Follow
newj today
@newjtoday
1,068
Posts
1,174
Followers
newj today
439 views
*టాలీవుడ్ కొత్త జంట విజయ్, రష్మిక దంపతులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు..* #🆕Current అప్‌డేట్స్📢 మార్చి 4న జరగనున్న తమ వివాహ రిసెప్షన్‌కు రావాలని ప్రధానిని ఆహ్వానించారు..
newj today
527 views
✒️- వండర్ హార్స్: 37 ఏళ్లు జీవించిన 'ఫ్యాన్సీ' సాధారణంగా గుర్రాల సగటు జీవితకాలం 25 నుంచి 30ఏళ్లు. కానీ యజమానులు చూపే ప్రేమ, మెరుగైన సంరక్షణతో అవి ఈ పరిమితిని అధిగమిస్తున్నాయి. 'ఫ్యాన్సీ' అనే పెంపుడు గుర్రం 37ఏళ్లు జీవించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. అత్యధికంగా 'ఓల్డ్ బిల్లీ' అనే గుర్రం ఏకంగా 62ఏళ్లు (1760–1822) జీవించింది. దీని పుర్రెను బెడ్ఫోర్డ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు•• #🆕Current అప్‌డేట్స్📢
newj today
603 views
శ్రీవారి హుండీలో డిజిటల్ మొక్కులు #🆕Current అప్‌డేట్స్📢 AP: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి కొండపై TTD కొత్త విధానం తీసుకురానుంది. పెరిగిన డిజిటల్ చెల్లింపులకు అనుగుణంగా స్వామివారి హుండీలో కానుకలు సమర్పించేందుకు శ్రీవారి ముడుపు పత్రం విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. TTD ప్రత్యేక కౌంటర్లలో UPI ద్వారా చెల్లిస్తే ముడుపు పత్రం అందిస్తారు. దీన్ని గర్భాలయం వెలుపల ఉన్న శ్రీవారి హుండీలో వేసి మొక్కును చెల్లించుకోవచ్చు. నగదు లేని భక్తులకు ఈ విధానం ఉపయోగపడనుంది
newj today
578 views
*ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో నిరుపేదల ఇళ్ల కూల్చివేత… హృదయ విదారక దృశ్యాలు* .😭. ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల ప్రాంతంలో నిరుపేదల ఇళ్లను కూల్చివేయడంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. సంవత్సరాలుగా నివసిస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డున పడటంతో కన్నీటి పర్యంతమయ్యాయి. ఇళ్ల అవశేషాల మధ్య చిన్నపిల్లలు, వృద్ధులు నిరాశ్రయులుగా కనిపించటం హృదయ విదారకంగా మారింది. తమ సామాన్లు, గృహోపకరణాలు శిధిలాల మధ్యే మిగిలిపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల ప్రకారం ముందస్తు నోటీసులు సరైన విధంగా ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం ఆక్రమణలపై చర్యల్లో భాగంగానే కూల్చివేత చేపట్టినట్లు చెబుతున్నారని సమాచారం. #🆕Current అప్‌డేట్స్📢
newj today
524 views
> *కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు..* *కేరళ పేరు కేరళంగా మారుస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం..* #🆕Current అప్‌డేట్స్📢 అహ్మదాబాద్‌ మెట్రో ఫేజ్-2కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం.. జబల్‌పూర్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు గ్రీన్ సిగ్నల్.. విద్యుత్‌ రంగంలో సంస్కరణలకు ఆమోదం.. దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు గ్రీన్‌సిగ్నల్.. 14 ఏళ్ల బాలికులకు ఉచితంగా గర్దాసిల్‌ ఇంజెక్షన్‌ ఇవ్వాలని నిర్ణయం
newj today
670 views
*_T20 World Cup: టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా సెమీస్ చేరదు.. లెక్కలు ఇవిగో_* #🆕Current అప్‌డేట్స్📢 * దక్షిణాఫ్రికా చేతిలో భారీ ఓటమితో టీమిండియా సెమీ-ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో నెట్ రన్ రేట్ -3.800కు పడిపోయింది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో(వెస్టిండీస్, జింబాబ్వేపై) భారీ విజయాలు సాధించడం, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడటం భారత్‌కు తప్పనిసరైంది. సెమీస్ చేరాలంటే నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవడం అత్యవసరం. * టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌కు అనూహ్యమైన భారీ షాక్ తగిలింది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా 76 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ ఘోర పరాజయం భారత జట్టు సెమీ-ఫైనల్ అవకాశాలను తీవ్రంగా సంక్లిష్టం చేసింది. కేవలం ఓటమి మాత్రమే కాకుండా, భారీ తేడాతో ఓడిపోవడంతో భారత జట్టు నెట్ రన్ రేట్(NRR) ఘోరంగా దెబ్బతింది. ప్రస్తుతం టీమిండియా నెట్ రన్ రేట్ -3.800గా నమోదైంది. ఇది సెమీస్ రేసులో భారత్‌కు తీవ్ర ప్రతికూలంగా మారింది. * టీమిండియా సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే, మిగిలి ఉన్న రెండు సూపర్ 8 మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించడం తప్పనిసరి. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లలో వెస్టిండీస్, జింబాబ్వే జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో విజయాలు సాధించడం ద్వారా భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు వచ్చి చేరతాయి. అయితే, కేవలం విజయాలు మాత్రమే సరిపోవు. నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవడం అత్యవసరం, ఎందుకంటే గ్రూప్‌లో ఇతర జట్లు కూడా నాలుగు పాయింట్లతో ముగించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులలో, మెరుగైన నెట్ రన్ రేట్ కలిగిన జట్టే సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో భారత్ పూర్తిగా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో విజయం సాధించినా, మరో రెండు జట్లు కేవలం రెండు పాయింట్లు మాత్రమే సాధిస్తే భారత్ సెమీస్‌కు చేరుకుంటుంది. అయితే, ఒకవేళ మరో రెండు జట్లు కూడా నాలుగు పాయింట్లతో ఉంటే, అప్పుడు టీమిండియాకు సెమీస్ చేరడం కష్టమవుతుంది. ఈ సంక్లిష్ట పరిస్థితులలో టీమిండియా తన నెట్ రన్ రేట్‌ను సాధ్యమైనంత మేరకు మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించాలి. * సెమీ-ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియాకు కొన్ని నిర్దిష్ట పరిస్థితులు అనుకూలించాలి. ఉదాహరణకు, భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే గెలిస్తే, అప్పుడు దక్షిణాఫ్రికా తమ మిగిలిన అన్ని మ్యాచ్‌లలోనూ గెలవాల్సి ఉంటుంది. అంతేకాకుండా, వెస్ట్ ఇండీస్ వర్సెస్ జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్ విజేతను టీమిండియా ఓడించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో, భారత్, వెస్ట్ ఇండీస్, జింబాబ్వే జట్లు తలా రెండు పాయింట్లతో ఉంటాయి. ఈ స్థితిలో, మెరుగైన నెట్ రన్ రేట్ కలిగిన జట్టు ముందంజ వేస్తుంది. ఇది టీమిండియాకు మరింత ఒత్తిడిని పెంచుతుంది. భారత జట్టు తమ తదుపరి మ్యాచ్ ఈ నెల 26వ తేదీన జింబాబ్వేతో చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియం వేదికగా తలపడనుంది. ఆ తరువాత, మార్చి ఒకటవ తేదీన వెస్ట్ ఇండీస్‌తో కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో భారత జట్టు కేవలం గెలవడమే కాకుండా, భారీ మార్జిన్‌తో విజయాలు సాధించడం, తద్వారా తమ నెట్ రన్ రేట్‌ను గణనీయంగా పెంచుకోవడం అత్యంత కీలకం. ఈ భారీ ఓటమి సెమీస్ ఆశలపై మరింత క్లిష్టం చేసుకుందని చెప్పడంలో సందేహం లేదు. *𝗡𝗮𝗿𝗲𝘀𝗵 𝗠𝘂𝗱𝗶𝗿𝗮𝗷✍️*
newj today
549 views
*చిలీ రాజధాని* శాంటియాగోలోని రెంకా ప్రాంతంలో గురువారం (ఫిబ్రవరి 19, 2026) భీకర ప్రమాదం జరిగింది. ఓ బిజీ హైవేపై వెళ్తున్న లిక్విడ్ గ్యాస్ ట్యాంకర్ ఒక్కసారిగా బోల్తా పడి పేలిపోవడంతో నలుగురు మృతి చెందగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ భారీ పేలుడు దాటికి సుమారు 50 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 200 మీటర్ల వ్యాసార్థం వరకు మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. మృతుల్లో ట్యాంకర్ డ్రైవర్ కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. #🆕Current అప్‌డేట్స్📢
newj today
577 views
*_అలర్ట్..తెలంగాణలో స్కూల్స్ సమయం మార్పు, సమ్మర్ హాలీడేస్ ప్రకటన.._* _తెలంగాణలో ఎండలు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులను ప్రారంభిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది._ *_అలాగే వేసవి సెలవుల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది._* _మార్చి 16 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే పనిచేస్తాయి. 10వ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం తరగతులు మధ్యాహ్నం 1:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతాయి. ఏప్రిల్ 24 నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. జూన్ 12న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి._ *_ఉర్దూ మీడియం పాఠశాలలకు ప్రత్యేక రాయితీ:_* _పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని, ఉర్దూ మీడియం స్కూల్స్ సమయాల్లో మార్పులు చేశారు. ఈ పాఠశాలలు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు పనిచేస్తాయి. సిలబస్ పూర్తి చేసేందుకు అవసరమైతే వారానికి ఒకసారి అదనపు తరగతులు నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు._ _ఎండ తీవ్రత వల్ల విద్యార్థులు వడదెబ్బకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తల్లిదండ్రులు తమ ప్రయాణ ప్రణాళికలను ఈ షెడ్యూల్ ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చని సూచించింది._ #🆕Current అప్‌డేట్స్📢
See other profiles for amazing content