Follow
Manasa
@372209630
894
Posts
887
Followers
Manasa
1K views
4 days ago
#✌️నేటి నా స్టేటస్ #🌅శుభోదయం శ్రీ గురుభ్యోనమః🙏 🌹పంచాంగం🌹 శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు, తేది ... 22 - 4 - 2026, వారం ... సౌమ్య వాసరే (బుధ వారము), శ్రీపరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్ల పక్షం, తిధి : పంచమి ఉ 6.11 వరకు షష్టి తె 3.54 వరకు నక్షత్రం : ఆర్ద్ర తె 3.07 వరకు తదుపరి పునర్వసు యోగం: అతిగండం మ 1.48 వరకు తదుపరి సుకర్మం కరణం : బాలువ ఉ 6.11 వరకు కౌలువ సా 5.03 వరకు తైతుల తె 3.54 వరకు వర్జ్యం : మ 12.31 - 2.01 వరకు దుర్ముహూర్తం : ఉ 11.33 - 12.23 వరకు అమృతకాలం : సా 5.45 - 7.15 వరకు రాహుకాలం : మ 12.00 - 1.30 వరకు యమగండం : ఉ 7.30 - 9.00 వరకు సూర్యరాశి : మేషం చంద్రరాశి : మిథునం సూర్యోదయం : 5.46 సూర్యాస్తమయం:6.12 *నేటి విశేషం* శ్రీశంకర జయంతి, శ్రీరామానుజ జయంతి, శ్రీవిద్యారణ్య జయంతి. *నేటి మాట* ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మాణేినమః గురుచరిత్ర - 81 శ్రీగురువులు గంగాతీరమున ప్రాణము విడుచుటకు సిద్ధపడిన బ్రాహ్మణుని చూసినారు. ఆ బ్రాహ్మణుడు, ఈ అసారమైన సంసారము నందు నా వంటి పాపాత్ముడు జీవింపరాదు. అన్నము లేనిదే జీవితము ఎట్లు గడపగలను? ఎట్లు ఉండెదను? అన్నంతో నాకు వైరము అయ్యెను. ఇక మరణమే శరణ్యము. అని నిశ్చయించుకొని, ఆ బ్రాహ్మణుడు గంగాజలమున ప్రవేశించుటకు ముందు కంఠమునకు ఒక బండరాయిని కట్టుకొని నిట్టూర్చుచూ, కర్పూరగౌరుని స్మరించుచూ, పూర్వజన్మ యందును, ఈ జన్మ యందును అన్నదానము మొదలైన పుణ్యకార్యములు నేనేమీ చేయలేదు. పుణ్యఫలం లేకపోవుట సరికదా, పూర్వార్జితమైన పాపఫలమే ఉన్నది. ఎవరైనా విప్రుని గ్రాసమునో, లేదా గోవు యొక్క గ్రాసమునో హరించి ఉంటిని కాబోలు. లేదంటే ఏదయినా విశ్వాసఘాతకత్వమునకు ఈ ఫలము వచ్చినదో! ఈశ్వరుని పూజింపలేదు. సద్గురువును నిందించి ఉంటినేమో! పితరులను అవమానించి ఉంటినో! అందువలన పూర్వార్జితమైన ఈ కష్టమే మిగిలిఉన్నది. గృహమునకు వచ్చిన విప్రులను అవమానించి ఉంటినేమో! పూర్వజన్మలో అతిథులకు ఎవరికి భోజనము పెట్టలేదేమో! ఏ వధూవరులను హత్య చేసి ఉంటినేమో! అడవికి నిప్పు అంటించి ఉంటినేమో! తల్లిదండ్రులను ఆదరింపక, వారిని పస్తులు ఉంచి, ఇష్టాన్నమును భార్యాపుత్రులతో తిని ఉంటినేమో! అందుచేతనే ఇట్టి పూర్వజన్మార్జిత పాపములు ఈ జన్మలో బాధించుచున్నవి. ఈ విధముగా ఆ విప్రుడు తలంచుచూ, గౌతమీ నదీ జలములో ప్రవేశించినాడు. ఈ విధముగా నిమగ్నుడైన బ్రాహ్మణుని చూసి, శ్రీగురువులు శిష్యులను పిలిచి, వారితో ఆ బ్రాహ్మణుని వెంటనే ఉద్ధరించి తీసుకొని రండి. ఆత్మహత్య బహుదోషములను కలిగించును. అతడెవరో, ఎందువలన ప్రాణత్యాగం చేయుచున్నాడో తెలుసుకోండి. అని ఆదేశింపగా, శిష్యులు నీట పడిన విప్రుని సలిలము నుండి లేవనెత్తి, గురు సమ్ముఖమునకు తెచ్చినారు. అనాథలకు కల్పతరువు, దుఃఖితులకు దయామయుడు అయిన గురువరుడు, ఓ బ్రాహ్మణా! నీవు ఏల ప్రాణత్యాగం నకు స్వబుద్ధితో తలపడినావు? ఆత్మహత్య మహాదోషము కదా? అనిరి. అప్పుడు ఆ విప్రుడు, ఓ యాతీశ్వరా! నన్ను ఇవన్నీ అడిగి ఏమి చేయుదువు? నా జన్మ వ్యర్ధము. నేను బ్రాహ్మణుడనే. కానీ మాసమునకో, పక్షమునకో భుజించినచో ఉదరము నందు సహింపరాని శూల ఏర్పడును. అది సహింపజాలక ప్రాణములు త్యజింప సమకట్టినాను. శరీరమే అన్నమయము. ఆ అన్నము నాకు వైరి అయినది. గురునాథా! అన్నము లేనిదే జీవించుట ఎట్లో చెప్పుము. అని వేడుకున్నాడు. శ్రీగురువు, నీ బాధ ఒక్క క్షణములో పోగలదు. అట్టి ఔషధమును నీకు చెప్తాను. నీ మనస్సులో సంశయము వీడుము. నీ వ్యాధి భూమిలో కలిసిపోవును. ఇష్ట మృష్టాన్నములు భుజింపుము. అని శ్రీగురువులు ఆనతి ఈయగా, ఆ బ్రాహ్మణుడు మెల్లమెల్లగా మనస్సు చిక్కబట్టుకొని శ్రీగురువు పదములందు శీర్షమును ఉంచి అతడు నమస్కరించినాడు. అదేసమయంలో మరియొక ద్విజుడు అక్కడకు చేరినాడు. అతడు ఆ గ్రామమునకు అధికారి. అతడు గంగలో స్నానము చేయవచ్చినాడు. శ్రీగురువును చూసిన వెంటనే వచ్చి శ్రీగురు పాదములకు నమస్కరించి, భక్తి సంయుక్తుడై మనోవాక్కాయములతో ప్రార్థించినాడు. అంతట శ్రీగురువులు, వానిని ఆదరించి, ఊరడించి, ఓయీ! నీ నివాసము ఎక్కడ? నీ పేరేమి? విస్తారముగా తెలుపుము అని అడిగిరి. స్వామీ నేను ఆపస్తంబ శాఖీయుడను. కౌండిన్యస గోత్రుడను. సాయందేవుడని నన్ను అందురు. కాంచీపురి నా నివాసము. ఉదర పూరణమునకై యవనేశ్వరునకు సేవకుడనై, గ్రామాధికారినై ఈ గ్రామము నందు ఒక సంవత్సరము నుండి నివసించుచున్నాను. నేను నేడు ధన్యుడను, కృతార్థుడను అయితిని. మీ దర్శనమును పొందగలిగితిని. మీరు విశ్వతారకులు. జన్మ జన్మాంతరములందు నేను ఆర్జించిన నా పాపములు అన్ని పటాపంచలు అయినవి. మీ అనుగ్రహమును పొందినవాడు భవార్ణమును తరించును. అప్రయత్నంగా మీ దర్శనము ఇప్పుడు నాకు లభించినది. గంగ పాపమును, చంద్రుడు తాపమును, కల్పవృక్షము దైన్యమును హరించును. శ్రీగురు దర్శనము పాపమును, తాపమును, దైన్యమును కూడా వెంటనే హరించును. గంగలో స్నానము చేసిన పాపము పోవును. చంద్రుడు రాత్రివేళ తాపమును హరించును. కల్పవృక్షము సమీపమునకు వచ్చిన వానికే దైన్యమును పోగొట్టును. మీ దర్శనము అట్లుకాక, పాప, తాప, దైన్యములను సర్వదా పోగొట్టును. చతుర్వర్గ ఫలప్రదవమైన మీ దర్శనము అట్టిది. అని స్తుతించుచూ మరలా సాయందేవుడు అనే విప్రుడు గురుపాదములను గ్రహించినాడు. సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందమస్తు 🙏 #🙆 Feel Good Status #😇My Status
Manasa
565 views
6 days ago
#✌️నేటి నా స్టేటస్ #🌅శుభోదయం #🙆 Feel Good Status #😇My Status శ్రీ గురుభ్యోనమః🙏 🌹పంచాంగం🌹 శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు, తేది ... 20 - 4 - 2026, వారం ... ఇందు వాసరే (సోమ వారము), శ్రీపరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్ల పక్షం, తిధి : తదియ ఉ 11.05 వరకు తదుపరి చవితి నక్షత్రం : కృత్తిక ఉ 8.00 వరకు తదుపరి రోహిణి యోగం: సౌభాగ్యం రా 7.57 వరకు తదుపరి శోభనం కరణం : గరజి ఉ 11.05 వరకు వణిజ రా 9.53 వరకు వర్జ్యం : రా 10.54 - 12.23 వరకు దుర్ముహూర్తం : మ 12.23 - 1.13 వరకు మ 2.52 - 3.42 వరకు అమృతకాలం : ఉ 5.46 - 7.16 వరకు తె 3.21 - 4.51 వరకు రాహుకాలం : ఉ 7.30 - 9.00 వరకు యమగండం : ఉ 10.30 - 12.00 వరకు సూర్యరాశి : మేషం చంద్రరాశి : వృషభం సూర్యోదయం : 5.46 సూర్యాస్తమయం:6.12 *నేటి విశేషం* పరశురామ జయంతి, అక్షయతృతీయ, సింహాచల చందనోత్సవం. *నేటి మాట* ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మాణేినమః గురుచరిత్ర - 79 గురుమూర్తి త్రయంబక క్షేత్రము నుండి నాసిక చేరినారు. అక్కడ పురాణ మహిమలు గల అనేక క్షేత్రములు ఉన్నవి. ఆ క్షేత్రముల గురించి సంక్షిప్తముగా చెప్పెదను నామధారక. గోదావరి మహిమ లోకములో అపారము. ఆ గోదావరి తట ద్వయమును వృద్ధ గంగ అందురు. అందులో అపరిమితములైన తీర్ధములు కలవు. ఆ నది సర్వేశ్వరుని జట యందు నివసించుచూ కిందకు అవతరించెను. ఋషీశ్వరుడైన గౌతముడు పూర్వము ప్రతిదినము ధాన్యమును చల్లి అక్కడే తపస్సు చేయువాడు. ఆ చల్లిన ధాన్యము మొలకలై ఆ దినమందే ఫలించును. గౌతమ మహర్షి మంత్రమహిమ అటువంటిది. ఒకప్పుడు మునులందరూ కలిసి, ఈ గౌతముడు శివభక్తుడు. మహాముని. ఇతడు గంగను భూమికి తెచ్చినచో మనందరికి ఇక్కడే గంగాస్నానం సమకూరును. యోగయుక్తులు, ఊర్ధ్వ రేతస్కులైన మునులకు లభించు సద్గతి గౌతమీ తీర వాసులైన జంతువులకు కూడా లభించగలదు. ఊర్ధ్వ రేతస్కులైన మునులు కోటి సంవత్సరములు చేయగా వచ్చు తపః ఫలము గౌతమీ స్నాన మాత్రముననే సిద్ధింపగలదు. ఈ గౌతమ మహాముని గంగను భూమికి తెచ్చు ప్రయత్నము చేయగలడు. కాబట్టి, గౌతమునకు ఏదో ఒక సంకటము తెచ్చినచో మనకు గంగా లాభము కలుగును. అని వారందరూ తలచి, దూర్వాలతో ఒక మాయా గోవత్సమును చేసి, గౌతముని సస్యభక్షణమునకు వారు ప్రోత్సహించిరి. అనుష్టానమున ఉన్న గౌతముడు సస్యమును భక్షించుచున్న గోవత్సమును దర్భతో మరలింపబోయినాడు. ఆ దర్భ దూర్వారమైన శస్త్రముగా మారి వజ్రాయుధం వలె ఆ గోవత్సమును తాకెను. వెంటనే గోవత్సము పంచత్వమును పొందినది. గోహత్యాపాతకము గౌతమునకు వచ్చినది. ఋషులందరూ కలిసి సమావేశమై గోహత్యకు ప్రాయశ్చిత్తముగా గంగను తెచ్చి గోవు మీద ప్రవహింప చేసినచో శుద్ధి అగును అనిరి. గౌతముడు అట్లే అని వెళ్ళి, వేయి సంవత్సరములు తపము చేసినాడు. వ్యోమకేశుడు ప్రసన్నుడై వరము అడుగమనినాడు. నీవు ప్రసన్నుడవైనచో చరాచరములను ఉద్ధరించుటకు గంగను భూమండలమునకు అర్పింపుము. గౌతముని వాక్యమునకు సంతుష్టుడైన ఈశ్వరుడు గంగను సమర్పించినాడు. ఆ గంగ భూలోకములో మనుష్యుల పాపములను పోగొట్టుచూ భాగీరథి వలె దక్షిణ భారతమున ప్రవహించెను. ఆ గంగయే గౌతమి, గోదావరి అను పేర్లతో ప్రసిద్ధి పొందెను. ఆ నదుల మహిమ వర్ణింప ఎవరికి తరము కాదు. అందుచేతనే నామధారకా! శ్రీగురునాధులు అచ్చటకు వచ్చినారు. లోకానుగ్రహ కాంక్షతో సర్వతీర్థములను పర్యటించుచూ మంజరీక క్షేత్రమున ఉన్న మాధవారణ్యమును చేరినారు. సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందమస్తు 🙏
Manasa
594 views
8 days ago
#🙆 Feel Good Status #😇My Status #✌️నేటి నా స్టేటస్ #🌅శుభోదయం శ్రీ గురుభ్యోనమః🙏 🌹పంచాంగం🌹 శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు, తేది ... 18 - 4 - 2026, వారం ... స్థిర వాసరే (శని వారము), శ్రీపరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్ల పక్షం, తిధి : శు పాడ్యమి మ 3.35 వరకు తదుపరి విదియ నక్షత్రం : అశ్వని ఉ 10.57 వరకు తదుపరి భరణి యోగం: ప్రీతి రా 1.57 వరకు తదుపరి ఆయుష్మాన్ కరణం : బవ మ 3.35 వరకు బాలువ రా 2.31 వరకు వర్జ్యం : ఉ 7.08 - 8.39 వరకు రా 8.00 - 9.30 వరకు దుర్ముహూర్తం : ఉ 5.46 - 7.25 వరకు అమృతకాలం : తె 5.03 నుండి రాహుకాలం : ఉ 9.00 - 10.30 వరకు యమగండం : మ 1.30 - 3.00 వరకు సూర్యరాశి : మేషం చంద్రరాశి : మేషం సూర్యోదయం : 5.48 సూర్యాస్తమయం:6.11 *నేటి విశేషం* రేలంగి మంటాలాంబ వారి తీర్థం, కూర్మకల్పం *నేటి మాట* ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మాణేినమః గురుచరిత్ర - 77 శ్రీగురువులు కరంజా నగరమును చేరి, జననీజనకులను ఆనందింపజేసి, చెల్లెలిని, తమ్ముళ్ళను ప్రేమతో ఆదరించిరి. ఆ నగరములో పౌరులు గురుమూర్తిని చూసి సంతుష్టులై సద్గురువును పూజించిరి. జగద్గురువులు ప్రతీ ఇంటా భిక్ష చేయుచుండిరి. అక్కడ విప్రులు అందరూ భిక్షకు నిమంత్రింపగా శ్రీగురువులు బహురూపధారులై అందరి ఇళ్లలో ఒకేసారి భిక్ష గైకొనిరి. అందరూ అది తెలుసుకొని విస్మితులై శ్రీమహావిష్ణువే యతిధారియై వచ్చినారని భావించిరి. శ్రీవారిని దూషించినవారు నరకానికి పోవుదురు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కార్యార్థమై యతిరూపమున వచ్చినారని నగర పౌరులు తలంచిరి. శ్రీగురువులు, తల్లిదండ్రులకు పూర్వస్మరణ కలిగించుటకు శ్రీపాద శ్రీవల్లభ రూపమును చూపిరి. తల్లి అంబిక శ్రీపాద శ్రీవల్లభ రూప దర్శనము చేసి, వారి పాదములందు శిరమును ఉంచి, నా ప్రదోష పూజ ఫలించింది. అని భావించింది. చంద్రమౌళి సత్యసంకల్పుడు అని భావించి, భర్తతో తన పూర్వజన్మ చరితమును చెప్పుచూ, గతజన్మలో శ్రీపాదులైన ఈ విశ్వవంద్యులైన సుతునిగా పొందుటకు మహాదేవుని ఆరాధించి ఉంటిని. ఈ జన్మ యందు నా కోరిక సఫలమైనది. అని తన భర్త అయిన మాధవునికి చెప్పినది. అప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు కలిసి, యతిరాజా! జగన్నాథా! మమ్ము భవార్ణము నుండి ఉద్ధరింపుము. అని ప్రార్థించినారు. అప్పుడు శ్రీగురువులు, వంశము లోని ఒక సన్యాసి ఆ వంశమునందు 42 తరములను ఉద్ధరించును. ఆ వంశమునకు శాశ్వత బ్రహ్మలోకం ఇచ్చును. ఆ కులము నందు జన్మించిన వారందరకూ కూడా శాశ్వతమైన బ్రహ్మపదమును ఇచ్చును. వారి సంతతికి యముని వలన కూడా భయ దుఃఖములు ఉండవు. అంతకుముందు నరకమునకు పోయిన వారందరూ కూడా బ్రహ్మలోకమునకు పోగలరు. ఇంతకన్నా మీకేమి చెప్పను? మీకు యముని వలన కూడా జంకు లేదు. బ్రహ్మ పదమే లభించును. మీ ఈ పుత్రులు శతవర్ష జీవులై అష్టైశ్వర్యములను పొందగలరు. వీరి పుత్రులను, పౌత్రులను చూసి సుఖములు అనుభవించిన తరువాత మీకు చివరికాలమున కాశీక్షేత్ర వాసము లభించును. కాశీ మోక్షస్థానమని వేదాదులయందు కలదు. ఇంకముందు మీరు ఎట్టి చింతన పెట్టుకోవలదు. అని జగద్గురువులు ఆనతి ఈయునంతలో, అక్కడకి శ్రీగురువులు పూర్వాశ్రమమున చెల్లెలైన రత్న వచ్చి, స్వామి దగ్గర వినతురాలై, స్వామీ! నన్ను తరింప చేయండి. అవిద్యా జల నిమగ్నయై భవసాగరమున మునిగి ఉంటిని. తాపత్రయం అను బడబాగ్ని నన్ను దహించుచున్నది. కామాదులు అనే నక్రములు భయపెట్టు చున్నవి. నన్ను సంసార జలధి నుండి ఉద్ధరింపుము. నేను తపము చేయ పోవుదును. అని పలికినది. అప్పుడు శ్రీగురువులు, స్త్రీలకు పతి సేవయే తపస్సు. వేరే తపము ఏల? వీరిని భవార్ణము నుండి తరింపచేసి, పరమపదము నొసగువాడు శివుడే. అతడే పతివ్రతలకు సర్వాభీష్టములను కలుగజేయును. సంశయము వలదు. భవసాగరమును ఉద్ధరించుటకు పతియే స్త్రీలకు దైవమని స్మృతులు ఘోషించుచున్నవి. కావున మనస్సును స్థిరముగా చేసుకొని శివసమానుడైన పతిని సేవింపుము. వేదవాక్యములను అనుసరించి పతియే గతి. నిన్ను ఉద్ధరించువాడు అతడే. నీ అంతఃకరణమున దుఃఖ పడకు. అని జగద్గురువులు ఆమెను ఆదేశించారు. సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందమస్తు 🙏