తిరుమల సమాచారం

S.HariBlr (Bangalore)
790 views
2 months ago
#😇My Status #తిరుమల సమాచారం *🌹 ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే! 🌹* *ప్రసాద్ భరద్వాజ* *తిరుమల దర్శనం టికెట్లు ఇక సులభంగా పొందే వెసులుబాటు కలిగింది. ఇప్పటి వరకు టీటీడీ ఆన్ లైన్.. ఆఫ్ లైన్ విధానంలో టికెట్లు పొందే విధానం అందుబాటులో ఉంది. ఇక నుండి ఆ సేవలు వాట్సప్ లో అందుబాటులోకి తెచ్చింది టిటిడి.* *బుకింగ్ విధానం* *భక్తుల కోసం ఇంగ్లీష్, తెలుగు భాషల్లో మన మిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా దేవాలయాలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి తెచ్చారు. సేవలను సులువుగా పొందడానికి '95523 00009' అనే వాట్సాప్ నెంబర్​ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్​లోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన దర్శనాలు, సేవలు పొందొచ్చు. ముందుగా మీ మొబైల్​లో '9552300009' అనే నంబర్ సేవ్ చేసుకొని 'Hi' అని మెస్సేజ్ చేయాలి. అప్పుడు సేవలు ఎంచుకోండి) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే 'దేవాలయ బుకింగ్ సేవలుఅనే ఆప్షన్ కనిపిస్తుంది.* *అనంతరం శ్రీశైలం, కాణిపాకం, అన్నవరం, విజయవాడ (Vijayawada), శ్రీకాళ హస్తి ఇలా ఏపీలోని ప్రముఖ టెంపుల్స్ నేమ్స్ డిస్​ప్లే అవుతాయి. అప్పుడు మీరు ఏ దేవాలయం వెళ్లాలనుకుంటున్నారో ఆ టెంపుల్​ ను సెలెక్ట్ చేసి నిర్ధారించి ఆప్షన్ ​పై క్లిక్ చేయాలి. దర్శనం సేవకు సంబంధించి భక్తుడి పూర్తి వివరాలు ఇవ్వటం ద్వారా దర్శనం సేవా టికెట్లు పొందవచ్చు.* 🌹 🌹 🌹 🌹 🌹
S.HariBlr (Bangalore)
802 views
2 months ago
#😇My Status #తిరుమల తిరుపతి #తిరుమల సమాచారం 🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀 గోవిందా! అని ఎందుకు తల్చుకోవాలి తెలుగువారికి గోవిందుడంటే వేంకటేశ్వరస్వామే! ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురుచూసే సమయంలో భక్తుల గోవిందనామస్మరణతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అంతదాకా ఎందుకు తిరుపతిలో అడుగుపెడుతూనే ఏడుకొండలన్నీ ఆ గోవిందనామంతో మారుమోగిపోతున్నట్లు తోస్తుంది. ఇంతకీ గోవింద అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే. గోకులంనాటి కథ విష్ణుమూర్తిని గోవిందుడు అని కూడా పిల్చుకుంటారని తెలిసిందే. ఈ పేరు వెనుక ఓ చిన్న కథ కూడా కనిపిస్తుంది. శ్రీకృష్ణుని లీలలలో గోవర్థనగిరిని ఎత్తడం కూడా ఒకటి కదా! గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు. ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురవుతారు. గోకులం మీద తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. ఆ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రజలంతా తల్లడిల్లుతుంటే, వారిని రక్షించేందుకు గోవర్థనగిరిని తన చిటికెన వేలున ఎత్తి పట్టుకుంటాడు ఆ నల్లనయ్య. ఈ ఘటనతో ఇంద్రుని గర్వం అణగిపోతుంది. తానే స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని, క్షమాపణలు వేడుకునేందుకు గోకులానికి వస్తాడు. అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వస్తుంది. తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా, ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అటుపై ‘నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని (అధిపతిని). కానీ మీరు గోవులన్నింటికీ కూడా అధిపతి. అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలవబడతారు,’ అని పేర్కొటాడు. అలా కృష్ణుడు ఈ భూలోకం మీద ఉన్న జీవులన్నింటికీ కూడా ఇంద్రునిగా పూజింపబడుతూ ‘గోవిందుడు’ అన్న నామంతో పూజలందుకుంటున్నాడు. చాలా అర్థాలే ఉన్నాయి గో అంటే గోవులు లేదా జీవులు అన్న అర్థం ఒక్కటే కాదు, అద్భుతమైన అర్థాలు ఎన్నో గోచరిస్తాయి. విష్ణుసహస్రనామంలో మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాం గతిః | అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః అన్న శ్లోకం కనిపిస్తుంది. ఇందులో గోవింద అనే నామాన్ని వివరిస్తూ పెద్దలు గో అనే శబ్దానికి గోవులు, భూమి, వాక్కు, వేదాలు అనే అర్థాలు ఉన్నాయని చెబుతారు. అంటే యోగులు విష్ణుపరమాత్మను ఈ లోకానికీ, ఆ లోకం మీద ఉండే జీవులకూ ప్రాణాధారంగా భావిస్తున్నారని తెలుస్తోంది. మరి అలాంటి జీవంతో సంచరించే మనిషికి ఆరోగ్యంతో పాటుగా జ్ఞానం (వేదం) ఉండాలి. మంచిని వ్యాపింపచేసి చెడుని ఖండించే వాక్కు ఉండాలి. అంటే మనకు జీవాన్ని, ఆ జీవానికి పోషణగా నిలిచే లోకాన్ని, ఆ జీవానికి అర్థాన్నిచ్చే వాక్కునీ, తనేమిటో తెలుసుకుని పరమాత్మతో ఐక్యమయ్యేందుకు తోడ్పడే జ్ఞానాన్ని... ప్రసాదించేవాడే ‘గోవిందుడు’ అనుకోవచ్చు. బహుశా అందుకేనేమో శంకరాచార్యులరు ‘భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే’ అంటూ ఆ పరమత్మను తలచుకోమని హెచ్చరించారు🙏🙏🙏 ✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️
S.HariBlr (Bangalore)
910 views
2 months ago
#😇My Status #తిరుమల తిరుపతి #తిరుమల సమాచారం #ఘటాటోపం 🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏 *🌼ఘటాటోపం* 🌼🌿🌼🌿🌼🌿🌼🌿 తిరుమల మాడవీధులలో స్వామివారి ఊరేగింపు సమయంలో చివరిగా ఒక గొడుగు లేదా గుడారం లాంటి దానిని పరిచారికలు మోసుకు వెళ్లడం మనం చూస్తూనే ఉంటాము. దీనినే "ఘటాటోపం" అంటారు. 1000 ఏళ్ల క్రితం శ్రీ రామానుజాచార్యుల వారు తిరుమల ఆలయ నిర్వహణలో అనేక సంస్కరణలు తెచ్చారు. ఏ ఆటంకం వచ్చినా స్వామి సేవ ఆగకూడదు అనే నియమాన్ని అప్పుడే బలంగా నాటారు. అందులో భాగంగానే ఈ వర్షం నుండి రక్షణ కల్పించే ఏర్పాట్లు వచ్చాయని చెబుతారు. అకస్మాత్తుగా వర్షం వస్తే స్వామివారి వాహనానికి ఇది రక్షణ కల్పిస్తుంది. తిరుమల ఆగమ శాస్త్రాల ప్రకారం, బ్రహ్మోత్సవాల్లో లేదా నిత్యోత్సవాల్లో స్వామివారు ఒక్కసారి ఆలయం నుండి మాడ వీధుల్లోకి వస్తే, ఊరేగింపు పూర్తి కాకుండా మధ్యలో ఆగకూడదు. : "ప్రకృతి వైపరీత్యాలు దైవ కార్యాన్ని ఆపలేవు" అనే నియమానికి ఇది నిదర్శనం. వర్షం వచ్చినా సరే, వాహన సేవ ఆగదు. అందుకే ఈ ఘటాటోపం కింద స్వామివారిని, వాహనాన్ని (గరుడ, శేష వాహనాలు మొదలైనవి) సురక్షితంగా ఆలయం వరకు చేర్చుతారు. దీనిని మోయడం చాలా కష్టమైన పని. తిరుమలలో బలమైన ఈదురు గాలులు వీస్తున్నప్పుడు, ఈ పెద్ద గుడారాన్ని బ్యాలెన్స్ చేస్తూ, వాహనంతో సమానంగా నడవడం అనేది ఆ పరిచారకుల నైపుణ్యానికి, భక్తికి నిదర్శనం. కొన్ని దశాబ్దాల క్రితం తోలు పొరలను వాడేవారని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు పైన వాటర్ ప్రూఫ్ కాన్వాస్ లోపలి వైపు స్వామివారికి శోభను ఇచ్చేలా వెల్వెట్ ల రంగుల వస్త్రాలను అమర్చుతారు. దీనిని పట్టుకోవడానికి పొడవైన వెదురు లేదా తేలికపాటి లోహపు రాడ్లు వాడతారు. ఘటాటోపాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారి పరిధిలోని ప్రత్యేక దర్జీ విభాగం తయారు చేస్తుంది. ఆలయ అవసరాలకు అనుగుణంగా, వానను తట్టుకునేలా అత్యంత దృఢమైన వాటర్‌ప్రూఫ్ మెటీరియల్‌తో దీనిని కుడతారు. దీనిని భద్రపరచడం, మరమ్మతులు చేయడం మరియు వాహన సేవా సమయానికి సిద్ధం చేయడం వంటి బాధ్యతలు 'వాహన బేరర్లు' లేదా ఆలయ సిబ్బంది చూసుకుంటారు . 🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏
newj today
589 views
4 months ago
#తిరుమల సమాచారం 17 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,966 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,535 మంది భక్తులు.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు
𝙎𝙖𝙜𝙖𝙧.... 𝙉.....
701 views
5 months ago
#తిరుమల సమాచారం #తిరుమల తిరుపతి సమాచారం 25న పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం* తిరుమల, 2025 అక్టోబర్ 23: తిరుమలలో అక్టోబర్ 25వ తేదీన‌ నాగుల చవితి ప‌ర్వ‌దినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుండి 9 గంటలవరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభ‌య‌ దేవేరుల‌తో క‌లిసి దర్శనమివ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు, దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు. శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునిదే. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
𝙎𝙖𝙜𝙖𝙧.... 𝙉.....
652 views
6 months ago
#తిరుమల సమాచారం *స్వర్ణరథంపై ఊరేగిన దేవదేవుడు* తిరుమ‌ల‌, 2025 సెప్టంబ‌ర్ 29: శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమ‌వారం సాయంత్రం 4 గంటలకు శ్రీవారు బంగారు తేరులో విహరిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్ర‌హించారు. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల న‌డుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వ‌ర్ణర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జరిగింది. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని శ్రీ‌వారి స్వర్ణ రథాన్ని లాగారు. స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భ‌క్తుల విశ్వాసం. స్వ‌ర్ణ‌ ర‌థోత్స‌వంలో టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌, జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సీవీఎస్వో శ్రీ ముర‌ళీకృష్ణ‌, శ్రీ సీఈ సత్యనారాయణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డింది.