ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: వైశాఖ అమావాస్య / ఐశ్వర్య ప్రదాత శనీశ్వర జయంతి / శనిదేవ్ జయంతి 🔱🙏

PSV APPARAO
643 views
1 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: వైశాఖ అమావాస్య / ఐశ్వర్య ప్రదాత శనీశ్వర జయంతి / శనిదేవ్ జయంతి 🔱🙏 #🕉️శ్రీ శని భగవానుని జయంతి #🙏🏻శని జయంతి🙏🏻 #శని అమావాస్య #శని అమావాస్య.. *ఐశ్వర్యప్రదాత శనీశ్వర* శని నవగ్రహాలలో ఏడవ గ్రహం. శనీశ్వరుడని, ధర్మానుజు డని లోకంలో పిలుస్తారు. అసలు పేరు శనైశ్చరుడు. శనైః చరతీతి శనైశ్చరః మెల్లమెల్లగా నడిచేవాడు అని అర్థం. అందువల్లనే శనిని మందుడు అని కూడా పిలుస్తారు. శనివారా నికి శని అధిపతి. శని మందుడైన వలన ఆ వారానికి మంద వాసరమని, స్థిరవాసరమని పేరు వచ్చింది. శని పుట్టుపూర్వోత్తరాలను మత్స్యమహాపురాణం, ఇతర పురాణాలు కూడా వివరిం చాయి. ఛాయ, సూర్యదేవులు శనికి తల్లిదండ్రులు. యముడు అన్న. యమున అక్క ఛాయకే సంజ్ఞ అని మరోపేరు. ఉషా పద్మినిలు కూడా సూర్యుని భార్య లుగా ప్రసిద్ధి, సూర్యుని భార్య సంజ్ఞాదేవి సూర్యుని వల్ల యముణ్ణి, యమునను పొందింది. నానాటికీ సూర్య తాపం పెరుగుతున్నందువల్ల సంజ్ఞాదేవి తట్టుకోలేకపోయింది. ఒకరోజున తన తండ్రి ఇంటికి వెళ్ళింది. భర్తకు తెలియకుండా, ముందుగా తండ్రి అనుమతి లేకుండా వచ్చినందుకు తండ్రి మందలించాడు. అప్పుడు సంజ్ఞాదేవి ఆలో చించి తననీడతో ఛాయ అనే స్త్రీమూర్తిని సృష్టించింది. ఛాయ సంజ్ఞవలెనే ఉంది. సూర్యుడు కూడా ఛాయను గుర్తు పట్టలేకపోయాడు. సూర్యతాపాన్ని తట్టుకునే శక్తిని సంపాదించటం కోసం సంజ్ఞ తపస్సు చేసుకోవటానికి వెళ్ళింది. ఛాయ సంజ్ఞ చెప్పినట్లుగా ఆమె సంతానాన్ని ప్రేమతో పరిపాలిస్తూ సూర్యునితో అన్యోన్యంగా కాలం గడుపుతున్నది. ఛాయకు సూర్యుని వల్ల గర్భోత్పత్తి జరిగింది. 'ఛాయ' అంటే నీడ కనుక ఆ నీడకు పుట్టినందువల్ల శని నీలం నలుపురంగులు కలిసి నట్లుగా జన్మించాడు. శని నల్లగా ఉండటానికి మరొక కారణాన్ని ఇలా చెపుతున్నారు. ఛాయాదేవి గర్భంలో శని ఉన్న సమయంలో ఛాయాదేవి పరమేశ్వరుణ్ణి గురించి తీవ్రమైన తపస్సు చేసింది. ఆ ప్రభావం వల్ల శనికి నల్లనివర్ణం వచ్చింది. శివుడు సర్వజ్ఞుడైనందు వల్ల పుట్టుకతోనే ఆధ్యాత్మిక జ్ఞానసంపద కూడా శనికి లభించింది. శని ఛాయాసూర్యదేవుల సంతానమైనందు వల్లనే శనిని ప్రార్థిం చేటప్పుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ | శని గ్రహాలలో ప్రధానగ్రహం. చాలామంది శనిమహర్దశ వస్తున్నదని తెలిస్తే ముందుగానే భయపడతారు. 'నిజానికి శని కర్మఫలప్రదాత. కర్మసాక్షి కుమా రుడైనందువల్ల మానవులు చేసిన పుణ్యఫలాలను అనుభవింప చేస్తాడు. తానుగా ఎవ్వరినీ కష్టపెట్టడు. పాపం చేసిన వాళ్ళకి ఆ పాపఫలాన్ని అనుభవింపచేస్తాడు. పాపఫలం కష్టరూపంగా ఉంటుంది. కనుక శని కష్టపెడుతున్నాడని భావిస్తున్నారు. పుణ్యం చేసుకున్న వాళ్ళకి సుఖరూపమైన ఫలాన్నిస్తాడు'. ఇది గ్రహ అనుకూలతను సూచిస్తుందని కొందరు పండితులు చెపుతున్నారు. శని కుండలిలో ఉన్న స్థానాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది. ఈ స్థితి శనికే కాదు. గ్రహాలన్నింటికి ఉండేదే. గ్రహాలకు కూడా స్వక్షేత్రాలు, మిత్రక్షేత్రాలు, శత్రుక్షేత్రాలు అని ఉంటాయి. స్వక్షేత్రంలో మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు అనుకూల్య ప్రభావం చేత చక్కటి లాభదాయకంగా, సంతోషదాయకంగా జీవితం సాగుతుంది. క్షేత్రం మారితే ఆ ప్రభావం కూడా తీవ్రంగా ఇందుకు వ్యతిరేకంగా ఉంటుంది. రాహుకేతువులు సంపూర్ణశరీరులు కారు. ఇక మిగిలిన ఏడు గ్రహాలలో శని ఏడవగ్రహం. అందువల్ల ఏడవవారమైన శని వారానికి శని అధిపతి. శనివారంరోజున కొందరు శనికి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు. శనిని నువ్వులతో అర్చిస్తే ఎంతో మేలు కలుగుతుంది. శనికి నువ్వులనూనె అంటే ప్రీతి కనుక నువ్వులనూనెతో అభిషేకం చెయ్యాలి. త్రయోదశి తిథి రోజున (ప్రతినెల కాకుండా) శనిత్రయోదశి అనే విశేషసమయం వస్తుంది. ఆ రోజున కూడా శనికి విశేష పూజలు నిర్వహిస్తారు. శని నల్లగా ఉంటాడు కనుక నల్లని రంగు వస్త్రం ఇష్టం. నల్లని ధాన్యమైన నువ్వులు ఇష్టం. నువ్వులనుండి వచ్చిన తైలం ఇష్టం. నల్లనిపక్షి అయిన కాకి అంటే ఇష్టం కనుక కాకి వాహనం. శనిమహర్దశ అన్ని గ్రహదశల వలెనే నడుస్తున్నా చాలా మెల్లగా నడుస్తున్నట్లుగా ఉంటుంది. శనికి నీలం (రత్నం) అంటే ఇష్టం. నీలాలలో సముద్రనీలం, ఆకాశనీలం, కాకినీలం, మయూరనీలం, ఇంద్రనీలం అని అనేక రకాలున్నాయి. వారివారి స్థితిగతులను పట్టి, అవసరాన్ని బట్టి సిద్ధాంతిని సంప్రదించి వారి సూచన మేరకు ఆ రత్నాన్ని ధరించాలి. శనికి తరతమ భేదం లేదు. స్వజన, పరజన భేదం లేదు. తన ధర్మం తాను నిర్వహించటమే శనిలో ఉన్న ప్రధానలక్షణం. శని ఈశ్వరుణ్ణి కూడా బాధించాడని లోకంలో వృత్తాంతం ఉన్నది. ఒకసారి నారదుడు కైలాసంలో పరమేశ్వరుని దగ్గర శని గ్రహాన్ని గురించి ఎంతగానో ప్రశంసిస్తాడు. ఈశ్వరుడికి కొంచెం బాధ కలుగుతుంది. శని అంతటి గొప్పవాడైతే నాకె దురుపడి బాధించమని చెప్పు అని నారదుణ్ణి ఆదేశించాడు. నారదుడు శనికి ఈ వార్తను చేరవేస్తాడు. మళ్ళీ తిరిగి వచ్చి పరమేశ్వరుణ్ణి హెచ్చరించి వెళతాడు. పరమేశ్వరుడు శనికి తానుదొరికితేనే కదా బాధపెట్టేది. దొరకకుండా ఉండాలని కైలాసాన్ని వదిలి తన పరివారాన్ని విడిచి ఒక అడవిలో ప్రవేశించి అక్కడ ఉన్న మర్రిచెట్టుతొర్రలో దాగి ఉంటాడు. మరునాడు ఉదయం శని ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఈశ్వరా! చూశారా? మీరు నా ప్రభావాన్ని, హాయిగా ప్రమథగణాల మధ్య కైలాసంలో సేవలందుకోవలసిన మీరు ఈచెట్టు తొర్రలో దాగి ఉన్నారు అని నమస్కారం చేశాడు. పరమేశ్వరుడు ఒక్కక్షణం ఆలోచించి ఓశనీ! నీ ప్రభావం అమోఘం. ఈనాటి నుండీ నీవు కూడా ఈశ్వరపదంతో ప్రసి ద్ధిని పొందుతావు. నిన్ను శనీశ్వరుడని పిలుస్తారు అని అను గ్రహించాడు. శని ఆనాటి నుండి శనీశ్వరుడుగా పేరు పొందాడు. అందు వల్లనే శనిగ్రహ దేవాలయాలు మనకు దర్శనమిస్తున్నాయి. శనీశ్వరుడికి ప్రత్యేకంగా దేవాలయాలు కూడా ఉన్నాయి. మంగనూరులో కూడా ఒక శనీశ్వరదేవాలయం ఉంది. ఇది నిర్ణీత సమయంలోనే తెరచి ఉంటుంది. మనరాష్ట్రంలోని మంద పల్లిలోని శనీశ్వరాలయం సుప్రసిద్ధం. మహారాష్ట్రలోని శని శింగణాపూర్ చాలా విలక్షణక్షేత్రం. ఆరు బయటే ఉంటుంది. ఇక్కడ వాకిళ్ళకు తలుపులు కూడా ఉండవు. దొంగతనాలు జరుగవు. అక్కడ ఎవరైనా దొంగతనానికి పాలుపడితే వాళ్ళు పొలిమేర దాటరు. ఇప్పటికీ శనీశ్వరప్రభావాన్ని ఇది చాటు చున్నట్లే కదా! మరొక మహిమాన్వితమైన పాగడ (పావగడ) క్షేత్రం అనే పేరుతో ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులలో ఉన్నటు వంటి శనీశ్వరాలయం ఎంతో ప్రసిద్ధమైనది. గొప్పశక్తి కలిగిన శనీశ్వరుడికి పరమేశ్వరుడు లోబడినా పరమేశ్వరాంశతో అవ తరించిన హనుమంతుడు మాత్రం శనికి లోబడలేదు. శని అనుకూలంగా లేని వాళ్ళు ఆ దోపం తొలిగిపోవటానికి హనుమకి పూజలు, సుందరాకాండ పారాయణలు చేయిస్తారు. శనికి మందగమనుడు అనే పేరు రావటానికి కారణాన్ని పురాణాలు ఇలా చెపుతున్నాయి. సంజ్ఞాదేవి తపస్సు పూర్తిచేసు కొని వచ్చేసరికి ఛాయ సూర్యుని వల్ల శనిని కన్నది. తాను సృష్టించిన స్త్రీయే, తన ఛాయే అయినా ఆ కుమారుణ్ణి చూడ గానే సంజ్ఞకు తన సవతికుమారుడనే భావం కొద్దిపాటి ఈర్ష్య కలిగాయి. తన దగ్గరకు వస్తున్న ఆ చిన్నారి శనిని అసూయతో సంజ్ఞాదేవి నీవు కుంటివాని వలె మెల్లగా నడుస్తావు. నీ మంద గమనం వల్ల నిన్ను మందుడని పిలుస్తారు. అని శపించింది. ఆ కారణంగా శని మందు డు, శనైశ్చరుడు అయినాడు. మీనరాశిలో శని ఉంటే కరువుకాటకాలు వస్తాయి. అయోధ్యానగరాన్ని దశరథ మహా రాజుగారు పరిపాలిస్తున్న సమయంలో కరువు కాటకాలు వచ్చి ప్రజలు అనేకకష్టాలతో బాధ పడుతున్నారు. ఇందుకు కారణం శనే అని జ్యోతిష్యుల వల్ల తెలుసుకున్న దశరథుడు శని మీదకు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో ఓడి పోయిన దశరథమహారాజు చివరికి చేసేది లేక శనిని స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం. *ప్రసాదం కురు మే సౌరే వరదో యది మే స్థితః* *అధ్య ప్రభతి మే రాష్ట్ర పీడా కార్యా న కస్యచిత్ |* అని ప్రారంభమై ఇరవైఐదు శ్లోకాలతో పూర్తవుతుంది. ఇది అత్యద్భుతమైన స్తోత్రం. ఓ శనీ! ఇకనుండీ నా దేశంలో ప్రతి పన్నెండుసంవత్సరాలకు వచ్చే దుర్భిక్షం రాకూడదు అని కోర గానే శని వెంటనే వరమిచ్చాడు. ఈ వరాన్ని పొంది దశరథ మహారాజు కృతకృత్యుడైనట్లు భావించి రథంపై ధనుర్బాణాల నుంచి చేతులు జోడించి నమస్కరిస్తూ సరస్వతీదేవిని, గణపతిని ధ్యానించి శనిని ఈవిధంగా స్తోత్రం చెయ్యటం మొదలు పెట్టాడు. *నమః కృష్ణాయ నీలాయ శిఖికంఠనిభాయ చ* *నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ...* అంటూ స్తోత్రం చేశాడు. శని సంతుష్టుడైతే అప్ల్యైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఆగ్రహిస్తే అష్టకష్టాలపాలు చేస్తాడు. దేవతలు, రాక్ష సులు, మనుష్యులు, సిద్ధులు, విద్యాధరులు, ఉరగులు అందరూ కూడా శని అనుగ్రహదృష్టి లేకపోతే అష్టకష్టాల పాలౌతారు. కేవలం వీళ్ళేకాదు. బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, సప్తర్షులు కూడా తమ తేజస్సులను కోల్పోయి దీనులౌతారు. మహా రాజులు రాజ్యభ్రష్టులౌతారు. దశరథ మహారాజు చేసిన స్తోత్రం విని ఓ మహారాజా! నీ స్తోత్రానికి నేను ప్రీతుణ్ణయ్యాను. ఇవ్వకూడనిదే అయినా నీకు నేను వరాన్నిస్తాను. నీవు చేసిన ఈ స్తోత్రాన్ని మానవుడు ఒక సారి కాని, రెండుసార్లుకాని భక్తి శ్రద్ధలతో పఠిస్తే మృత్యుముఖం నుండి కూడా రక్షణ పొందుతాడు. ఎవడైతే లోహంతో నా ప్రతిమను చేయించి జమ్మిపూలతో పూజించి మినుములతో వండిన అన్నాన్ని నువ్వులతో కలిపి నివేదించి నల్లని ఆవుని, గేదెను, వస్త్రాన్ని దానం చేస్తాడో, శనివారం రోజున ఈ స్తోత్రంతో పూజచేస్తాడో వాడికి నేనేవిధమైన బాధని కలిగించను. గోచారంలో కాని, జన్మలగ్నంలో కాని, దశలో కాని, అంత ర్దశలో కాని ఇతర గ్రహాల వల్ల కూడా బాధ కలుగకుండా రక్షిస్తాను. అని మరొక వరాన్నిచ్చాడు. ఈ విధంగా దశరథుడు రెండు వరాలను పొంది కృతార్థుడైనాడు. *ఇంతకంటే సులభతరంగా షోడశనామావళి ఉంది.* 1. కోణః, 2. శనైశ్చరః, 3. మందః, 4. ఛాయాహృదయ నందనః, 5. మార్తాండజః, 6. తథా సౌరి:, 7. పాతంగీ,8. గృహనాయకః, 9. అబ్రాహ్మణః, 10. క్రూరకర్మా, 11, నీల వస్త్రః, 12. అంజనద్యుతిః, 13. కృష్ణః, 14. ధర్మానుజః, 15. శాంతః, 16. శుష్కోదరవరప్రదః ఈ 16 నామాలను ప్రతిరోజు చదువుకుంటే విశేషమైన శుభఫలితాలు వస్తాయి. అత్యంత ప్రభావసంపన్నుడైన శనీశ్వరుని అనుగ్రహాన్ని పొందటానికి మనం కూడా శనీశ్వరునిజయంతి రోజున ఆరాధించి అప్లైశ్వర్యాది అనేక శుభాలను పొందుదాం. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
641 views
5 days ago
#ఏకాదశి రోజున ప్రత్యేక నియమాలు తెలుసా #ఏకాదశి #అపరా ఏకాదశి ప్రాముఖ్యత 🕉️🙏 #అపర ఏకాదశి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: అపర ఏకాదశి 🕉️ Apara Ekadashi 2023 🙏 ఏకాదశి విశిష్టత *రేపు అపరా ఏకాదశి* *(మే 13)* హరే కృష్ణ.. *భక్తి జనని అయిన ఏకాదశి యొక్క నియమాలను తెలుసుకుందాం* ✓ ధాన్యాలు, పప్పులు, శనిగలు, మక్కజొన్న, కూరగాయలలో(గొకర్కాయ, చిక్కుడుకాయ లాంటివి), బటాని వంటివి తినకూడదు. ✓*పండ్లు, పాలు, కాజు, బాదం, పిస్తా, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్, కంద మూలాలు, సగ్గు బియ్యం, *సామలు* లాంటివి మనం తినవచ్చు* / తులసి పత్త్రిన్ని/ఆకులని ఏకాదశి మరియు ద్వాదశి(ఏకాదశి తరువాత రోజున) తెంపకూడదు. ✓ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం, మన శరీరం యొక్క అవసరాలను తగ్గించి, శ్రవణం, కీర్తనం, హరి నామ స్మరణం ఎక్కువ చేయడం. ✓ మన రోజును కృష్ణుడి యొక్క విగ్రహాన్ని లేదా ప్రతిమను పూజించడంతో మొదలుపెట్టడం చాలా మంచిది. ధూపం, దీపం, తులసి పత్రం(ఏకాదశి ముందు రోజు తీసినవి), పండ్లు, పూలు సమర్పించి ఆ శ్రీ విష్ణువుని కృప కొరకు ప్రార్థించండి. ✓ హరే కృష్ణ హరే కృష్ణ | కృష్ణ కృష్ణ హరే హరే || హరే రామ హరే రామ రామ రామ హరే హరే ॥ అనే ఈ మహా మంత్రాన్ని ఎంత కుదిరితే అంత జపించండి. ✓ ఒక గమనిక ఏమిటంటే మనం ఏకాదశి రోజున మాంసము, చేపలు, గుడ్లు, పుట్ట గొడుగులు, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి, మత్తుపదార్తాలు(సిగరెట్, తంబాకు) మరియు ఇతర తామసిక పదార్థాలను సేవించకూడడు. ✓ ద్వాదశి (ఏకాదశి తరువాత రోజు) ప్రొదున్నే లేచి స్నానంచేసి, విష్ణు మూర్తిని ఆరాధించి, ఉపవాసాన్ని పారణ సమయమున (ఉపవాసము విడిచిపెట్టు సమయం) విడిచిపెట్టాలి, ఈ సమయం ప్రతి ఏకాదశికి మారుతుంది. శ్రీమాన్ ప్రణవానంద ప్రభూజీ యొక్క ప్రవచనాల గురించి మరియు రాబోయే కార్యక్రమాల గురించి మరిన్ని వివరాల కోసం ఈ వాట్సాప్ ఛానెల్ ని ఫాలో అవ్వండి 👇🏻👇🏻 https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b
PSV APPARAO
668 views
16 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మహా వైశాఖి / వైశాఖ పూర్ణిమ / బుద్ధ పూర్ణిమ #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #బుద్ధ పూర్ణిమ #బుద్ధ పూర్ణిమ స్పెషల్ *ఆచరణే ఆరాధన* _ఆచరణే ఆరాధన_ మనం పురాణ పురుషుల, మహనీయుల జయంతులు వంటి వాటిని ఘనంగా జరుపుకుంటాం గాని వారు చెప్పిన బోధనలు పాటించటంలో వెనుకబడి ఉంటుంటామని ఇంతకు ముందే తెలుసు కున్నాం. ఆయా బోధనలు చేసిన మహాత్ములను మనం ఏనాడూ చూసి ఉండకపోవచ్చు. కలిసి మాట్లాడి ఉండక పోవచ్చు. ఒక్క పైసా ఇచ్చి ఉండక పోవచ్చు. వారి బోధనలను ఆచరణలో పెట్టటమే వారి పట్ల మనం గౌరవాన్ని, భక్తి, శ్రద్ధలను కనబరచినట్లు అవుతుంది. ఆ విషయాన్నే తెలుపుతుంది మహాభారతంలోని ఏకలవ్యుని కథ. ఎదురుగా గురువు లేకున్నా, ఆయనను మనసులో నిలుపుకుని సాధన చేసి విలువిద్యలో అద్భుత నైపుణ్యాన్ని సాధించాడు ఏకలవ్యుడు. ఇటువంటి సంఘటనే బుద్ధ భగవానుని జీవితంలోను జరిగింది. బుద్ధ భగవానుడు దేశాటనలో భాగంగా ఒక రాత్రి వేళ కుమ్మరి శాలకు చేరుకున్నాడు. ఆ శాలకు ఆయన కన్న ముందే ఒక యువ పరి వ్రాజకుడు వచ్చి ఉన్నాడు. వారికి పూర్వ పరిచయం లేదు. ఆ యువ పరివ్రాజకుని మాట, ప్రవర్తన బాగా నచ్చాయి బుద్ధ భగవానునికి. అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నాడు. ఓ భిక్షూ! నీవెవరి పేరున ప్రవ్రుజిడవైనావు లేక నీ శాస్త ఎవరు? ఎవరి ధర్మాన్ని ఇష్టపడతావు? అని ఆ యువకుని ప్రశ్నించాడు. అతడు సమాధానమిస్తూ, 'మిత్రమా! శాక్య పుత్రుడైన శ్రవణ గౌతము డున్నాడు. అతడు భగవంతుడు, అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు. అతనే నా శాస్త్ర, నేనతని ధర్మాన్నే ఇష్టపడతాను అన్నాడు. దానితో బుద్దుడు ఒకింత ఆశ్చర్యంతో 'ఆ సమ్యక్ సంబుద్ధుడు ఇప్పుడెక్కడున్నాడు. నీవు ఆయనను ఎపుడైనా చూశావా? చూస్తే గుర్తించగలవా అని ప్రశ్నించాడు. ఎందుకంటే ఆ సన్యాసి చెబుతున్న సమ్యక్ సంబుద్ధుడు తానే. ఆ యువ సన్యాసికి తానెప్పుడూ ఏదీ ప్రత్యక్షంగా బోధించలేదు. దానికా యువ సన్యాసి 'నేను భగవంతుని ఏ నాడూ చూడలేదు. అందువల్ల చూసినా గుర్తించలేను అన్నాడు. పరో క్షంగా తన బోధనలు విని భక్తి శ్రద్ధలతో వాటిని ఆచ రిస్తున్న ఆ యువ సన్యాసికి బుద్ధుడు తానెవరో తెలిపి ధర్మాన్ని వివ రిస్తూ ఇంకెన్నో విషయాలను తెలి యజేశాడు. ఆనందం హృద యంలో పొంగి పొరలగా, రెండు కళ్ళలో నీరు ఉబ కగా, ఆ యువ సన్యాసి బుద్ధ భగ వానుని పాద పద్మాలపై తల ఉంచాడు. రెండు చేతులూ జోడించి, 'భగవాన్! నేను మిమ్మల్ని మిత్రమా అన్నందుకు నన్ను క్షమించండి. నా పేరు పుష్కర స్వాతి. నాకు ప్రవ్రాజ్య ఉప సంపద బ్రిక్టు సంఘంలో సదస్యత్ర ఇవ్వండి' అని ప్రార్థించాడు. భక్తి, శ్రద్ధ అంటే అవి. ఏ మహనీయుని విషయంలోనైనా మనకు ఆరాధనా భావముంటే వారి బోధను ఆచరించాలి గాని పాదపూజలతో, పూలహారాలతో, హారతి అర్చనలతో సరిపెట్టు కోరాదు. అవి ఉద్ధరించవు. సనాతన ధర్మం మనం ఆరు రుణాలతో పుడ తామని చెబుతుంది. అవి భూత రుణం, పితృరుణం, మాతృ రుణం, దేవ రుణం, ఋషి రుణం, మనుష్య రుణం. ఇవి తీర్చుకోవాలంటారు. వాటికి విధా నాలున్నాయి. వాటిలో ఋషి రుణాన్ని తీర్చుకోవడం ఎలా గంటే వారు మనకు ఇచ్చిన విజ్ఞానాన్ని వారు చేసిన రచ నలు చదివి ఆచరించడం ద్వారానేనని చెబుతారు. అంటే నిజమైన ఆరాధన ఆయా మహనీయుల బోధనలు ఆచరించడమేనని తెలుస్తుంది. లోకోపకారమే ఆ మహ నీయుల ఉద్దేశం. వారి బోధ నలు ఆచరించడం ద్వారా మన జీవితాలు, సమాజం బాగు పడతాయి. అవి బాగుపడితే రాష్ట్రం, దేశం ఇలా అన్నీ బాగుపడతాయి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
645 views
3 months ago
#పుణ్య స్నానం చేయడం వలన ఫలం ఏమిటి? #మౌని అమావాస్య ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: పుష్య అమావాస్య / మౌని అమావాస్య / చొల్లంగి అమావాస్య #త్రివేణి సంగమం #సరస్వతి నది * అంతర్వాహిని * త్రివేణి సంగమం *UP:* *మౌని అమావాస్య వేళ.. 1.3 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు* *ఇంటర్నెట్‌ డెస్క్‌:* *మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ (UP)లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌ పరిసరాలు భక్తజనంతో సందడిగా మారాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమంలో 1.3 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. మాఘమేళా పవిత్ర స్నానాల కోసం మొత్తం 12,100 అడుగుల పొడవైన స్నానపు ఘాట్‌లను నిర్మించామని, ప్రజలకు అవసరమైన అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సాధారణ, ట్రాఫిక్‌ పోలీసులతో పాటు ఏదైనా అత్యవసర కేసుల్లో సాయం అందించేందుకు వైద్య నిపుణుల బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. భద్రతా నియమాలు పాటిస్తూ, అధికారులకు సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.* https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42
PSV APPARAO
657 views
3 months ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: పుష్య అమావాస్య / మౌని అమావాస్య / చొల్లంగి అమావాస్య #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #మౌని అమావాస్య విశిష్టత #మౌని అమావాస్య.. ఏం చేయాలి 🤔?? #మౌని అమావాస్య ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు 🙏 *UP:* *మౌని అమావాస్య వేళ.. 1.3 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు* *ఇంటర్నెట్‌ డెస్క్‌:* *మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ (UP)లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌ పరిసరాలు భక్తజనంతో సందడిగా మారాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమంలో 1.3 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. మాఘమేళా పవిత్ర స్నానాల కోసం మొత్తం 12,100 అడుగుల పొడవైన స్నానపు ఘాట్‌లను నిర్మించామని, ప్రజలకు అవసరమైన అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సాధారణ, ట్రాఫిక్‌ పోలీసులతో పాటు ఏదైనా అత్యవసర కేసుల్లో సాయం అందించేందుకు వైద్య నిపుణుల బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. భద్రతా నియమాలు పాటిస్తూ, అధికారులకు సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.* https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42