*పొన్నూరులో ఇద్దరు పోలీసులు సస్పెండ్..*
*పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్* పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను జిల్లా SP వకుల్ జిందాల్ ఆదివారం సస్పెండ్ చేశారు. అక్రమ రేషన్ రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి సహకరిస్తూ, పోలీస్ నిఘా సమాచారాన్ని వారికి చేరవేశారని ఎస్పీ తెలిపారు. అక్రమ వ్యాపారస్తులకు సహకరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు...
#📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢
*ప్రెస్ నోట్*
*గుంటూరు జిల్లా పోలీస్…*
*నగరంపాలెం పోలీస్ స్టేషన్*
*తేది: 07.12.2025*
_*// గంజాయి అమ్మకం మరియు కొనుగోలు కేసులో 6 మంది నిందితులను అరెస్ట్ చేసి, 2 కిలోల గంజాయి స్వాధీనం చేసిన నగరంపాలెం పోలీసులు,.//*_
📍 గుంటూరు జిల్లా S.P శ్రీ వకుల్ జిందల్, I.P.S. గారి ఆదేశాల మేరకు, గుంటూరు పశ్చిమ డీఎస్పీ శ్రీ K. అరవింద్ గారి పర్యవేక్షణలో, నగరంపాలెం సీఐ శ్రీ Y. సత్యనారాయణ గారు సిబ్బందితో కలిసి ప్రత్యేక దాడులు నిర్వహించి, గంజాయి అమ్మకం మరియు కొనుగోలు చేస్తున్న ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.
*👉 కేసు వివరాలు:-*
06.12.2025 రాత్రి 10.00 గంటలకు నగరం పాలెం సీఐ సత్యనారాయణ గారికి పోలీస్ స్టేషన్ పరిధిలోని VIP రోడ్డులోని లాలుపురం వెళ్ళు డొంక సమీపంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి పక్కన ఉన్న ఖాళీ స్థలం వద్ద గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో ఎస్సై ప్రసన్న కుమార్ గారు, తన పోలీసు బృందంతో అక్కడికి చేరుకోగా, అక్కడ గుంపుగా కూడిన వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోతుండగా సీఐ గారు తన సిబ్బందితో 06 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి చేతుల్లో ఉన్న కవర్లను పరిశీలించగా వాటిలో గంజాయి ఉండటం గుర్తించి, వెంటనే వాటిని సీజ్ చేసి, పట్టుబడిన నిడుతులను పోలీస్ స్టేషన్ కు తరలించి, Cr.No: 458/2025
U/s 8(c) r/w 20(b)(ii)(A)(B) NDPS Act – Nagarampalem PS నమోదు చేయడం జరిగింది.ఈరోజు(07.12.2025) వెస్ట్ డిఎస్పీ అరవింద్ గారు కేసు వివరాలు వెల్లడించి, నిందితుల్ని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరుస్తామని తెలపడం జరిగింది.
👉 *అరెస్టు చేయబడిన నిందితులు, వారి వద్ద సీజ్ చేయబడిన గంజాయి వివరాలు :-*
1. గొర్ల కోటేష్ @ ఈశ్వర్, 28 సం., సంపత్ నగర్, గుంటూరు.
* *500 గ్రాములు*
2. కాకర్ల శ్రీకాంత్, 25 సం., వసంతారాయ పురం, గుంటూరు.
* *500 గ్రాములు*
3. బిశెట్టి కిరణ్ @ సాయి, 24 సం., నల్లచెరువు, గుంటూరు.
* *250 గ్రాములు*
4. షేక్ నాగుల్ షరీఫ్ @ షరీఫ్, 24 సం., వినోభానగర్, పాత గుంటూరు.
* *250 గ్రాములు*
5. అర్ధల అశోక్, 28 సం., A.T. అగ్రహారం, గుంటూరు.
* *250 గ్రాములు*
6. షేక్ అబ్దుల్ ఖయ్యూమ్ @ ఖయ్యూమ్, 20 సం., నల్లచెరువు, గుంటూరు.
* *250 గ్రాములు*
📌 ఈ కేసులో ఇంకా కొంతమంది నిందితులు గుర్తింపులో ఉన్నారనీ, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
*Note :- పైన తెలిపిన సీజ్ చేసిన గంజాయినీ మధ్యవర్తుల సమక్షంలో నియమానుసారం సీజ్ చేసి, గౌరవ న్యాయమూర్తి గారి వద్ద ఇన్వెంటరీ పూర్తిచేశారు.*
👉 *నిందితులపై గతంలో నమోదైన కేసులు....*
*1) A1 – గొర్ల కోటేష్*
* అమర్తలూరు PS – దోపిడీ
* రాజుపాలెం PS – దోపిడీ
* GRP PS – దోపిడీ
* నర్సిపట్నం PS – NDPS
* గుంటూరు ఎక్సైజ్ PS – NDPS
*2)A2 – కాకర్ల శ్రీకాంత్*
* నగరంపాలెం PS – దోపిడీ
* అరండల్ పేట PS – NDPS
*3)A3 – బిశెట్టి కిరణ్*
* అరండల్ పేట PS – NDPS
* మోతుగూడెం PS – NDPS
*4)A4 – షేక్ నాగుల్ షరీఫ్*
* అమర్తలూరు PS – దోపిడీ
* మోతుగూడెం PS – NDPS
*5)A5 – అబ్దుల్ ఖయ్యూమ్*
* లాలాపేట PS – NDPS
*👉 దర్యాప్తులో పాల్గొన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది :-* CI సత్యనారాయణ గారు, SI D. ప్రసన్న కుమార్ గారు, హెడ్ కానిస్టేబుళ్ళు ప్రసాధ్ బాబు మరియు దాసు, కానిస్టేబుళ్లు శ్రీనివాసు, ఉదయ్, నాగేశ్వరరావులు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరచిన వీరందరిని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు అభినందించారు.
👉 కేసులోని నిందితుల్లో ఒకరైన కాకర్ల శ్రీకాంత్, ఇంజనీరింగ్ విద్యార్థి అయినప్పటికీ గంజాయి బానిసగా మారడం గమనార్హమని పోలీసులు తెలిపారు.
అందువల్ల జిల్లాలోని అన్ని కళాశాలలు తమ విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వహించాలి అని సూచించారు.
👉 గుంటూరు వెస్ట్ సబ్–డివిజన్ పరిధిలో గంజాయి విక్రయించినా, రవాణా చేసినా, సేవించినా లేదా కలిగి ఉన్నా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీ K. అరవింద్ గారు హెచ్చరించారు.
#📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్
*ప్రెస్ నోట్*
*గుంటూరు జిల్లా పోలీస్…*
*తేది: 07.12.2025*
_*//రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి, రోడ్లపై మార్చ్ చేయించిన గుంటూరు ఈస్ట్ డీఎస్పీ శ్రీ అబ్దుల్ అజీజ్ గారు,.//*_
📍గుంటూరు జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగా, గుంటూరు ఈస్ట్ సబ్-డివిజన్ పరిధిలోని లాలాపేట, ఓల్డ్ గుంటూరు, కొత్తపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సుమారు 150 మంది రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించబడింది.
అనంతరం, వారిలో చట్టబద్ధ జీవన విధానాన్ని అలవర్చేందుకు అవగాహన కల్పించేందుకు పోలీస్ పరేడ్ గ్రౌండ్–వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ –జిల్లా పోలీస్ కార్యాలయం–SBI బ్యాంక్ సెంటర్–పోలీస్ పరేడ్ గ్రౌండ్ మార్గంలో ప్రత్యేక మార్చ్ నిర్వహించారు.
👉 *డీఎస్పీ శ్రీ అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడుతూ…*
* చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం వలన ఎదురయ్యే చట్టపరమైన శిక్షలు, వ్యక్తిగత భవిష్యత్తుపై వచ్చే ప్రతికూల ప్రభావాలు, కుటుంబాలపై ఏర్పడే మానసిక–ఆర్థిక భారం గురించి వివరించారు.
* శాంతి భద్రతలను కాపాడడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం అని, సమాజ అభివృద్ధికి ప్రతి పౌరుడు చట్టబద్ధతను అనుసరించడం అవసరమని సూచించారు.
* రౌడీ షీటర్లు జీవితాల్లో మార్పుకు అవకాశాన్ని ఉపయోగించుకుని, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని సూచించారు.
* ఉపాధి అవకాశాలను అన్వేషించి స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగాలని, ప్రజల సహకారంతో నేరాలను అరికట్టి శాంతి వాతావరణం నెలకొల్పడమే పోలీస్ శాఖ ధ్యేయమని తెలిపారు.
👉 *లాలాపేట సీఐ శ్రీ శివ ప్రసాద్ గారు మాట్లాడుతూ...*
* నేర చరిత్ర చివరికి వ్యక్తిని నాశనానికి నెడుతుందని పేర్కొన్నారు.
* సమాజంలో గౌరవం పొందాలంటే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.
* ఇకపై నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై పీడీ చట్టం సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
❇️ *ఓల్డ్ గుంటూరు సీఐ శ్రీ వెంకట ప్రసాద్ గారు మాట్లాడుతూ...*
* రౌడీ షీటర్లపై నిత్య పర్యవేక్షణ కొనసాగుతుందని, ప్రవర్తనలో మార్పులు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
* చట్ట ఉల్లంఘనపై సున్నా సహనం–Zero Tolerance విధానాన్ని కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
* యువతను నేరాలకు దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని చెప్పారు.
👉 ఓల్డ్ గుంటూరు ఎస్సై శ్రీ రెహమాన్ గారు కౌన్సెలింగ్ కి హాజరైన రౌడీ షీటర్లతో నేర ప్రవర్తనకు దూరంగా ఉండటం, సత్ప్రవర్తన పాటించడం కోసం ప్రతిజ్ఞ చేయించారు.
👉 ఈ కార్యక్రమంలో ఈస్ట్ డిఎస్పీ గారితో పాటు లాలాపేట సీఐ శివ ప్రసాద్ గారు, ఓల్డ్ గుంటూరు సీఐ వెంకట ప్రసాద్ గారు, కొత్తపేట ఎస్సైలు రమేష్ గారు, సుబ్బారావు గారులు పాల్గొన్నారు.
#📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢
*బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రెస్ నోట్, తేది: 07.12.2025*
*వరుసగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు అరెస్ట్*
*చాకచక్యంగా ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసిన బాపట్ల సిసిఎస్ పోలీసులు*
*ముద్దాయిల నుండి రూ. 21.2 లక్షల విలువ గల 37 ద్విచక్ర వాహనాలు స్వాధీనం*
*గడిచిన వారం రోజుల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం రూ. 40 లక్షల విలువ గల 60 బైకులను రికవరీ*
*ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వాహనాలకు సేఫ్టీ లాక్లు, జిపిఎస్ వంటి పరికరాలు అమర్చుకోవాలని*
*పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించి కేసు వివరాలను మీడియాలో వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు*
బాపట్ల జిల్లాలో వరుసగా చోటుచేసుకున్న ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా చేధించి, దొంగతనాలకు పాల్పడుతున్న వారిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
*కేసు వివరాలు*
1. Cr.No. 126/2025 U/S 303 (2) BNS of Vedullapalli PS (Bapatla Dist.)
2. Cr.No. 424/2025 U/S 303 (2) BNS of Bapatla Town PS (Bapatla Dist.)
3. Cr.No. 540/2023 U/S 379 IPC of Krishnalanka PS (NTR Dist.)
4. Cr.No. 254/2025 U/S 303 (2) BNS Chirala 1 Town PS (Bapatla Dist.)
5. Cr.No. 255/2025 U/S 303 (2) BNS Chirala 1 Town PS (Bapatla Dist.)
6. Cr.No. 256/2025 U/S 303 (2) BNS Chirala 1 Town PS (Bapatla Dist.)
7. Cr.No. 249/2025 U/S 303 (2) BNS Addanki PS (Bapatla Dist.)
*ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను ఛేదించిన విధానం:*
బాపట్ల జిల్లాలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు సవాలుగా తీసుకొని, బాపట్ల సిసిఎస్ డిఎస్పీ పి. జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో సిసిఎస్ సిఐ ప్రేమయ్య మరియు వారి సిబ్బంది, జిల్లా పోలీస్ యంత్రాంగంతో కలిపి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, సీసీ కెమెరాల ఆధారంగా వరుస కేసులను చాకచక్యంగా ఛేదించి, దొంగతనాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేశారు. దొంగిలించబడిన రూ. 21.2 లక్షల విలువగల 37 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
*ముద్దాయిల వివరాలు*
1. కగ్గ. సాంబశివరావు, S/O ప్రేమిలి, వయసు: 32 సంవత్సరాలు, కులం: ఉప్పర, పొత్తూరు గ్రామం, గుంటూరు మండలం, గుంటూరు జిల్లా.
2. దాసరి గోపిరాజు @ గోపి, S/O కోటేశ్వరరావు, 32 సంవత్సరాలు, కులం: ఎరుకుల, జగనన్న కాలనీ, బుర్లవారిపాలెం. ప్రస్తుత నివాసం: గాంధీనగర్ యానాది సంఘం, కోర్టు సెంటర్ వద్ద, పేరాల, చీరాల పట్టణం.
3. దాసరి దుర్గా రావు @ దుర్గ, S/O కోటేశ్వరరావు, 24 సంవత్సరాలు, కులం: ఎరుకుల, జగనన్న కాలనీ, బుర్లవారిపాలెం. ప్రస్తుత నివాసం: గాంధీనగర్ యానాది సంఘం, కోర్టు సెంటర్ వద్ద, పేరాల, చీరాల పట్టణం.
*ముద్దాయిలు నేరం చేసిన విధానం:*
*కగ్గ. సాంబశివరావు*
లారీ డ్రైవర్గా పనిచేస్తూ చెడు వ్యసనాలు మరియు విలాసాలకు అలవాటు పడటం వల్ల వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో, గత రెండు సంవత్సరాలుగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇళ్ల ముందర, ఆసుపత్రుల వద్ద పార్క్ చేసిన బైకులను దొంగతాళాలతో లాక్ తెరిచి దొంగతనం చేస్తూ వచ్చాడు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, విజయవాడ, ఎన్టిఆర్ జిల్లాల్లో వరుస దొంగతనాలు చేసినట్లు తేలింది. దొంగతనం చేసిన వాహనాలను ఇతర జిల్లాల్లో విక్రయించేవాడు. ఇతడి మీద గతంలో ఎటువంటి కేసులు లేవు. మొత్తం 33 బైకులను దొంగిలించినట్లు గుర్తించారు. బాపట్ల టౌన్ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు.
*దాసరి గోపిరాజు @ గోపి మరియు దాసరి దుర్గా రావు @ దుర్గ*
ఇద్దరూ అన్నదమ్ములు. చీరాల పరిసరాల్లో చీపురులు అమ్ముతూ జీవనం సాగిస్తారు. సంపాదన సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గత 6 నెలలుగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. చీరాల 1 టౌన్, అద్దంకి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 4 ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. చీరాల 1 టౌన్ పోలీసులు వారిని ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు.
జిల్లా సిసిఎస్ పోలీసులు మరియు జిల్లా పోలీస్ యంత్రాంగం కలిసి కేసులను ఛేదించి, బాపట్లలో సాంబశివరావును, చీరాలలో గోపి మరియు దుర్గలను అరెస్ట్ చేశారు. మొత్తం ముగ్గురు ముద్దాయిల నుండి రూ. 21.2 లక్షల విలువగల 37 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
*ఎస్పీ గారి సందేశం:*
ద్విచక్ర వాహనాల దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గడిచిన వారం రోజుల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం రూ. 40 లక్షల విలువ గల 60 బైకులను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనాలకు సేఫ్టీ లాక్లు, జిపిఎస్ పరికరాలు అమర్చుకోవాలని తెలిపారు. లక్షల రూపాయలు ఖర్చుచేసి వాహనాలను కొనుగోలు చేసేవారు, వాహనాలు దొంగతనాలకు గురికాకుండా ఉండేందుకు సేఫ్టీ లాక్ లు, జిపిఎస్ ఏర్పాటు చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించవద్దని ప్రజలకు తెలిపారు.
*ప్రశంసలు*
ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను సమర్థవంతంగా చేధించి, ముద్దాయిలను అరెస్ట్ చేసి, 37 వాహనాలను సీజ్ చేసినందుకు సిసిఎస్ డిఎస్పీ పి. జగదీష్ నాయక్, ఇన్స్పెక్టర్ ప్రేమయ్య, బాపట్ల టౌన్ ఇన్స్పెక్టర్ రాంబాబు, చీరాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, సిసిఎస్ ఎస్ఐ రాంబాబు, సిసిఎస్ కానిస్టేబుల్స్ కోటేశ్వరరెడ్డి, కృష్ణ, సురేష్, దాసు, చిరంజీవి, హోంగార్డ్ రవూఫ్లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డులను అందజేశారు.
ఈ సమావేశంలో సిసిఎస్ డిఎస్పీ జగదీష్ నాయక్, సిసిఎస్ సిఐ ప్రేమయ్య, బాపట్ల టౌన్ సిఐ రాంబాబు, చీరాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
#📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్
*బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రెస్ నోట్, తేది: 07.12.2025*
*వరుసగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు అరెస్ట్*
*చాకచక్యంగా ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసిన బాపట్ల సిసిఎస్ పోలీసులు*
*ముద్దాయిల నుండి రూ. 21.2 లక్షల విలువ గల 37 ద్విచక్ర వాహనాలు స్వాధీనం*
*గడిచిన వారం రోజుల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం రూ. 40 లక్షల విలువ గల 60 బైకులను రికవరీ*
*ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వాహనాలకు సేఫ్టీ లాక్లు, జిపిఎస్ వంటి పరికరాలు అమర్చుకోవాలని*
*పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించి కేసు వివరాలను మీడియాలో వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు*
బాపట్ల జిల్లాలో వరుసగా చోటుచేసుకున్న ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా చేధించి, దొంగతనాలకు పాల్పడుతున్న వారిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
*కేసు వివరాలు*
1. Cr.No. 126/2025 U/S 303 (2) BNS of Vedullapalli PS (Bapatla Dist.)
2. Cr.No. 424/2025 U/S 303 (2) BNS of Bapatla Town PS (Bapatla Dist.)
3. Cr.No. 540/2023 U/S 379 IPC of Krishnalanka PS (NTR Dist.)
4. Cr.No. 254/2025 U/S 303 (2) BNS Chirala 1 Town PS (Bapatla Dist.)
5. Cr.No. 255/2025 U/S 303 (2) BNS Chirala 1 Town PS (Bapatla Dist.)
6. Cr.No. 256/2025 U/S 303 (2) BNS Chirala 1 Town PS (Bapatla Dist.)
7. Cr.No. 249/2025 U/S 303 (2) BNS Addanki PS (Bapatla Dist.)
*ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను ఛేదించిన విధానం:*
బాపట్ల జిల్లాలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు సవాలుగా తీసుకొని, బాపట్ల సిసిఎస్ డిఎస్పీ పి. జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో సిసిఎస్ సిఐ ప్రేమయ్య మరియు వారి సిబ్బంది, జిల్లా పోలీస్ యంత్రాంగంతో కలిపి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, సీసీ కెమెరాల ఆధారంగా వరుస కేసులను చాకచక్యంగా ఛేదించి, దొంగతనాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేశారు. దొంగిలించబడిన రూ. 21.2 లక్షల విలువగల 37 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
*ముద్దాయిల వివరాలు*
1. కగ్గ. సాంబశివరావు, S/O ప్రేమిలి, వయసు: 32 సంవత్సరాలు, కులం: ఉప్పర, పొత్తూరు గ్రామం, గుంటూరు మండలం, గుంటూరు జిల్లా.
2. దాసరి గోపిరాజు @ గోపి, S/O కోటేశ్వరరావు, 32 సంవత్సరాలు, కులం: ఎరుకుల, జగనన్న కాలనీ, బుర్లవారిపాలెం. ప్రస్తుత నివాసం: గాంధీనగర్ యానాది సంఘం, కోర్టు సెంటర్ వద్ద, పేరాల, చీరాల పట్టణం.
3. దాసరి దుర్గా రావు @ దుర్గ, S/O కోటేశ్వరరావు, 24 సంవత్సరాలు, కులం: ఎరుకుల, జగనన్న కాలనీ, బుర్లవారిపాలెం. ప్రస్తుత నివాసం: గాంధీనగర్ యానాది సంఘం, కోర్టు సెంటర్ వద్ద, పేరాల, చీరాల పట్టణం.
*ముద్దాయిలు నేరం చేసిన విధానం:*
*కగ్గ. సాంబశివరావు*
లారీ డ్రైవర్గా పనిచేస్తూ చెడు వ్యసనాలు మరియు విలాసాలకు అలవాటు పడటం వల్ల వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో, గత రెండు సంవత్సరాలుగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇళ్ల ముందర, ఆసుపత్రుల వద్ద పార్క్ చేసిన బైకులను దొంగతాళాలతో లాక్ తెరిచి దొంగతనం చేస్తూ వచ్చాడు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, విజయవాడ, ఎన్టిఆర్ జిల్లాల్లో వరుస దొంగతనాలు చేసినట్లు తేలింది. దొంగతనం చేసిన వాహనాలను ఇతర జిల్లాల్లో విక్రయించేవాడు. ఇతడి మీద గతంలో ఎటువంటి కేసులు లేవు. మొత్తం 33 బైకులను దొంగిలించినట్లు గుర్తించారు. బాపట్ల టౌన్ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు.
*దాసరి గోపిరాజు @ గోపి మరియు దాసరి దుర్గా రావు @ దుర్గ*
ఇద్దరూ అన్నదమ్ములు. చీరాల పరిసరాల్లో చీపురులు అమ్ముతూ జీవనం సాగిస్తారు. సంపాదన సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గత 6 నెలలుగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. చీరాల 1 టౌన్, అద్దంకి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 4 ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. చీరాల 1 టౌన్ పోలీసులు వారిని ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు.
జిల్లా సిసిఎస్ పోలీసులు మరియు జిల్లా పోలీస్ యంత్రాంగం కలిసి కేసులను ఛేదించి, బాపట్లలో సాంబశివరావును, చీరాలలో గోపి మరియు దుర్గలను అరెస్ట్ చేశారు. మొత్తం ముగ్గురు ముద్దాయిల నుండి రూ. 21.2 లక్షల విలువగల 37 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
*ఎస్పీ గారి సందేశం:*
ద్విచక్ర వాహనాల దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గడిచిన వారం రోజుల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం రూ. 40 లక్షల విలువ గల 60 బైకులను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనాలకు సేఫ్టీ లాక్లు, జిపిఎస్ పరికరాలు అమర్చుకోవాలని తెలిపారు. లక్షల రూపాయలు ఖర్చుచేసి వాహనాలను కొనుగోలు చేసేవారు, వాహనాలు దొంగతనాలకు గురికాకుండా ఉండేందుకు సేఫ్టీ లాక్ లు, జిపిఎస్ ఏర్పాటు చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించవద్దని ప్రజలకు తెలిపారు.
*ప్రశంసలు*
ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను సమర్థవంతంగా చేధించి, ముద్దాయిలను అరెస్ట్ చేసి, 37 వాహనాలను సీజ్ చేసినందుకు సిసిఎస్ డిఎస్పీ పి. జగదీష్ నాయక్, ఇన్స్పెక్టర్ ప్రేమయ్య, బాపట్ల టౌన్ ఇన్స్పెక్టర్ రాంబాబు, చీరాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, సిసిఎస్ ఎస్ఐ రాంబాబు, సిసిఎస్ కానిస్టేబుల్స్ కోటేశ్వరరెడ్డి, కృష్ణ, సురేష్, దాసు, చిరంజీవి, హోంగార్డ్ రవూఫ్లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డులను అందజేశారు.
ఈ సమావేశంలో సిసిఎస్ డిఎస్పీ జగదీష్ నాయక్, సిసిఎస్ సిఐ ప్రేమయ్య, బాపట్ల టౌన్ సిఐ రాంబాబు, చీరాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
#📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢
*బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రెస్ నోట్, తేది: 07.12.2025*
*వరుసగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు అరెస్ట్*
*చాకచక్యంగా ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసిన బాపట్ల సిసిఎస్ పోలీసులు*
*ముద్దాయిల నుండి రూ. 21.2 లక్షల విలువ గల 37 ద్విచక్ర వాహనాలు స్వాధీనం*
*గడిచిన వారం రోజుల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం రూ. 40 లక్షల విలువ గల 60 బైకులను రికవరీ*
*ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వాహనాలకు సేఫ్టీ లాక్లు, జిపిఎస్ వంటి పరికరాలు అమర్చుకోవాలని*
*పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించి కేసు వివరాలను మీడియాలో వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు*
బాపట్ల జిల్లాలో వరుసగా చోటుచేసుకున్న ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా చేధించి, దొంగతనాలకు పాల్పడుతున్న వారిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
*కేసు వివరాలు*
1. Cr.No. 126/2025 U/S 303 (2) BNS of Vedullapalli PS (Bapatla Dist.)
2. Cr.No. 424/2025 U/S 303 (2) BNS of Bapatla Town PS (Bapatla Dist.)
3. Cr.No. 540/2023 U/S 379 IPC of Krishnalanka PS (NTR Dist.)
4. Cr.No. 254/2025 U/S 303 (2) BNS Chirala 1 Town PS (Bapatla Dist.)
5. Cr.No. 255/2025 U/S 303 (2) BNS Chirala 1 Town PS (Bapatla Dist.)
6. Cr.No. 256/2025 U/S 303 (2) BNS Chirala 1 Town PS (Bapatla Dist.)
7. Cr.No. 249/2025 U/S 303 (2) BNS Addanki PS (Bapatla Dist.)
*ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను ఛేదించిన విధానం:*
బాపట్ల జిల్లాలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు సవాలుగా తీసుకొని, బాపట్ల సిసిఎస్ డిఎస్పీ పి. జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో సిసిఎస్ సిఐ ప్రేమయ్య మరియు వారి సిబ్బంది, జిల్లా పోలీస్ యంత్రాంగంతో కలిపి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, సీసీ కెమెరాల ఆధారంగా వరుస కేసులను చాకచక్యంగా ఛేదించి, దొంగతనాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేశారు. దొంగిలించబడిన రూ. 21.2 లక్షల విలువగల 37 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
*ముద్దాయిల వివరాలు*
1. కగ్గ. సాంబశివరావు, S/O ప్రేమిలి, వయసు: 32 సంవత్సరాలు, కులం: ఉప్పర, పొత్తూరు గ్రామం, గుంటూరు మండలం, గుంటూరు జిల్లా.
2. దాసరి గోపిరాజు @ గోపి, S/O కోటేశ్వరరావు, 32 సంవత్సరాలు, కులం: ఎరుకుల, జగనన్న కాలనీ, బుర్లవారిపాలెం. ప్రస్తుత నివాసం: గాంధీనగర్ యానాది సంఘం, కోర్టు సెంటర్ వద్ద, పేరాల, చీరాల పట్టణం.
3. దాసరి దుర్గా రావు @ దుర్గ, S/O కోటేశ్వరరావు, 24 సంవత్సరాలు, కులం: ఎరుకుల, జగనన్న కాలనీ, బుర్లవారిపాలెం. ప్రస్తుత నివాసం: గాంధీనగర్ యానాది సంఘం, కోర్టు సెంటర్ వద్ద, పేరాల, చీరాల పట్టణం.
*ముద్దాయిలు నేరం చేసిన విధానం:*
*కగ్గ. సాంబశివరావు*
లారీ డ్రైవర్గా పనిచేస్తూ చెడు వ్యసనాలు మరియు విలాసాలకు అలవాటు పడటం వల్ల వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో, గత రెండు సంవత్సరాలుగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇళ్ల ముందర, ఆసుపత్రుల వద్ద పార్క్ చేసిన బైకులను దొంగతాళాలతో లాక్ తెరిచి దొంగతనం చేస్తూ వచ్చాడు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, విజయవాడ, ఎన్టిఆర్ జిల్లాల్లో వరుస దొంగతనాలు చేసినట్లు తేలింది. దొంగతనం చేసిన వాహనాలను ఇతర జిల్లాల్లో విక్రయించేవాడు. ఇతడి మీద గతంలో ఎటువంటి కేసులు లేవు. మొత్తం 33 బైకులను దొంగిలించినట్లు గుర్తించారు. బాపట్ల టౌన్ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు.
*దాసరి గోపిరాజు @ గోపి మరియు దాసరి దుర్గా రావు @ దుర్గ*
ఇద్దరూ అన్నదమ్ములు. చీరాల పరిసరాల్లో చీపురులు అమ్ముతూ జీవనం సాగిస్తారు. సంపాదన సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గత 6 నెలలుగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. చీరాల 1 టౌన్, అద్దంకి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 4 ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. చీరాల 1 టౌన్ పోలీసులు వారిని ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు.
జిల్లా సిసిఎస్ పోలీసులు మరియు జిల్లా పోలీస్ యంత్రాంగం కలిసి కేసులను ఛేదించి, బాపట్లలో సాంబశివరావును, చీరాలలో గోపి మరియు దుర్గలను అరెస్ట్ చేశారు. మొత్తం ముగ్గురు ముద్దాయిల నుండి రూ. 21.2 లక్షల విలువగల 37 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
*ఎస్పీ గారి సందేశం:*
ద్విచక్ర వాహనాల దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గడిచిన వారం రోజుల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం రూ. 40 లక్షల విలువ గల 60 బైకులను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనాలకు సేఫ్టీ లాక్లు, జిపిఎస్ పరికరాలు అమర్చుకోవాలని తెలిపారు. లక్షల రూపాయలు ఖర్చుచేసి వాహనాలను కొనుగోలు చేసేవారు, వాహనాలు దొంగతనాలకు గురికాకుండా ఉండేందుకు సేఫ్టీ లాక్ లు, జిపిఎస్ ఏర్పాటు చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించవద్దని ప్రజలకు తెలిపారు.
*ప్రశంసలు*
ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను సమర్థవంతంగా చేధించి, ముద్దాయిలను అరెస్ట్ చేసి, 37 వాహనాలను సీజ్ చేసినందుకు సిసిఎస్ డిఎస్పీ పి. జగదీష్ నాయక్, ఇన్స్పెక్టర్ ప్రేమయ్య, బాపట్ల టౌన్ ఇన్స్పెక్టర్ రాంబాబు, చీరాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, సిసిఎస్ ఎస్ఐ రాంబాబు, సిసిఎస్ కానిస్టేబుల్స్ కోటేశ్వరరెడ్డి, కృష్ణ, సురేష్, దాసు, చిరంజీవి, హోంగార్డ్ రవూఫ్లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డులను అందజేశారు.
ఈ సమావేశంలో సిసిఎస్ డిఎస్పీ జగదీష్ నాయక్, సిసిఎస్ సిఐ ప్రేమయ్య, బాపట్ల టౌన్ సిఐ రాంబాబు, చీరాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
#🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢
గుంటూరు డిసెంబర్ 07:ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా EAGLE (ఈగల్) విభాగం నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు - సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో ఈగల్ విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ ఆకె.రవికృష్ణ గారు, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారీయా గారు, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ గారు, నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు గారు తదితరులు పాల్గొన్నారు.
#📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢
*గంజాయి కేసులో ముద్దాయిలు అరెస్ట్*
వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయంపై వచ్చిన విశ్వసనీయ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, ఎస్ఐ భాగ్యరాజు గారి ఆధ్వర్యంలో వెదులపల్లి విఆర్ఓ మరియు స్టువర్టుపురం విఆర్వోలను వెంట తీసుకొని వృక్షనగర్ ప్రాంతంలో దాడి నిర్వహించారు.
దాడి సమయంలో మేడ్రగుత్తి ప్రతాప్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తుండగా గుర్తించారు. అదే సమయంలో సాయి హర్షద రెడ్డి అనే వ్యక్తి ప్రతాప్ నుండి గంజాయి కొనుగోలు చేసినట్టు నిర్ధారణ జరిగింది.దీంతో ఇద్దరినీ వెంటనే అదుపులోకి తీసుకుని విచారించి VRΟల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసును దర్యాప్తు చేసి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారు ఈ నెల 19 వరకు రిమాండ్ కు పంపించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ భాగ్యరాజు గారు మాట్లాడుతూ
వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, మత్తు బిళ్లు, నాటు సారాయి వంటి నిషేధిత పదార్థాలను అమ్మేవారిపై మరియు కొనుగోలు చేసేవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేస్తాం.
అలాగే, ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఉన్నవారు ఎద్దులపల్లి పోలీసులకు తెలియజేయాలని, సమాచారదాత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
#🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్
గుంటూరు జిల్లా,నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో లో గంజాయి పట్టివేత..
సౌత్ డీఎస్పీ బాణోదయ.
పలకలూరు రోడ్ లో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి ముప్పిరి సుబ్బారావు (38) అనే వ్యక్తిని అరెస్ట్ చేశాం..
సుబ్బారావు వద్ద నుండి సుమారు 3 kg ల గంజాయి స్వాధీనం చేసుకున్నాం..
సుబ్బారావు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.గంజాయి అమ్మితే డబ్బులు ఎక్కువ వస్తూ ఉండటంతో గంజాయి ఒరిస్సా నుండి తెచ్చి విక్రయిస్తున్నాడు..
నిందితుడికి సహాయం చేస్తున్న మరియు గంజాయి వినియోగిస్తున్న మరో 7గురిని కూడా అరెస్ట్ చేశాం..
అరెస్ట్ చేసిన వారిలో 5 గురిపై హత్యయత్నం మరియు హత్య కేసులలో రౌడీ షీట్లు తెరవబడి ఉన్నాయి..
నిందితుడుకి గంజాయి సేవించే అలవాటు ఉండటంతో అతను సేవించడానికి తెచ్చుకొని దానిలో కొంత భాగం గంజాయిని బయట వ్యక్తులకు అమ్ముతున్నాడు..
గంజాయి మొత్తని ఒరిస్సా లోని అల్సంధాపూర్ అనే చోట నుండి కిలో 2000/- రూపాయలకు కొనుగోలు చేశాడు..
గంజాయి సప్లై చేసే వారిపై నిఘా పెంచాం.గంజాయి విక్రయించిన ఎవరైనా వాడిన చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం...
#🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢
*బ్రేకింగ్*...
*మళ్ళీ మారు వేషం లో జిజిహెచ్ సూపరింటెండెంట్*..
*మార్చురిలో గంట పాటు పరిశీలన*..
*రాత్రి చనిపోయిన రోగుల బంధువుల నుంచి వివరాలు సేకరించిన వైనం*...
#🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్డేట్స్




![📰ఈరోజు అప్డేట్స్ - alunllulfi] | Uinlfjalillసl నdhi PONNURU RURALPOUOESTITION తెనాలిగబొడివడన్; గుంటnరుణణ wfzb &nbट (oट UoRu" taotar 10b*516 Mnt lkol [ 1٧ alunllulfi] | Uinlfjalillసl నdhi PONNURU RURALPOUOESTITION తెనాలిగబొడివడన్; గుంటnరుణణ wfzb &nbट (oट UoRu" taotar 10b*516 Mnt lkol [ 1٧ - ShareChat 📰ఈరోజు అప్డేట్స్ - alunllulfi] | Uinlfjalillసl నdhi PONNURU RURALPOUOESTITION తెనాలిగబొడివడన్; గుంటnరుణణ wfzb &nbट (oट UoRu" taotar 10b*516 Mnt lkol [ 1٧ alunllulfi] | Uinlfjalillసl నdhi PONNURU RURALPOUOESTITION తెనాలిగబొడివడన్; గుంటnరుణణ wfzb &nbट (oट UoRu" taotar 10b*516 Mnt lkol [ 1٧ - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_710962_63b7b6a_1765126708244_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=244_sc.jpg)





