తల్లికి వందనం అందించిన
లోకేష్ గారికి ధన్యవాదాలు
పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టికి చెందిన ఎం. కృష్ణవేణి ఇద్దరు పిల్లలు గతంలో సచివాలయ స్థాయిలో చోటు చేసుకున్న సాంకేతికపరమైన పొరపాటు కారణంగా ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయినట్లు నమోదై ఉంది.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం కృష్ణవేణి కుటుంబానికి అందలేదు. అయితే, ఈ సమస్యను పరిష్కరించాలంటూ ఆమె పలుమార్లు సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. మెళియాపుట్టి తెలుగు యువత అధ్యక్షుడు సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి ఈ సమస్య తక్షణమే పరిష్కరించాలని తన యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. మంత్రి సిబ్బంది కృషితో సాంకేతిక పొరపాటును సరిదిద్దారు. దీంతో ఇద్దరు పిల్లలకు తల్లికి వందనం పథకం నిధులు తల్లి ఖాతాలో జమయ్యాయి. తన సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేష్ గారికి, స్థానికనేతలకు కృష్ణవేణి కృతజ్ఞతలు తెలియజేసింది.
#TallikiVandanam
#NaraLokesh
#AndhraPradesh
#GatewayToUttarandhra