోకి వచ్చినట్లయితే ఎప్పుడైనా చంచలం కూడా అవ్వవచ్చు. ఎలా అయితే, ఎవరైనా జ్ఞాన స్వరూపులుగా అవ్వకుండా ధ్యానములోకి వెళ్ళినట్లయితే ఎన్నో సార్లు మాయలో చిక్కుకుపోతారు, అందుకే బాబా అంటారు, పిల్లలూ, ఈ ధ్యానము కూడా దారపు సంకెళ్ళవంటిది, కానీ జ్ఞాన స్వరూపులుగా అయ్యి ఆ తర్వాత ధ్యానములోకి వెళ్ళినట్లయితే అత్యంత ఆనందము అనుభవమవుతుంది. కనుక ముందు జ్ఞానము, ఆ తర్వాత ధ్యానము. ధ్యాననిష్ఠ అవస్థ కంటే జ్ఞాననిష్ఠ అవస్థ శ్రేష్ఠమైనది, అందుకే ఓ పిల్లలూ, ముందు జ్ఞాన స్వరూపులుగా అయ్యి ఆ తర్వాత ప్రేమను ఇమర్జ్ చేయాలి. జ్ఞానము లేకుండా కేవలం ప్రేమ మాత్రమే ఉంటే అది ఈ పురుషార్థీ జీవితములో విఘ్నము కలిగిస్తుంది. సాక్షీతనపు అవస్థ అతి మధురమైనది, రమణీకమైనది మరియు సుందరమైనది. ఈ అవస్థపైనే భవిష్య జీవితమంతా ఆధారపడి ఉంది. ఒకవేళ ఎవరైనా ఏదైనా శారీరక రోగాన్ని అనుభవించాల్సి వస్తే, ఆ సమయములో ఒకవేళ వారు సాక్షీ, సుఖ స్వరూప అవస్థలో ఉంటూ దానిని అనుభవించినట్లయితే దాని ద్వారా వారు గత కర్మల భోగమును సమాప్తము కూడా చేసుకుంటారు మరియు దానితోపాటు భవిష్యత్తు కోసం సుఖపు ఖాతాను కూడా తయారుచేసుకుంటారు. కనుక ఈ సాక్షీతనపు సుఖ స్వరూప అవస్థకు గతము మరియు భవిష్యత్తు, రెండింటితోనూ కనెక్షన్ ఉంటుంది. ఈ రహస్యాన్ని తెలుసుకున్నట్లయితే ఎవ్వరూ కూడా ఇలా అనరు - నా ఈ మనోహరమైన సమయమంతా కేవలం సమాప్తము చేసుకోవటములోనే గడిచిపోయింది అని. అలా కాదు. ఇదే మనోహరమైన పురుషార్థము యొక్క సమయము. ఈ సమయములో రెండు కార్యాలూ సంపూర్ణ రీతిలో సిద్ధిస్తాయి. ఇలా రెండు కార్యాలనూ సిద్ధి చేసుకునే తీవ్ర పురుషార్థులే అతీంద్రియ సుఖము మరియు ఆనందము యొక్క అనుభవములో ఉంటారు. ఈ వెరైటీ విరాట డ్రామాలోని ప్రతి విషయములోనూ పిల్లలైన మీకు సంపూర్ణ నిశ్చయము ఉండాలి ఎందుకంటే ఈ తయారై, తయారుచేయబడిన డ్రామా పూర్తిగా విశ్వసనీయమైనది. చూడండి, ఈ డ్రామా ప్రతి ఒక్క జీవి చేత, ప్రాణి చేత తమ పాత్రను పూర్ణ రీతిలో అభినయించేలా చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా కూడా, ఆ తప్పు చేసే పాత్రను కూడా పూర్ణ రీతిలో అభినయించేలా చేస్తుంది. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. రాంగ్ మరియు రైట్, ఈ రెండూ కూడా ప్లాన్ లో నిశ్చితమై ఉన్నప్పుడు ఇక ఏ విషయములోనైనా సంశయాన్ని రానివ్వటమంటే, అది జ్ఞానము కాదు ఎందుకంటే ప్రతి ఒక్క పాత్రధారి తమ-తమ పాత్రను అభినయిస్తున్నారు. ఎలాగైతే సినిమాలలో అనేకమంది భిన్న-భిన్న నామ-రూపాలు కల యాక్టర్లు తమ-తమ యాక్టింగ్ ను చేసినప్పుడు వారిని చూసి ఎవరిపైనైనా ద్వేషము కలగటము కానీ, ఎవరిని చూసి అయినా సంతోషించటము కానీ జరగదు. అది ఒక ఆట అన్నది అక్కడ తెలుసు, అందులో ప్రతి ఒక్కరికీ తమ-తమ మంచిగా ఉండే లేక చెడుగా ఉండే పాత్ర లభించి ఉంది. అలాగే అనాదిగా తయారై ఉన్న ఈ సినిమాను కూడా సాక్షీగా అయ్యి ఏకరస అవస్థతో హర్షితముఖులై చూస్తూ ఉండాలి. సంగఠనలో ఈ పాయింట్ ను చాలా బాగా ధారణ చేయాలి. ఇతరులను ఈశ్వరీయ రూపముతో చూడాలి, జ్ఞానాన్ని అనుభూతి చేసి సర్వ ఈశ్వరీయ గుణాల ధారణను చేయాలి. తమ లక్ష్య స్వరూపము యొక్క స్మృతి ద్వారా శాంతచిత్తము, నిర్మానచిత్తము, ఓర్పు, మధురత, శీతలత మొదలైన అన్ని దైవీ గుణాలను ఇమర్జ్ చేసుకోవాలి. ఓర్పుతో కూడిన అవస్థను ధారణ చేసేందుకు ముఖ్యమైన పునాది - వెయిట్ అండ్ సీ (వేచి చూడండి). ఓ నా ప్రియమైన పిల్లలూ, వెయిట్ అనగా ఓర్పు వహించటము, సీ అనగా చూడటము. మీ మనసు లోపల ముందుగా ఓర్పు అనే గుణాన్ని ధారణ చేసి, ఆ తర్వాత బయట విరాట డ్రామాను సాక్షీగా అయ్యి చూడాలి. ఏదైనా రహస్యాన్ని వినే సమయము సమీపముగా వచ్చేంతవరకు ఓర్పు అనే గుణాన్ని ధారణ చేయాలి. సమయము వచ్చినప్పుడు ఆ ఓర్పు అనే గుణముతో రహస్యాన్ని వినటం వలన ఎప్పుడూ కూడా చలించరు, అందుకే ఓ పురుషార్థీ ప్రాణులారా, కాస్త ఆగండి మరియు ముందుకు వెళ్తూ రహస్యాన్ని చూస్తూ ఉండండి. ఈ ఓర్పుతో కూడిన అవస్థ ద్వారానే మొత్తము కర్తవ్యమంతా సంపూర్ణ రీతిలో సిద్ధిస్తుంది. ఈ గుణము నిశ్చయముతో ముడిపడి ఉంది. అలా నిశ్చయబుద్ధి సాక్షీదృష్టాగా అయ్యి ప్రతి ఆటను హర్షితముఖముతో చూస్తూ ఆంతరికమైన ఓర్పుతో మరియు అచంచలమైన మనసుతో ఉంటారు, ఇదే జ్ఞానము యొక్క పరిపక్వ అవస్థ, ఇదే అంతిమములో సంపూర్ణతా సమయములో ప్రాక్టికల్ గా ఉంటుంది, అందుకే బహుకాలము నుండీ ఈ సాక్షీతనపు అవస్థలో స్థితులయ్యే కృషి చేయాలి. ఎలా అయితే నాటకములో యాక్టర్ తనకు లభించిన పాత్రను పూర్ణ రీతిలో అభినయించేందుకు ముందు నుండే రిహార్సల్స్ చేయవలసి ఉంటుందో, అలాగే ప్రియమైన పుష్పాలైన మీకు కూడా రాబోయే పెద్ద పరీక్షలలో యోగబలము ద్వారా పాస్ అయ్యేందుకు ముందు నుండే రిహార్సల్స్ తప్పకుండా చేయాలి. కానీ ఒకవేళ బహుకాలము నుండీ ఈ పురుషార్థము చేసి ఉండకపోతే సమయము వచ్చినప్పుడు ఆ సమయములో గాభరా పడిపోయి ఫెయిల్ అయిపోతారు, అందుకే ముందుగా మీ ఈశ్వరీయ పునాదిని పక్కా చేసుకుని దైవీగుణధారిగా అవ్వాలి. జ్ఞాన స్వరూప స్థితిలో స్థితులై ఉండటము ద్వారా స్వతహాగానే శాంత స్వరూప అవస్థ ఏర్పడుతుంది. జ్ఞాన స్వరూప ఆత్మలైన పిల్లలందరూ కలిసి కూర్చుని మురళిని విన్నట్లయితే నలువైపులా శాంతి వాయుమండలము ఏర్పడుతుంది ఎందుకంటే వారు ఏ మహావాక్యాలను విన్నా సరే అవి ఆంతరికముగా బాగా లోపలికి వెళ్ళిపోతాయి. బాగా లోపలికి వెళ్ళిపోయిన కారణముగా ఆంతరికముగా వారికి శాంతితో కూడిన మధురమైన అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు దీని కోసమేమీ ప్రత్యేకముగా కూర్చుని శ్రమ చేయాల్సిన అవసరము లేదు, కానీ జ్ఞాన అవస్థలో స్థితులై ఉన్నట్లయితే ఈ గుణము సులభముగానే వచ్చేస్తుంది. పిల్లలైన మీరు ఉదయముదయమే లేచి ఏకాంతములో కూర్చున్నప్పుడు శుద్ధ ఆలోచనలనే అలల ఉత్పన్నమవుతాయి. ఆ సమయములో చాలా ఉపరామ అవస్థ ఉండాలి. ఆ తర్వాత తమ నిజమైన, శుద్ధ సంకల్పాలలో స్థితులవ్వటం ద్వారా ఇతర అన్ని సంకల్పాలు వాటంతటవే శాంతిస్తాయి మరియు మనసు నిస్సంకల్పముగా అయిపోతుంది ఎందుకంటే మనసును వశము చేసుకునేందుకు కూడా ఏదో ఒక శక్తి అయితే తప్పకుండా కావాలి, అందుకే ముందుగా మీ లక్ష్య స్వరూపము యొక్క శుద్ధ సంకల్పాలను ధారణ చేయండి. ఆంతరిక బుద్ధియోగము నియమప్రమాణముగా ఉన్నట్లయితే మీ ఈ నిస్సంకల్ప అవస్థ స్వతహాగానే ఏర్పడుతుంది. అచ్ఛా! మధురాతి మధురమైన జ్ఞాన పుష్పాలకు, జ్ఞాన సితారలకు ప్రియస్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. తమ లక్ష్య స్వరూపము యొక్క స్మృతితో శాంతచిత్తము, నిర్మానచిత్తము, ఓర్పు, మధురత, శీతలత మొదలైన సర్వ దైవీ గుణాలను ధారణ చేయాలి. 2. నిశ్చయబుద్ధీ సాక్షీదృష్టాగా అయ్యి ఈ ఆటను హర్షితముఖముతో చూస్తూ ఆంతరికముగా ఓర్పుతో మరియు అచంచల మనసుతో ఉండాలి. బహుకాలము నుండీ ఈ సాక్షీతనపు అవస్థలో స్థితులై ఉండే పురుషార్థము చేయాలి. వరదానము:-ఒకే మార్గాన్ని మరియు ఒక్కరితోనే సంబంధాన్ని ఉంచుకునే సంపూర్ణ ఫరిశ్తా భవ నిరాకార మరియు సాకార రూపముతో బుద్ధి యొక్క సాంగత్యము మరియు సంబంధము ఒక్క బాబాతో పక్కాగా ఉన్నట్లయితే ఫరిశ్తాగా అవుతారు. ఎవరివైతే సర్వ సంబంధాలు మరియు సర్వ బాంధవ్యాలు ఒక్కరితోనే ఉంటాయో, వారే సదా ఫరిశ్తాలు. ఏ విధముగా గవర్నమెంటు వారు - ‘ఈ మార్గము బ్లాక్ చేయబడింది (మూసివేయబడింది)’ అని మార్గము మధ్యలో బోర్డును పెడతారో, అదే విధముగా అన్ని మార్గాలను బ్లాక్ చేసినట్లయితే (మూసి వేసినట్లయితే) బుద్ధి భ్రమించడము సమాప్తమైపోతుంది. బాప్ దాదా ఆజ్ఞ ఇదే - మొదట అన్ని మార్గాలను మూసి వేయండి, దీని ద్వారా సహజముగానే ఫరిశ్తాలుగా అయిపోతారు. స్లోగన్:-సదా సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలలో ఉండటము - ఇదే మాయ నుండి సురక్షితముగా ఉండేందుకు సాధనము.   అవ్యక్త సూచనలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ మీ మాటలు మరియు స్వరూపము, రెండూ ఒకేలా ఉండాలి - మాటలలో స్పష్టత కూడా ఉండాలి, అందులో స్నేహము కూడా ఉండాలి, నమ్రత మరియు మధురత కూడా ఉండాలి, సత్యత కూడా ఉండాలి, కానీ స్వరూపములో నమ్రత కూడా ఉండాలి, ఇటువంటి రూపముతోనే బాబాను ప్రత్యక్షము చెయ్యగలరు. నిర్భయులుగా ఉండాలి కానీ మాటలు మర్యాదపూర్వకముగా ఉండాలి - ఎప్పుడైతే ఈ రెండు విషయాలలో బ్యాలెన్స్ ఉంటుందో, అప్పుడు అద్భుతము కనిపిస్తుంది. అప్పుడు మీ మాటలు చేదుగా కాకుండా మధురముగా అనిపిస్తాయి. "
v. v. guptha
597 views
5 days ago
#🇮🇳 మన దేశ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు 10-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - భారత్ కు ముక్తినిచ్చేందుకు తండ్రి వచ్చారు, పిల్లలైన మీరు ఈ సమయములో తండ్రికి సహాయకులుగా అవుతారు, భారత్ యే ప్రాచీన ఖండము’’ ప్రశ్న:-ఉన్నతమైన గమ్యములో ఆటంకాలు కలిగించేటటువంటి చిన్న-చిన్న విషయాలు ఏమిటి? జవాబు:-ఒకవేళ దేనిపట్లనైనా కొద్దిగా అభిరుచి ఉన్నా, అనాసక్త వృత్తి లేకపోయినా, మంచివి ధరించాలి, తినాలి అని బుద్ధి భ్రమిస్తూ ఉన్నా... ఈ విషయాలు ఉన్నతమైన గమ్యానికి చేరుకోవడములో ఆటంకాలను కలిగిస్తాయి, అందుకే బాబా అంటారు - పిల్లలూ, వనవాహములో ఉండండి, మీరు అన్నింటినీ మర్చిపోవాలి, ఈ శరీరము కూడా గుర్తుండకూడదు. ఓంశాంతి. ఈ భారత్ యే అవినాశీ ఖండమని మరియు దీని అసలైన పేరు భారతఖండమని పిల్లలకు అర్థం చేయించారు. హిందుస్థాన్ అనే పేరైతే తర్వాత వచ్చింది. భారత్ ను ఆధ్యాత్మిక ఖండమని అంటారు, ఇది ప్రాచీన ఖండము. కొత్త ప్రపంచములో భారత ఖండము ఉన్నప్పుడు వేరే ఖండాలేవీ ఉండేవి కావు. ముఖ్యమైన ధర్మాలు ఇస్లామ్, బౌద్ధ మరియు క్రిస్టియన్ ధర్మాలు. ఇప్పుడైతే చాలా ఖండాలు ఏర్పడ్డాయి. భారత్ అవినాశీ ఖండము, దీనినే స్వర్గము, హెవెన్ అని అంటారు. కొత్త ప్రపంచములో కొత్త ఖండముగా ఒక్క భారత్ మాత్రమే ఉంటుంది. కొత్త ప్రపంచాన్ని రచించేవారు పరమపిత పరమాత్మ, స్వర్గ రచయిత అయిన హెవెన్లీ గాడ్ ఫాదర్. ఈ భారత్ అవినాశీ ఖండమని భారతవాసులకు తెలుసు. భారత్ స్వర్గముగా ఉండేది. ఎవరైనా మరణించినప్పుడు, వారు స్వర్గస్థులయ్యారని అంటారు, స్వర్గము ఎక్కడో పైన ఉందని భావిస్తారు. దిల్వాడా మందిరములో కూడా వైకుంఠము యొక్క చిత్రాలను పైకప్పులో చూపించారు. భారత్ యే స్వర్గముగా ఉండేదని, ఇప్పుడు అలా లేదని, ఇప్పుడైతే నరకముగా ఉందని ఎవరి బుద్ధిలోకీ రాదు. ఇది కూడా అజ్ఞానమే కదా. జ్ఞానము మరియు అజ్ఞానము అనే రెండు విషయాలు ఉంటాయి. జ్ఞానాన్ని పగలు అని, అజ్ఞానాన్ని రాత్రి అని అంటారు. అపారమైన ప్రకాశము మరియు ఘోర అంధకారమని అంటారు. ప్రకాశము అనగా ఉన్నతి, అంధకారమనగా పతనము. మనుష్యులు సూర్యాస్తమయాన్ని చూడడానికి సన్ సెట్ పాయింటు వద్దకు వెళ్తారు. ఇప్పుడది హద్దు విషయము. దీనిని బ్రహ్మా యొక్క పగలు, బ్రహ్మా యొక్క రాత్రి అని అంటారు. ఇప్పుడు బ్రహ్మా అయితే ప్రజాపిత కావున తప్పకుండా వారు ప్రజలకు పిత అవుతారు. జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చారు, అజ్ఞాన అంధకారము వినాశనమయిందని అంటారు. ఈ విషయాలను ప్రపంచములోనివారెవరూ అర్థం చేసుకోరు. ఇది కొత్త ప్రపంచము కోసం కొత్త జ్ఞానము. హెవెన్ కోసం హెవెన్లీ గాడ్ ఫాదర్ ఇచ్చే జ్ఞానము కావాలి. ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ ఫుల్ అని పాడుతారు కూడా కావున వారు టీచర్ కూడా అయినట్లు. ఫాదర్ ను పతిత-పావనుడు అని అంటారు, ఇంకెవ్వరినీ పతిత-పావనుడు అని అనలేరు. శ్రీకృష్ణుడిని కూడా అలా అనలేరు. ఫాదర్ అయితే అందరికీ ఒక్కరే. శ్రీకృష్ణుడైతే అందరికీ ఫాదర్ కాదు. అతను పెద్దవాడై వివాహము చేసుకున్న తర్వాత, ఒకరిద్దరు పిల్లలకు తండ్రి అవుతారు. రాధా-కృష్ణులను రాకుమారీ, రాకుమారుడు అని అంటారు. వారి స్వయంవరము కూడా ఎప్పుడో జరిగి ఉంటుంది. వివాహము తర్వాతనే తల్లిదండ్రులుగా అవ్వగలరు. కృష్ణుడిని ఎప్పుడూ ఎవ్వరూ వరల్డ్ గాడ్ ఫాదర్ అని అనలేరు. వరల్డ్ గాడ్ ఫాదర్ అని కేవలం నిరాకార తండ్రి ఒక్కరినే అంటారు. గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని శివబాబాను అనలేరు. గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ప్రజాపిత బ్రహ్మా. వారి నుండి వంశవృక్షము వెలువడుతుంది. వారు (శివబాబా) నిరాకార గాడ్ ఫాదర్, నిరాకార ఆత్మలకు తండ్రి. నిరాకార ఆత్మలు ఇక్కడ శరీరములో ఉన్నప్పుడు భక్తి మార్గములో వారిని పిలుస్తారు. మీరు ఈ కొత్త విషయాలన్నింటినీ వింటున్నారు. యథార్థ రీతిలో ఇవి ఏ శాస్త్రాలలోనూ లేవు. తండ్రి అంటారు, నేను సమ్ముఖములో కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. ఇక తర్వాత ఈ జ్ఞానమంతా మాయమైపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే తండ్రి వస్తారో, అప్పుడు యథార్థమైన జ్ఞానాన్ని వినిపిస్తారు. పిల్లలకే సమ్ముఖములో అర్థం చేయించి వారసత్వాన్ని ఇస్తారు. తర్వాత శాస్త్రాలు తయారవుతాయి. అవి యథార్థముగానైతే తయారవ్వవు ఎందుకంటే సత్యమైన ప్రపంచము సమాప్తమై అసత్య ఖండముగా మారిపోతుంది. కనుక ఇక్కడ అసత్యమైన విషయాలే ఉంటాయి ఎందుకంటే దిగే కళే ఉంటుంది. సత్యము ద్వారానైతే ఎక్కే కళ ఏర్పడుతుంది. భక్తి రాత్రి వంటిది, అంధకారములో ఎదురుదెబ్బలు తినవలసి ఉంటుంది. తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. అంతటి ఘోర అంధకారము ఉంటుంది. మనుష్యులకైతే ఏమీ తెలియదు. ప్రతి ముంగిట భ్రమిస్తూ ఉంటారు. ఈ సూర్యునికి కూడా ఉదయించడము మరియు అస్తమించడము ఉంటుంది, పిల్లలు వెళ్ళి దానిని చూస్తూ ఉంటారు. ఇప్పుడైతే పిల్లలైన మీరు జ్ఞాన సూర్యుడు ఉదయించడాన్ని చూడాలి. భారత్ యొక్క ఉన్నతి మరియు భారత్ యొక్క పతనము. సూర్యుడు అస్తమించినట్లుగా, భారత్ కూడా అస్తమిస్తుంది. భారత్ యొక్క నావ కిందకు వెళ్ళిపోతుందని, మళ్ళీ తండ్రి వచ్చి దానికి ముక్తినిచ్చారని సత్యనారాయణుడి కథలో చూపిస్తారు. మీరు ఈ భారత్ కు మళ్ళీ విముక్తిని ఇస్తారు. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీరు ఆహ్వానము కూడా ఇస్తారు. నవ-నిర్మాణ ప్రదర్శనీ అనే పేరు బాగుంది. కొత్త ప్రపంచము ఎలా స్థాపనవుతుంది అన్నది చూపించే ప్రదర్శనీ ఇది. చిత్రాల ద్వారా అర్థం చేయించడము జరుగుతుంది. అదే పేరు కొనసాగడము మంచిది. కొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుంది మరియు ఉన్నతి ఎలా జరుగుతుంది అనేది మీరు చూపిస్తారు. తప్పకుండా పాత ప్రపంచము పతనమవుతుంది, అందుకే ఉన్నతి ఎలా జరుగుతుంది అనేది మీరు చూపిస్తారు. రాజ్యాన్ని తీసుకోవడము మరియు కోల్పోవడము అనేది కూడా ఒక కథ. 5 వేల సంవత్సరాల క్రితం ఏముండేది. సూర్యవంశీయుల రాజ్యముండేదని అంటారు. తర్వాత చంద్రవంశీయుల రాజ్య స్థాపన జరిగింది. వారు ఒకరి నుండి మరొకరు రాజ్యాన్ని తీసుకుంటారు. ఫలానావారి నుండి రాజ్యాన్ని తీసుకున్నట్లుగా చూపిస్తారు. వారు మెట్ల వరుస చిత్రాన్ని ఏమీ అర్థం చేసుకోరు. మీరు బంగారుయుగము నుండి వెండియుగములోకి మెట్లు దిగుతూ వెళ్ళారని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది 84 జన్మల మెట్లు వరుస. మెట్లు దిగవలసి ఉంటుంది, మళ్ళీ ఎక్కవలసి కూడా ఉంటుంది. పతనము యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. భారత్ యొక్క పతనము ఎంత సమయము, ఉన్నతి ఎంత సమయము. భారతవాసుల పతనము మరియు ఉన్నతి. మనుష్యులకు ఉత్సుకతను ఎలా కలిగించాలి అని విచార సాగర మంథనము చేయవలసి ఉంటుంది. అంతేకాక సోదరీ, సోదరులారా, వచ్చి అర్థం చేసుకోండి అన్న ఆహ్వానాన్ని కూడా ఇవ్వాలి. తండ్రి మహిమను ముందుగా తెలియజేయాలి. శివబాబా మహిమను తెలిపే ఒక బోర్డు కూడా ఉండాలి. పతిత-పావనుడు, జ్ఞాన సాగరుడు, పవిత్రతా సాగరుడు, సుఖ-శాంతుల సాగరుడు, సంపద సాగరుడు, సర్వుల సద్గతిదాత, జగత్ పిత, జగత్ శిక్షకుడు, జగత్ గురువు అయిన శివబాబా నుండి మీ సూర్యవంశీ, చంద్రవంశీ వారసత్వాన్ని తీసుకోండి అని బోర్డుపై ఉండాలి. అప్పుడు మనుష్యులకు తండ్రి గురించి తెలుస్తుంది. తండ్రి మహిమ మరియు శ్రీకృష్ణుని మహిమ వేర్వేరు. ఇది మీ బుద్ధిలో కూర్చుని ఉంది. సర్వీసబుల్ పిల్లలు ఎవరైతే ఉంటారో, వారు రోజంతా పరుగులు పెడుతూ ఉంటారు. తమ లౌకిక ఉద్యోగము ఉన్నప్పటికీ, సెలవు తీసుకుని సేవలో నిమగ్నమవుతారు. ఇది ఉన్నదే ఈశ్వరీయ గవర్నమెంట్. విశేషముగా కుమార్తెలు, ఒకవేళ ఇటువంటి సేవలో నిమగ్నమైనట్లయితే, ఎంతో పేరును తీసుకురాగలరు. సర్వీసబుల్ పిల్లలకు పాలన అయితే మంచి రీతిలో జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే శివబాబా భండారా నిండుగా ఉంటుంది. ఏ భండారా నుండైతే తిన్నారో, ఆ భండారా నిండుగా, కాల కంటకాలకు దూరముగా ఉంటుంది. మీరు శివ వంశీయులు. వారు రచయిత, ఇది వారి రచన. ‘బాబుల్’ (తండ్రి) అనే పేరు చాలా మధురమైనది. శివుడు ప్రియుడు కూడా కదా. శివబాబా మహిమయే వేరు. నిరాకారుడు అనే పదం వ్రాయడము వలన, వారికి ఎటువంటి ఆకారము లేదని భావిస్తారు. అత్యంత ప్రియమైనవారు శివబాబా - పరమప్రియుడు అని తప్పకుండా వ్రాయాలి. ఈ సమయములో వాళ్ళు కూడా యుద్ధ మైదానములో ఉన్నారు మరియు మీరు కూడా యుద్ధ మైదానములో ఉన్నారు. శివశక్తులు అహింసకులని అంటూ ఉంటారు. కానీ చిత్రాలలో దేవీలకు కూడా ఆయుధాలను చూపించి హింసను చూపించారు. వాస్తవానికి మీరు యోగబలము లేక స్మృతిబలము ద్వారా విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారు. ఆయుధాలు మొదలైనవాటి మాటే లేదు. గంగ యొక్క ప్రభావము చాలా ఉంది. చాలామందికి సాక్షాత్కారము కూడా జరుగుతుంది. గంగా జలము లభిస్తే ఉద్ధరణ జరుగుతుందని భక్తి మార్గములో భావిస్తారు, అందుకే గుప్త గంగ అని అంటూ ఉంటారు. బాణము వేయగానే గంగ వెలువడిందని అంటారు. గోముఖము నుండి కూడా గంగను చూపిస్తారు. మీరు అడిగితే, గుప్త గంగ వెలువడుతూ ఉందని అంటారు. త్రివేణిలో కూడా సరస్వతిని గుప్తముగా చూపించారు. మనుష్యులైతే ఎన్నో విషయాలను తయారుచేసారు. ఇక్కడైతే ఒకటే విషయము ఉంది. కేవలం అల్ఫ్ (భగవంతుడు), అంతే. అల్లాహ్ వచ్చి బహిష్త్ ను స్థాపన చేస్తారు. ఖుదా హెవెన్ ను స్థాపన చేస్తారు. ఈశ్వరుడు స్వర్గాన్ని స్థాపన చేస్తారు. వాస్తవానికి ఈశ్వరుడైతే ఒక్కరే. వారు తమ-తమ భాషలలో రకరకాల పేర్లు పెట్టుకున్నారు. కానీ అల్లాహ్ నుండి తప్పకుండా స్వర్గ రాజ్యాధికారము లభిస్తుందని భావిస్తారు. ఇక్కడైతే తండ్రి, మన్మనాభవ అని అంటారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వారసత్వము తప్పకుండా గుర్తుకొస్తుంది. స్వర్గము రచయిత యొక్క రచన. రాముడు నరకాన్ని రచించారని అనరు. నిరాకార రచయిత ఎవరు అనేది భారతవాసులకు అసలు తెలియదు. నరకానికి రచయిత రావణుడని, అతడిని కాలుస్తారని మీకు తెలుసు. రావణ రాజ్యములో భక్తి మార్గపు అంటు ఎంత పెద్దది. రావణుడి రూపాన్ని కూడా చాలా భయంకరముగా తయారుచేసారు. రావణుడు మా శత్రువు అని అంటారు కూడా. విస్తారము ఎక్కువగా ఉన్నందుకు, రావణుడి శరీరాన్ని కూడా పెద్దదిగా తయారుచేస్తారు అని తండ్రి దీని అర్థాన్ని తెలియజేసారు. శివబాబా అయితే బిందువు కానీ చిత్రాన్ని పెద్దదిగా తయారుచేసారు. లేదంటే బిందువుకు ఎలా పూజ జరుగుతుంది. పూజారులుగా అయితే అవ్వాలి కదా. ఆత్మ గురించి - భృకుటి మధ్యలో ప్రకాశించే అద్భుతమైన నక్షత్రమని అంటారు. మళ్ళీ ఆత్మయే పరమాత్మ అని అంటారు. అటువంటప్పుడు వారు వేలాది సూర్యుల కన్నా ఎక్కువ తేజోమయముగా ఎలా ఉండగలరు. ఆత్మను వర్ణిస్తారు కానీ అర్థం చేసుకోరు. ఒకవేళ పరమాత్మ వేలాది సూర్యుల కన్నా తేజోమయుడు అయినట్లయితే, వారు ప్రతి ఒక్కరిలోనూ ఎలా ప్రవేశించగలరు. ఇవి ఎంతటి అయథార్థమైన విషయాలు, వీటిని వింటూ ఎలా అయిపోయారు. ఆత్మయే పరమాత్మ అని అంటారు, అదే నిజమైతే తండ్రి రూపము కూడా అలాగే ఉంటుంది కదా, కానీ పూజ కోసం పెద్ద రూపాన్ని తయారుచేసారు. రాతితో ఎంతో పెద్ద-పెద్ద చిత్రాలను తయారుచేస్తారు. గుహలలో పాండవులను పెద్ద-పెద్ద రూపాలలో చూపించారు కానీ ఏమీ తెలియదు. ఇది చదువు. వ్యాపారము మరియు చదువు వేర్వేరు. తండ్రి చదివిస్తారు కూడా, అలాగే వ్యాపారాన్ని కూడా నేర్పిస్తారు. బోర్డుపై కూడా ముందు తండ్రి మహిమ ఉండాలి. తండ్రి యొక్క పూర్తి మహిమను వ్రాయాలి. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో కూడా నంబరువారు పురుషార్థానుసారముగా వస్తాయి, అందుకే మహారథులు, గుర్రపు స్వారీ చేసేవారు అని అంటారు. ఆయుధాలు మొదలైనవాటి విషయమేమీ లేదు. తండ్రి బుద్ధితాళాన్ని తెరుస్తారు. ఈ గోద్రెజ్ తాళాన్ని ఎవరూ తెరవలేరు. తండ్రిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు, బాబా పిల్లలను అడుగుతారు - ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా, ఇదే స్థానములో, ఇదే రోజున ఎప్పుడు కలిశారు? అప్పుడు పిల్లలు - అవును బాబా, 5 వేల సంవత్సరాల క్రితం కలిసాము అని అంటారు. ఇప్పుడు ఈ విషయాలను ఇలా ఎవరూ అడగలేరు. ఇవి ఎంత గుహ్యమైన, అర్థం చేసుకోవలసిన విషయాలు. బాబా జ్ఞానానికి చెందిన యుక్తులను ఎన్ని అర్థం చేయిస్తారు. కానీ ధారణ నంబరువారుగా జరుగుతుంది. శివబాబా మహిమ వేరు, బ్రహ్మా-విష్ణు-శంకరుల మహిమ వేరు. ప్రతి ఒక్కరి పాత్ర వేర్వేరుగా ఉంటుంది. ఒకరి పాత్ర మరొకరి పాత్రతో కలవదు. ఇది అనాది డ్రామా. ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. మనము మూలవతనానికి ఎలా వెళ్తాము, మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఎలా వస్తాము అనేది ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుని ఉంది. వెళ్ళే సమయములో వయా సూక్ష్మవతనము వెళ్తాము కానీ పై నుండి కిందకు వచ్చే సమయములో సూక్ష్మవతనము ఉండదు. సూక్ష్మవతనము యొక్క సాక్షాత్కారము ఎప్పుడూ ఎవరికీ కలగనే కలగదు. సూక్ష్మవతనము యొక్క సాక్షాత్కారము కోసం ఎవరూ తపస్య చేయరు ఎందుకంటే దాని గురించి ఎవరికీ తెలియదు. సూక్ష్మవతనానికి భక్తులెవరూ ఉండరు. సూక్ష్మవతనాన్ని ఇప్పుడు రచిస్తారు, వయా సూక్ష్మవతనము వెళ్ళి, మళ్ళీ కొత్త ప్రపంచములోకి వస్తారు. ఈ సమయములో మీరు అక్కడికి వెళ్తూ-వస్తూ ఉంటారు. మీ నిశ్చితార్థము జరిగింది, ఇది పుట్టినిల్లు. విష్ణువును తండ్రి అని అనరు. అది అత్తవారిల్లు. కన్య అత్తవారింటికి వెళ్ళినప్పుడు, పాత వస్త్రాలన్నింటినీ వదిలి వెళ్తుంది. మీరైతే పాత ప్రపంచాన్నే వదిలేస్తారు. మీ వనవాహానికి మరియు వారి వనవాహానికి ఎంత తేడా ఉంది. మీరు కూడా చాలా అనాసక్తులుగా ఉండాలి, దేహాభిమానాన్ని వదిలివేయాలి. ఖరీదైన చీరను ధరించినట్లయితే వెంటనే దేహాభిమానము వచ్చేస్తుంది. నేను ఆత్మను అన్నది మర్చిపోతారు. ఈ సమయములో మీరు వనవాహములోనే ఉన్నారు. వనవాహము మరియు వానప్రస్థము, రెండూ ఒక్కటే. శరీరాన్నే వదిలేయాలి అన్నప్పుడు చీరను వదలరా. మామూలు చీర లభించినట్లయితే, మనసు చిన్నబుచ్చుకుంటారు. కానీ వాస్తవానికి ఇందులో సంతోషపడాలి, మామూలు వస్త్రము లభించడము ఎంతో మంచిది. మంచి వస్తువులనైతే సంభాళించవలసి ఉంటుంది. ఇవి ధరించాలి, ఇవి తినాలి అనే చిన్న-చిన్న విషయాలు కూడా ఉన్నత గమ్యాన్ని చేరుకోవడములో ఆటంకాలను కలిగిస్తాయి. గమ్యము చాలా పెద్దది. కథలో కూడా వినిపిస్తారు కదా - ఈ చేతికర్రను కూడా వదిలేయండి అని పతికి చెప్పినట్లుగా చూపిస్తారు. తండ్రి అంటారు - ఈ పాత వస్త్రము, పాత ప్రపంచము, అన్నీ సమాప్తమవ్వనున్నాయి, అందుకే ఈ మొత్తము ప్రపంచమంతటి నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి, దీనిని అనంతమైన సన్యాసమని అంటారు. సన్యాసులైతే హద్దు సన్యాసము చేసారు, ఇప్పుడు వారు మళ్ళీ లోపల నగరాలలోకి వచ్చేసారు. ఇంతకుముందు వారిలో చాలా శక్తి ఉండేది. దిగజారేవారికి మహిమ ఏముంటుంది. చివరివరకు కొత్త-కొత్త ఆత్మలు కూడా పాత్రను అభినయించేందుకు వస్తూనే ఉంటారు, వారిలో ఎంత శక్తి ఉంటుంది. మీరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఇవన్నీ అర్థం చేసుకునేందుకు ఎంత మంచి బుద్ధి కావాలి. సర్వీసబుల్ పిల్లలు సేవలో ఉత్సాహముతో ఉంటారు. బాబా ఏ విధముగా ఉత్సాహముతో ఉంటారో, అదే విధముగా జ్ఞానసాగరుని పిల్లలు కూడా భాషణ చేయాలి, ఇందులో నిరుత్సాహపడకూడదు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. బుద్ధితో అనంతమైన సన్యాసము చేయాలి. ఇది తిరిగి ఇంటికి వెళ్ళే సమయము, అందుకే పాత ప్రపంచము మరియు పాత శరీరము నుండి అనాసక్తులుగా ఉండాలి. 2. డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని చూస్తూ సదా హర్షితముగా ఉండాలి. వరదానము:-బాప్ దాదాను మీ సహచరుడిగా భావిస్తూ డబుల్ ఫోర్సుతో కార్యము చేసే సహజయోగీ భవ ఏ కార్యము చేస్తున్నా సరే, బాప్ దాదాను మీ సహచరునిగా చేసుకోండి, అప్పుడు డబుల్ ఫోర్సుతో కార్యము జరుగుతుంది మరియు స్మృతి కూడా చాలా సహజముగా ఉంటుంది ఎందుకంటే ఎవరైతే సదా తోడుగా ఉంటారో వారి స్మృతి స్వతహాగా నిలిచి ఉంటుంది. కనుక ఈ విధముగా సహచరులుగా ఉన్నట్లయితే మరియు బుద్ధి ద్వారా నిరంతరము ఆ సత్యమైనవారి సాంగత్యము చేసినట్లయితే సహజయోగులుగా అవుతారు మరియు శక్తిశాలి సాంగత్యము ఉన్న కారణముగా ప్రతి కర్తవ్యములోనూ మీకు డబుల్ ఫోర్సు ఉంటుంది, తద్వారా ప్రతి కార్యములోనూ సఫలత అనుభూతి అవుతుంది. స్లోగన్:-ఎవరైతే ఎప్పుడూ మాయ ప్రభావములో పరవశమవ్వరో, వారు మహారథులు.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చెయ్యండి’’ మధురతయే బ్రాహ్మణ జీవితము యొక్క మహానత. ఎక్కడైతే మధురత ఉంటుందో, అక్కడ పవిత్రత ఉంటుంది. పవిత్రత లేకుండా మధురత రాదు. ఎంతగా బుద్ధిలో నషా ఉంటుందో, అంతగానే కర్మలలో నమ్రత మరియు మాటలలో మధురత ఉండాలి. ఇటువంటి నషాలో ఉన్నట్లయితే ఎప్పుడూ నష్టము జరగదు. సిద్ధిని ప్రాప్తి చేసుకున్నవారు స్వయాన్ని నమ్రచిత్తులుగా, నిర్మానులుగా, ప్రతి విషయములోనూ తమను తాము గుణగ్రాహకులుగా మరియు మధురతా సంపన్నులుగా తయారుచేసుకుంటారు. "
v. v. guptha
1.1K views
8 days ago
#📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి 07-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - మీకు ఎప్పుడు సమయము లభించినా, ఏకాంతములో కూర్చుని సత్యమైన ప్రియుడిని స్మృతి చేయండి ఎందుకంటే స్మృతి ద్వారానే స్వర్గము యొక్క రాజ్యాధికారము లభిస్తుంది’’ ప్రశ్న:-బాబా లభించారు కావున ఏ నిర్లక్ష్యము సమాప్తమైపోవాలి? జవాబు:-కొంతమంది పిల్లలు నిర్లక్ష్యముతో - మేము ఎలాగూ బాబాకు చెందినవారిమే కదా అని అంటారు. స్మృతి యొక్క కృషి చేయరు. పదే-పదే స్మృతిని మర్చిపోతారు. ఇదే నిర్లక్ష్యము. బాబా అంటారు - పిల్లలూ, ఒకవేళ స్మృతిలో ఉన్నట్లయితే లోలోపల స్థిరమైన సంతోషము ఉంటుంది. ఏ రకమైన ఇబ్బంది కలగదు. ఏ విధముగా బంధనములో ఉన్నవారు స్మృతిలో తపిస్తూ ఉంటారో, రాత్రింబవళ్ళు స్మృతి చేస్తూ ఉంటారో, అదే విధముగా మీకు కూడా నిరంతరము స్మృతి ఉండాలి. పాట:-భాగ్యాన్ని మేలుకొలుపుకుని వచ్చాను... ఓంశాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయించారు - మీరు కూడా, ఓం శాంతి అని అంటారు, తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు అనగా ఆత్మలైన మీరు శాంతి స్వరూపులు, తండ్రి కూడా శాంతి స్వరూపుడు. ఆత్మ స్వధర్మము శాంతి, పరమాత్ముని స్వధర్మము కూడా శాంతి. మీరు కూడా శాంతిధామ నివాసులు. తండ్రి కూడా అంటారు - నేనూ అక్కడి నివాసినే. పిల్లలైన మీరు పునర్జన్మలలోకి వస్తారు, నేను రాను. నేను ఈ రథములో ప్రవేశిస్తాను, ఇది నా రథము. ఒకవేళ శంకరుడిని అడిగినట్లయితే, వాస్తవానికి అడగలేరు, కానీ ఒకవేళ ఎవరైనా సూక్ష్మవతనానికి వెళ్ళి అడిగినట్లయితే, శంకరుడు - ఈ సూక్ష్మ శరీరము నాది అని అంటారు. శివబాబా అంటారు - ఇది నా శరీరము కాదు, నేను దీనిని అప్పుగా తీసుకున్నాను ఎందుకంటే నాకు కూడా కర్మేంద్రియాల ఆధారము కావాలి. మొట్టమొదట - పతిత-పావనుడు, జ్ఞానసాగరుడు శ్రీకృష్ణుడు కాదు అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. శ్రీకృష్ణుడు సర్వాత్మలను పతితము నుండి పావనముగా చేయరు, వారు వచ్చి పావన ప్రపంచములో రాజ్యము చేస్తారు. ముందు రాకుమారుడిగా అవుతారు, ఆ తర్వాత మహారాజుగా అవుతారు. అతనిలో కూడా ఈ జ్ఞానము లేదు. రచన యొక్క జ్ఞానమైతే రచయితలోనే ఉంటుంది కదా. శ్రీకృష్ణుడిని రచన అని అంటారు. రచయిత అయిన తండ్రియే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. ఇప్పుడు తండ్రి రచిస్తున్నారు, మీరు నా పిల్లలు అని అంటారు. మీరు కూడా - బాబా, మేము మీ వారము అని అంటారు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణుల స్థాపన అని కూడా అంటారు. లేదంటే బ్రాహ్మణులు ఎక్కడ నుండి వచ్చారు. సూక్ష్మవతనములోని బ్రహ్మా వేరే ఎవరో కాదు. పైనున్న వారే కిందనున్న వారు, కిందనున్న వారే పైనున్న వారు. ఇరువురూ ఒక్కరే. అచ్ఛా, విష్ణువు మరియు లక్ష్మీ-నారాయణులు కూడా ఒక్కరే. వారు ఎక్కడివారు? బ్రహ్మాయే విష్ణువుగా అవుతారు. బ్రహ్మా-సరస్వతులే లక్ష్మీ-నారాయణులుగా అవుతారు, మళ్ళీ వారే మొత్తం కల్పములో 84 జన్మలు తీసుకున్న తర్వాత సంగమములో బ్రహ్మా-సరస్వతులుగా అవుతారు. లక్ష్మీ-నారాయణులు కూడా మనుష్యులే, వారిది దేవీ-దేవతా ధర్మము. విష్ణువుకు కూడా 4 భుజాలను చూపించారు. ప్రవృత్తి మార్గానికి గుర్తుగా అలా చూపించారు. భారత్ లో ప్రారంభము నుండే ప్రవృత్తి మార్గము కొనసాగుతూ వస్తుంది, అందుకే విష్ణువుకు 4 భుజాలను చూపించారు. ఇక్కడ బ్రహ్మా-సరస్వతులు ఉన్నారు. ఈ సరస్వతి దత్త పుత్రిక. వారి అసలు పేరు లఖీరాజ్, తర్వాత వారికి బ్రహ్మా అని పేరు పెట్టారు. శివబాబా వీరిలో ప్రవేశించారు మరియు రాధను తమవారిగా చేసుకున్నారు, సరస్వతి అని పేరు పెట్టారు. సరస్వతికి బ్రహ్మా లౌకిక తండ్రి ఏమీ కాదు. వీరిరువురికీ తమ-తమ లౌకిక తండ్రులు ఉండేవారు, ఇప్పుడు ఆ తండ్రులు లేరు. ఈ శివబాబా బ్రహ్మా ద్వారా దత్తత తీసుకున్నారు. మీరు దత్తత తీసుకోబడిన పిల్లలు. బ్రహ్మా కూడా శివబాబా కుమారుడు. బ్రహ్మా ముఖకమలము ద్వారా రచిస్తారు కావున బ్రహ్మాను కూడా తల్లి అని అంటారు. మీరు తల్లి-తండ్రి, మేము మీ పిల్లలము, మీ కృపతో అపారమైన సుఖము లభిస్తుంది... అని పాడుతారు కదా. బ్రాహ్మణులైన మీరు వచ్చి పిల్లలుగా అయ్యారు. ఇది అర్థం చేసుకోవడానికి చాలా మంచి బుద్ధి కావాలి. పిల్లలైన మీరు శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. బ్రహ్మా ఏమీ స్వర్గ రచయిత లేక జ్ఞానసాగరుడు కాదు. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. ఆత్మకు తండ్రియే జ్ఞానసాగరుడు. ఆత్మ కూడా జ్ఞానసాగరునిగా అవుతుంది కానీ ఆత్మను జ్ఞానసాగరుడు అని అనరు ఎందుకంటే సాగరుడు ఒక్కరే ఉంటారు. మీరందరూ నదులు. సాగరుడికి తన శరీరమంటూ ఏమీ లేదు, నదులకు శరీరాలు ఉన్నాయి. మీరు జ్ఞాన నదులు. కలకత్తాలోని బ్రహ్మాపుత్ర నది చాలా పెద్దది, ఎందుకంటే దానికి సాగరముతో కనెక్షన్ ఉంది. అక్కడ చాలా పెద్ద మేళా జరుగుతుంది. ఇక్కడ కూడా మేళా జరుగుతుంది. సాగరుడు మరియు బ్రహ్మాపుత్ర, ఇరువురూ కలిసి ఉన్నారు. ఈ మేళా చైతన్యమైనది, అది జడమైనది. ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. శాస్త్రాలు భక్తి మార్గపు డిపార్టుమెంట్. ఇది జ్ఞాన మార్గము, అది భక్తి మార్గము. అర్ధకల్పము భక్తి మార్గపు డిపార్టుమెంట్ నడిచింది. అందులో జ్ఞానసాగరుడు లేరు. పరమపిత పరమాత్మ, జ్ఞానసాగరుడైన తండ్రి సంగమములో వచ్చి జ్ఞాన స్నానముతో అందరికీ సద్గతినిస్తారు. మనము అనంతమైన తండ్రి ద్వారా స్వర్గ సుఖాల భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నామని మీకు తెలుసు. తప్పకుండా మనము సత్య, త్రేతాయుగాలలో పూజ్య దేవీ-దేవతలుగా ఉండేవారము. ఇప్పుడు మనము పూజారి మనుష్యులుగా ఉన్నాము. మీరు మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. బ్రాహ్మణుల నుండి దేవతా ధర్మములోకి వచ్చారు, తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యారు. 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ కిందకు దిగవలసి వచ్చింది. ఇది కూడా తండ్రి మీకు తెలియజేశారు. ఇంతకుముందు మీకు మీ జన్మల గురించి తెలియదు. 84 జన్మలను కూడా మీరే తీసుకుంటారు. ఎవరైతే మొట్టమొదట వస్తారో, వారే పూర్తి 84 జన్మలను తీసుకుంటారు. యోగముతోనే మాలిన్యము తొలగుతుంది, యోగములోనే శ్రమ ఉంది. కొంతమంది పిల్లలు జ్ఞానములో చురుకుగా ఉన్నారు కానీ యోగములో కచ్చాగా ఉన్నారు. బంధనములో ఉన్న కుమార్తెలు యోగము విషయములో బంధనములేనివారి కన్నా బాగున్నారు. వారు శివబాబాను కలుసుకునేందుకు రాత్రింబవళ్ళు తపిస్తూ ఉంటారు కానీ మీరైతే బాబాను కలుసుకున్నారు. మీకు, స్మృతి చేయండి అని చెప్పడము జరుగుతుంది, అయినా మీరు పదే-పదే మర్చిపోతూ ఉంటారు. మీకు తుఫానులు చాలా వస్తాయి. వారు స్మృతిలో తపిస్తూ ఉంటారు. మీరు తపించరు. వారు ఇంటిలో కూర్చుని ఉన్నా కానీ వారికి ఉన్నత పదవి లభిస్తుంది. బాబా స్మృతిలో ఉండటము ద్వారా మనకు స్వర్గ రాజ్యాధికారము లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. ఏ విధముగా ఒక బిడ్డ గర్భము నుండి బయటకు రావడానికి తపిస్తాడో, అదే విధముగా బంధనములో ఉన్న కుమార్తెలు - శివబాబా, ఈ బంధనము నుండి బయటకు తీయండి అని తపిస్తూ-తపిస్తూ పిలుస్తూ ఉంటారు, రాత్రింబవళ్ళు స్మృతి చేస్తూ ఉంటారు. మీకు తండ్రి లభించారు, మీరు నిర్లక్ష్యులుగా అయిపోయారు. మనము బాబా పిల్లలము, మనము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి రాకుమారులుగా అవుతాము అని లోలోపల ఈ స్థిరమైన సంతోషము ఉండాలి. కానీ మాయ స్మృతిని నిలవనివ్వదు. స్మృతి వలన చాలా సంతోషముగా ఉంటారు. స్మృతి చేయకపోతే ఇబ్బందులు పడుతూ ఉంటారు. అర్ధకల్పము మీరు రావణ రాజ్యములో దుఃఖాన్ని చూసారు. అకాల మృత్యువులు జరుగుతూ వచ్చాయి. దుఃఖమైతే ఎలాగూ ఉండనే ఉంది. ఎంతటి షావుకారులైనా కానీ దుఃఖమైతే ఉంటుంది. అకాల మృత్యువు జరుగుతుంది. సత్యయుగములో ఇలాంటి అకాల మృత్యువులు సంభవించవు. ఎప్పుడూ రోగగ్రస్థులుగా అవ్వరు. సమయము వచ్చినప్పుడు తమకు తామే, కూర్చుని-కూర్చునే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. దాని పేరే సుఖధామము. మనుష్యులైతే స్వర్గము యొక్క విషయాలను ఊహ అని భావిస్తారు. స్వర్గము ఎక్కడ నుండి వచ్చింది అని అంటారు. మనమైతే స్వర్గములో ఉండేవారమని, తర్వాత 84 జన్మలు తీసుకుంటామని మీకు తెలుసు. ఈ ఆట అంతా భారత్ పైనే తయారుచేయబడి ఉంది. మనము 21 జన్మలు పావన దేవతలుగా ఉండేవారమని, ఆ తర్వాత మనము క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యామని, ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యామని మీకు తెలుసు. ఈ స్వదర్శన చక్రము చాలా సులభమైనది. దీనిని శివబాబా కూర్చుని అర్థం చేయిస్తారు. శివబాబా బ్రహ్మా రథములోకి వచ్చారని మీకు తెలుసు. ఎవరైతే బ్రహ్మాగా ఉన్నారో, వారే సత్యయుగము ఆదిలో శ్రీకృష్ణునిగా ఉండేవారు. వారు 84 జన్మలు తీసుకుని పతితముగా అయ్యారు, మళ్ళీ వారిలో తండ్రి ప్రవేశించి దత్తత తీసుకున్నారు. తండ్రి స్వయముగా అంటున్నారు - నేను ఈ తనువును ఆధారముగా తీసుకుని మిమ్మల్ని నా వారిగా చేసుకున్నాను, తర్వాత మిమ్మల్ని స్వర్గ రాజధానికి యోగ్యులుగా తయారుచేస్తాను. ఎవరైతే యోగ్యులుగా అవుతారో, వారే రాజ్యములోకి వస్తారు. దీని కోసం మంచి మ్యానర్స్ కావాలి. ముఖ్యమైనది పవిత్రత. ఈ విషయములోనే అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. అక్కడక్కడ పురుషులపై కూడా అత్యాచారాలు జరుగుతాయి. వికారాల కోసం ఒకరినొకరు విసిగించుకుంటారు. ఇక్కడ మాతలు ఎక్కువమంది ఉన్న కారణముగా శక్తి సైన్యమనే పేరు గాయనము చేయబడింది, వందే మాతరమ్. ఇప్పుడు మీరు కామ చితి నుండి దిగి సుందరముగా అయ్యేందుకు జ్ఞాన చితిపై కూర్చున్నారు. ద్వాపరము నుండి మొదలుకుని కామ చితిపై కూర్చున్నారు. ఒకరికొకరు వికారాలను ఇచ్చుకునే బంధాన్ని వికారీ బ్రాహ్మణులు ముడి వేస్తారు. మీరు నిర్వికారీ బ్రాహ్మణులు. మీరు ఆ బంధాన్ని క్యాన్సిల్ చేసి జ్ఞాన చితిపై కూర్చోబెడతారు. కామ చితి వలన నల్లగా అయిపోయారు, జ్ఞాన చితి వలన సుందరముగా తయారవుతారు. తండ్రి అంటారు, మీరు కలిసే ఉండండి కానీ మేము వికారాలలోకి వెళ్ళము అన్న ప్రతిజ్ఞను చేయండి, అందుకే బాబా ఉంగరాన్ని కూడా ధరింపజేస్తారు. శివబాబా, తండ్రి కూడా, ప్రియుడు కూడా, వారు సీతలందరికీ రాముడు. వారే పతిత-పావనుడు. అంతేకానీ రఘుపతి రాఘవ రాజా రాముడి విషయము కాదు, వారు సంగమములోనే ఈ ప్రారబ్ధాన్ని పొందారు. అతనికి హింసాత్మక బాణాలను చూపించడము తప్పు. చిత్రములో కూడా అలా చూపించకూడదు. కేవలం చంద్రవంశీ అని వ్రాయాలి. శివబాబా వీరి ద్వారా మనకు ఈ చక్రము యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి. సత్యనారాయణుని కథ ఉంటుంది కదా, అది మనుష్యులు తయారుచేసిన కథ. (ఆ కథ ద్వారా) ఎవరూ నరుని నుండి నారాయణునిగా అవ్వరు. సత్యనారాయణుని కథ యొక్క అర్థమే నరుని నుండి నారాయణునిగా అవ్వడము. అమరకథను కూడా వినిపిస్తారు కానీ దాని ద్వారా అమరపురిలోకైతే ఎవరూ వెళ్ళరు. మృత్యులోకము 2500 సంవత్సరాలు కొనసాగుతుంది. మూడవ నేత్రము యొక్క కథను మాతలు వింటారు. వాస్తవానికి అది జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చే కథ. ఇప్పుడు జ్ఞానమనే మూడవ నేత్రము ఆత్మకు లభించింది కావున ఆత్మాభిమానులుగా అవ్వాలి. నేను ఈ శరీరము ద్వారా ఇప్పుడు దేవతగా అవుతాను, నాలోనే ఈ సంస్కారాలు ఉన్నాయి. మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. తండ్రి వచ్చి దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. మనుష్యులు ఆత్మ-పరమాత్మ ఒక్కటేనని, పరమాత్మయే ఈ రూపాలన్నింటినీ ధారణ చేసారని అంటారు. తండ్రి అంటారు, అదంతా రాంగ్, దానిని మిథ్యా అభిమానము, మిథ్యా జ్ఞానము అని అంటారు. నేను బిందువు వలె ఉంటానని బాబా అంటున్నారు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు, ఇతనికి కూడా తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇందులో సంశయము కలగకూడదు, నిశ్చయముండాలి. బాబా తప్పకుండా సత్యాన్నే వినిపిస్తారు. సంశయబుద్ధి వినశ్యంతి. అటువంటివారు పూర్తి వారసత్వాన్ని పొందలేరు. ఆత్మాభిమానులుగా అవ్వడములోనే శ్రమ ఉంది. భోజనము తయారుచేస్తున్నప్పుడు, బుద్ధి తండ్రి వైపు జోడించబడి ఉండాలి. ప్రతి విషయములోనూ ఇది ప్రాక్టీస్ చేయాలి. రోటీ తయారుచేస్తూ తమ ప్రియుడిని స్మృతి చేస్తూ ఉండాలి - ఈ అభ్యాసము ప్రతి విషయములోనూ చేయాలి. ఎంత సమయము తీరిక లభిస్తే అంత సమయము స్మృతి చేయాలి. స్మృతితోనే మీరు సతోప్రధానముగా అవుతారు. 8 గంటలు కర్మల కోసం అనుమతి ఉంది. కర్మల మధ్యలో కూడా ఏకాంతములోకి వెళ్ళి కూర్చోవాలి. మీరు అందరికీ బాబా పరిచయాన్ని కూడా వినిపించాలి. ఈ రోజు వినకపోతే రేపు వింటారు. తండ్రి స్వర్గ స్థాపనను చేస్తారు. మనము స్వర్గములో ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ నరకవాసులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ తండ్రి నుండి వారసత్వము లభించాలి. తండ్రి భారతవాసులకే అర్థం చేయిస్తారు. తండ్రి రావడము కూడా భారత్ లోనే వస్తారు. చూడండి, మీ వద్దకు ముసల్మానులు కూడా వస్తారు, వారు కూడా సెంటర్లను సంభాళిస్తారు. వారూ శివబాబాను స్మృతి చేయండి అని చెప్తారు. సిక్కులు కూడా వస్తారు, క్రిస్టియన్లు కూడా వస్తారు, మున్ముందు చాలామంది వస్తారు. ఈ జ్ఞానము అందరి కోసము ఉంది ఎందుకంటే ఇది ఉన్నదే సహజమైన స్మృతి మరియు తండ్రి యొక్క సహజమైన వారసత్వము. కానీ పవిత్రముగా అయితే తప్పకుండా అవ్వవలసి ఉంటుంది. దానమిచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుంది. ఇప్పుడు భారత్ పై రాహు గ్రహణముంది, తర్వాత 21 జన్మల కోసం బృహస్పతి దశ ప్రారంభమవుతుంది. ముందు బృహస్పతి దశ ఉంటుంది, ఆ తర్వాత శుక్ర దశ ఉంటుంది. సూర్యవంశీయులపై బృహస్పతి దశ ఉంటుందని, చంద్రవంశీయులపై శుక్ర దశ ఉంటుందని అంటారు. ఆ తర్వాత దశలు తగ్గిపోతూ ఉంటాయి. అన్నింటికన్నా చెడ్డది రాహు దశ. బృహస్పతి అంటే గురువెవరో కాదు. ఇది వృక్షపతి దశ. వృక్షపతి అయిన తండ్రి వచ్చినప్పుడు బృహస్పతి దశ మరియు శుక్ర దశ ఉంటాయి. రావణుడు వచ్చినప్పుడు రాహు దశ ఉంటుంది. పిల్లలైన మీపై ఇప్పుడు బృహస్పతి దశ కూర్చుంటుంది. కేవలం వృక్షపతిని స్మృతి చేయండి, పవిత్రముగా అవ్వండి, అంతే. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. ప్రతి కార్యము చేస్తూ ఆత్మాభిమానులుగా అయ్యే ప్రాక్టీస్ చేయాలి. దేహ అహంకారము సమాప్తమైపోవాలి, దీని కోసమే కృషి చేయాలి. 2. సత్యయుగీ రాజ్యానికి యోగ్యులుగా అయ్యేందుకు మీ మ్యానర్స్ ను రాయల్ గా తయారుచేసుకోవాలి. పవిత్రతయే అన్నింటికన్నా ఉన్నతమైన నడవడిక. పవిత్రముగా అవ్వడము ద్వారానే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. వరదానము:-చేసేవారు మరియు చేయించేవారి స్మృతి ద్వారా సహజయోగాన్ని అనుభవము చేసే సఫలతామూర్త భవ ఏ కార్యము చేస్తున్నా సరే ఇదే స్మృతి ఉండాలి - ఈ కార్యానికి నిమిత్తులుగా చేసిన వెన్నెముక ఎవరు? వెన్నెముక లేకుండా ఏ కర్మలోనూ సఫలత లభించదు. అందుకే ఏ కార్యము చేస్తున్నా సరే - నేను నిమిత్తుడిని, చేయించేవారు స్వయముగా సర్వ సమర్థుడైన తండ్రి - దీనిని స్మృతిలో ఉంచుకుని కర్మలు చేసినట్లయితే సహజయోగము యొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఈ సహజయోగము అక్కడ సహజముగా రాజ్యం చేయిస్తుంది. ఇక్కడి సంస్కారాలను అక్కడికి తీసుకువెళ్తారు. స్లోగన్:-కోరికలు నీడ వంటివి, మీరు వెన్ను చూపిస్తే అవి మీ వెనుక-వెనుకే వస్తూ ఉంటాయి.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ మధురత ఎటువంటి విశేష ధారణ అంటే అది చేదు భూమిని కూడా మధురముగా తయారుచేస్తుంది. మీరందరూ పరివర్తన అయ్యేందుకు ఆధారము - బాబా యొక్క రెండు మధురమైన మాటలు. మధురమైన పిల్లలూ, మీరు మధురమైన శుద్ధమైన ఆత్మలు, ఈ రెండు మధురమైన మాటలే మార్చేశాయి. మధురమైన దృష్టియే మార్చివేసింది. అదే విధముగా మధురత ద్వారా ఇతరులను కూడా మధురముగా తయారుచేయండి. ఈ నోటిని తీపి చేయండి. సదా ఈ మధురత అనే కానుకను తోడుగా ఉంచుకోండి, దీని ద్వారానే సదా మధురముగా ఉంటారు మరియు మధురముగా తయారుచేస్తారు. "