భారతదేశం 🇮🇳

P.Venkateswara Rao
582 views
1 months ago
#భారతదేశం 🇮🇳 భారత ప్రభుత్వం తనకు వచ్చిన బహుమతులను ఏమి చేస్తుంది❓
P.Venkateswara Rao
699 views
1 months ago
#భారతదేశం 🇮🇳 *చైనా కంట్లో నలుసు! – హఠాత్తుగా ఇండియాలో వాలిన బర్మా చీఫ్❗* June 23, 2026🎯 చైనాకు చెక్, అమెరికాకు షాక్: భారత్ వేసిన ‘ప్రాక్టికల్ డిప్లమసీ’ మాస్టర్‌స్ట్రోక్! అంతర్జాతీయ రాజకీయాల చదరంగంలో ఎప్పుడు ఏ దేశం ఎలాంటి వ్యూహం రచిస్తుందో ఊహించడం కష్టం. తాజాగా మయన్మార్ మిలిటరీ పాలకుడు జనరల్ మిన్ ఆంగ్ హ్లెయింగ్ తన మొదటి విదేశీ పర్యటనకు బీజింగ్‌ను కాదని, అనూహ్యంగా విమానం తిప్పుకొని నేరుగా ఢిల్లీలో వాలడం ప్రపంచ దౌత్య వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రజాస్వామ్య నీతులు చెప్పే అమెరికా లాంటి పశ్చిమ దేశాలను పక్కనపెట్టి, కేవలం జాతీయ ప్రయోజనాలే పరమావధిగా భారత్ అమలు చేసిన ఈ ‘ప్రాక్టికల్ డిప్లమసీ’ (ఆచరణాత్మక దౌత్యం) లేదా ‘రియల్‌పాలిటిక్స్’ వెనుక ఒక పెద్ద వ్యూహాత్మక స్కెచ్ ఉంది. 1. నీతులు లేవు.. కేవలం జాతీయ ప్రయోజనాలే! (Realpolitik vs Idealism) అమెరికా వంటి దేశాలు తరచుగా ‘ప్రజాస్వామ్య విలువలు’, ‘మానవ హక్కులు’ అనే గొడుగు కింద ఇతర దేశాలకు ‘డెమోక్రసీ క్లాసులు’ పీకుతుంటాయి. కానీ, భారత విదేశాంగ శాఖ ఈసారి రూట్ మార్చింది. “మీ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా, మిలిటరీ రూల్ ఉందా అనే అంతర్గత విషయాలు మాకు అనవసరం. అధికారంలో ఉన్న మీతోనే మాకు వ్యాపారం, దేశ రక్షణ ముఖ్యం” అనే స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. పొరుగు దేశాల అంతర్గత పంచాయతీల్లో వేలు పెట్టకుండా, ‘మన దేశానికి ఏం లాభం?’ అనే కోణంలో మాత్రమే ఆలోచించే ఈ విధానం నేటి ప్రపంచానికి అత్యంత అవసరంగా మారింది. 2. ఈశాన్య సరిహద్దుల భద్రత – చైనా ‘డబుల్ గేమ్’కు బ్రేక్ మన ఈశాన్య రాష్ట్రాల భద్రతకు మయన్మార్ సరిహద్దు చాలా కీలకం. అక్కడ చైనా ఒకవైపు ప్రభుత్వానికి మద్దతిస్తూనే, మరోవైపు అక్కడి తీవ్రవాదులకు ఆయుధాలు ఇస్తూ భారత్‌లోకి అక్రమ రవాణా చేయిస్తూ డబుల్ గేమ్ ఆడుతోంది. ఇలాంటి తరుణంలో మోదీ- దోవల్ ద్వయం ఒకవైపు సరిహద్దుల్లో కంచె వేస్తూనే, మరోవైపు మయన్మార్ దేశాధినేతతో “మా వ్యతిరేక శక్తులకు మీ భూమిని వాడొద్దు” అని హామీ రాయించుకోవడం ఒక పెద్ద దౌత్య విజయం. మయన్మార్ ప్రభుత్వంతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడం ద్వారా అక్కడ చైనా విస్తరిస్తున్న వ్యూహాత్మక ప్రభావానికి భారత్ గట్టి బ్రేక్ వేయగలిగింది. ఈ మాస్టర్‌స్ట్రోక్ వల్ల భారత్‌కు చేకూరే 3 అతిపెద్ద లాభాలు: రోడ్డు మార్గంలో బ్యాంకాక్: మయన్మార్ మీదుగా సాగే ‘భారత్-మయన్మార్-థాయ్‌లాండ్’ త్రైపాక్షిక హైవే ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తి కాబోతోంది. ఇది సాకారమైతే, రేపు పొద్దున మనం హైదరాబాద్‌లో కారెక్కితే రోడ్డు మార్గం ద్వారా నేరుగా థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు చేరుకోవచ్చు. ఇది వాణిజ్యాన్ని, పర్యాటకాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్తుంది. బంగ్లాదేశ్‌కు బైపాస్ (కాలాదాన్ ప్రాజెక్ట్): సముద్ర మార్గం ద్వారా కోల్‌కతా నుండి మయన్మార్‌లోని ‘సిట్వే’ పోర్టుకు సరుకులు పంపి, అక్కడి నుండి రోడ్డు/నది మార్గాల ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు చేర్చే కాలాదాన్ మల్టీ-మోడల్ ప్రాజెక్ట్ వేగవంతం కాబోతోంది. భవిష్యత్తులో బంగ్లాదేశ్‌తో రాజకీయ సమీకరణాలు మారి మనకు ఇబ్బంది ఎదురైనా, ఈశాన్య రాష్ట్రాలకు సరుకుల రవాణా ఆగిపోకుండా ఉండేందుకు ఇదొక అద్భుతమైన ‘లైఫ్ లైన్’ బైపాస్ రూట్. డాలర్‌కు చెక్ (De-dollarization): ఇకపై ఇరు దేశాల మధ్య వాణిజ్యం అమెరికన్ డాలర్లలో కాకుండా.. భారత రూపాయి, మయన్మార్ ‘కియాట్’ కరెన్సీల్లోనే జరగబోతోంది. ఇది అంతర్జాతీయంగా రూపాయి బలాన్ని పెంచడమే కాకుండా, పశ్చిమ దేశాల ఆర్థిక ఆంక్షల ప్రభావం మనపై పడకుండా కాపాడుతుంది. నాణేనికి మరో వైపు: సవాళ్లు కూడా ఉన్నాయా? భారత్ తీసుకున్న ఈ రియల్‌పాలిటిక్స్ విధానం వంద శాతం కరెక్ట్ అనిపిస్తున్నప్పటికీ, దౌత్యనీతిలో దీనికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి: సుస్థిరతపై ప్రశ్నలు: మిలిటరీ ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రజల తిరుగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. భవిష్యత్తులో మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తే, అప్పుడు ఈ ఒప్పందాల పరిస్థితి ఏంటనేది ఒక సవాలు. మానవ హక్కుల వాదన: ప్రజాస్వామ్యం లేని మిలిటరీ పాలనను సమర్థించినట్టు అవుతుందనే విమర్శలు అంతర్జాతీయంగా వచ్చే అవకాశం ఉంది. అయితే, అమెరికా కూడా తన స్వప్రయోజనాల కోసం సౌదీ అరేబియా వంటి రాచరికపు దేశాలతో ఒప్పందాలు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి కాబట్టి, భారత్ తన జాతీయ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం సమంజసమే. ఏ దేశానికైనా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు.. (ఉదాహరణకు… ఒకప్పుడు ఆఫ్ఘన్ తాలిబన్లతో ఇండియా సంబంధాలకు ఇప్పటికీ పూర్తి మార్పు) కేవలం “జాతీయ ప్రయోజనాలే అత్యున్నతమైనవి” అనే సిద్ధాంతాన్ని భారత్ మరోసారి నిరూపించింది. పక్క దేశం వైఖరి ఎలా ఉన్నా, మన దేశ సరిహద్దులను సురక్షితం చేసుకుంటూ, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంచుకున్న ఈ ‘వ్యూహాత్మక చదరంగం’ భవిష్యత్తులో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
P.Venkateswara Rao
602 views
2 months ago
*ధనిక సీఎం:* #భారతదేశం 🇮🇳 కర్ణాటక సీఎం డికె శివకుమార్ దేశంలోనే ధనిక సీఎంగా మొదటి స్థానంలో ఉన్నారు. 1. DK శివకుమార్: 1,413 కోట్లు [కర్ణాటక] 2. నారా చంద్రబాబు: 931 కోట్లు [ఆంధ్రప్రదేశ్] 3. జోసెఫ్ విజయ్: 648 కోట్లు [తమిళనాడు] 4. ప్రేమ్ ఖండూ: 332 కోట్లు [అరుణాచల్] 5. నెయిఫియు రియో: 46 కోట్లు [నాగాలాండ్] [తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆస్తుల విలువ 30.04కోట్లు] ........ #RichestCms
P.Venkateswara Rao
1.7K views
3 months ago
#భారతదేశం 🇮🇳 *భారతీయులు ఎందుకు "అవినీతిపరులు"❓* వారి ప్రవర్తనలో, ఉన్న లోపం ఏమిటి? ————————————————— చేదు వాస్తవాలుతో కూడిన వ్యాసం ఇది. ఇది భారతదేశంలోని, "అవినీతి"పై ఒక న్యూజిలాండర్ చెప్పిన అభిప్రాయం. భారతీయులు (hobbesian) స్వార్థపరులు. "అవినీతి", భారతదేశ సంస్కృతిలో ఒక భాగం. "అవినీతి"ని భారతీయులు, "నీతిబాహ్యం"గా చూడరు. ఇది దేశమంతటా వ్యాపించి ఉంది. భారతీయులు "అవినీతిపరుల"ను ఓపికతో భరిస్తారు, కానీ సంస్కరించడానికి పూనుకోరు. ఏ జాతి కూడా, పుట్టుకతో "అవినీతిమయం"గా ఉండదు. భారతీయులు, "అవినీతిపరులు" ఎందుకు అవుతున్నారు. ఇది తెలుసుకోవాలంటే, వారి ఆచారవ్యవహారాలను చూడాల్సిందే. మొదటగా .. భారతదేశంలో అంతర్గతంగా, ఒక వ్యాపార ప్రక్రియ ఉంది. అది, "భారతీయులు" దేవుడికి డబ్బులు అర్పిస్తారు. అర్పించి, దాని కంటే ఎక్కువ "ప్రతిఫలాన్ని" ఆశిస్తారు. దీని అర్థం ఏమిటంటే, ఎలాంటి అర్హత, అవసరం, ప్రమాణము లేకున్నా, తాము గొప్ప "లబ్ది" పొందాలనుకోవడమే. అదే, గుడి వెలుపల, ఇటువంటి వ్యాపార ప్రక్రియను *"లంచం"* అంటాము. బాగా ధనవంతుడైన భారతీయుడు, గుళ్లకు డబ్బు ఇవ్వడు. కానీ, బంగారుకిరీటాలు, వెండి తొడుగులు వంటి ఇతర అత్యంత విలువైన ఆభరణాలు "కానుకలు"గా ఇస్తాడు. అతని కానుకలు పేదవాడి "ఆకలిదప్పులు" తీర్చవు. అతడు ఇచ్చేది, కేవలం ఆ దేవుడికి. ఆకలిగొన్న వాడికి, సహాయం చేయడం వృధా ప్రయాసము అనుకుంటాడు. అందుకే, దేవునికి అత్యంత విలువైన "కానుకలు" ఇస్తాడు. *జూన్ 2009 లో, హిందూ దినపత్రిక, ఒక వార్త ప్రచురించింది.* అదేమిటంటే, జి.జనార్దన్ రెడ్డి, కర్ణాటక మంత్రి, 45 కోట్ల రూపాయలతో, డైమండ్స్ పొదిగిన ఒక బంగారు కిరీటాన్ని, తిరుమల వారి గుడికి "కానుక"గా ఇచ్చాడు. ఈ విధంగా, విపరీతమైన సంపద, ఈ భారతదేశంలోని కొన్ని గుళ్ళల్లో పోగు పడుతుంది. ఈ "సంపదను" ఏం చేయాలో, వారికి అర్థం కాదు. కోశాగారాలలో, బిలియన్ల కొద్దీ ఆస్తులు, డబ్బులు, "దుమ్ము" కొట్టుకు పోతున్నాయి. యూరోపియన్లు, భారతదేశానికి వచ్చి, పాఠశాలలు నెలకొల్పారు. కానీ, భారతీయులు మాత్రం యూరప్, అమెరికా వెళ్లి, అక్కడ గుళ్ళు నిర్మిస్తున్నారు. తన కోర్కెలను తీర్చడానికి, దేవుడు "కానుకలు" తీసుకోవడం ఎట్లా తప్పు కాదో, బయట కూడా "లంచం" తీసుకోవడం, ఇవ్వడం కూడా తప్పు కాదు అనే భావన అంతట నెలకొంది. అందుకే, భారతీయులు తేలికగా "అవినీతికి" లొంగిపోతారు. ఈ దేశ సంస్కృతి, "అవినీతి"ని తనలో ఇముడ్చుకుంటుంది. 1."అవినీతిని" భారతీయులు ఒక మచ్చగా భావించరు. ఎందుకంటే, బాగా అవినీతిపరులైన రాజకీయ నాయకులను, వారు అధికారంలోకి తెస్తారు. ఇది పశ్చిమ దేశాలలో, మనం ఊహించలేము. 2.చరిత్ర చూసినా కూడా, అవినీతికి ఊతమిచ్చే నైతిక దిగజారుడుతనమే కనిపిస్తుంది. భారతదేశ చరిత్రలో, "లంచాలు"కు లొంగి, కోట ద్వారాలు తెరవడం ద్వారా, అనేక పట్టణాలు, రాజ్యాలను వశపరచుకున్న "సంఘటనలు" అనేకం. డబ్బు తీసుకొని లొంగి పోయిన సైన్యాధిపతులు కూడా అనేకం. ఇది భారతదేశం అంతటా ఉన్న "సారూప్యత". పూర్వపు గ్రీకు, మోడ్రన్ యూరప్ తో పోలిస్తే, భారతీయుల "పోరాటపటిమ" ఎంతటిదో ఇట్టే అర్థమవుతుంది. నాదేర్షాను అంతమొందించేందుకు, టర్క్ లు పోరాడారు. కానీ, భారతదేశంలో పోరాటం అవసరం లేదు, లంచాలు ఇవ్వడం ద్వారా సైన్యం, యుద్ధము, లేకుండా చేయవచ్చు. దండెత్తే వాడు, డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాడైతే, భారతీయ రాజులను తేలికగా లొంగ తీసుకోవచ్చు. ఆ రాజుల దగ్గర, పదుల వేల సంఖ్యలో సైన్యం ఉన్నప్పటికీ, ఇది సాధ్యం. ప్లాసి యుద్ధంలో, భారతీయులు గట్టిగా యుద్ధం చేశారు. తర్వాత ఏమైంది, "మీర్ జాఫర్" కు, ఆంగ్లయుడు Clive laid "లంచం" ఇచ్చాడు. అంతే, బెంగాల్ రాజ్యము, ఈస్ట్ ఇండియా కంపెనీకి, పూర్తిగా లొంగిపోయింది. భారతీయ కోటలను వశపరచుకున్న చాలా సంఘటనలలో, ఈ "డబ్బు మారక పాత్ర" చాలా ఉంది. డబ్బులు, ముట్టినందున గోల్కొండ వెనుక కోటదర్వాజ తెరచి ఉంచడం వలన, 1867లో ఈ కోటను తేలికగా ఆక్రమించుకోగలిగారు. మరాఠాలను, రాజపుత్రులను కూడా, ఈ "లంచాలు" ద్వారానే, "మొఘలులు" సులభంగా గెలుచుకోగలిగారు. శ్రీనగర్ రాజు, ఔరంగజేబు దగ్గర డబ్బులు తీసుకుని, సులేమాన్ ను అప్పగించాడు. భారతీయులు "అవినీతి"కి తలొగ్గి, చేసిన "దేశద్రోహ కార్యక్రమాలు" అనేకం ఉన్నాయి. అర్థం చేసుకోవాల్సినదేమిటంటే, భారతీయులకు ఇచ్చి పుచ్చుకునే (లంచాలు) "సంస్కృతి", ఎందుకు వచ్చింది. ఇతర నాగరిక దేశాలలో, ఇది ఎందుకు లేదు? 3. నైతికంగా, అవినీతిరహితంగా మసలుకుంటే, 'అందరము బాగుపడతాము' అనే స్వభావం, భారతీయులలో కొరవడడానికి మూల కారణం. వారు అనుసరించే "మతం"లో, ఆ సందేశం లేకపోవడమే. కులవ్యవస్థ వారిని, "వేరు" పరుస్తుంది. మనుషులందరూ సమానమేనని వారు నమ్మరు. దీని ఫలితమే, ఈ విభజనలు. మత మార్పిడులు జరిగాయి. చాలా మంది "హిందువులు" సిక్కులు, జైనులు, బౌద్ధులు అయ్యారు. ఇంకను బలవంతంగా, మత మార్పిడి వల్ల ఎంతో మంది క్రిస్టియన్లుగా, ముస్లింలుగా మారారు. భారతీయులు ఒకరిపై, మరొకరికి విశ్వాసం ఏమాత్రం ఉండదు. భారతదేశంలో, నిజమైన భారతీయత ఉన్న భారతీయులు లేరు. ఇక్కడ హిందువులు, క్రిస్టియన్లు ముస్లింలు, మొదలగు వారు ఉన్నారు. 1400 సంవత్సరాల క్రితం, "భారతీయులంతా" ఒకే విశ్వాసం కలిగి ఉండేవారు. కానీ, తరువాత అనేక కులాలుగా, మతాలుగా విడిపోవడంతో, ఈ "అనారోగ్య సంస్కృతి" దాపురించింది. "అసమానతలు" అనేవి "అవినీతి సమాజాని"కి దారి తీస్తాయి. భారతీయులు ఒకరినొకరు ఈసడించుకుంటారు, ఒక్క దేవుడిని తప్ప. అతనికి కూడా లంచం ఇస్తారు. బ్రియాన్, న్యూజిలాండ్. (బాధతో వాస్తవాలను అంగీకరిస్తూ). ఇది ఉన్నది ఉన్నట్లుగా, ఏమాత్రం edit చేయకుండా, English వ్యాసాన్ని అనువదించడం జరిగింది. (న్యూజిలాండ్, అతి తక్కువ అవినీతి ఉన్న దేశాలలో మొదటిది ) *సురేందర్ ఉయ్యాల*
P.Venkateswara Rao
1.3K views
3 months ago
#భారతదేశం 🇮🇳 Yes.. 👍 వందల కోట్లు, వేల కోట్ల రూపాయలను వాళ్ళ ఇళ్లకు పోయి రుణ మాఫీ చేస్తారు. కాని పేద వాళ్లకు, నిరక్ష్య రాస్యులకు మాత్రం 100 సార్లు తిరిగినా, Family certificate అని, death certificate అని, ఆధార్ card లో తప్పులు ఉన్నాయని,Revenue ఆధారాలు.. Bla Bla bla అంటూ.. డైలీ తిప్పించుకొని విసిగిస్తారు.