జగద్గురు అది శంకరచార్య

Rochish Sharma Nandamuru
809 వీక్షించారు
1 నెలల క్రితం
శంకరులు కేవలం సిద్ధాంతం చెప్పి వెళ్లిపోలేదు. ధర్మ రక్షణ కోసం దేశానికి నాలుగు దిక్కులందు 4 మఠాలను (పీఠాలను) స్థాపించి, ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికి "మఠామ్నాయ మహానుశాసనము" అనే గ్రంథమే సాక్ష్యం. దానికి సంబంధించిన పూర్తి శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి: 1. తూర్పు దిక్కు (పూరీ - గోవర్ధన పీఠం): శ్లోకం : "పూర్వస్యాం దిశి వైశాఖే కాళికా పీఠముచ్యతే | జగన్నాథః ప్రభుర్దేవో భోగవారో వనస్థలీ || ఋగ్వేద శాఖా కథితా హి తత్ర ధర్మస్య వృద్ధిః | వివరణ : ఆది శంకరులు తూర్పున గోవర్ధన పీఠాన్ని స్థాపించి, దానికి పద్మపాదాచార్యుల వారిని అధిపతిగా చేశారు. వేదం: ఋగ్వేదం | మహావాక్యం: ప్రజ్ఞానం బ్రహ్మ 2. దక్షిణ దిక్కు (శృంగేరి - శారదా పీఠం): శ్లోకం : "దక్షిణే శృంగేరీ పీఠం శక్తిః శ్రీ శారదా భవేత్ | వరాహో దేవతా తత్ర రామక్షేత్రముదాహృతమ్ || యజుర్వేదస్య పఠనం తత్ర ధర్మానుశాసనమ్ | అహం బ్రహ్మాస్మి వాక్యం చ తత్రైవ పరికీర్తితమ్ ||" వివరణ: దక్షిణాన శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించి, సాక్షాత్తు సురేశ్వరాచార్యుల వారిని నియమించారు. వేదం: యజుర్వేదం | మహావాక్యం: అహం బ్రహ్మాస్మి 3. పశ్చిమ దిక్కు (ద్వారక - శారదా మఠం): శ్లోకం : "పశ్చిమాయాం శారదామఠః కీటవారః సముదాహృతః | తీర్థం చ గోమతీ ప్రోక్తం ద్వారకాక్షేత్రముచ్యతే || సామవేదో బ్రహ్మరూపః తత్ర ధర్మముదాహృతమ్ | తత్త్వమసి మహావాక్యం తత్రైవ పరికీర్తితమ్ ||" వివరణ: పడమర ద్వారకా పీఠాన్ని స్థాపించి, హస్తామలకాచార్యుల వారిని కూర్చb వేదం: సామవేదం | మహావాక్యం: తత్త్వమసి 4. ఉత్తర దిక్కు (బదరి - జ్యోతిర్ మఠం): శ్లోకం: "ఉత్తరే జ్యోతిర్మఠం చ బదరికాశ్రమ ముచ్యతే | నారాయణః ప్రభుర్దేవో పూర్ణగిరిశ్చ శక్తికా || అథర్వణ వేద వాక్యాని తత్ర స్వీకురుతే సదా | అయమాత్మా బ్రహ్మ వాక్యం జ్యోతిర్మఠే ప్రతిష్ఠితమ్ ||" వివరణ: ఉత్తరాన జ్యోతిర్మఠాన్ని స్థాపించి, తోటకాచార్యుల వారికి బాధ్యత ఇచ్చారు. వేదం: అథర్వణ వేదం | మహావాక్యం: అయమాత్మా బ్రహ్మ విద్యారణ్య స్వామి శృంగేరి పీఠ పరంపరలో 12వ జగద్గురువులు. పీఠం అప్పటికే ఉంటేనే కదా ఆయన 12వ వారు అవుతారు? లేకపోతే ఆయనకు సన్యాస దీక్ష ఎవరు ఇచ్చారు? గురు పరంపర లేకుండా పీఠాధిపతి ఎలా అవుతారు? విద్యారణ్యులు పీఠాన్ని పునరుద్ధరించారు తప్ప, స్థాపించలేదు. స్థాపకుడు సాక్షాత్తు శంకర భగవత్పాదులే! శంకరులు కేవలం వైష్ణవులా? ! కాదు! డెభై రెండు పాషండ మతాలను ఖండించి,అందరినీ మెప్పించి ఒప్పించి ఒకే త్రాటిపై నిల్పిన పరమ అద్వైత జ్ఞానమూర్తి ! ఆదిశంకరులు! వారు "షణ్మత స్థాపనాచార్యులు". శివుడిని "శివానందలహరి"లో, అమ్మవారిని "సౌందర్యలహరి"లో, విష్ణువును "భజ గోవిందం"లో స్తుతించిన అద్వైతులు వారు. వారిని ఒక దేవుడికి పరిమితం చేయడం అవివేకం. దయచేసి ఇలాంటి చారిత్రక వక్రీకరణలను నమ్మకండి. మన ధర్మాన్ని, మన గురు పరంపరను కాపాడుకుందాం. శ్లోll శివాయవిష్ణురూపాయ శివరూపాయవిష్ణవేl శివస్యహృదయంవిష్ణుః విష్ణోశ్చహృదయగ్ంశివఃll యథాశివమయోర్విష్ణురేవంవిష్ణుమయశ్శివఃl యథాంతరన్నపశ్యామి తధామేస్వస్తిరాయుషిll #🌅శుభోదయం #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు🕉️ #🕉️జగత్గురు శ్రీ ఆది శంకరాచార్యులు🔱🚩
S.HariBlr (Bangalore)
699 వీక్షించారు
2 నెలల క్రితం
#😇My Status #జగద్గురువు ఆది శంకరాచార్యులు 🚩🚩 🔱 ఆది శంకరాచార్యుడు – భారత తత్త్వచింతనకు యుగదీపం 🔱 🚩🚩 💜 ఆది శంకరాచార్యుడు (క్రీ.శ. 788 – 820) భారతదేశం చూసిన మహా తత్త్వవేత్త, మహాసన్యాసి, అద్వైత వేదాంత స్థాపకుడు.. కేరళ రాష్ట్రంలోని కలడి గ్రామంలో తండ్రి – శివగురు, తల్లి – ఆర్యాంబ దంపతులకు జన్మించారు. 💜 బాల్యంలోనే 🔹 వేదాలు 🔹 ఉపనిషత్తులు 🔹 బ్రహ్మసూత్రాలు 🔹 భగవద్గీత సంపూర్ణంగా అవగాహన చేసుకున్న మహామేధావి. 👉 భగవద్గీతకు మొదటి బాష్యకారుడు ఆది శంకరాచార్యులే. 💜 8 ఏళ్లకే సన్యాసం స్వీకరించి, గురువైన గోవిందభగవత్పాదులు వద్ద విద్యనభ్యసించారు. 💜 🔱 ఆదిశంకరాచార్యుల తత్త్వబోధన 🔱 👉 “బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః” అంటే – 🔹 బ్రహ్మమే నిజం 🔹 ప్రపంచం మాయ 🔹 జీవుడు బ్రహ్మనే 👉 ఇదే అద్వైత వేదాంతం. 💜 భక్తి + జ్ఞానం + వైరాగ్యం ఈ మూడు కలిసినప్పుడే మోక్షం సాధ్యం అని బోధించారు. 💜 సమన్వయ దృష్టి శైవం, వైష్ణవం, శాక్తం, సౌరం, గాణపత్యం – అన్ని మార్గాలను ఏకతాటిపైకి తెచ్చి 👉 పంచాయతన పూజ విధానాన్ని ప్రాచుర్యం చేశారు. 💜 దీని ద్వారా సనాతన ధర్మంలో ఏకత్వం ఏర్పడింది. 💜 📜 గ్రంథకర్తగా శంకరులు భారతీయ తత్త్వశాస్త్రానికి పునాదులైన గ్రంథాలు: 💜 ✔️ బ్రహ్మసూత్రభాష్యం 💜 ✔️ భగవద్గీతాభాష్యం 💜 ✔️ ఉపనిషద్భాష్యాలు 💜 ✔️ వివేకచూడామణి 💜 ✔️ ఆత్మబోధ 💜 ✔️ ఉపదేశసాహస్రి 💜 భక్తిరసంతో నిండిన స్తోత్రాలు 🔹 భజగోవిందం 🔹 సౌందర్యలహరి 🔹 కనకధారాస్తవం 🔹 శివానందలహరి 🛕 చతురామ్నాయ పీఠాల స్థాపన భారతదేశ ఆధ్యాత్మిక ఏకత్వం కోసం నాలుగు మఠాలు: 💜 శృంగేరి – దక్షిణం 💜 జ్యోతిర్మఠం (బదరీ) – ఉత్తరం 💜 ద్వారకామఠం – పశ్చిమం 💜 గోవర్ధనమఠం (పూరి) – తూర్పు 👉 దీని ద్వారా సనాతన ధర్మం దేశమంతా విస్తరించింది.. 💜 ✨ సాధనలు – మహిమలు ✨ 🔹 మృతబాలుడికి ప్రాణం పోసిన ఘట్టం 🔹 మాండన మిశ్రుడితో శాస్త్రార్థం 🔹 నర్మదా నది ప్రవాహాన్ని ఆపిన కథ 🔹 కాశీలో ధర్మస్థాపన 🔹 భక్తి–జ్ఞాన సమన్వయం 💜 🛕 శారదా పీఠం స్థాపన:: (Sharada Peeth) అనేది కాశ్మీర్‌–పాక్ ఆక్రమిత కాశ్మీర్ (Pakistan-administered Kashmir) లోని శార్దా గ్రామంలో (Neelum Valley) ఉన్న ప్రాచీన హిందూ దేవాలయం మరియు పీఠంగా ప్రసిద్ధి చెందింది.. తక్కువ వయసులోనే అనంతమైన జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన మహాయోగి ఆదిశంకరులు.. *🌍 ప్రపంచ మేధావుల అభిప్రాయాలు..* *💜 మాక్సిముల్లర్ జర్మన్ ఫిలాసపర్,* సంస్కృతం నేర్చుకొని వేదాలు, ఉపనిషత్ ల సారాన్ని గ్రహించినవారు.. 👉 “శంకరాచార్యులు లేకపోతే వేదాంతం ఈ రూపంలో మనకు అందేది కాదు” 👉 ఉపనిషత్తుల అంతర్భావాన్ని ప్రపంచానికి వివరించిన మహానుభావుడు.. *💜 పాశ్చాత్య తత్త్వవేత్త పాల్ డ్యూసెన్..* ఉపనిషత్తుల సత్యాన్ని అత్యంత శాస్త్రీయంగా వివరించినవాడు శంకరాచార్యుడేనని, అద్వైతం ప్రపంచ తత్త్వచరిత్రలో అత్యున్నత తత్త్వమని అభిప్రాయపడ్డారు.. *💜 డా. సర్వేపల్లి రాధాకృష్ణన్..* 👉 భారత ఆధ్యాత్మిక ఏకత్వానికి శిల్పి. 👉 జ్ఞానం–భక్తి–కర్మల సమన్వయమే శంకరుల బోధన.. *💜 స్వామి వివేకానంద గారు* 👉 అద్వైతం భారతదేశానికి లభించిన గొప్ప వరం. 👉 భారత ఆత్మను మేల్కొలిపిన మహాయోగి. *💜 శ్రీ అరవిందో ఘోష్. గారు..* ఈయన భారత తత్వవేత్త, యోగి, కవి, స్వాతంత్ర్య సమరయోధుడు.. 👉 శంకరుల అద్వైతం భారత తత్త్వచింతనలో మేరు శిఖరం.. 👉 అదిశంఖరులది బుద్ధివాదం కాదు – ఆత్మానుభవం.. భారతీయ తత్వశాస్త్ర పితామహుడు వారు.. *💜 కంచీ మహాస్వామి గారు..* 👉 శంకరులు సాక్షాత్తు పరమేశ్వరావతారం. 👉 వేదధర్మ రక్షకుడు.. *💜 🔱 ఆది శంకరాచార్యుల వారసత్వం 🔱* ఈరోజుకీ ✔️ వేదాంతం ✔️ హిందూ తత్త్వచింతన ✔️ ధార్మిక ఏకత్వం *💜అన్నిటికీ మూలస్తంభం ఆది శంకరాచార్యులే..* 🙏 జయతు జయతు శంకరాచార్యః 🙏 అద్వైతవేదాంతం 🙏 సనాతన ధర్మం 🙏 భారతీయ తత్త్వదీపం – ఆది శంకరులు...