🕉️జగత్గురు శ్రీ ఆది శంకరాచార్యులు🔱🚩

Rochish Sharma Nandamuru
764 views
22 days ago
కంచి కామకోటి...... పీఠం పీఠం ప్రకారం, మఠంలోని గురు పరంపర కాలక్రమ జాబితా ఇలా ఉంది: 1.శ్రీ ఆది శంకరాచార్య (482 BCE–477 BCE) 2.శ్రీ సురేశ్వరాచార్య (477 BCE–407 BCE) 3.శ్రీ సర్వజ్ఞాత్మనేంద్ర సరస్వతి (407 BCE–367 BCE) [ 27 ] 4.శ్రీ సత్యబోధేంద్ర సరస్వతి (367 BCE–268 BCE) [ 28 ] 5.శ్రీ జ్ఞానేంద్ర సరస్వతి (268 BCE–205 BCE) 6.శ్రీ శుద్ధానందేంద్ర సరస్వతి (205 BCE–124 BCE) 7.శ్రీ ఆనందఘనేంద్ర సరస్వతి (124 BCE–55 BCE) 8.శ్రీ కైవల్యానంద యోగేంద్ర సరస్వతి (55 BCE–28 CE) 9.శ్రీ కృపాశంకరేంద్ర సరస్వతి (28 CE–69 CE) 10.శ్రీ సురేశ్వర సరస్వతి (69 CE–127 CE) 11.శ్రీ శివానంద చిద్ఘనేంద్ర సరస్వతి (127 CE–172 CE) 12.శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి I (172–235) 13.శ్రీ సచ్చిద్ఘనేంద్ర సరస్వతి (235–272) 14.శ్రీ విద్యాఘనేంద్ర సరస్వతి (272–317) 15.శ్రీ గంగాధరేంద్ర సరస్వతి (317–329) 16.శ్రీ ఉజ్వల శంకరేంద్ర సరస్వతి (329–367) 17.శ్రీ సదాశివేంద్ర సరస్వతి (367–375) 18.శ్రీ శంకరానంద సరస్వతి (375–385) 19.శ్రీ మార్తాండ విద్యాఘనేంద్ర సరస్వతి (385–398) 20.శ్రీ ముఖశంకరేంద్ర సరస్వతి (398–437) 21.శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి II (437–447) 22.శ్రీ బోధేంద్ర సరస్వతి I (447–481) 23.శ్రీ సచ్చిసుఖేంద్ర సరస్వతి (481–512) 24.శ్రీ చిత్సుఖేంద్ర సరస్వతి (512–527) 25.శ్రీ సచ్చిదానందఘనేంద్ర సరస్వతి (527–548) 26.శ్రీ ప్రజ్ఞానేంద్ర సరస్వతి (548–565) 27.శ్రీ చిద్విలాసేంద్ర సరస్వతి (565–577) 28.శ్రీ మహాదేవేంద్ర సరస్వతి I (577–601) 29.శ్రీ పూర్ణభోధేంద్ర సరస్వతి (601–618) 30.శ్రీ భోధేంద్ర సరస్వతి II (618–655) 31.శ్రీ బ్రహ్మానందఘనేంద్ర సరస్వతి (655–668) 32.శ్రీ చిదానందఘనేంద్ర సరస్వతి (668–672) 33.శ్రీ సచ్చిదానంద సరస్వతి (672–692) 34.శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి III (692–710) 35.శ్రీ చిత్సుఖేంద్ర సరస్వతి (710–737) 36.శ్రీ చిత్సుఖానందేంద్ర సరస్వతి (737–758) 37.శ్రీ విద్యాఘనేంద్ర సరస్వతి III (758–788) 38.శ్రీ అభినవ శంకరేంద్ర సరస్వతి (788–840) 39.శ్రీ సచ్చిద్విలాసేంద్ర సరస్వతి (840–873) 40.శ్రీ మహాదేవేంద్ర సరస్వతి II (873–915) 41.శ్రీ గంగాధరేంద్ర సరస్వతి II (915–950) 42.శ్రీ బ్రహ్మానందఘనేంద్ర సరస్వతి (950–978) 43.శ్రీ ఆనందఘనేంద్ర సరస్వతి (978–1014) 44.శ్రీ పూర్ణభోధేంద్ర సరస్వతి II (1014–1040) 45.శ్రీ పరమశివేంద్ర సరస్వతి I (1040–1061) 46.శ్రీ చంద్రానందభోధేంద్ర సరస్వతి (1061–1098) 47.శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి IV (1098–1166) 48.శ్రీ అద్వైతానందబోధేంద్ర సరస్వతి (1166–1200) 49.శ్రీ మహాదేవేంద్ర సరస్వతి III (1200–1247) 50.శ్రీ చంద్రచూడేంద్ర సరస్వతి I (1247–1297) 51.శ్రీ విద్యాతీర్థేంద్ర సరస్వతి (1297–1385) 52.శ్రీ శంకరానందేంద్ర సరస్వతి (1385–1417) 53.పూర్ణానంద సదాశివేంద్ర సరస్వతి (1417–1498) 54.వ్యాసాచల మహాదేవేంద్ర సరస్వతి (1498–1507) 55.చంద్రచూడేంద్ర సరస్వతి II (1507–1524) 56.శ్రీ సర్వజ్ఞ సదాశివబోధేంద్ర సరస్వతి (1524–1539) 57.శ్రీ పరమశివేంద్ర సరస్వతి II (1539–1586) 58.ఆత్మబోధేంద్ర సరస్వతి (1586–1638) 59.బోధేంద్ర సరస్వతి II (1638–1692) 60.శ్రీ అద్వైతాత్మ ప్రకాశేంద్ర సరస్వతి (1692–1704) 61.శ్రీ మహాదేవేంద్ర సరస్వతి IV (1704–1746) 62.శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వి (1746–1783) 63.శ్రీ మహాదేవేంద్ర సరస్వతి V (1783–1813) 64.శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి VI (1813–1851) 65.సుదర్శన మహాదేవేంద్ర సరస్వతి (1851–1891) 66.శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి VII (1891 – 7 ఫిబ్రవరి 1907) 67.శ్రీ మహాదేవేంద్ర సరస్వతి V (7 ఫిబ్రవరి 1907 – 13 ఫిబ్రవరి 1907) 68.శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి VIII (జననం 20 మే 1894; 1907 - 8 జనవరి 1994) 69.శ్రీ జయేంద్ర సరస్వతి (జననం 18 జూలై 1935; వారసుడిగా 1954; 3 జనవరి 1994 - 28 ఫిబ్రవరి 2018) 70.శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి (జననం 13 మార్చి 1969; వారసుడిగా నియమితులయ్యారు 29 మే 1993; ఫిబ్రవరి 2018 - ప్రస్తుతం) 71.శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి (జననం 2001; వారసుడిగా నియమితులైన 30 ఏప్రిల్ 2025) 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 #🌅శుభోదయం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🙏కంచి కామకోటి పీఠం🕉️ #🙏సనాతన హైందవ ధర్మం🕉️ #🕉️జగత్గురు శ్రీ ఆది శంకరాచార్యులు🔱🚩
Rochish Sharma Nandamuru
1.5K views
1 months ago
శ్రీశైల క్షేత్రానికి, ఆది శంకరాచార్యుల వారికి విడదీయరాని సంబంధం ఉంది. శంకరాచార్యులు ఇక్కడ తపస్సు చేసి, ప్రముఖ గ్రంథాన్ని రచించారు. దీనికి సంబంధించిన ముఖ్య వివరాలు ఇక్కడ ఉన్నాయి:  శివానందలహరి రచన: ఆది శంకరాచార్యులు శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకుని, ఇక్కడే తపస్సు చేసి ప్రసిద్ధ 'శివానందలహరి' మహా గ్రంథాన్ని రచించారు. పాలధార-పంచధార: శ్రీశైలంలోని ఫాలధార-పంచధార అనే పవిత్ర ప్రదేశంలో శంకరాచార్యులు తపస్సు చేశారని ప్రతీతి. శంకర మందిరం: ఈ ప్రదేశంలో శంకరాచార్యుల వారి మందిరం ఉంది, ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి. శంకర జయంతి ఉత్సవాలు: శ్రీశైలంలో శంకర జయంతిని వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🕉️జగత్గురు శ్రీ ఆది శంకరాచార్యులు🔱🚩 #🙏ఓం శ్రీ మాత్రే నమః🕉️
Rochish Sharma Nandamuru
797 views
1 months ago
🕉️ మానవ జన్మ: దైవం ఇచ్చిన వరం... దాన్ని వృధా చేసుకోవడం ఆత్మహత్యా సదృశం! మన సనాతన ధర్మంలో ఆది శంకరాచార్యుల వారు రచించిన "వివేకచూడామణి" గ్రంథం ఆధ్యాత్మిక రత్నాల గని. అందులో మానవ జన్మ విశిష్టత గురించి శంకరులు చెప్పిన ఈ మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. ఈ శ్లోకాలను ఒక్కసారి గమనించండి. 👇 ✨ 1. అత్యంత అరుదైన మూడు వరాలు: శ్లోకం: దుర్లభం త్రయమేవైతద్దేవానుగ్రహహేతుకమ్ । మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుషసంశ్రయః ॥ భావం: ఈ ప్రపంచంలో మూడు విషయాలు అత్యంత దుర్లభమైనవి. అవి కేవలం దైవానుగ్రహం వల్ల మాత్రమే లభిస్తాయి: మనుష్యత్వం: మానవుడిగా పుట్టడం. 👤 ముముక్షుత్వం: మోక్షం పొందాలనే తీవ్రమైన కోరిక కలగడం. 🔥 మహాపురుష సంశ్రయః: ఆ మోక్ష మార్గంలో నడిపించే మహాత్ముల లేదా సద్గురువుల ఆశ్రయం దొరకడం. 🙏 ఈ మూడు వారు లభించాయంటే,వారు సామాన్యులు కారు, దైవం ఎన్నుకున్నవారు! 🚧 2. నిర్లక్ష్యం చేస్తే జరిగే అనర్థం: శ్లోకం: లబ్ధ్వా కథంచిన్నరజన్మ దుర్లభం తత్రాపి పుంస్త్యం యః స్వాత్మముక్తా న యతేత మూఢధీ: శ్రుతిపారదర్శనమ్ | స హ్యాత్మహా స్వం వినిహంత్యసద్గ్రహాత్॥ భావం: అతి కష్టము మీద లభించే మానవ జన్మను, అందులోనూ వేదశాస్త్ర పరిజ్ఞానాన్ని పొందే శక్తిని కలిగి ఉండి కూడా... ఎవడైతే తన ఆత్మ విముక్తి కోసం ప్రయత్నించడో, ఆ మూఢమతి నిశ్చయముగా "ఆత్మహత్య" చేసుకున్నవాడే అవుతాడు. ఎందుకంటే, అనిత్యమైన విషయాల పట్ల ఆసక్తితో (అసద్గ్రహాత్) అతడు తనను తానే నాశనం చేసుకుంటున్నాడు. 💔 ❓ 3. ఇంతకంటే మూర్ఖత్వం ఉంటుందా? శ్లోకం: ఇతః కోన్వస్తి మూఢత్మా యస్తుస్వార్థే ప్రమాద్యతి । దుర్లభం మానుషం దేహం ప్రాప్యతత్రాపి పౌరుషమ్ ॥ భావం: పురుషార్థ సాధనకు (ధర్మ, అర్థ, కామ, మోక్ష) పనికొచ్చే ఈ మానవ శరీరాన్ని పొంది కూడా, స్వార్థానికి లోబడి, సోమరితనంతో ఎవడైతే ఆధ్యాత్మికతను నిర్లక్ష్యం చేస్తాడో... వాడిని మించిన మూర్ఖుడు ఈ లోకంలో మరొకరు ఉండరు. 🛑 ముగింపు: కనుక ఓ మనిషీ! ఆహారం, నిద్ర, భయం... ఇవి పశువులకు, మనకు ఒక్కటే. మనిషికి ఉన్న ఏకైక ప్రత్యేకత 'జ్ఞానం' మరియు 'విచక్షణ'. ఈ జన్మను కేవలం భోగాల కోసమే ఖర్చు చేస్తే, అది చేతిలో ఉన్న చింతామణిని మట్టిలో పడేసుకున్నట్టే.కనుక ఇప్పుడే మేల్కొనండి! సత్యం వైపు అడుగు వేయండి. ☀️🙏 #☀️శుభ మధ్యాహ్నం #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🕉️జగత్గురు శ్రీ ఆది శంకరాచార్యులు🔱🚩 #🙏శ్రీ ఆది శంకరాచార్యులు జయంతి🕉️
Rochish Sharma Nandamuru
863 views
1 months ago
శ్రీ శంకర జయంతి పర్వదినమునాడు. శ్రీ శంకరభగవత్పాదులకు తోటకాష్టకముతో, ప్రతీ శ్లోకమునకూ భూమి మీద పడి, అభివాదము చెయ్యాలి. తోటకాష్టకం విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే | హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ || ౧ || కరుణావరుణాలయ పాలయ మాం భవసాగరదుఃఖవిదూనహృదమ్ | రచయాఖిలదర్శనతత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || ౨ || భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే | కలయేశ్వరజీవవివేకవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || ౩ || భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా | మమ వారయ మోహమహాజలధిం భవ శంకర దేశిక మే శరణం || ౪ || సుకృతేఽధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసతా | అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణమ్ || ౫ || జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్ఛలతః | అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణమ్ || ౬ || గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కోఽపి సుధీః | శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణమ్ || ౭ || విదితా న #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🕉️జగత్గురు శ్రీ ఆది శంకరాచార్యులు🔱🚩 #🙏శ్రీ ఆది శంకరాచార్యులు జయంతి🕉️
Rochish Sharma Nandamuru
1.8K views
1 months ago
*జగద్గురువులు శ్రీ శంకరుల జీవన ముఖ్య విశేషాలు* *శ్రీ జగద్గురువులు శంకరులకు నమస్సులు* **************************************** *ఆర్యాంబ శివగురు గర్భ జననం* శివగురు, ఆర్యాంబ దంపతులకు పరమశివుడు స్వప్నంలో దర్శనమిచ్చి, తాను పుత్రుడిగా జన్మిస్తానని వరమిచ్చిన ఘట్టం ఇది. అథ ప్రాప్యే శుభే కాలే గ్రహేషు శుభగౌషు చ | ఆర్యాంబా సుషువే పుత్రం శివమంశాత్ సముద్భవమ్ || శుభప్రదమైన కాలంలో, గ్రహాలన్నీ అనుకూల స్థితిలో ఉన్నప్పుడు, ఆర్యాంబ శివుని అంశతో జన్మించిన పుత్రుడిని ప్రసవించింది. తిథౌ పంచమ్యాం సితపక్షే వైశాఖే మాసి శోభనే | పునర్వసుగతే చంద్రే ప్రవృద్ధే శశిని ప్రభోః || వైశాఖ శుద్ధ పంచమి, పునర్వసు నక్షత్రం వారి జన్మ సమయం **************************************** శంకరుల సన్యాస స్వీకారం (మొసలి ఘట్టం) పూర్ణా నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి శంకరుల కాలు పట్టుకోవడం, ఆ సమయంలో తల్లి అనుమతితో వారు 'ఆతుర సన్యాసం' స్వీకరించడం ఒక అద్భుత ఘట్టం. అంబ తాత నయ మాం గ్రహో బలీ | సత్త్వరం త్యజతు మాం యథా భవేత్ | దేహి మేఽద్య సన్న్యాసమనుజ్ఞాం | త్యక్ష్యతి త్వరితమేష మాం ఖలః || "అమ్మా! మొసలి నన్ను పట్టుకుంది. నేను సన్యాసం స్వీకరించడానికి నీవు అనుమతి ఇస్తేనే ఇది నన్ను వదులుతుంది. త్వరగా ఆజ్ఞ ఇవ్వు" అని శంకరులు ప్రార్థించారు. సంసారమేవ నిస్సారం దృష్ట్వా కౌమార ఏవ హి | ప్రవ్రజ్య పరమేశస్య సన్న్యాసం సమవాప్తవాన్ || (సంసారం నిస్సారమని గ్రహించి, కౌమార దశలోనే సన్యాసం స్వీకరించారు.) **************************************** *గోవింద భగవత్పాదుల అనుగ్రహం* నర్మదా నదీ తీరంలో శంకరులు తమ గురువైన గోవింద భగవత్పాదులను కలిసి, వారి శిష్యరికం పొందిన ఘట్టం అత్యంత పవిత్రమైనది. గురువు అడిగిన "నీవు ఎవరివి?" అన్న ప్రశ్నకు శంకరులు "దశశ్లోకి" (నిర్వాణ షట్కం వంటివి) ద్వారా సమాధానం ఇచ్చారు. తం నర్మదాతట గతం గురుమభ్యుపేత్య | గోవిందనామకమతీవ ముదా ప్రణమ్య | సర్వజ్ఞకల్పమపి సర్వవిదాం వరిష్ఠం | విజ్ఞాపయామాస వినీతవదాత్మవృత్తమ్ || నర్మదా తీరంలో ఉన్న గోవింద భగవత్పాదుల దగ్గరకు వెళ్లి, అత్యంత సంతోషంతో ప్రణామం చేసి, సర్వజ్ఞుడైన ఆ గురువుకు వినయంతో తనను శిష్యుడిగా స్వీకరించమని విన్నవించుకున్నారు. శంకరుల సమాధానానికి సంతోషించి గురువు ఇలా అన్నారు విదితం త్వత్స్వరూపం మే శంకరస్త్వం న సంశయః| భాష్యం కురు త్వం లోకానాం హితాయ చరతాం భువి || నీ స్వరూపం నాకు తెలిసింది. నీవు సాక్షాత్తు శంకరుడివే, ఇందులో సందేహం లేదు. లోక కల్యాణం కోసం బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాయి అని గురువు ఆదేశించారు. **************************************** *శంకరుల అవతార విశేషం సాక్షాత్తు శివ స్వరూపం* ఓం అజ్ఞానాంతర్ఘహన పతితాన్ ఆత్మవిద్యోపదేశైః | త్రాతుం లోకాన్ భవదవశిఖి తాపపాపచ్యమానాన్ | ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిశ్చరంతీ | శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా || అజ్ఞానమనే అడవిలో పడి, సంసార తాపత్రయాలతో దహింపబడుతున్న లోకాన్ని రక్షించడానికి, మౌనాన్ని వీడి వటవృక్షం నీడ నుండి కదిలి వచ్చిన దక్షిణామూర్తియే శంకరాచార్యుల రూపంలో ఈ భూమిపై (అవతరించారు) సంచరిస్తున్నారు. **************************************** *విద్యార్జన* శ్రుతయోఽపి యదర్థబోధకాః సకలాః సంతి న చాన్యబోధకాః | సహసా స చతుర్భిరాయుషో వర్షైరభ్యసదుత్తమం పదమ్ || కేవలం నాలుగు సంవత్సరాల ప్రాయంలోనే ఉపనయనం తర్వాత అతి తక్కువ కాలంలో సకల వేదాలను, వాటి అర్థాలను శంకరులు గ్రహించారు. అష్టవర్షే చతుర్వేదీ, ద్వాదశే సర్వశాస్త్రవిత్ | షోడశే కృతవాన్ భాష్యం, ద్వాత్రింశే మునిరభ్యగాత్ || ఎనిమిదేళ్లకే నాలుగు వేదాలను అభ్యసించిన వారు, పన్నెండేళ్లకే సర్వ శాస్త్రాలను క్షుణ్ణంగా తెలుసుకున్న వారు, పదహారేళ్లకే ప్రస్థానత్రయానికి (భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు) భాష్యాలు రాసిన వారు మరియు ముప్పై రెండేళ్లకే తన అవతార కార్యము ముగించి పరమధామం చేరిన మహనీయులు శంకరాచార్యులు. **************************************** *భాష్య రచన* గంభీరైః పదనికాయైః ప్రసన్న మృదుభిః పదం | వ్యాచకారుత్తరాం మీమాంసాం భాష్యైర్భాష్యకృతాం వరః || భాష్యకారులలో శ్రేష్ఠుడైన శంకరులు, అత్యంత గంభీరమైన పదజాలంతో, స్పష్టమైన అర్థంతో ఉత్తర మీమాంస (బ్రహ్మసూత్రాలు) వంటి క్లిష్టమైన గ్రంథాలకు భాష్యాలు రచించారు. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణమ్ | సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః || బ్రహ్మసూత్రాలను రచించిన వ్యాస భగవానుడిని (బాదరాయణుడు), వాటికి భాష్యం వ్రాసిన శంకరాచార్యులను (శివ స్వరూపులు) నేను పదే పదే పూజిస్తున్నాను. **************************************** *వైదిక సిద్ధాంత ఉద్దీపన* *అద్వైత సిద్ధాంత స్థాపన (షణ్మత స్థాపనాచార్య)* శంకరాచార్యుల వారు లోకంలో ఉన్న విభిన్న ఆరాధనా పద్ధతులను సంస్కరించి 'షణ్మతాలను' (ఆరు మతాలు) స్థాపించారు కొనియాడుతుంది. ఆశేషపాషండ ముఖప్రమర్దనం | విదారితాశేష కుతర్కవాదినమ్ | వేదాంత సిద్ధాంత విభాసకం సదా | తం శంకరం భక్త హితం నమామి || వేద విరుద్ధమైన మార్గాలను ఖండించి, కుతర్క వాదుల వాదనలను పటాపంచలు చేసి, వేదాంత సిద్ధాంతాన్ని (అద్వైతాన్ని) ప్రకాశింపజేసిన, భక్తుల మేలు కోరే శంకరులకు నమస్కరిస్తున్నాను. **************************************** *శాశ్వత ధర్మ స్థాపన కోసం చతురామ్నాయ పీఠ స్థాపన* పశ్చిమే ద్వారకాపీఠం, పూర్వే గోవర్ధనస్తథా | ఉత్తరే జ్యోతిర్మఠం చ, దక్షిణే శృంగేరీ తథా || భావం: పశ్చిమ దిక్కున ద్వారకా పీఠం, తూర్పున గోవర్ధన పీఠం, ఉత్తరాన జ్యోతిర్మఠం మరియు దక్షిణాన శృంగేరీ పీఠాలను స్థాపించారు. *తూర్పు పీఠం (పురి)* అంగవంగ కళింగాద్యాః, పూర్వదేశ వ్యవస్థితాః | మఠో గోవర్ధనస్తత్ర, హలాయుధాభిరక్షితః || అంగ, వంగ, కళింగ దేశాల (తూర్పు భారతం) రక్షణార్థం జగన్నాథ పురిలో గోవర్ధన పీఠం స్థాపించబడింది. *పశ్చిమ పీఠం (ద్వారక)* సింధు సౌవీర సౌరాష్ట్రాః, పశ్చిమామ్నాయ గోచరాః| మఠః శారదా నామ్నా, ద్వారకాయాం వ్యవస్థితః || సింధు, సౌరాష్ట్ర ప్రాంతాల ఆధ్యాత్మిక ఉద్ధరణ కోసం ద్వారకలో శారదా పీఠం నెలకొల్పబడింది. *ఉత్తర పీఠం (బదరి)* కురుపాంచాల కాశ్మీర, కాంభోజాద్యాస్తథోత్తరాః | జ్యోతిర్మఠస్తత్ర విఖ్యాతః, బదర్యాశ్రమ సంస్థితః || కాశ్మీరం, కురుపాంచాల వంటి ఉత్తర దేశాల కోసం బదరికాశ్రమంలో జ్యోతిర్మఠం స్థాపించబడింది. పద్మపాదశ్చ హస్తామలకశ్చ తథా | తోటకో వార్తికకారశ్చాన్యే | ఏతైశ్చతుర్భిః శిష్యైః సహితం | జగద్గురుం శంకరం ప్రణమామి || *పద్మపాద: పూర్వ ఆమ్నాయం (పురి) *హస్తామలక: పశ్చిమ ఆమ్నాయం (ద్వారక) *తోటక: ఉత్తర ఆమ్నాయం (బదరి) *వార్తికకార (సురేశ్వరాచార్య): దక్షిణ ఆమ్నాయం (శృంగేరి) ఇలా వీరిని ఆయా పీఠాలలో ఆచార్యులను నియమించారు. **************************************** *జగద్గురు రూప వర్ణన* వక్త్రం పద్మమివాభాతీ, నేత్రే నీలోత్పల ప్రభే | వాచః పీయూష తుల్యాశ్చ, తం వందే శంకరం గురుమ్ || పద్మం వంటి ప్రసన్నమైన ముఖము, నీలోత్పలాల వంటి ప్రకాశవంతమైన నేత్రాలు, అమృతం వంటి మధురమైన మాటలు కలిగిన గురువు శంకరాచార్యులకు వందనం. **************************************** *సామాన్యుల దేవతా అనుగ్రహం కోసం అనేక సంఖ్యాక స్తోత్రముల రచన* మధురాక్షరకావ్యం నిర్మితం యేన మానినా | స్తోత్రైః సుధామయైశ్చైవ లోకోద్ధరణ కారణమ్ || లోకోద్ధరణ కోసం అమృతం వంటి మధురమైన అక్షరాలతో కూడిన స్తోత్రాలను, కావ్యాలను శంకరులు నిర్మించారు. **************************************** *శ్రీ శంకరులను అనుసరించు భక్తులకు కలిగే అనుగ్రహం* యో హృత్కమల మధ్యస్థం, జగద్గురుమనుస్మరేత్| తస్య విద్యా చ కీర్తిశ్చ, వర్ధతే నాత్ర సంశయః || ఎవరైతే తన హృదయ కమలంలో జగద్గురువు శంకరాచార్యులను నిరంతరం స్మరిస్తారో, వారికి విద్య మరియు కీర్తి నిశ్చయంగా పెరుగుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. **************************************** సనాతన ధర్మం లో జగద్గురువులైన శంకరులు చూపిన వైదిక విధులను ఆచరించడం అందరి కర్తవ్యం . మీ పిల్లలని పెద్దలను ప్రతివారి మీ సమీపం లోని శంకర మఠములు లో జరిగి వైదిక సేవలు పాల్గొని భగవద్ అనుగ్రహం పొందండి. జయ జయ శంకర హర హర శంకర 🙏 శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏 *రాళ్ళబండి శర్మ* గారి time line నుండి సేకరణ **************************************** #☀️శుభ మధ్యాహ్నం #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🕉️జగత్గురు శ్రీ ఆది శంకరాచార్యులు🔱🚩 #🙏శ్రీ ఆది శంకరాచార్యులు జయంతి🕉️
Rochish Sharma Nandamuru
776 views
1 months ago
జగద్గురువు ఆది శంకరుల అవతార దినోత్సవం. ఆదిశంకరుల అష్టోత్తర శతనామావళి చదవండి, అది లేకపోతే శివ అష్టోత్తరం చదవండి, దగ్గర్లో శంకర మఠం ఉంటే అందులో జరిగే ఉత్సవాల్లో పాల్గొనండి, ప్రతి గ్రామం లో రామ నవమి ఎలా జరుపుతారో శంకర జయంతి అలా జరిపే రోజు రావాలి, శంకరులు ధర్మాన్ని పునః స్థాపన చేసిన మహనీయులు, వారిని స్మరించి నమస్కారం చేస్తే మనలో ధర్మం యెడ శ్రద్ధ, విశ్వాసం పెరుగుతుంది, హిందువులకు పట్టిన జాడ్యాలు వదలాలి అంటే ఆ మహానుభావుని వల్లే సాద్యం.. జడత్వం,మూఢత్వం, అంధత్వం ఈ మూడు హిందువుల ను కప్పివేశాయి. తన ధర్మాన్ని తాను నమ్మలేని స్తితికి వెళ్ళారు. ధర్మాచరణ అంటే దండం పెట్టీ కోరికలు కోరడం ఒక్కటే కాదు, జీవన విధానం అనుక్షణం, ప్రతి నిమిషం ఏ సమయంలో, ఏ ప్రదేశంలో ఎలా బతకాలి అని ధర్మం చెప్పిందో అలా బతకడం ధర్మం. అలాంటి శ్రద్ధ, పట్టుదల హైందవ సమాజంలో లోపించింది, మంచి మాట చెప్తే ఆచరించటం అటుంచి మనసు లోకి తీసుకోలేని స్తితికి వెళ్ళారు. చెవి దగ్గరే ఆగి పోతున్నాయి... మళ్ళీ ధర్మం ఉత్సాహం తో ఆచరించే సమాజం రావాలి అంటే, ఆది శంకరుల ఆరాధన, ఆరాటం లోకంలో విశేషంగా ప్రాచుర్యం లోకి రావాలి... 🌿🌼🙏జయ జయ శంకర హర హర శంకర🙏🌼🌿 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🕉️జగత్గురు శ్రీ ఆది శంకరాచార్యులు🔱🚩 #🙏శ్రీ ఆది శంకరాచార్యులు జయంతి🕉️
Rochish Sharma Nandamuru
814 views
2 months ago
శంకరులు కేవలం సిద్ధాంతం చెప్పి వెళ్లిపోలేదు. ధర్మ రక్షణ కోసం దేశానికి నాలుగు దిక్కులందు 4 మఠాలను (పీఠాలను) స్థాపించి, ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికి "మఠామ్నాయ మహానుశాసనము" అనే గ్రంథమే సాక్ష్యం. దానికి సంబంధించిన పూర్తి శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి: 1. తూర్పు దిక్కు (పూరీ - గోవర్ధన పీఠం): శ్లోకం : "పూర్వస్యాం దిశి వైశాఖే కాళికా పీఠముచ్యతే | జగన్నాథః ప్రభుర్దేవో భోగవారో వనస్థలీ || ఋగ్వేద శాఖా కథితా హి తత్ర ధర్మస్య వృద్ధిః | వివరణ : ఆది శంకరులు తూర్పున గోవర్ధన పీఠాన్ని స్థాపించి, దానికి పద్మపాదాచార్యుల వారిని అధిపతిగా చేశారు. వేదం: ఋగ్వేదం | మహావాక్యం: ప్రజ్ఞానం బ్రహ్మ 2. దక్షిణ దిక్కు (శృంగేరి - శారదా పీఠం): శ్లోకం : "దక్షిణే శృంగేరీ పీఠం శక్తిః శ్రీ శారదా భవేత్ | వరాహో దేవతా తత్ర రామక్షేత్రముదాహృతమ్ || యజుర్వేదస్య పఠనం తత్ర ధర్మానుశాసనమ్ | అహం బ్రహ్మాస్మి వాక్యం చ తత్రైవ పరికీర్తితమ్ ||" వివరణ: దక్షిణాన శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించి, సాక్షాత్తు సురేశ్వరాచార్యుల వారిని నియమించారు. వేదం: యజుర్వేదం | మహావాక్యం: అహం బ్రహ్మాస్మి 3. పశ్చిమ దిక్కు (ద్వారక - శారదా మఠం): శ్లోకం : "పశ్చిమాయాం శారదామఠః కీటవారః సముదాహృతః | తీర్థం చ గోమతీ ప్రోక్తం ద్వారకాక్షేత్రముచ్యతే || సామవేదో బ్రహ్మరూపః తత్ర ధర్మముదాహృతమ్ | తత్త్వమసి మహావాక్యం తత్రైవ పరికీర్తితమ్ ||" వివరణ: పడమర ద్వారకా పీఠాన్ని స్థాపించి, హస్తామలకాచార్యుల వారిని కూర్చb వేదం: సామవేదం | మహావాక్యం: తత్త్వమసి 4. ఉత్తర దిక్కు (బదరి - జ్యోతిర్ మఠం): శ్లోకం: "ఉత్తరే జ్యోతిర్మఠం చ బదరికాశ్రమ ముచ్యతే | నారాయణః ప్రభుర్దేవో పూర్ణగిరిశ్చ శక్తికా || అథర్వణ వేద వాక్యాని తత్ర స్వీకురుతే సదా | అయమాత్మా బ్రహ్మ వాక్యం జ్యోతిర్మఠే ప్రతిష్ఠితమ్ ||" వివరణ: ఉత్తరాన జ్యోతిర్మఠాన్ని స్థాపించి, తోటకాచార్యుల వారికి బాధ్యత ఇచ్చారు. వేదం: అథర్వణ వేదం | మహావాక్యం: అయమాత్మా బ్రహ్మ విద్యారణ్య స్వామి శృంగేరి పీఠ పరంపరలో 12వ జగద్గురువులు. పీఠం అప్పటికే ఉంటేనే కదా ఆయన 12వ వారు అవుతారు? లేకపోతే ఆయనకు సన్యాస దీక్ష ఎవరు ఇచ్చారు? గురు పరంపర లేకుండా పీఠాధిపతి ఎలా అవుతారు? విద్యారణ్యులు పీఠాన్ని పునరుద్ధరించారు తప్ప, స్థాపించలేదు. స్థాపకుడు సాక్షాత్తు శంకర భగవత్పాదులే! శంకరులు కేవలం వైష్ణవులా? ! కాదు! డెభై రెండు పాషండ మతాలను ఖండించి,అందరినీ మెప్పించి ఒప్పించి ఒకే త్రాటిపై నిల్పిన పరమ అద్వైత జ్ఞానమూర్తి ! ఆదిశంకరులు! వారు "షణ్మత స్థాపనాచార్యులు". శివుడిని "శివానందలహరి"లో, అమ్మవారిని "సౌందర్యలహరి"లో, విష్ణువును "భజ గోవిందం"లో స్తుతించిన అద్వైతులు వారు. వారిని ఒక దేవుడికి పరిమితం చేయడం అవివేకం. దయచేసి ఇలాంటి చారిత్రక వక్రీకరణలను నమ్మకండి. మన ధర్మాన్ని, మన గురు పరంపరను కాపాడుకుందాం. శ్లోll శివాయవిష్ణురూపాయ శివరూపాయవిష్ణవేl శివస్యహృదయంవిష్ణుః విష్ణోశ్చహృదయగ్ంశివఃll యథాశివమయోర్విష్ణురేవంవిష్ణుమయశ్శివఃl యథాంతరన్నపశ్యామి తధామేస్వస్తిరాయుషిll #🌅శుభోదయం #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు🕉️ #🕉️జగత్గురు శ్రీ ఆది శంకరాచార్యులు🔱🚩