సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నా స్టెటష్

బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
569 వీక్షించారు
1 రోజుల క్రితం
గురువు డాక్టర్ సర్వేపల్లి జీవితం ఓ స్ఫూర్తి పాఠం! ( 17 - 4 - 2026)! లేదా ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధకృష్ణన్ గారి 51వ వర్ధంతిని పురస్కరించుకొని! వృత్తిరీత్యా,వ్యక్తిత్వ రీత్యా,సంస్కార రీత్యా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మహోన్నతుడు.పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది,చిన్నతనం నుంచే అసాధారణ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించిన డాక్టర్ సర్వేపల్లి స్వశక్తితో ఉన్నత శిఖరాలకు ఎదిగి పలువురికి మార్గదర్శకంగా,తన వృత్తి ధర్మానికి ఓ మకుటంగా వెలిగారు.గురువులకు గురువుగా ఉపాధ్యాయవృత్తికి ఆదర్శంగా నిలిచిన ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు.విద్యార్థికి,ఉపాధ్యాయునికి మధ్య సంబంధం ఎలా ఉండాలో విడమరచి చెప్పారు ఆచార్య రాధాకృష్ణ.ఆధ్యాపకుడిగా,వైస్ ఛాన్సలర్ గా, దౌత్యవేత్తగా,ఉపరాష్ట్రపతిగా,రాష్ట్రపతిగా ఆయన దేశానికి అందించిన సేవలు నిరుపమానం,అనితర సాధ్యం.ఆయన అధిరోహించిన శిఖరాలు ఆయన జీవితంలోని అసాధారణ కోణాలను మనకు వెల్లడి చేస్తాయి.ఇక ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు,మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.ముఖ్యంగా ఆయన తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం.ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5న ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము కూడా. ఏదిఏమైన నాలుగు దశాబ్దాల పాటు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఉపాధ్యాయవృత్తి లోనే గడిపారు.ఎదుటి వారికి బోదించడం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని మనసా,వాచ,కర్మనా నమ్మి ఆచరించిన వ్యక్తి ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.ప్రదానంగా కష్టమైన అంశాన్ని కూడా విద్యార్థులకు అతి సులభంగా బోదించే వారాయన, అంతేకాదు ఉపాధ్యాయుడి బాధ్యత ఎప్పుడు గురుతరమైనదే,అలాంటి భోదనా వృత్తికే తలమానికంగా నిలిచిన గొప్ప ఘన చరిత్ర ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిది అనే మాట అక్షర సత్యం.ఏమైనా ఈ రోజు ఏప్రిల్ 17 ఆయన 51వ వర్ధంతిని పురస్కరించుకొని యావత్ ఉపాధ్యాయ వృత్తికే ఎనలేని వన్నె తెచ్చిన ఆ మహోన్నతునికి, కారణజన్మునికి ఈ ప్రత్యేక సందర్బంగా కోట్లాది మంది భారతీయులు మరియు ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ ఆదర్శ వ్యక్తికి అత్యంత గొప్పగా,ఘనంగా నివాళులు అర్పించాల్సిన తరుణం ఇదే.అమర్ రహే!అమర్ రహే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు!జైహింద్!మేరా హిందూస్తాన్ మహాన్!🇮🇳🇮🇳🇮🇳✍️✍️✍️ - బుగ్గన #సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!