ఆ పెద్ద పెద్ద కళ్ళతో మనల్ని గమనించే జగన్నాథ రథయాత్ర ఇవాళే..
వసంతపంచమిరోజు రథాలకి కావలసిన (దారు)చెక్క ఎంపిక తో మొదలు అక్షయ తృతీయ నాడు రథం తయారీ దాకా ఎంతో శ్రద్ధగా చేసే ఈ కార్యక్రమం లో ఎలాంటి బలమైన లోహం వాడరు మేకులు అవీ కూడా వాడరు రథ తయారీకి..
జగన్నాథుని రథం పేరు:నందిఘోష
బలరాముని రథం పేరు: తాళధ్వజ
సుభద్ర రథం పేరు: పద్మ రథం
...
ఒడిశా లో ఇంచుమించు ప్రతీ ఊళ్ళో జగన్నాథుడు కొలువై ఉంటాడు. ఏటా కొత్త రథం తయారు చేసి, గుళ్లో పూజలందుకున్న మూలవిరాట్ ను రథం మీద ఊరేగిస్తూ స్వామి,బలభద్రుడు,సుభద్ర లను గుండిచా కి తీసుకుని వెడతారు అక్కడ వారం రోజులు ఉండి దశమి నాడు తిరుగుప్రయాణం అవుతారు.
ఇవాళ పూరీలో క్షణమైన వర్షం పడుతుంది.పైనుంచి దేవతలు పూలవర్షం కురిపిస్తారు కదా ఆది మనకి వర్షం లా కనపడుతుంది అంతే..
దేవుడు అంటే మన వెన్నంటి ఉండే నమ్మకం, తానే మన ధైర్యం..
గుళ్ళో మూలవిరాట్ ను బయటికి తీసుకువచ్చి రథం మీద ఊరేగించడం ఒక్క పూరీ జగన్నాధ స్వామి కే జరుగుతుంది.
#జగన్నాథ స్వామి #జగన్నాథ స్వామి.. #జగన్నాథ రథ యాత్ర.. 🌀 #శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్ర మహారాణి 🙏🙏🌷🌹🌷