🙏ఓం శ్రీ మాత్రే నమః🕉️

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
573 views
1 days ago
కనకధార స్తోత్రం చదివేవాళ్ళకు కొన్ని సూచనలు .................!! ♦ లక్ష్మీదేవి అదృష్టానికి, శుభానికి సూచికగా చెబుతారు. సిరి ఉంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆ మహాలక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికీ లభించాలని లేదు. ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్నా వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా శ్రీ ఆదిశంకరాచార్యులవారు ఆశువుగా 'కనకధారా స్తోత్రం' చెప్పారు. కనకధారా స్తోత్రాన్ని రోజూ రెండు సార్లు పఠించినంతనే నిరుపేదలైనా కుబేరులుగా మారతారు. అటువంటి కనకధారా స్తోత్రం పఠించే వారు కొన్ని సూచనలను పాఠించాలి. ♦ కనకధారా స్తోత్రాన్ని ఉత్తర ముఖంగా ఉండి పఠించాలి. ♦ మహాలక్ష్మీదేవి పటాన్ని కానీ మహాలక్ష్మీ యంత్రాన్ని కానీ ఎదురుగా పెట్టుకుని పారాయణ చేయాలి ♦ ప్రతి రోజూ ఉదయం 6:00 నుండి 7:00 గంటల మధ్య, సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల మధ్య పారాయణ చేయాలి. ♦ కనకధారా స్తోత్రాన్ని పూర్ణిమ తిథి లేదా పౌర్ణమి రోజున ఉపదేశం పొందాలి ♦ కనకధారా స్తోత్ర పారాయణకు వయసు లింగ భేదాలు లేవు. ♦ ఎటువంటి కారణంతో అయినా పూజ చేసే సమయాలలో నలుపు, ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజించకూడదు ♦ ఎరుపు రంగు వస్త్రాలను ధరించి కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయకూడదు ♦ పట్టువస్త్రం లేదా ఎరుపు, నలుపు లేని వస్త్రాలను ధరించి శ్రీ కనకధారా స్తోత్రాన్ని పఠించి కులదేవతకు పూజ చేస్తే ఋణ బాధలు ఉండవు, లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొందుతారు. ♦ మగవాళ్ళు ప్రతి రోజూ శ్రీ కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే అసలు అప్పులపాలు కారు. 🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺 #ఓం శ్రీ మాత్రే నమః #తెలుసుకుందాం #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి #శ్రీ మహాలక్ష్మి దేవి
Rochish Sharma Nandamuru
1.2K views
22 days ago
అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్... ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.. మహిషాసురుడనే రాక్షసుడిని దుర్గాదేవి సంహరించడం. బ్రహ్మదేవుని వరం పొందిన మహిషాసురుడు, ఏ పురుషుని చేతిలోనూ మరణం లేకుండా వరాన్ని పొంది, ముల్లోకాలను పీడించసాగాడు. దేవతలు అతనిని ఓడించలేక త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శరణు వేడారు. అప్పుడు ఆ త్రిమూర్తులు తమ శక్తులను ఏకీకృతం చేసి, ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవిని సృష్టించారు. ప్రతి దేవత తమ ఆయుధాలను ఆమెకు అందించగా, ఆమె సింహవాహినియై మహిషాసురునితో తొమ్మిది రాత్రులు భీకరంగా యుద్ధం చేసి, పదవ రోజున అతనిని సంహరించింది. ఈ విజయానికి గుర్తుగా పదవ రోజును "విజయదశమి"గా జరుపుకుంటారు. నవరాత్రులలో ప్రతి రోజూ దుర్గాదేవి యొక్క ఒక్కో రూపాన్ని పూజిస్తారు. ఈ తొమ్మిది రూపాలను "నవదుర్గలు" అని అంటారు. 1. శైలపుత్రి: పర్వతరాజైన హిమవంతుని కుమార్తె. ఈమె వృషభవాహని. యోగసాధనలో మూలాధార చక్రానికి అధిదేవత. 2. బ్రహ్మచారిణి: తపస్సు ఆచరించే కన్య. ఆమె పరమశివుడిని భర్తగా పొందడానికి కఠోర తపస్సు చేసింది. ఈమె జపమాలను, కమండలాన్ని ధరించి ఉంటుంది. 3. చంద్రఘంట: శిరస్సున అర్ధచంద్రుని ధరించిన రూపం. ఈమె శాంతిని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. 4 కూష్మాండ: తన చిరునవ్వుతో బ్రహ్మాండాన్ని సృష్టించిన దేవత. ఈమె అష్టభుజాలతో, వివిధ ఆయుధాలను ధరించి ఉంటుంది. 5. స్కందమాత: కుమారస్వామి (స్కందుడు) తల్లి. ఈమె తన ఒడిలో స్కందుడిని కూర్చోబెట్టుకుని ఉంటుంది. 6. కాత్యాయని: కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించిన రూపం. ఈమె మహిషాసురుడిని వధించడానికి అవతరించింది. 7. కాళరాత్రి: నల్లని వర్ణంతో, భయంకరమైన రూపంతో ఉన్నప్పటికీ, తన భక్తులను ఎల్లప్పుడూ శుభ ఫలితాలతో అనుగ్రహిస్తుంది. 8. మహాగౌరి: పరమశివుని కోసం చేసిన కఠోర తపస్సు తర్వాత పొందిన గౌర వర్ణం కలది. ఈమె శాంతికి, స్వచ్ఛతకు ప్రతీక. 9. సిద్ధిధాత్రి: సర్వ సిద్ధులను ప్రసాదించే దేవత. ఈమె కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ప్రతి రోజు అమ్మవారిని ఆ రోజుకు నిర్దేశించిన రూపంలో అలంకరించి, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి, పూజలు నిర్వహిస్తారు. వైభవం మరియు వేడుకలు నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. బొమ్మల కొలువు: దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడులలో, నవరాత్రుల సమయంలో "బొమ్మల కొలువు" ఏర్పాటు చేయడం ఒక ముఖ్యమైన సంప్రదాయం. మెట్లపై వివిధ రకాల దేవతలు, పురాణ గాథలు మరియు సామాజిక జీవనానికి సంబంధించిన బొమ్మలను ప్రదర్శిస్తారు. ఇది సృజనాత్మకతకు మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. నవరాత్రులు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక సాధన. ఈ తొమ్మిది రోజులు ఇంద్రియ నిగ్రహంతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ద్వారా మనలోని తామసిక, రాజసిక గుణాలను జయించి, సాత్విక గుణాలను పెంపొందించుకోవడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇది మనలోని చెడు ఆలోచనలు, అహంకారం అనే మహిషాసురుడిని సంహరించి, జ్ఞానం మరియు ఆనందం అనే దైవత్వాన్ని పొందడానికి ఒక అవకాశం. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో జగన్మాత తొమ్మిది అవతారాలను పూజిస్తారు. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రఘంట, నాల్గవ రోజు కూష్మాండా దేవి, ఐదవ రోజు స్కంద మాత, ఆరవ రోజు కాత్యాయిని, ఏడవ రోజు కాళరాత్రి, ఎనిమిదవ రోజు మహాగౌరి, తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి మొదలైనవి. ఈ తొమ్మిది రోజులు నవ దుర్గలను రంగురంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. అదే సమయంలో ఈ నవరాత్రి పండుగలో నవ దుర్గలకు ఇష్టమైన రంగు చీర లేదా దుస్తులను ధరించి అమ్మవారిని పూజించవచ్చు. #🌅శుభోదయం #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #🙏ఓం శ్రీ మాత్రే నమః🕉️ #🪔🕉️ అమ్మవారి అనుగ్రహం🙏🚩
Rochish Sharma Nandamuru
2.4K views
1 months ago
🌿🌼🙏దేవతల సర్వ సైన్యాధ్యక్షురాలు శ్రీ ఉగ్ర వారాహీ అమ్మవారు వారాహి దేవి నామాలు...ఈ నామాలు రోజు తలుచుకుని నమస్కారం చేసిన ఆ తల్లి ఆశీర్వాదం దక్కుతుంది 🌿🌼🙏శ్రీ వారాహీ ద్వాదశ నామ స్తోత్రం🙏🌼🌿 అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః !అనుష్టుప్ఛందః ! శ్రీవారాహీ దేవతా ! శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం! సర్వ సంకట హరణ జపే వినియోగః !! *1) పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ !* *తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా !!* *2) వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా !* *అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే !!* *3) నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః !* *సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః !!* 🌿🌼🙏ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామస్తోత్రం సంపూర్ణం🙏🌼🌿 పంచమి, దండనాథా, సంకేతా, సమయేశ్వరి, సమయ సంకేతా, వారాహి, పోత్రిణి , వార్తాళి ,శివా,ఆజ్ఞా చక్రేశ్వరి ,అరిఘ్ని. "ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ....." లడ్డు ఆకారంలో ఉండే గుండ్రటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. నీలిరంగు పుష్పాలు తో పూజించడం, రేవతి నక్షత్రం రోజు విశేష పూజ కు అనుగ్రహిస్తుంది.. ఈమె వాహనం దున్నపోతు,ఉగ్రంగా కనిపించిన ఏమీ చల్లని తల్లి, అన్యాయంగా దౌర్జన్యం గా ఆక్రమణకు గురి కాకుండా దేశాన్ని కానీ కుటుంబాన్ని కానీ, పొలాన్ని కానీ రక్షించే దేవతగా తరాలుగా ఉపాసించ బడుతుంది.లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వరాహీ దేవి. లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది, దానిపేరు కిరి చక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి, రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ, మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు ఉంటారు. కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా | జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 || భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా | నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 || భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా | మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 || విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా | అరుణాచలశివ 🌹 ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః🌹🙏🚩 . #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #🙏ఓం శ్రీ మాత్రే నమః🕉️ #🙏శ్రీ వారాహి అమ్మవారు🕉️