లాకప్ డేత్ కేసులో బాధితులకు ఎట్టకేలకు న్యాయం చేకూరింది!
లేదా
మదురై కోర్టు తీర్పు ముమ్మాటికీ హర్షణీయం!
తమిళనాడులో కలకలం సృష్టించిన తండ్రీ కుమారుడి లాకప్ డేత్ కేసులో మదురై కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ఎంతైనా హర్షణీయం.ముఖ్యంగా ఎలాంటి నేర చరిత్ర లేని తండ్రీ కుమారుడిని ఆతి క్రూరంగా హింసించి చంపిన తీరు అత్యంత కిరాతకమైనది.అంతేకాదు మృతుల కుటుంబాలకు రూ 1.40 కోట్ల పరిహారం చెల్లించాలని మదురై కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఎంతైనా సహేతుకమైన,న్యాయబద్ధమైన విషయమే.ఇక ఈ కేసు పూర్వపరాల విషయానికి వస్తే తండ్రీ కుమారుడు అయిన జయరాజ్,బెన్నిక్స్ లు మొబైల్ దుకాణం నిర్వహించేవారు.కోవిడ్ సమయంలో వీరు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ సేపు షాపు తెరిచారన్న ఆరోపణలతో వారిని అరెస్ట్ చేసి తీవ్రంగా వేధించి కొట్టడంతో వారు ఆ దెబ్బలు తట్టుకోలేక జూన్ 22,23 తేదీల్లో వారిరువురు కూడా మృత్యువాత పడ్డారు.అయితే ఆ తరువాత సీబీఐ వారు నిర్వహించిన దర్యాప్తులో ఇది అవాస్తవమని తేలింది.అదేవిధంగా వీరురువురిని 2020 జూన్ 19న తుత్తుకూడి జిల్లా సత్తాన్ కులం పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ముఖ్యంగా ఈ అత్యంత క్రూరమైన ఘటనపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో మొత్తం 10మంది పోలీసులపై కేసు నమోదు చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.అన్నింటికి మించి ఈ లాకప్ డెత్ కేసులో ఇంతమంది పోలీసులకు మరణశిక్ష వేయడం దేశ న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి.అంతేకాదు మద్రాసు హైకోర్టుకు అందిన సమాచారం ప్రకారం మృతులు జయరాజ్,బిన్నిక్స్ లపై పోలుసులు మోపిన ఆరోపణలు అవాస్తవమని దర్యాప్తులో సీబీఐ తేల్చడంతో పాటు ఈ కేసులో ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం ఎంతో కీలకంగా మారింది.తండ్రీ కుమారుడిని పోలీసులు రాత్రంతా కొడుతూనే ఉన్నారని,లాఠీలపై,బల్లలపై రక్తపు మరకలు ఉన్నాయని ఆమె సీబీఐ వారికి వెల్లడించారు. అంతేందుకు ఈ కిరాతక ఘటన బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు సీసీ కెమెరా రికార్డింగ్ లు, ఆటోమేటిక్ గా డిలీట్ అయ్యేలా సెట్ చేసినారని సీబీఐ దర్యాప్తులో తేలింది.ఈ అత్యంత బలమైన ఆధారాలన్నింటితోనే కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి,సుదీర్ఘ విచారణ జరిపి మదురై కోర్టు ఎట్టకేలకు ఆరేళ్ళ తరువాత ఈ పెను సంచలన తీర్పు వెల్లడించింది.
ఏదిఏమైన చట్టం దృష్టిలో అందరూ సమానమే, తప్పు ఎంతటి వారు చేసిన రుజువు అయ్యితే మాత్రం శిక్ష అనుభవించాల్సిందే అనే నిగూడ వాస్తవం మరోసారి రుజువైంది.దీన్నిబట్టి ఎంతటివారైనా చట్టంతో చెలగాట మాడితే,చట్టం తమ చుట్టంగా భావిస్తే ఇలాంటి చేదు ఫలితాలను చవిచూడటమే కాదు, తీవ్ర కఠినమైన శిక్షలకు సైతం గురికావాల్సి రావడం తథ్యం.ఏమైనా ఇలాంటి స్ఫూర్తిదాయక తీర్పు అధికార దర్పం,అహంభావంతో కళ్ళు మూసుకుపోయి
#న్యాయం సామాన్యులపై జూలూమ్ చలాయిస్తూ తాము ఏమి చేసిన చెల్లుతుంది అనే దుర్మార్గపు శైలితో ఏదో తెలిసో తెలియకో చేసిన తప్పు మూలాన వారిపట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించే కొంతమంది పోలీసు వారికి మదురై కోర్టు ఇచ్చిన ఈ అత్యంత సాహాసోపేతమైన తీర్పు ఓ చెంపపెట్టు,కనువిప్పు వంటిది కూడా.న్యాయం మరో పదికాలాల పాటు వర్ధిల్లాలి.నిర్దోషులకు ఎలాంటి పరిస్థితుల్లో శిక్ష పడకూడదు.⚖️⚖️⚖️⚖️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!