*బాలికల హాస్టల్లోకి పాము.. నలుగురిపై కాటు*
* జార్ఖండ్లోని లోహార్దగా జిల్లాలోని పాఠశాల హాస్టల్ గదిలో నిద్రిస్తున్న నలుగురు విద్యార్థినులను పాము కాటేయడంతో, వారిలో ఒకరు మరణించగా, మిగిలిన ముగ్గురు ఆసుపత్రి పాలయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం రాత్రి భోజనం అనంతరం విద్యార్థినులు గ్రౌండ్ ఫ్లోర్లోని హాస్టల్ గదికి వెళ్లారని పాఠశాల ప్రతినిధి చెప్పారు. మరణించిన విద్యార్థినిని స్నేహ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలౌడి నవటోలికి చెందిన వర్ష ఒరాన్గా గుర్తించారు.
#news #sharechat