justice

బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
390 views
18 hours ago
లాకప్ డేత్ కేసులో బాధితులకు ఎట్టకేలకు న్యాయం చేకూరింది! లేదా మదురై కోర్టు తీర్పు ముమ్మాటికీ హర్షణీయం! తమిళనాడులో కలకలం సృష్టించిన తండ్రీ కుమారుడి లాకప్ డేత్ కేసులో మదురై కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ఎంతైనా హర్షణీయం.ముఖ్యంగా ఎలాంటి నేర చరిత్ర లేని తండ్రీ కుమారుడిని ఆతి క్రూరంగా హింసించి చంపిన తీరు అత్యంత కిరాతకమైనది.అంతేకాదు మృతుల కుటుంబాలకు రూ 1.40 కోట్ల పరిహారం చెల్లించాలని మదురై కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఎంతైనా సహేతుకమైన,న్యాయబద్ధమైన విషయమే.ఇక ఈ కేసు పూర్వపరాల విషయానికి వస్తే తండ్రీ కుమారుడు అయిన జయరాజ్,బెన్నిక్స్ లు మొబైల్ దుకాణం నిర్వహించేవారు.కోవిడ్ సమయంలో వీరు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ సేపు షాపు తెరిచారన్న ఆరోపణలతో వారిని అరెస్ట్ చేసి తీవ్రంగా వేధించి కొట్టడంతో వారు ఆ దెబ్బలు తట్టుకోలేక జూన్ 22,23 తేదీల్లో వారిరువురు కూడా మృత్యువాత పడ్డారు.అయితే ఆ తరువాత సీబీఐ వారు నిర్వహించిన దర్యాప్తులో ఇది అవాస్తవమని తేలింది.అదేవిధంగా వీరురువురిని 2020 జూన్ 19న తుత్తుకూడి జిల్లా సత్తాన్ కులం పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ముఖ్యంగా ఈ అత్యంత క్రూరమైన ఘటనపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో మొత్తం 10మంది పోలీసులపై కేసు నమోదు చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.అన్నింటికి మించి ఈ లాకప్ డెత్ కేసులో ఇంతమంది పోలీసులకు మరణశిక్ష వేయడం దేశ న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి.అంతేకాదు మద్రాసు హైకోర్టుకు అందిన సమాచారం ప్రకారం మృతులు జయరాజ్,బిన్నిక్స్ లపై పోలుసులు మోపిన ఆరోపణలు అవాస్తవమని దర్యాప్తులో సీబీఐ తేల్చడంతో పాటు ఈ కేసులో ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం ఎంతో కీలకంగా మారింది.తండ్రీ కుమారుడిని పోలీసులు రాత్రంతా కొడుతూనే ఉన్నారని,లాఠీలపై,బల్లలపై రక్తపు మరకలు ఉన్నాయని ఆమె సీబీఐ వారికి వెల్లడించారు. అంతేందుకు ఈ కిరాతక ఘటన బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు సీసీ కెమెరా రికార్డింగ్ లు, ఆటోమేటిక్ గా డిలీట్ అయ్యేలా సెట్ చేసినారని సీబీఐ దర్యాప్తులో తేలింది.ఈ అత్యంత బలమైన ఆధారాలన్నింటితోనే కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి,సుదీర్ఘ విచారణ జరిపి మదురై కోర్టు ఎట్టకేలకు ఆరేళ్ళ తరువాత ఈ పెను సంచలన తీర్పు వెల్లడించింది. ఏదిఏమైన చట్టం దృష్టిలో అందరూ సమానమే, తప్పు ఎంతటి వారు చేసిన రుజువు అయ్యితే మాత్రం శిక్ష అనుభవించాల్సిందే అనే నిగూడ వాస్తవం మరోసారి రుజువైంది.దీన్నిబట్టి ఎంతటివారైనా చట్టంతో చెలగాట మాడితే,చట్టం తమ చుట్టంగా భావిస్తే ఇలాంటి చేదు ఫలితాలను చవిచూడటమే కాదు, తీవ్ర కఠినమైన శిక్షలకు సైతం గురికావాల్సి రావడం తథ్యం.ఏమైనా ఇలాంటి స్ఫూర్తిదాయక తీర్పు అధికార దర్పం,అహంభావంతో కళ్ళు మూసుకుపోయి #న్యాయం సామాన్యులపై జూలూమ్ చలాయిస్తూ తాము ఏమి చేసిన చెల్లుతుంది అనే దుర్మార్గపు శైలితో ఏదో తెలిసో తెలియకో చేసిన తప్పు మూలాన వారిపట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించే కొంతమంది పోలీసు వారికి మదురై కోర్టు ఇచ్చిన ఈ అత్యంత సాహాసోపేతమైన తీర్పు ఓ చెంపపెట్టు,కనువిప్పు వంటిది కూడా.న్యాయం మరో పదికాలాల పాటు వర్ధిల్లాలి.నిర్దోషులకు ఎలాంటి పరిస్థితుల్లో శిక్ష పడకూడదు.⚖️⚖️⚖️⚖️ - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
1.7K views
2 months ago
ఈ రోజు నేను వ్రాసిన వ్యాసం ' కృషితో నాస్తి దుర్భిక్ష్యం అనే పదానికి మరో పర్యాయ పదం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎన్. హరినాథరెడ్డి ' క్యాపిటల్ వాయిస్ పత్రికలో ప్రచురితమైంది. ఈ ప్రత్యేక సందర్బంగా ఒక సాధారణ వకీలుగా,అడ్వకేట్ గా తన జీవితాన్ని ఆరంభించి తన స్వయం కృషి తో,అవిరళ కృషితో న్యాయశాస్ర విద్యలో మంచి పట్టు, నైపుణ్యం సంపాదించి ఆ రంగంలో అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఏకంగా ఒక అత్యున్నత హోదా, ఎవరెస్ట్ శిఖరం వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి పదవికి ఎదిగిన గౌరవనీయులు అయిన జస్టిస్ ఎన్. హరినాథరెడ్డి గారి కథాకమిషు, ఆయన ఒక మహోన్నత స్థానానికి ఎదిగిన తీరుతెన్నులు వంటి అంశాలను విశ్లేషిస్తూ నేను వ్రాసిన ఈ వ్యాసాన్ని తన సొంత దినపత్రిక ' క్యాపిటల్ వాయిస్ ' లో ప్రచురించిన ఆ పత్రిక ఎడిటర్ పంగులూరి బుచ్చిబాబు గారికి & డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ వీరన్న గారికి ఇవే నా ఆత్మీయ,సహృదయ పూర్వక కృతజ్ఞతలు! - మధుసూదనరెడ్డి బుగ్గన,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #justice
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
668 views
5 months ago
ప్రతి న్యాయవాది కూడా ఎంతో పవిత్రమైన న్యాయవాద వృత్తికి వన్నె తెచ్చేలా వ్యవహారించండి,ఎలాంటి పరిస్థితుల్లో అన్యాయం వైపు వెళ్లే వారికి అనుకూలంగా వకల్తా పుచ్చుకొని,న్యాయం వైపు పయనించే వారి నోట్లో మట్టి కొట్టకండి! న్యాయానికి పట్టం కడదాం,అన్యాయానికి చరమగీతం పాడదాం!⚖️⚖️⚖️⚖️⚖️⚖️⚖️👩‍⚖️👩‍⚖️👩‍⚖️👨‍⚖️👨‍⚖️👨‍⚖️ #న్యాయం
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
625 views
5 months ago
చట్టానికి,న్యాయానికి జరిగిన ఈ సమరంలో! ⚖️⚖️⚖️క్యాప్షన్ : న్యాయం మరో పది కాలాల పాటు వర్ధిల్లాలి!అన్యాయన్ని నిలదీసేలా ప్రజల్లో చైతన్యం వెల్లివిరియాలి !జైహింద్!🇮🇳🇮🇳🇮🇳 #న్యాయం
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
634 views
5 months ago
( 10 - 10 - 2025 ) ఈ రోజు నేను వ్రాసిన వ్యాసం ' రిజిస్ట్రేషన్లలో అవకతవకలు ప్రజల పాలిట శాపం ' ప్రజాసంచలనం దినపత్రికలో ప్రచురితమైంది.ఇందుకు సంబంధించి ప్రజలు తమ స్థిరాస్తులు వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ కాకుండా ఎల్లవేళలా అత్యంత జాగురతతో వ్యవహారించాలనే ఓక హెచ్చరికను ప్రజలకు తెలియపరుస్తూ నేను వ్రాసిన ఈ వ్యాసానికి తగు రీతిలో ప్రాధాన్యత ఇచ్చి తన సొంత దినపత్రిక 'ప్రజాసంచలనం'లో ప్రచురించిన ఆ పత్రిక ఎడిటర్ సిరిపిరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్నయ్య గారికి ఇవే నా ఆత్మీయ పూర్వక కృతజ్ఞతలు! - మధుసూదనరెడ్డి బుగ్గన,బేతంచెర్ల! #న్యాయం