ఫాలో అవ్వండి
KP@KALIPRASAD
@journalist007
16,079
పోస్ట్
74,503
ఫాలోవర్స్
KP@KALIPRASAD
5.4K వీక్షించారు
22 గంటల క్రితం
*బిర్యానీ తింటుంటే దాడి చేసిన చోరీలో.. బిగ్ ట్విస్ట్...వీళ్ళ మైండ్ గేమ్ మాములు గా లేదుగా...కేసు ను చేధించిన పోలీసులు* పల్నాడు జిల్లా కారంపూడి ఈ నెల 17న నరమాలపాడు వద్ద రోడ్డు పక్కన బిర్యానీ తింటున్నప్పుడు జరిగిన 30 లక్షల రూపాయలు, 13 కిలోల వెండి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దుర్గికి చెందిన సాంబశివరావు తన గోల్డ్ షాప్ గుమస్తా కొడుకు వెంకటేశ్‌కు ఈ డబ్బు, వెండిని పిడుగురాళ్లలోని చందు వద్దకు ఇవ్వమని పంపాడు. అయితే, వెంకటేశ్ తన స్నేహితులతో కలిసి ఈ చోరీకి ప్లాన్ చేసి, తనపై దాడి చేయించుకుని డబ్బును ఎత్తుకెళ్లిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణలో ఈ కుట్రను బట్టబయలు చేశారు. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
KP@KALIPRASAD
475 వీక్షించారు
2 రోజుల క్రితం
రైలు వెనుక **‘X’ గుర్తు** ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? మనం ప్రయాణించే రైళ్లలో చివరి బోగీ వెనుక పెద్దగా కనిపించే **‘X’ గుర్తు** ఒక ముఖ్యమైన భద్రతా సూచిక. రైల్వే శాఖ వివరణ ప్రకారం, ఈ గుర్తు ద్వారా **రైలు అన్ని బోగీలతో సురక్షితంగా గమ్యస్థానానికి చేరిందా లేదా** అనే విషయాన్ని అధికారులు నిర్ధారిస్తారు. రైలు స్టేషన్‌కి చేరినప్పుడు లేదా మార్గమధ్యంలో పర్యవేక్షణ సమయంలో, చివరి బోగీపై ఉన్న **‘X’ గుర్తు కనిపిస్తే** — మధ్యలో ఎలాంటి బోగీ విడిపోలేదని, రైలు పూర్తిగా వచ్చిందని అర్థం. ఒకవేళ **‘X’ గుర్తు కనిపించకపోతే**, వెంటనే అప్రమత్తమై ఎక్కడైనా బోగీలు విడిపోయాయా అనే విషయాన్ని రైల్వే సిబ్బంది పరిశీలిస్తారు. సారాంశంగా చెప్పాలంటే, **‘X’ గుర్తు రైలు ప్రయాణ భద్రతకు సంబంధించిన కీలక సూచన**. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
KP@KALIPRASAD
440 వీక్షించారు
3 రోజుల క్రితం
శబరిమల బంగారం చోరీ.. ప్రధాన నిందితుడికి బెయిల్... శబరిమల బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టికి బెయిల్ లేదు. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసులో విచారణ జరుపుతోంది. ప్రధాన పూజారి కందరారు రాజీవరును కూడా సిట్ అరెస్టు చేసింది. ఈ కేసులో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు శంకర్‌దాస్‌కు సుప్రీంకోర్టులో ఎలాంటి ఊరట దక్కలేదు. చోరీ కేసులో తనను ఉద్దేశించి చేసిన హైకోర్టు వ్యాఖ్యలను తొలగించాలన్న ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. మరింత తెలుసుకోవాలంటే, శబరిమల బంగారం చోరీ కేసులో ఇప్పటివరకు ఎంత మందిని అరెస్టు చేశారు? లేదా ఈ కేసులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి రానున్నాయా? #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
KP@KALIPRASAD
591 వీక్షించారు
3 రోజుల క్రితం
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం తేలుకుట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త చల్లా నాగరాజు 2024 అక్టోబర్‌లో టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడిన నాగరాజు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్‌గా ఉన్నందుకు టీడీపీ గూండాలు రాడ్లతో దాడిచేసి, నాగరాజు రెండు కాళ్ళు విరగ్గొట్టి తీవ్రంగా గాయపరిచారు తనపై టీడీపీ గూండాలు ఏ విధంగా దాడిచేశారనేది, తన కుటుంబాన్ని ఎలా ఇబ్బందులు పెడుతున్నారనేది వైయస్‌ జగన్‌కు వివరించిన నాగరాజు. తన రెండు కాళ్ళు విరిగిపోవడంతో వీల్‌ ఛైర్‌కే పరిమితమై కుటుంబ పోషణ తీవ్ర ఇబ్బందిగా ఉందన్న నాగరాజు, నాగరాజు కుటుంబాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆదుకుంటుందని వైయస్‌ జగన్‌ భరోసా ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ను కలిసిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్‌ రెడ్డి, స్ధానిక నాయకులు, లీగల్‌ సెల్ సభ్యులు. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
KP@KALIPRASAD
582 వీక్షించారు
3 రోజుల క్రితం
కొత్త చట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), 2023 ప్రకారం, డిస్ట్రిక్ట్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి ఉపయోగించాల్సిన సెక్షన్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. పాత CrPC సెక్షన్లకు బదులుగా ఇప్పుడు ఈ క్రింది సెక్షన్లను ఉపయోగించాలి: ⚖️ BNSS ప్రకారం బెయిల్ సెక్షన్లు: 1. రెగ్యులర్ బెయిల్ (Regular Bail): • సెక్షన్ 482 BNSS (ఇది పాత CrPC 439 స్థానంలో వచ్చింది). • హైకోర్టు లేదా సెషన్స్ కోర్టు (డిస్ట్రిక్ట్ కోర్టు) లో రెగ్యులర్ బెయిల్ కోసం ఈ సెక్షన్ కింద పిటిషన్ వేయాలి. 2. ముందస్తు బెయిల్ (Anticipatory Bail): • సెక్షన్ 482 BNSS (ఇది పాత CrPC 438 స్థానంలో వచ్చింది). • గమనిక: కొత్త చట్టంలో రెగ్యులర్ బెయిల్ మరియు ముందస్తు బెయిల్ రెండింటినీ ఒకే సెక్షన్ (482) కింద చేర్చారు. అయితే పిటిషన్ దాఖలు చేసేటప్పుడు అది ముందస్తు బెయిల్ (Anticipatory) అని స్పష్టంగా పేర్కొనాలి. 3. మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్: • సెక్షన్ 480 BNSS (పాత CrPC 437 స్థానంలో). • నాన్-బెయిలబుల్ నేరాల్లో మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ కోరడానికి ఇది ఉపయోగపడుతుంది. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
KP@KALIPRASAD
575 వీక్షించారు
3 రోజుల క్రితం
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం తేలుకుట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త చల్లా నాగరాజు 2024 అక్టోబర్‌లో టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడిన నాగరాజు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్‌గా ఉన్నందుకు టీడీపీ గూండాలు రాడ్లతో దాడిచేసి, నాగరాజు రెండు కాళ్ళు విరగ్గొట్టి తీవ్రంగా గాయపరిచారు తనపై గుర్తుతెలియని గూండాలు ఏ విధంగా దాడిచేశారనేది, తన కుటుంబాన్ని ఎలా ఇబ్బందులు పెడుతున్నారనేది వైయస్‌ జగన్‌కు వివరించిన నాగరాజు. తన రెండు కాళ్ళు విరిగిపోవడంతో వీల్‌ ఛైర్‌కే పరిమితమై కుటుంబ పోషణ తీవ్ర ఇబ్బందిగా ఉందన్న నాగరాజు, నాగరాజు కుటుంబాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆదుకుంటుందని వైయస్‌ జగన్‌ భరోసా ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ను కలిసిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్‌ రెడ్డి, స్ధానిక నాయకులు, లీగల్‌ సెల్ సభ్యులు. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
KP@KALIPRASAD
891 వీక్షించారు
3 రోజుల క్రితం
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన మందా సాల్మన్‌ కుమారులు మరియదాసు,భిక్షం(ప్రవీణ్‌), కుమార్తె రాహేలు, పిన్నెల్లి గ్రామస్తులు ఇటీవల టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన మందా సాల్మన్‌ తమ తండ్రిని రాజకీయ కక్షతోనే అత్యంత కిరాతకంగా చంపారని వైయస్ జగన్‌కు వివరించిన సాల్మన్‌ కుమారులు, కుమార్తె, తమ తండ్రి మరణంతో తమ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేసిన కుమారులు, కుమార్తె. పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గూండాలు, పోలీసులు తమను ఎలా బెదిరించింది, అక్రమ కేసులు పెట్టి వేధించిన తీరును వైయస్‌ జగన్‌కు వివరించిన సాల్మన్ కుటుంబ సభ్యులు, పిన్నెల్లి గ్రామస్తులు వైఎస్సార్సీపీ క్యాడర్‌ ఎవరూ భయపడవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చిన వైయస్‌ జగన్‌, అక్రమ కేసులు, వేధింపులపై పార్టీ లీగల్ సెల్ అవసరమైన న్యాయసహాయం అందిస్తుందని వెల్లడి, ప్రభుత్వ దన్నుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, వ్యవస్ధలు దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టిన వైయస్‌ జగన్‌ ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ను కలిసిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్‌ రెడ్డి, స్ధానిక నాయకులు, లీగల్‌ సెల్ సభ్యులు. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
See other profiles for amazing content