👉నాడు...నేడు👈

P.Venkateswara Rao
488 views
9 days ago
#నాడు - నేడు!!! *భేష్ లోకేష్… కార్పొరేట్ దోపిడీ బడులను దాటి… నిల *‘బడి’*…❗ May 1, 2026🎯 మొన్నామధ్య మనం ఓ ముచ్చట చెప్పుకున్నాం గుర్తుందా..? తెలంగాణ గురుకులాల విద్యార్థులు కార్పొరేట్ కాలేజీలకు దీటుగా మంచి మార్కులు, ర్యాంకులు సంపాదించారు… గ్రామీణ నేపథ్యం, పేదరికం, కులం, మతం, ప్రాంతం, ఏదీ ప్రతిభకు అడ్డురాదు… చదువుకునే పరిస్థితులు క్రియేట్ చేస్తే వాళ్లు అద్భుతాలు క్రియేట్ చేస్తారని చెప్పడానికి ప్రబల నిదర్శనం… కానీ ఏం సుఖం..? రేవంత్ రెడ్డి సమాచార విభాగం ఘోర వైఫల్యం, తన టీమ్ ఫెయిల్యూర్… అందుకే ఏమాత్రం ఆ ఘనతను, సొసైటీకి ఆదర్శంగా ఉండగల సక్సెస్ స్టోరీని చెప్పుకోలేక చేతులెత్తేసింది… ఖచ్చితంగా… రేవంత్ రెడ్డి తన పాలనలో వైఫల్యాలు ఏమున్నాయి అంటే, టాప్ టెన్‌లో ప్రచార వైఫల్యం కూడా ఒకటి… సీన్ కట్ చేస్తే… దీనికి పూర్తి కంట్రాస్టుగా… ఒక ఐడియల్ ప్రచారాన్ని చెప్పుకుందాం… ఏపీలో పదో తరగతి ఫలితాలు రిలీజయ్యాయి… ఏపీలో విద్యా మంత్రి లోకేష్… సారీ, తను యాక్టింగ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్… తను చెప్పిందే శాసనం… ఐనా సరే… తన ఊసు లేకుండా, తన డప్పు కొట్టుకోకుండా పత్రికలకు యాడ్స్ ఇచ్చాడు… కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా యాడ్స్… వాడో వీడో రాసేదేముంది..? ఎవడిని బతిమిలాడేదేముంది..? మన ఘనతను మనమే ప్రచారం చేసుకుందాం…. ఎస్, అదే కోణంలో… 8 మంది ప్రభుత్వ విద్యార్థులు ఏకంగా 600కు 595 మార్కులు… గ్రేట్… వాళ్ల మొహాలు, స్కూళ్ల పేర్లతో సహా… అదే చెబుతున్నది… మెరిట్‌కు కులం, ప్రాంతం, మతం, పేదరికం, గ్రామీణ నేపథ్యం అడ్డుకావు అని… ఒరేయ్ మేమెవరికి తక్కువరా అన్నట్టుగా… ఐతే ఇక్కడ మెచ్చుకునేది ఏమిటంటే..? యాడ్స్‌లో ఎక్కడా చంద్రబాబు ఫోటో లేదు… అదొక అబ్బురం… లోకేష్ ఫోటో లేదు, తను సంబంధిత మంత్రి అయినా సరే…. సరే, పవన్ కల్యాణ్ ఫోటో లేదు, తనకు లింక్ లేదు కూడా… ఎక్కడా కూటమి ప్రభుత్వం అనే జాడలు, ఛాయలు లేవు… ఒక్క అధికారి ఫోటో లేదు… ఐనా వాళ్లు పీకేదేముందిలే… కార్పొరేట్ యాడ్స్ అంటేనే అబద్ధాలు… కానీ ఇక్కడ నిజాయితీగా వివరాల ప్రకటన… జస్ట్, ప్రతి ప్రభుత్వ విద్యార్థికీ ఓ అభినందన… ప్రతి ప్రభుత్వ టీచర్‌కూ ఓ గుర్తింపు… ఈ స్కూల్ మాది, ఈ వ్యవస్థ మాది అని ఓన్ చేసుకోవడం గొప్ప విషయం… నిజానికి ప్రతి ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చిన శ్రమ జగన్‌ది… కానీ చెప్పుకునే తెలివి, సోయి ఎక్కడిది… అది లోకేష్‌కు ఉంది..!! ఎస్, జగన్ ఫెయిల్యూర్ తన టీమ్ ఎంపికలో ఉంది… లోకేష్ సక్సెస్ తన టీమ్ ఎంపికలో ఉంది…!! అఫ్‌కోర్స్, జగన్‌కు సమజవుతుందని అనుకుంటే అది మన భ్రమ..!! ఇంత మంచి మార్కులు సంపాదించిన ప్రతి ప్రభుత్వ బడి విద్యార్థికీ అభినందనలు, ఆశీస్సులు..!!!
P.Venkateswara Rao
3.8K views
21 days ago
#నాడు - నేడు!!! మొన్న అచ్చి... ఇప్పుడు బుచ్చి (అచ్చెన్నాయుడు ,బుచ్చయ్య చౌదరి ) ABN రాధాకృష్ణకు జగన్ నుంచి ప్రమాదం ఉంది పరిటాల రవిని హత్య చేయించిన చరిత్ర జగన్‌ ది సొంత బాబాయి వివేకానందరెడ్డినే హత్య చేయించాడు చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి 54 రోజులు జైల్లో పెట్టాడు -టీడీపీ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి వాస్తవాలు YS కానీ జగన్ కానీ సీఎం గ ఉండగా రామోజీ రాధాకృషల మీద దాడులు జరిగాయా .. లేదే 81 ఏళ్ల లేటు వయసులో మంత్రి పదవి కోసం ఇంత దిగజారాలా నీవు ఎన్టీఆర్ వర్గం లో ఉన్నప్పుడు ఇదే బాబు మీద ఎంత ఘాటు కామెంట్స్ చేసావో బాబు కు గుర్తుంది అందుకే నీకు మంత్రి పదవి ఇవ్వడం లేదు వివేకా హత్య కేసులో జగన్ కు ఎలాంటి సంబంధం లేదు అని సుప్రీం కోర్ట్ ఇప్పటికే చెప్పింది పరిటాల రవి 1993 లో మద్దెల చెరువు సూరి ఇంటిలో పరిటాల వర్గీయులు TV బాంబు పెడితే సూరి తల్లి సిస్టర్ బ్రదర్ చనిపోయారు ప్రతీకారంగా .. బాబు సీఎం గ ఉన్నప్పుడు 1997 లో పరిటాల రవి కోసం అని సూరి బాంబులు పెడితే ఆ ప్రమాదంలో ఈటీవీ సిబ్బంది చనిపోయారు ఆ విధంగా పరిటాల ,సూరి కుటుంబాల మధ్య ఉన్న ఫ్యాక్షన్ గొడవలకు వారే కారణం కానీ జగన్ కాదు ఇక పరిటాల రవిని (2005 లో) చంపింది కూడా సూరి వర్గమే జగన్ ది పరిటాలది వేరే జిల్లా వేరే పార్టీ రాజకీయంగా లోకల్ గ పరిటాల కు , JC బ్రదర్స్ కి పడేది కాదు పరిటాల హంతకులలో జేసీ బ్రదర్స్ ఉన్నారు అని చెప్పిన బాబు వాళ్లకు వరుసగా టీడీపీ టికెట్లు ఇచ్చాడు మరి ఇప్పుడు ఎవరి హస్తం ఉన్నట్టు ? పోనీ నిజంగా జగన్ హస్తం ఉంటె 2014 -19 మధ్య ..ఇప్పుడు బాబే సీఎం కదా మరి ఎమ్ చేస్తున్నట్టు, 1998 లో బాబు సీఎం గ ఉన్నప్పుడు YS రాజారెడ్డి ని చంపిన వాళ్ళు ఇప్పటికి బ్రతికే ఉన్నారు అంటే తెలియడం లేదా YS కుటుంబం హత్య రాజకీయాలకు దూరం అని స్కిల్ స్కాం లో బాబు మీద ఆధారాలు ఇచ్చింది కేంద్ర GST శాఖ ఇన్కమ్ టాక్స్ వాళ్ళు కదా Note : రంగా హత్య గురుంచి బాబుకు ముందే తెలుసు -కాపు నేత మాజీ మంత్రి హరిరామజోగయ్య Nov 2 2015 నన్ను రంగాను లేపేయాలని బాబు ట్రై చేసాడు రంగ విషయం లో సక్సెస్ అయ్యాడు నేను జస్ట్ ఎస్కేప్ -ఓపెన్ హార్ట్ విత్ RK లో కన్నా లక్ష్మి నారాయణ జూన్ 10 2018
P.Venkateswara Rao
640 views
4 months ago
#నాడు - నేడు!!! #🎬మూవీ ముచ్చట్లు *అటు తిరిగి ఇటు తిరిగి జగన్ లైన్ లోకే కూటమి ప్రభుత్వం❗* By Akshith Kumar December 26, 2025💃 సినిమా టిక్కెట్ల విషయంలో గత ప్రభుత్వ హయాంలో.. సామాన్యులను, చిన్న సినిమాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాలపై సగం సగం తెలిసో.. లేక, కావాలనే కక్షతోనో.. అదీగాక, స్వార్ధ ప్రయోజనాలు ఆశించో తెలియదు కానీ.. జగన్ పై చాలా మంది విమర్శలు చేశారు. అయితే.. తాజాగా కూటమి ప్రభుత్వం కూడా జగన్ నిర్ణయాన్నే సమర్థించే పనికి పూనుకుందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. సామాన్యుడు థియేటర్ కు వచ్చేలా టిక్కెట్ ధరలు పెంచుతామని కందుల దుర్గేష్ చెప్పిన మాట.. ఒకప్పుడు జగన్ చెప్పిందే కదా..? సినిమా బడ్జెట్ ను పరిగణలోకి తీసుకుంటూ.. సినిమా నష్టపోకుండా టిక్కెట్ ధరలు పెంచుతామని చెప్పిందీ.. జగన్ చెప్పిందే కదా..? జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ధరల పద్దతే బాగుందని.. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో మాట్లాడినప్పుడు తనతో అన్నారని బీవీఎస్ రవి అలియాస్ మచ్చ రవి చేసిన వ్యాఖ్యలు గట్టిగా తగిలాయా..? ఎవరు చెప్పారు.. ఎవరు అమలు చేశారు.. అన్నది ముఖ్యం కాదు.. ఎలా అమలు చేశారు.. ఇందులో ప్రజలకు ఉపయోగం ఎంత అనేది కదా ప్రభుత్వాలు చూడాలి..? తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ పుణ్యమాని బడ్జెట్ లు భారీగా పెరిగిపోతున్నాయని.. ఫలితంగా విడుదల సమయంలో టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాల వద్దకు వెళ్తే.. వారు మొహమాటానికో ఏమో కానీ అనుమతులు ఇస్తున్నారని.. ఈ పెరిగిన ధరల కారణంగా సామాన్యులు థియేటర్లకు రావడం లేదని.. దీంతో.. ఓ మోస్తరు నెగిటివ్ టాక్ వస్తే మూడో రోజునే థియేటర్లలో ఫుట్ ఫాల్స్ మొత్తం పడిపోతున్నాయనే చర్చ ఇటీవల విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓపెనింగ్స్ బాగుంటే చాలు చాలా వరకూ కలెక్ట్ చేసెయ్యొచ్చనే అర్ధ జ్ఞానపు ఆలోచన ప్రభావం వల్ల.. ఎంత గొప్ప సినిమా అని చెప్పుకున్నా, సూపర్ డూపర్ హిట్ అని ప్రకటించుకున్నా.. ప్రొడ్యూసర్ మాత్రం నష్టాలు చూస్తున్నాడనే చర్చ ఇటీవల బలంగా వినిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం.. సామాన్యులు థియేటర్లకు రాకపోవడమే అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. టిక్కెట్ ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచేలా చూసుకుంది! దీనిపై హాల్ఫ్ నాలెడ్జ్ బ్యాచ్ చాలా మంది కుయ్యో మొర్రో అన్నారని.. ఈ రోజుల్లో 50 రూపాయలు ఏమి వస్తుంది.. 10లు 30లు ఎవరైనా గుర్తిస్తున్నారా అంటూ గొణుకున్నారని.. అయితే… టిక్కెట్ ధరలు పెరగడంతో అసలు జనాలు థియేటర్స్ వైపే చూడటం లేదని అంటున్నారు! ఈ సమయంలో… కూటమి ప్రభుత్వం కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాల వైపే మొగ్గు చూపి, పేర్లు పదాలు మార్చి, వాటిని అమలు చేయనునందని అంటున్నారు! తాజాగా తనను కలిసిన సినిమా ఇండస్ట్రీకి చెందిన ఐదుగురు వ్యక్తులతో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా… సామాన్యుడు థియేటర్ కు వచ్చేలా టిక్కెట్ ధరలపై నిర్ణయం తీసుకుంటామని కందుల దుర్గేష్ అన్నారు. ప్రతి సినిమాకు విడివిడిగా జీవోలు ఇచ్చే పద్దతికి స్వస్తి పలికి.. ఒకే విధానంలో టిక్కెట్ ధరలు ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో… జగన్ సర్కార్ చెప్పింది ఇదే కదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ప్రధానంగా సామాన్య ప్రేక్షకుడిపై టికెట్‌ ధరల భారం పడకూడదనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో.. సినిమా చిత్రీకరణలో ఎంత శాతం ఏపీలో చేయాలనేదానిపైనా నిబంధనలు నిర్ణయిస్తామన్నారు. ఈ సందర్భంగా స్పందించిన దర్శకుడు తేజ… థియేటర్స్ లో టిక్కెట్ ధరలంటే పాప్ కార్న్ ధరలు ఎక్కువగా ఉన్నాయని.. అవి చూస్తే తనకే భయం వేస్తుందని అన్నారు! వాస్తవానికి ఏపీలో గత ప్రభుత్వంలో సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. సామాన్యులకు సినీ వినోదం భారం కాకూడదని, తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటి సీఎం జగన్ తెలిపారు. అయితే దీనిపై సినీ ప్రముఖులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీని జగన్ టార్గెట్ చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శించారు. ఇక ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన వెనుక తంధాన తాన అంటూ హీరో నాని సహా పలువురు సినీ ప్రముఖులు వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు! కట్ చేస్తే.. ఇటీవల థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనికి కారణం.. అధిక టికెట్ రేట్లే అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ సమయంలో.. జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించిన నిర్మాత బన్నీ వాసు సైతం ఇప్పుడు తన చిత్రాన్ని సరసమైన ధరలతోనే విడుదల చేస్తున్నామని ప్రకటించుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో టికెట్ రేట్లు తగ్గిస్తూ వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయమే బెటర్ అని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భావిస్తున్నారని బీవీఎస్‌ రవి తెలిపారు. దీంతో… నాడు వైఎస్ జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. ఆయనపై అవాకులు చెవాకులు పేలుతూ.. కాస్తైనా బుర్ర పెట్టి ఆలోచించకుండా.. తమ స్వార్ధ ప్రయోజనాల కోణంలోనే ఆలోచించిన చాలా మంది హాల్ఫ్ నాలెడ్జ్ సెలబ్రెటీలు ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటున్నారనే కామెంట్లు నెట్టింట కనిపిస్తున్నాయి. మరికొంతమంది మాత్రం తేలు కుట్టిన దొంగల్లా మిన్నకున్నారనే చర్చా వినిపిస్తోంది!
Raja (TSRU)
919 views
4 months ago
#ఈనాడు @50 #📺ఈటీవీ తెలుగు @30 వసంతలు వేడుకలు మన విజయవాడ లో.
P.Venkateswara Rao
595 views
5 months ago
#నాడు - నేడు!!! *🐸ఊసరవెల్లి కూడా ఇన్ని రంగులు మార్చదు..*✍️
P.Venkateswara Rao
660 views
5 months ago
#నాడు - నేడు!!! ఇలాంటి ప్లేకార్డ్ ఇప్పుడు ఒకటి పట్టుకునే దమ్ముందా పవనన్నా..? పట్టుకొని చూడు నల్లిని నలిపినట్టు నలుపుతారు..❗