registration

బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
635 views
6 months ago
రిజిస్ట్రేషన్ల విషయంలో బహు పరాక్! లేదా వృద్ధులను ఏ మార్చి,కళ్ళుగప్పి అందరికి సంక్రమించాల్సిన ఆస్తులను ఒక్కరే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న దారుణ పరిస్థితులు! నేటి సమాజంలో వృద్ధులను ఏ మార్చి,కళ్ళుగప్పి, వారికి ఏవో సొల్లికబుర్లు చెప్పి,నయానో,భయానో వారిపై ఒత్తిడి తెచ్చి ఓక కుటుంబంలో అందరికి సంక్రమించాల్సిన ఆస్తులను దొడ్డిదారిలో ఒక్కరే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న దారుణ,దగాకోరు చేసే పరిస్థితులు ప్రస్తుతం మన కళ్ళ ముందు తరచుగా సాక్షాత్కరిస్తున్నాయి అనే మాట సత్య దూరం కాదు. ఒక్కొక్కసారి నయవంచన అనే వక్ర బుద్ది గల సొంత ఇంటి మనుషులలోని కొంతమంది తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వారు అందరికి చెందాల్సిన ఆస్తులను అక్రమ మార్గంలో,చట్ట విరుద్దంగా తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా అత్యంత గొప్యంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులోని వారిని మ్యానేజ్ చేసి తమ ఇంట్లో వృద్ధులను తమ వశం చేసుకొని,తమ అధీనంలోకి తెచ్చుకొని మరీ ఆస్తులను అడ్డదారిలో తమ పేర రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న సంఘటనలు కొకొల్లలుగా ప్రస్తుత సమాజంలో సంభవిస్తున్నాయి, పోటేత్తుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు.అదేవిధంగా పొరపాటున మన కర్మ చాలక ఆ ఇంటిలోని వృద్దులు మరణం చెందితే అలా అక్రమ మార్గంలో ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి పరం ఆస్తులు అవుతుండటం అనేది నిజంగా ఆందోళన కలిగించే విషయం.అలా జరుగకుండా మోసపోయిన కుటుంబసభ్యులు ఎవరైనా,పొరపాటున తెలిసో తెలియకో సంతకం చేసిన వృద్దులు తమ తప్పు తెలుసుకొని ఇది అన్యాయం అని అందరికి చెందాల్సిన ఆస్తులను నన్ను మభ్యపెట్టి ఆ ఇంట్లోని కుటుంబసభ్యుల్లో ఒక్కరే రిజిస్ట్రేషన్ చేసుకుంటే అయా ప్రాంత పరిధి లోని పోలీస్ స్టేషన్ కో లేదా న్యాయస్థానానికో వెళ్లి ఆ నయవంచకులపై పిర్యాదు చేసేలా మన చట్టాలు మరింతగా బలోపేతం కావలసిన అవశ్యకత ఎంతైన వుంది.అలా చట్టాలు బలోపేతం కాకపోతే మాత్రం అయా కుటంబసభ్యులలోని సభ్యులు తమ ఉమ్మడి ఆస్తుల విషయంలో కొంతమంది నమ్మక ద్రోహం చేసే కుటుంబసభ్యుల మూలాన అప్పనంగా తమకు చెందాల్సిన ఆస్తులను వారికి అప్పజెప్పాల్సి వస్తుంది.ఇలాంటి కేసుల విషయంలో పోలీసు డిపార్ట్మెంట్ వారు,న్యాయస్థానం వారు ప్రత్యేక శ్రద్ధ వహించి మోసపోయిన కుటుంబ సభ్యులకు తక్షణమే న్యాయం చేకూరేలా తీవ్ర కృషిసల్పాల్సిన కర్తవ్యం ఇరువురిపై ఎంతైనా వుంది. ఏదిఎమైన కనీసం ఇప్పటికయినా ఉమ్మడి కుటుంబంలోని సభ్యులు ప్రతి ఒక్కరూ అందరికి చెందాల్సిన ఉమ్మడి ఆస్తులు ఒక్కరి పరమే కాకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవశ్యకత, గురుతర బాధ్యత వారి భుజస్కందాలపై ఎంతైన వుంది.ఏమైనా ఈ ఉమ్మడి ఆస్తుల విషయంలో ఏ మాత్రం అశ్రద్దగా వున్న,నిద్ర మత్తులో ఉండిపోయిన మరొకరు తన కుటుంబంలోని వారే అక్రమ మార్గంలో ఆ ఇంటి వృద్దులకు మాయ మాటలు చెప్పి,పక్కదోవ పట్టించి అందరికి చెందాల్సిన ఆస్తులు ఒక్కరే డేగలా తన్నుకుపోయే దారుణ,కిరాతక,అమానుష,అత్యంత దుర్మార్గమైన పరిస్థితులు ప్రస్తుత సమాజంలో కొకొల్లలుగా సంభవిస్తున్నాయి.తస్మాత్ జాగ్రత్త!అదమరిస్తే మన నోట్లో మట్టి కొట్టి మరీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే మన సొంత బంధువులే చట్టంలోని కొన్ని లొసుగులను ఆధారం చేసుకొని తిమ్మిని బమ్మి బమ్మీని తిమ్మి చేసి మరీ మన ఆస్తులను కొల్లగొట్టుకుపోయే ప్రమాదం పొంచి వుంది.ఖాబర్ధార్!✍️✍️✍️ - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #registration