కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)

Panduranga Reddy kappati
712 views
7 days ago
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు ఆశయ సాధనే లక్ష్యం.. సంపూర్ణ తెలంగాణ వికాసమే ధ్యేయం!* ​తెలంగాణ బిడ్డల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, ఒక కొత్త రాజకీయ శక్తిగా మీ ముందుకు వస్తోంది శ్రీమతి కవితమ్మ గారి నాయకత్వంలో తెలంగాణ జాగృతి. సర్వోదయ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆహ్వానిస్తున్నాం. ​తెలంగాణ పునర్నిర్మాణం మరియు అమరుల ఆశయాల సాధన కోసం అడుగులు వేస్తూ, సరికొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభకు మీరు తప్పక విచ్చేయగలరు. *​ముఖ్య కార్యక్రమం: కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావ ప్రకటన & బహిరంగ సభ* *వేదిక: అద్వయ కన్వెన్షన్, మునీరాబాద్, మేడ్చల్*. సమయం: ఏప్రిల్ 25, 2026, ఉదయం 8 గంటలకు. *​మీ రాక మాకు కొండంత బలం.* *​మీ అడుగు.. తెలంగాణ ప్రగతికి తొలి అడుగు!* తమ విశ్వసనీయ *కప్పాటి పాండురంగా రెడ్డి* తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
Panduranga Reddy kappati
771 views
20 days ago
AI indicator
*ధర్మం వెలిగిన హృదయం💚* *సత్యం నడిచిన మార్గం🕉️* *శ్రీరాముని స్ఫూర్తితో జీవితం పావనం అవ్వాలి🙏🏻* _ఒక కొడుకుగా, సోదరుడిగా, భర్తగా, తండ్రిగా, స్నేహితుడిగా,రాజు గా శ్రీ రామ చరితం అన్ని విధాలా ఆదర్శ ప్రాయం. ఆ మహనీయుడి జీవితం మన జీవన గమనానికి తారక మంత్రం !_ ధర్మం నిలిచిన చోటే శ్రీరాముడు — మన హృదయం ఆయన ఆలయం కావాలి. సత్యం నడిచిన ప్రతి మార్గం శ్రీరాముడిదే — ఆ మార్గంలో నడిచే మన జీవితం పవిత్రం కావాలి. మనసులో ధర్మం వెలిగితే ప్రతి శ్వాసలో శ్రీరాముడు — అదే నిజమైన రామనవమి ఉత్సవం. భక్తి అనేది కేవలం ప్రార్థన కాదు — అది జీవితం నడిపే మార్గదర్శి. ఇంటి లో శాంతి, మాటలో నిజాయితీ, హృదయంలో విశ్వాసం — ఇవే శ్రీరాముని ఆశీర్వాదాల రూపాలు. ప్రతి మనసులో రాముడు నివసిస్తే — ప్రతి రోజు శ్రీరామ నవమి అవుతుంది బంగారం. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనది. తర తరాలకు ఆదర్శనీయమైనది... సీతారాముల ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని, ఆ దివ్యమూర్తులను ప్రార్థిస్తూ...👏 *జిల్లా ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు🙏🏻* తమ విశ్వసనీయ *కప్పాటి పాండురంగా రెడ్డి* తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు🌤️ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ ఛైర్మన్📚 #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)
Panduranga Reddy kappati
681 views
1 months ago
​తెలంగాణ జాగృతి ముఖ్య నాయకులకు ముఖ్య గమనిక! ​రేపు హైదరాబాద్‌లో జరగాల్సిన మన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. ​మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఖమ్మం పట్టణంలో నిరవధిక దీక్ష చేపట్టినందున, నాయకులు మరియు కార్యకర్తలందరూ రేపు ఉదయం 9 గంటలకల్లా ఖమ్మం చేరుకోవాల్సిందిగా కోరుతున్నాము. మనమంతా కవితక్కకు బాసటగా నిలుద్దాం. ​ఇట్లు, కప్పాటి పాండురంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, తెలంగాణ జాగృతి. #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)
Panduranga Reddy kappati
840 views
1 months ago
_*🌷అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు💐*_ ******* స్త్రీ మూర్తి ********* కనులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం,భాద్యత కోసం, కుటుంబం కోసం అందర్నీ కనుపాపలా తలసి ఆత్మీయతని పంచి తనవారి కోసం అహర్నిశలూ కష్టించి,వారి కళల్ని పోషించి, అవమానాల్ని సహించి వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే స్త్రీకి పాదాభి వందనము👣👏 ఆ స్త్రీ విలువని గుర్తించి తనకి మన అందరి అభివందనం అతివలు సాధిస్తున్న అనితర విజయాలుమరెందరికో వెలుగు బాటలవుతున్నాయి.దేశ విదేశాలలో బయట ప్రపంచంలో విభిన్న రంగాలలో దూసుకుపోతున్నా .. గృహిణిగా తన బాధ్యతలను నిర్వర్తించే ప్రతి తల్లి కూడా నిత్య జీవిత విజేతే.. *-కప్పాటి పాండురంగా రెడ్డి* తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు🌤️ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚 👩🏻‍🦰🧑🏻‍🦰👮🏻‍♀️👷🏻‍♀️🕵🏻‍♀️👩🏻‍⚕️👩🏻‍🍳👩🏻‍🎓👩‍🏫👩🏻‍🏭👩🏻‍🔬👩🏻‍🎨👩🏻‍⚖️👸🏻🤱🏻🧎🏻‍♀️🏋🏻‍♀️🧘🏻‍♀️ #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు #🌸మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💖 #🌷మహిళా దినోత్సవ స్టేటస్
Panduranga Reddy kappati
893 views
1 months ago
*రంగుల పండుగ "హోలీ" శుభాకాంక్షలు!* _*మరియు శ్రీ లక్ష్మీ జయంతి, శ్రీ ఛైతన్యప్రభు జయంతి శుభాకాంక్షలు🙏🏻*_ ​వసంత రుతువు రాకకు స్వాగతం పలుకుతూ, చెడుపై మంచి సాధించిన అద్భుత విజయానికి ప్రతీకగా మనం జరుపుకునే అత్యంత ఆనందోత్సాహాల పండుగ ఈ హోలీ. ​ప్రకృతి తన పాత ఆకులను రాల్చి సరికొత్త చిగురులతో ఎలాగైతే ముస్తాబవుతుందో... అలాగే మనందరి జీవితాల్లోని కష్టాలు, చేదు జ్ఞాపకాలు తొలగిపోయి, సరికొత్త ఆశలు, సంతోషాలు ఈ రంగుల పండుగతో వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ పవిత్రమైన రోజున కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలన్నింటినీ ఆ హోలీకా దహనంలో దహించివేసి, కేవలం మానవత్వంతో, ప్రేమానురాగాలతో సమాజం మొత్తం ఏకతాటిపై నడవాలని ఆశిస్తున్నాను. ​మన తెలంగాణ సమాజానికీ, రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ మరియు నా తోటి సోదరసోదరీమణులకు ఈ హోలీ పండుగ సకల శుభాలను, అంతులేని సంతోషాన్ని, ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. రసాయన రంగులకు దూరంగా, సహజసిద్ధమైన రంగులతో పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పండుగను జరుపుకుందాం.         *_హోలీ రోజున ఒకరి మీద ఒకరు చల్లుకొనేది రంగులు కాదు_*        _*అనురాగ ,  ఆప్యాయతలు కలిసిన పన్నీటి రంగుల జల్లులు*_ *​ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, సంతోషకరమైన హోలీ పండుగ శుభాకాంక్షలు!* ​ఇట్లు, తమ విశ్వసనీయ *కప్పాటి పాండురంగారెడ్డి* అధ్యక్షులు, తెలంగాణ జాగృతి, రంగారెడ్డి జిల్లా🌤️ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚 🌞🎋🍂🍃🌳🌺💦🌔🪷👥🫂 #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు #హోలీ #🌈 హోలీ పండుగ శుభాకాంక్షలు 🌈 #హోలీ పండుగ💐🎂
Panduranga Reddy kappati
904 views
1 months ago
*మీకు శుభప్రదమైన మహాశివరాత్రి శుభాకాంక్షలు👏* గంగాధరుని కరుణతో మీ జీవితం పావనం కావాలి,నిత్యం శివతత్త్వం మీలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచాలి, ఆ మహాకాళుడి దయతో మీకున్న గ్రహబాధలు తొలగిపోవాలి, శివతత్వం మీలో అజ్ఞానాన్ని తొలగించాలి శివనామస్మరణతో మీ జీవితం ప్రశాంతంగా ఉండాలి... *“మనసే కైలాసం, నిశ్శబ్దమే అభిషేకం, జాగృతియే శివదర్శనం.”* ఈ శివరాత్రి మీకు ఆత్మజ్ఞానాన్ని కలిగించాలి...ఆ భోళాశంకరుడి చల్లని చూపు ఎల్లప్పుడూ మీ పై ఉండాలని కోరుకుంటూ.. తమ విశ్వసనీయ _*కప్పాటి పాండురంగారెడ్డి*_ తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు🌤️ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚 🪷☘️🌼☘️🍁☘️🪻🪷🌺🪷👏 #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
Panduranga Reddy kappati
886 views
2 months ago
జై తెలంగాణ. *జై కవితమ్మ* జైజై తెలంగాణ *కదిలిరండి ఉద్యమ సైనికులారా! ఆత్మగౌరవ పోరాటానికి సమయం ఆసన్నమైంది!* కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ గడ్డపై.. ఆత్మ గౌరవ జేండా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలా.. హామల అమలు దాకా ..ఆగని పోరాటం ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించేలా.. ఉద్యమకారుల ఆకాంక్షలే మన అజెండాగా కవితమ్మ పిలుపు ఉద్యమకారుల పక్షాన గెలువు. ​తెలంగాణ సాధించుకున్నాం... కానీ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయా? కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యమకారులకిచ్చిన హామీలు అమలయ్యాయా? మన ఉనికిని చాటుకోవడానికి, మనకిచ్చిన హమీలను సాధించుకోవడానికి కవితమ్మ నేతృత్వంలో ఏకమవుదాం. తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో కవితమ్మ అధ్యక్షతన *ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఇది కేవలం ఒక మీటింగ్ కాదు, ఉద్యమకారుల ఉనికిని చాటుకోవడానికి మరియు వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తలపెట్టిన సభ* ఫిబ్రవరి 2026, ఉదయం 10 గంటలకు ఆర్టీసీ కల్యాణ మండపం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్ ధన్యవాదములతో..👏 తమ విశ్వసనీయ _*కప్పాటి పాండురంగారెడ్డి*_ తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, తెలంగాణ జాగృతి ఉద్యమకారుల సంక్షేమ అధ్యయన కమిటీ ప్రతినిధి తెలంగాణ ద్యమకారులు 🤝✊🏻🤝✊🏻🤝✊🏻🤝✊🏻🤝 #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
Panduranga Reddy kappati
814 views
2 months ago
*12వ బడ్జెట్ లోనూ తెలంగాణ కు గుండు సున్నానే* *8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా తెలంగాణకు తీరని అన్యాయం* *12 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ సర్కార్* *విభజన హామీలు సహా తెలంగాణకు రావాల్సిన నిధులపై కిక్కురుమనని ఆర్థిక మంత్రి* *మోడీ నిత్యం వల్లవేసే కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా?* *కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారు.* వరుసగా 12వ ఏడాది కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు గుండు సున్నానే దక్కిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ పై ఎక్స్ వేదిక స్పందించారు. పన్నేండేళ్లుగా తెలంగాణను మోసం చేయటం బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఆమె ట్వీట్ చేశారు. కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటూ ప్రధాని మోడీ నిత్యం చెబుతుంటారు కానీ ఆచరణలో మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విభజన హామీలు సహా తెలంగాణ ప్రాజెక్ట్ లకు రావాల్సిన నిధులన్నింటినీ పెండింగ్ లో పెట్టారని విచారం వ్యక్తం చేశారు. స్థిరత్వం, క్రమశిక్షణ, వృద్ధి అంటూ నినాదాలు చెప్పే బీజేపీ పెద్దలు ఎందుకు తెలంగాణ విషయంలో వివక్ష చూపుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. *8 మంది ఎంపీలను ఇస్తే తిరిగి ఇచ్చింది గుండుసున్నా.* తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి మాత్రం గుండుసున్నా ఇచ్చారని మండిపడ్డారు. రాష్ట్రానికి నిధులు రావాల్సిన దానికి బదులు పెండింగ్ ఫైల్స్ వస్తున్నాయన్నారు. 34 వేల 367 కోట్ల తో చేపట్టాల్సిన రీజినల్ రింగ్ రోడ్, హైవేలు, రేడియల్ రోడ్లకు నిధులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు ఇవ్వాల్సిన 50 శాతం నిధులు ఇవ్వలేదన్నారు. కొత్త రైల్వే లైన్స్ కు క్లియరెన్స్ లు ఇవ్వకపోగా, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని అటకెక్కించారని మండిపడ్డారు. తెలంగాణకు దక్కాల్సిన ఐఐఎం, 16 నవోదయ విద్యాలయాలు, 9 కేంద్రీయ విద్యాలయాలను ఇవ్వటం లేదన్నారు. విభజన చట్టం హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా పారిశ్రామిక ప్రోత్సహాకాలు ఏమీ ఇవ్వలేదన్నారు. ఇలా చెప్పుకుంటే పోతే తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయాల జాబితా చాంతాడంతా ఉందన్నారు. ప్రధాని మోడీ చెప్పే కో ఆపరేటివ్ ఫెడరలిజం అంటే తెలంగాణ ప్రయోజనాలను కాలరాయమటేనా అని కవితమ్మ గారు ప్రశ్నించారు. తమ విశ్వసనీయ కప్పాటి పాండురంగారెడ్డి తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
Panduranga Reddy kappati
1K views
2 months ago
కోరిన కోర్కెలు తీర్చే వనదేవతల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మహా జాతర కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ ఉత్సవం భక్తికి, ఐక్యతకు నిదర్శనం. - మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర శుభాకాంక్షలు!👏 తమ విశ్వసనీయ *కప్పాటి పాండురంగారెడ్డి* తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు🌤️ #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
Panduranga Reddy kappati
908 views
2 months ago
*తెలంగాణ గడ్డపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడు, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.* ​నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన కేశవరావు జాదవ్ గారు 1952 ముల్కీ ఉద్యమం నుండి 2014లో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు ప్రతి పోరాటంలోనూ ముందు వరుసలో నిలిచారు. ఆయన జీవితం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక చెరగని అధ్యాయం.తెలంగాణ ఉద్యమ ధ్రువతార ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు. ​తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప మేధావి, నిస్వార్థ నాయకుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు. 1952లో విద్యార్థిగా ముల్కీ ఉద్యమంలో పాల్గొన్న నాటి నుండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఆయన చేసిన పోరాటం మరువలేనిది. పదవుల కోసం ఆశపడకుండా, కేవలం తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి. ​లోహియా వాదంతో ప్రభావితమై, సామాజిక న్యాయం కోసం నిరంతరం పరితపించిన ప్రజాస్వామ్యవాది. ​తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (TJAC)లో కీలక పాత్ర పోషించి, అన్ని వర్గాలను ఉద్యమం వైపు నడిపించిన మార్గదర్శి. ​ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవ్వడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. *-కప్పాటి పాండురంగారెడ్డి* తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు🌤️ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼 #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు