Follow
maa Putta
@putta777
10,358
Posts
23,894
Followers
maa Putta
537 views
3 hours ago
*అలసిన వానిని ఊరడించు మాటలు* 🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 *సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన* *అనుదిన ధ్యానములు* 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 *🌷🌷ఏప్రిల్ 6🌷🌷* *"నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును" (కీర్తనలు 34:19)* *ఆయన అనుమతించు అనేక పరిశోధనల ద్వారా ప్రభువు మనకు అనేక ఆత్మీయ పాఠములు నేర్పించగోరుచున్నాడు.* 1. మనము యేసు ప్రభువును మన స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయనే మన నీతియగును. అందరికి కనబడు రీతిగా, యోబు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు (యోబు 1:1) అయినప్పటికీ, అతడు శ్రమల కర్మాగారం ద్వారా వెళ్లిన తరువాత అదే యోబు, యోబు గ్రంథము 42:5,6 లలో ఈ విధముగా చెప్పుచున్నాడు, "వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను, బూడిదెలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను". యోబు బాధాకరమైన శ్రమల ద్వారా వెళ్లిన తరువాతనే తన నిజ స్వభావము పాప యుక్తమైనదని, చెడిపోయినదని చూడగలిగెను. పరిశుద్ధుడు, జీవము గలవాడు, నీతి మంతుడునైన దేవుని గూర్చిన వ్యక్తిగత అనుభవము ద్వారానే తాను నీతి మంతుడుగా కాగలడని గ్రహించెను. 2. శ్రమల ద్వారానే మనము బలమైన, నిజమైన విశ్వాసమును పెంపొందించు కొనగలము (1 పేతురు 1:7) అది, అనేక విధములైన శుద్ధి చేయు అగ్ని ద్వారా వెళ్ళినప్పుడే నిష్కళంకముగాను, ప్రకాశమానము గాను కాగలదు. 3. మనము సరియైన మార్గములో నుండుటకు ఈ శ్రమలు సహాయపడును. "శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను" (కీర్తనలు 119:67) 4. మనమాయన కట్టడలను, ఆజ్ఞలను నేర్చుకొనునట్లు దేవుడు మనకు కష్టములను అనుమతించును. మానవ సంబంధమైన ఏ పుస్తకము ద్వారా కూడా దేవుని కట్టడలను అర్ధము చేసికొనగలమను ఆశలేదు. "నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయెను". (కీర్తనలు 119:71) 5. కఠినమైన అనుభవములు చివరకు మనలను ఆత్మీయముగా సంపన్నమైన స్థలము లోనికి నడిపించును, మన ప్రత్యక్షతను విస్తరింపజేయును, మనకు విశాల హృదయము కలుగ జేయును. కీర్తనలు 66:12లో "మేము నిప్పులలోను నీళ్ల లోను పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి యున్నావు" అని చదువుదుము. 6. ఈ పరీక్షల ద్వారా, వెలుగులో నున్న పరిశుద్ధులతో పాటు, పరలోకపు స్వాస్థ్యము కొరకై సిద్ధపరచ బడుచున్నాము. "క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల, క్రీస్తు తోడి వారసులము" (రోమా 8:17) 7. మనము దుఃఖములు, శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు, అదే విధమైన శ్రమలు, పరీక్షల ద్వారా వెళ్లుచున్న వారిని ఆదరించుటకు సిద్ధపరచ బడగలము (2 కొరింతి 1:4) 8. యేసు క్రీస్తు ప్రభువు యొక్క నామము కొరకు మనము అపహసించబడి, హేళన చేయబడిన యెడల, ఆయనతో మన ఏకత్వము యొక్క విలువను చక్కగా గ్రహించగలము (మత్తయి 10:24,25) "శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాదు. శిష్యుడు తన బోధకునివలె ఉండిన చాలును" అని మనము చూచుచున్నాము. 9. శ్రమలు మనలను దీనులనుగా చేయును. పౌలుకు తన శరీరములోని ముళ్ళు మిక్కిలి బాధాకరంగా నుండి యుండవచ్చును. అతనిని దీనునిగా చేయుటకే ప్రభువు అతని జీవితములో దానిని అనుమతించెను ( 2 కొరింధీ 12:7-9) 10. కఠిన అనుభవములు ద్వారానే సంపూర్ణమైన దేవుని శక్తిని అనుభవించుటకు సిద్ధపరచ బడుదుము. 2 కొరింతి. 12:9 లో "నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి యుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయ పడుదును" అని చూచుచున్నాము. Please share 🙏🏼Praise the LORD.🙏🏼 #📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝
maa Putta
912 views
1 days ago
*అలసిన వానిని ఊరడించు మాటలు* 🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 *సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన* *అనుదిన ధ్యానములు* 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 *🌷🌷ఏప్రిల్ 5🌷🌷* *" క్రీస్తు మృతులలో నుండి లేపబడి యున్నాడు" (1 కొరింతి. 15:20)* *జీవముగల మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క పునరుర్ధానమును గూర్చి ఏడు గొప్ప రుజువులు కలవు.* 1. పాతనిబంధన లో ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనములు (యెషయా 25:8, హోషేయ 13:14, కీర్తనలు 16:10) మరణమును గెల్చుటను గూర్చి ఎవరును కలగనలేదు. ప్రపంచ చరిత్ర అంతటిలో ఒకే ఒక సంఘటన కలదు. ఆయన "విజయమందు మరణం మ్రింగివేయబడెను". 2. ఆయన సిలువ వేయబడక ముందు ప్రభువు తానే తన శిష్యులతో చెప్పిన ప్రవచనములు " మనుష్య కుమారుడు చంపబడి తిరిగి లేచును" (మార్కు 8:31; 9:31: 10:34; యోహాను 10:18) 3. ఆదివారమున తెల్లవారుచుండగా దూతలు ఇచ్చిన సాక్ష్యము. " ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి యున్నాడు" ( లూకా 24: 5,6) 4. ఖాళీ సమాధి. " వారు సమాధిలోనికి ప్రవేశించి ప్రభువైన యేసు యొక్క దేహమును కనుగొనలేదు". ఈనాటికి కూడా యెరూషలేములో ఖాళీ సమాధిని చూడగలము. ప్రతి దినము ప్రపంచములోని అనేక ప్రాంతముల నుండి దానిని చూచుటకు ప్రజలు వచ్చుచుందురు. ఇతర సమాధులు చనిపోయిన వారి ఎముకలతో నిండియుండును గాని ఇది ఖాళీ సమాధి. 5. ప్రభువు, తిరిగి లేచిన తరువాత 40 దినములలో, పది వేరు వేరు సందర్భములలో, వేరు వేరు దినములలో శిష్యులకు కనబడెను. మొదటి దినమున 5 పర్యాయములు, రెండవదినము నుండి ఆయన ఆరోహణ దినమువరకు 5 సార్లు కనబడెను. మొదట సమాధి యొద్ద మగ్దలేనే మరియకు కనబడెను. తరువాత ఇతర స్త్రీలు సమాధి యొద్ద నుండి తిరిగి వచ్చు చుండగా వారికి కనబడెను. తరువాత సీమోను పేతురుకు కనబడెను. ఎమ్మాయుకు వెళ్ళు ఇద్దరు శిష్యులకు, అదే సాయంకాలమున గదిలో చేరిన శిష్యులు తలుపులు మూసికొనియుండగా వారికి కనబడెను. 1 కొరింతి. 15:6 లో చూచినట్లు యెరూషలేములోని 500 మంది శిష్యులకు కనబడెను. తరువాత అపొస్తలుడైన యోహానుకు కనబడెను. తోమా కొరకై ఎనిమిదవ సారి ఎనిమిదవ దినమున కనబడెను. తిబెరియా సముద్రము నొద్ద తొమ్మిదవ సారి కనబడెను (యోహాను 21) ఆయన పరలోకమునకు ఆరోహణము కాకమునుపు బేతనియలో కనబడెను. ఘోరపాపిని దేవుని బిడ్డగా చేయుటకై, ఆయన పునరుర్ధాన శక్తి ద్వారా మనలోనికి రాగలడని చూపించుటకై 40 దినములలో ఆ విధముగా పది పర్యాయములు ఆయన కనబడెను. 6. ఆయన పరలోకమునకు వెళ్లిన తరువాత కనబడిన విధము. ఆయన స్తెఫనుకు కనబడెను (అపో.కా. 7:54,55) పౌలు అని పిలువబడిన సౌలుకు కనబడెను (అపో.కా 9:3-5) పత్మాసు ద్వీపములో యోహానుకు కనబడెను (ప్రకటన 1) 7. ఈ ఆరు రుజువులకంటెను నీవు ఎవరితో మాట్లాడుదువో వారిని ఒప్పించగల అతి ప్రాముఖ్యమైన ఇంకొక రుజువు కలదు. ఆయన ప్రతి విశ్వాసిలో నివసించును. ప్రపంచములోని ఏ భాగమునందైనను ఆయన యందు విశ్వాసముంచు వారిలో నివసించుటకు ఆయన వచ్చును. మనమందరము అదే చెప్పగలము. " ఆయన నా యందు నివశించుచున్నాడు, ఆయన నాయందు నివశించుచున్నాడు". అందుచేతనే ఇప్పుడు మేము అదే ప్రశ్న నీకు వేయుచున్నాము. *జీవము గల ప్రభువు నీలో నివసించుచున్నాడా?* Please share 🙏🏼Praise the LORD.🙏🏼 #📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝