శ్రీ ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా…
శ్రీ ఆది శంకరులు అద్వైత తత్వాన్ని ప్రచారం చేసి హిందూ ధర్మ పునరుద్ధరణకు పునాదులు వేసిన మహాగురు. “అహం బ్రహ్మాస్మి”, “తత్వమసి” వంటి మహావాక్యాలతో జీవాత్మ–పరమాత్మ ఏకత్వాన్ని స్పష్టంగా వివరించారు.
వేదాలు, ఉపనిషత్తులకు భాష్యాలు రచించి, భజ గోవిందం, సౌందర్య లహరి వంటి గ్రంథాలతో ఆధ్యాత్మికతను ప్రజలకు సులభంగా అందించారు. దేశమంతా పర్యటించి ధర్మపీఠాలు స్థాపించిన ఆయన జయంతి ప్రతి హిందువుకు పర్వదినం.
#శ్రీఆదిశంకరాచార్యలు