🙏ఓం శ్రీ మాత్రే నమః🕉️

252 Posts • 867 views
Rochish Sharma Nandamuru
1K views 2 months ago
అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్... ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.. మహిషాసురుడనే రాక్షసుడిని దుర్గాదేవి సంహరించడం. బ్రహ్మదేవుని వరం పొందిన మహిషాసురుడు, ఏ పురుషుని చేతిలోనూ మరణం లేకుండా వరాన్ని పొంది, ముల్లోకాలను పీడించసాగాడు. దేవతలు అతనిని ఓడించలేక త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శరణు వేడారు. అప్పుడు ఆ త్రిమూర్తులు తమ శక్తులను ఏకీకృతం చేసి, ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవిని సృష్టించారు. ప్రతి దేవత తమ ఆయుధాలను ఆమెకు అందించగా, ఆమె సింహవాహినియై మహిషాసురునితో తొమ్మిది రాత్రులు భీకరంగా యుద్ధం చేసి, పదవ రోజున అతనిని సంహరించింది. ఈ విజయానికి గుర్తుగా పదవ రోజును "విజయదశమి"గా జరుపుకుంటారు. నవరాత్రులలో ప్రతి రోజూ దుర్గాదేవి యొక్క ఒక్కో రూపాన్ని పూజిస్తారు. ఈ తొమ్మిది రూపాలను "నవదుర్గలు" అని అంటారు. 1. శైలపుత్రి: పర్వతరాజైన హిమవంతుని కుమార్తె. ఈమె వృషభవాహని. యోగసాధనలో మూలాధార చక్రానికి అధిదేవత. 2. బ్రహ్మచారిణి: తపస్సు ఆచరించే కన్య. ఆమె పరమశివుడిని భర్తగా పొందడానికి కఠోర తపస్సు చేసింది. ఈమె జపమాలను, కమండలాన్ని ధరించి ఉంటుంది. 3. చంద్రఘంట: శిరస్సున అర్ధచంద్రుని ధరించిన రూపం. ఈమె శాంతిని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. 4 కూష్మాండ: తన చిరునవ్వుతో బ్రహ్మాండాన్ని సృష్టించిన దేవత. ఈమె అష్టభుజాలతో, వివిధ ఆయుధాలను ధరించి ఉంటుంది. 5. స్కందమాత: కుమారస్వామి (స్కందుడు) తల్లి. ఈమె తన ఒడిలో స్కందుడిని కూర్చోబెట్టుకుని ఉంటుంది. 6. కాత్యాయని: కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించిన రూపం. ఈమె మహిషాసురుడిని వధించడానికి అవతరించింది. 7. కాళరాత్రి: నల్లని వర్ణంతో, భయంకరమైన రూపంతో ఉన్నప్పటికీ, తన భక్తులను ఎల్లప్పుడూ శుభ ఫలితాలతో అనుగ్రహిస్తుంది. 8. మహాగౌరి: పరమశివుని కోసం చేసిన కఠోర తపస్సు తర్వాత పొందిన గౌర వర్ణం కలది. ఈమె శాంతికి, స్వచ్ఛతకు ప్రతీక. 9. సిద్ధిధాత్రి: సర్వ సిద్ధులను ప్రసాదించే దేవత. ఈమె కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ప్రతి రోజు అమ్మవారిని ఆ రోజుకు నిర్దేశించిన రూపంలో అలంకరించి, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి, పూజలు నిర్వహిస్తారు. వైభవం మరియు వేడుకలు నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. బొమ్మల కొలువు: దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడులలో, నవరాత్రుల సమయంలో "బొమ్మల కొలువు" ఏర్పాటు చేయడం ఒక ముఖ్యమైన సంప్రదాయం. మెట్లపై వివిధ రకాల దేవతలు, పురాణ గాథలు మరియు సామాజిక జీవనానికి సంబంధించిన బొమ్మలను ప్రదర్శిస్తారు. ఇది సృజనాత్మకతకు మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. నవరాత్రులు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక సాధన. ఈ తొమ్మిది రోజులు ఇంద్రియ నిగ్రహంతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ద్వారా మనలోని తామసిక, రాజసిక గుణాలను జయించి, సాత్విక గుణాలను పెంపొందించుకోవడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇది మనలోని చెడు ఆలోచనలు, అహంకారం అనే మహిషాసురుడిని సంహరించి, జ్ఞానం మరియు ఆనందం అనే దైవత్వాన్ని పొందడానికి ఒక అవకాశం. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో జగన్మాత తొమ్మిది అవతారాలను పూజిస్తారు. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రఘంట, నాల్గవ రోజు కూష్మాండా దేవి, ఐదవ రోజు స్కంద మాత, ఆరవ రోజు కాత్యాయిని, ఏడవ రోజు కాళరాత్రి, ఎనిమిదవ రోజు మహాగౌరి, తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి మొదలైనవి. ఈ తొమ్మిది రోజులు నవ దుర్గలను రంగురంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. అదే సమయంలో ఈ నవరాత్రి పండుగలో నవ దుర్గలకు ఇష్టమైన రంగు చీర లేదా దుస్తులను ధరించి అమ్మవారిని పూజించవచ్చు. #🌅శుభోదయం #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #🙏ఓం శ్రీ మాత్రే నమః🕉️ #🪔🕉️ అమ్మవారి అనుగ్రహం🙏🚩
19 likes
41 shares
Rochish Sharma Nandamuru
759 views 6 days ago
🌿🌼రాత్రి వేళల్లో పూజలందుకునే వారాహీ అమ్మవారు 🌼🌿 శ్రీ వారాహీ మాత స్తోత్రాలు🌼🌿 🌿🌼🙏శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం (వారాహి దేవి)🙏🌼🌿 (వింధ్యాచలము పైన సాక్షాత్తు ఆ కాశి విశ్వనాథ స్వామి శ్రీ వారాహి అమ్మవారిని ప్రతిష్టించారు ఆ అమ్మవారిని ఇక్కడి వారు విన్ధ్యేశ్వరిగా కొలుస్తారు ఈ అమ్మవారికి వింధ్యాచల్ లో వామాచారం లో కొలుస్తారు ఈ మందిరం లో కాళీ అమ్మవారు కూడా ప్రతిష్టింపబడింది) నిశుంభ-శుంభ మర్దిని ప్రచండ ముండ ఖండినీం వనే రణే ప్రకాశినీం భజామి వింధ్య వాసినీం 1 .. త్రిశూల ముండ ధారిణీం ధరా విఘాత హారిణీం గృహే గృహే నివాసినీం భజామి వింధ్య వాసినీం 2 .. దరిద్ర దుఃఖ హరిణీం సదా విభూతి కారిణీమ్ వియోగ శోక హరిణీం భజామి వింధ్య వాసినీం 3.. లసత్సులోల లోచనం లతాసదే వరప్రదం కపాల శూల ధారిణీం భజామి వింధ్య వాసినీం 4.. కరేముదా గదాధరీం శివమ్ శివ ప్రదాయినీమ్ వరం వరాననం శుభం భజామి వింధ్ య వాసినీం 5.. ఋషీంద్రయామినీ ప్రదం త్రిదా స్వరూపధారిణీం జలే స్థలే నివాసినీం భజామి వింధ్య వాసినీం 6.. విశిష్ట సృష్టి కారిణీమ్ విశాల రూప ధారిణీం మహోదరే విలాసినీమ్ భజామి వింధ్య వాసినీం 7.. పురంధరాది సేవితం మురాది వంశ ఖండినీమ్ విశుద్ధ బుద్ది కారిణీమ్ భజామి వింధ్య వాసినీం 8. అమ్మవారి అనుగ్రహం పొందే స్త్రోత్రం ఇది. ప్రతి రోజు పారాయన స్త్రోత్రం గా చేస్తే అన్ని శుభాలను కలిగిస్తుంది. తరచూ అనారోగ్యంతో ఉండే వాళ్ళు అష్టోత్తరం తో అర్చన చేస్తే మంచిది, ఈమె ఆయుష్షు ని వృద్ధి చేస్తుంది, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది, ఈమె రథంలో ఎప్పుడూ ధన్వంతరి (వైద్యుడు)ఉంటారు 🌿🌼🙏అంతటి కారుణ్య స్వరూపిణి ఈ తల్లి. బ్రహ్మాండ పురాణంలో దేవతలు ఈ తల్లిని 12 నామాలతో కీర్తించారు. ఆ నామాలు స్మరణచేతనే వజ్రకవచంలా అమ్మ యెక్క రక్షణ వలయం మన చుట్టుా ఏర్పడిందని ప్రతీతి🙏🌼🌿 🌿🌼🙏ఆ 12 నామాలకు సంభవించిన శ్లోకం🙏🌼🌿 పంచమీ, దండనాధా చ సంకేతా, సమయేశ్వరీ! సమయసంకేతా, వారాహీ, హోత్రిణీ, శివా! వార్తాళీ చ మహాసేనా, ఆజ్ఞాచక్రేశ్వరీ తథా! అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే! నామ ద్వాదశకాభిఖ్య వజ్ర పంజర మధ్యగః! సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః!! 🌿🌼🙏ఆ 12 నామాలు:🙏🌼🌿 🙏పంచమి. 🙏దండనాధ. 🙏సంకేతా. 🙏సమయేశ్వరీ. 🙏సమయ సంకేతా. 🙏వారాహీ. 🙏పోత్రిణీ. 🙏శివా. 🙏వార్తాళీ. 🙏మహా సేనా. 🙏ఆజ్ఞాచక్రేశ్వరీ. 🙏అరిఘ్నీ ఆ అమ్మ దయ మనందరిపైనా ఎప్పుడుా ఉండాలని కోరుకుంటూ!..... అమ్మ అందరిదీ- అమ్మ అందరికీ!... "సర్వేజనాః సుఖినోభవంతు! " 🌿🌼🙏అందరం భక్తి శ్రద్ధలతో " ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః " నామం వ్రాస్తూ అమ్మవారిని స్మరిద్దాం ... మనం ఎంత ఆర్తితో పిలిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తుంది ఆ జగన్మాత🙏🌼🌿 🌿🌼🙏ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః🙏🌼🌿 #🌅శుభోదయం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏ఓం శ్రీ మాత్రే నమః🕉️ #🙏శ్రీ వారాహి అమ్మవారు🕉️
20 likes
17 shares