తిరుమల లడ్డు

P.Venkateswara Rao
604 views
25 days ago
#తిరుమల లడ్డు *ఇలాంటి నిర్ణయాలే అనుమానాలు పుట్టిస్తాయి❗* APRIL 3, 2026🎯 తిరుమలలో కల్తీనెయ్యి విషయంలో నిజానిజాల సంగతి ఎటుపోయినా సరే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం అనే సింగిల్ పాయింట్ ఎజెండాతోనే కూటమి సర్కారు పావులు కదుపుతున్నదని అంతా అనుకుంటున్నారు. తొలుత విచారణకు సిట్ ఏర్పాటుచేసిన రాష్ట్ర సర్కారు దూకుడుకు సుప్రీం కళ్లెం వేసింది. ఆ సిట్ కాకుండా.. సీబీఐ సారథ్యంలో విచారణ జరిగేలా మరో సిట్ ఏర్పాటుచేసింది. వారు విచారణ పూర్తిచేసి నివేదికలు కూడా ఇచ్చేశారు. కేసు నడుస్తున్న కోర్టుకు చార్జిషీట్లు కూడా వేసేశారు. ఆ నివేదిక పట్ల రాష్ట్రప్రభుత్వం సంతృప్తి చెందలేదు. వారి నివేదికలో జంతువుల కొవ్వులు కలిశాయని ఏ ప్రచారమైతే ప్రభుత్వపెద్దలు సుదీర్ఘకాలం సాగించారో.. అలాంటి మాటలు ఆ నివేదికలో లేవు. దరిమిలా.. విశ్రాంత ఐపీఎస్ అధికారి దినేష్ కుమార్ సారథ్యంలో మరొక ఏకసభ్య కమిషన్ ను నియమించారు. తమాషా ఏమిటంటే.. ఆ ఏకసభ్య కమిటీ విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించడానికి గడువు పూర్తికావస్తోంది. ఇప్పు.. ఆ గడువును పొడిగించారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పొడిగింపు ఉత్తర్వులే.. ప్రజల్లో కొత్త అనుమానాలకు కారణం అవుతున్నాయి. చూడబోతే.. ఏకసభ్య కమిషన్ ప్రభుత్వం ఆశించే విధంగా తమ నివేదిక తయారు చేయలేకపోయిందేమో అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే.. ఆల్రెడీ ఒకసారి నెలల తరబడి అనేక మంది నిపుణులతో కూడిన సిట్, సీబీఐ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో విచారం జరిపిన వ్యవహారమే ఇది. అదనపు దర్యాప్తు చేయడానికి మాత్రమే అన్నట్టుగా ఏకసభ్య కమిషన్ ఏర్పాటుచేశారు. ఇప్పుడు వారికి గడువు పొడిగించారు. అయిపోయిన పెళ్లికి మేళమెందుకని సామెత. అయిపోయిన విచారణను మళ్లీ చేయడానికి 45 రోజుల గడువు ఇస్తే.. ఆ గడువు చాలదని మళ్లీ పొడిగించడమే తమాషా. ఇలాంటి నిర్ణయాలు ప్రజల్లో అనుమానాలు కలిగిస్తాయి. సీబీఐ నివేదికే.. ప్రభుత్వానికి చేదుగా అనిపించి ఉండొచ్చు. జంతువులు కొవ్వు ప్రసాతం చేసిన నెయ్యిలో కలిపారంటూ ఎలాంటి అసహ్యమైన ఆరోపణలైతే వారు చేశారో.. ఆ ఊసు కూడా సీబీఐ నివేదికలో లేకపోవడం వారికి కంటగింపే. ఆ పరువు నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి వారు ఏకసభ్య కమిషన్ అనే ప్రహసనం తెచ్చారా? అనే అనుమానాలూ ఉన్నాయి. వాటికి బలం చేకూర్చేలా గడువు పొడిగిస్తున్నారంటే.. ఇప్పటికీ వారు కోరుకునే నివేదిక తయారు కాలేదేమో.. వారు కోరుకున్నట్టు నివేదిక తయారయ్యేదాకా గడువులు పొడిగిస్తూ ఉంటారేమో అని ఎవరికైనా అనుమానం పుడితే.. ఎలా తప్పుపట్టగలం?
P.Venkateswara Rao
621 views
1 months ago
#తిరుమల లడ్డు #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *జగన్ పై మతాస్త్రం.. లాభనష్టాలెవరికి❓* MARCH 7, 2026🎯 సుదీర్ఘ రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా తప్పుదారిలో పయనిస్తున్నారు. హిందువుల వ్యతిరేకిగా వైసీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ముద్ర వేసి రాజకీయంగా భారీ లబ్ధి పొందాలనేది చంద్రబాబు అండ్ కో వ్యూహం. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడంలో చంద్రబాబు దిట్ట. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు ఎత్తుకు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు లాంటి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులే చిత్తయ్యారు. చంద్రబాబు మాస్ లీడర్ కాదు. కానీ తెలివితేటలతో గత నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో రాణిస్తున్నారు. బాబు వేసిన ఎత్తులకు మహామహులు చిత్తయ్యారు. అయితే వైఎస్ జగన్ దగ్గరికి వచ్చే సరికి, ఒక్కోసారి ఆయన వ్యూహాలు నిష్ఫలం అవుతున్నాయి. ఎన్నికల సమయంలో దుష్ప్రచారంతో తమను ఓడించారని చంద్రబాబుపై వైఎస్ జగన్, వైసీపీ నాయకుల ఆరోపణల గురించి తెలిసిందే. కానీ వైసీపీకి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలన్న చంద్రబాబు శకుని పాచిక పారడం లేదు. చంద్రబాబు గొప్పతనం ఏమంటే, తన ప్రయత్నాల్ని ఎప్పుడూ విరమించరు. ప్రయత్నిస్తూ వుంటే, ఎప్పుడూ ఒకసారైనా సత్ఫలితాలు ఇవ్వకుండా వుంటుందా? అనే నమ్మకం ఆయనది. వైఎస్ జగన్పై కొన్నేళ్లపాటు సాగించిన అవినీతి ఆరోపణలకు కాలం చెల్లిందని చంద్రబాబు గుర్తించారు. దీంతో జగన్పై కొత్త అస్త్రాన్ని ప్రయోగించాలని చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగానే వైఎస్ జగన్పై మతాస్త్రాన్ని ప్రయోగించారు. టీటీడీ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు కలిపారని సీఎం హోదాలో చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందుకు తీసుకెళ్లారు. తమపై విసిరిన మతాస్త్రాన్ని ఎదుర్కోవడంలో మొదట్లో వైసీపీ ఇబ్బంది పడింది. అయితే తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట ప్రమాణంతో మొదలైన ఎదురు దాడి... క్రమంగా పెంచింది. చివరికి సీబీఐ నేతృత్వంలోని సిట్ ఇచ్చిన నివేదికతో వైసీపీ పూర్తిగా పైచేయి సాధించింది. అయితే మతాస్త్రంతో రాజకీయంగా భారీ లబ్ధి పొందుతామని అనుకుంటే, బూమరాంగ్ కావడం టీడీపీ, జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులందరినీ మతం దృష్టితోనే చూడడం విస్మయం కలిగిస్తోంది. ఈ పరిణామాలు జనంలో టీడీపీ, జనసేన పార్టీలపై వ్యతిరేకత తెచ్చి పెడుతున్నాయి. శాసన మండలిలో చైర్మన్ మోషేన్రాజును ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు క్రిస్టియన్ అంటూ అనవసరంగా కెలికారు. దీంతో మండలి చైర్మన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మతం గురించి మీరెలా చెబుతారని మోషేన్రాజు గట్టిగా నిలదీశారు. తాను హిందువని ఆయన తేల్చి చెప్పారు. దీంతో మండలిలో అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి. మరోవైపు జగన్ క్రిస్టియనో, కాదో చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు అడ్డగోలు వాదన చేశారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు చంద్రబాబునాయుడు మరోసారి మతం కేంద్రంగా కీలక కామెంట్స్ చేశారు. ఏసు ప్రభువుకు అపచారం జరిగిందంటే జగన్ క్షమాపణలు చెప్పారన్నారు. వెంకటేశ్వరస్వామికి కల్తీ చర్యలతో అపచారం చేస్తే దానికి సమాధానం చెప్పరా? క్షమాపణలు చెప్పరా? కనీసం పశ్చాత్తాపమైనా ఎందుకు ప్రకటించరని చంద్రబాబు నిలదీశారు. మతపరంగా ప్రభుత్వ పెద్దలు, మంత్రులు మాట్లాడే ప్రతి మాటనూ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తుంటారు. వైఎస్ జగన్ క్రిస్టియానిటీని పరిగణలోకి తీసుకుని, మతపరమైన విభజన తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలనేది పాలకుల ఎత్తుగడ. అయితే జగన్ క్రిస్టియన్ కావడంతో ఏదో అపచారం చేస్తున్నారని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితరులు చేసే నిందారోపణలు నమ్మి, హిందువులంతా వైసీపీకి దూరమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కానీ పాలకుల ఆరోపణలతో క్రిస్టియన్, ముస్లిం తదితర మైనార్టీలంతా కూటమికి దూరం కావడం ఖాయం. అలాగే దళితులు, గిరిజనుల్ని కూడా వైసీపీకి చేరువ చేయడంలో కూటమి నేతలు విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. అంటే, చంద్రబాబు, పవన్ ఆడుతున్న మత వికృత క్రీడలో తామే రాజకీయంగా నష్టపోతున్నామనే గ్రహించలేకున్నారా? లేక మొండిగా ముందుకు వెళుతున్నారా? అనే విషయాలు వారికే తెలియాలి. తెలుగు సమాజం మతపరంగా విడిపోయేంత అజ్ఞానంలో లేదు. ఇటీవల కోవా బన్ వలీ విషయంలో హిందువులంతా ఆ పేద చిరు వ్యాపారికి ఎంత అద్భుతంగా అండగా నిలిచారో తెలిసిందే. అలాంటిది అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్పై చంద్రబాబు, పవన్కల్యాణ్ ఏ ఉద్దేశంతో మతాన్ని అడ్డం పెట్టుకుని విమర్శలు చేస్తున్నారో అర్థం చేసుకోలేనంత అమాయక స్థితిలో జనం లేరు. హిందువుల్లో జగన్పై వ్యతిరేకత రాకపోగా, రాజకీయ లబ్ధి కోసం ఇంతగా దిగజారి తమ మనోభావాల్ని దెబ్బతీసేలా మాట్లాడ్తారా అని చంద్రబాబు, పవన్పై హిందువులు ఆగ్రహించే పరిస్థితి. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో జగన్ కంటే, తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవనే ప్రజల్లో ఎక్కువగా అభాసుపాలయ్యారు. ఈ వాస్తవాన్ని పసిగట్టడం వల్లే చంద్రబాబు, పవన్లో ఓర్వలేనితనం పెరిగింది. తప్పుల్ని సరిదిద్దుకోడానికి బదులు, మరిన్ని చేస్తున్నారనే చర్చకు తెరలేచింది. తెలుగు సమాజం మత వలకు చిక్కదని ఏపీ పాలకులు తెలుసుకోవాలి. వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోడానికి మరో అస్త్రాన్ని ఎంచుకోవాలి. మరే అస్త్రాలు లేకపోవడం వల్లే మతాన్ని ఎంచుకున్నామని అనుకుంటే, అది పూర్తిగా తప్పుడు విధానం అని... ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత నుంచైనా తెలుసుకోవాలి. ఇక తిరుమల లడ్డూ ప్రసాదంపై జుగుప్స కలిగించే ఆరోపణల్ని ఆపాలంటూ ముక్త కంఠంతో తెలుగు సమాజం కోరుతున్నదంటే, మన మాటలు ఎంత వెగటు పుట్టించాయో ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి. ఈ మొత్తం ఎపిసోడ్లో జగన్కు హిందువులు దూరం కాకపోగా, సానుభూతి పొందగలిగారు. అలాగే పదేపదే జగన్ మతం గురించి పాలకులు మాట్లాడుతుండడంతో దళితులు, గిరిజనులు, క్రిస్టియన్లు, ముస్లింలంతా వైసీపీకి మరింత దగ్గరయ్యారు. ఎందుకంటే, గత ఎన్నికల్లో వీళ్లలో మెజార్టీ కూటమి పక్షాన నిలిచింది. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. మరోవైపు హిందువుల్ని తమవైపు తిప్పుకోలేకపోగా, వారిలో కూడా వ్యతిరేకతను కూటమి సంపాదించుకుంది. చేతులు కాలాక చంద్రబాబు, పవన్ ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి? జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
P.Venkateswara Rao
568 views
2 months ago
#తిరుమల లడ్డు #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *ఏపీ రాజకీయాల్లో కోవా – నెయ్యి – పెరుగు – ప్రతిదీ గాయిగత్తరే…⁉️* February 18, 2026🎯 ఒక జాతర… అదీ తెలంగాణలోని ప్రముఖ జాతర… అక్కడ అన్ని మతాల చిన్న వ్యాపారులు నాలుగు డబ్బులు సంపాదించుకుందామని వస్తారు… సహజం… పొట్టపోసుకునే ప్రయత్నం… కానీ ఏం జరిగింది..? కోవా బన్ను అమ్ముకునే ఎవరో చిన్న వ్యాపారిని ఎవరో ఓ చానెల్ వాళ్లు గెలికారు, ఏదో ఆరోపించారు… అదంతా ఒక కోణంలో నాన్సెన్స్… అమానవీయం… మరీ దానికి ఫుడ్ జిహాద్ అని పేరుపెట్టి మరీ కొందరు రచ్చ చేయడానికి ప్రయత్నించారు… వ్యక్తుల నడుమ రచ్చను మతాలకు ముడిపెట్టడం దేనికి..? వోటు బ్యాంకు రాజకీయాల వైపు మళ్లించడం దేనికి.. ఆ బన్ను కల్తీయా, మరొకటా అనేది ఇక్కడ చర్చ కాదు, జాతరలో రకరకాల వ్యాపార వస్తువులు అమ్ముతారు, వాటి నాణ్యత, వాటి ధర కొనేవాడి ఇష్టం… సరే, సదరు చిరు వ్యాపారికి ఎస్‌డీపీఐ వంటి నిషిద్ద, ప్రమాదకర సంస్థ మద్దతు అనేది కొంత ఆలోచించాల్సిన విషయం… దాన్ని అంతటితో వదిలేయలేదు ఏపీ పాలిటిక్స్… విషయం ఏదైనా గాయిగత్తర చేయడమే కదా ఏపీ పాలిటిక్స్ నైజం… రాజకీయాలు పులుముతారు కదా… ఇక్కడా అంతే..,. లోకేష్ ట్వీట్, నేను నీ కోవా బన్ను తింటాను అని… ఎందుకు..? ఏం చెప్పదలుచుకున్నాడు..? ఇష్యూను మరింత సీరియస్ చేయాలనేనా ఉద్దేశం..? లేక ఇది మైనారిటీ హక్కులు, మనోభావాల ఇష్యూగా చిత్రీకరించాలనా..? నాగబాబు… పేరుకు నాస్తిక చక్రవర్తి… తనేం మాట్లాడతాడో తనకూ తెలియదు చాలాసార్లు… ఇప్పుడు సదరు వ్యాపారిని పిలిచి, ఆ కోవా బన్ను తిని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు… ఏం చెప్పదలుచుకున్నాడు..? దాని నాణ్యతకు, పవిత్రతకు సర్టిఫికెట్ ఇస్తున్నాడా..? చూశావా, మేమెంత మానవతావాదులమో అని ఓ ఓ చిత్రీకరణా…? మరి హిందూ గుళ్ల మీద దాడులు జరిగినప్పుడు, విగ్రహాల తలలు నరికేసినప్పుడు, ఏమయ్యాయి ఈ గొంతులు..? ఒక్క కోవా బన్ను మీద ఎందుకింత ఓవరాక్షన్..? సదరు వ్యాపారికి మద్దతుగా బోలెడు పోస్టులు, లక్షల వసూళ్లు, విరాళాలు.., చివరకు దీన్ని ఏమని చిత్రీకరిస్తున్నారు అందరూ కలిసి..? సదరు చానెల్ చేసింది తప్పే, మత విద్వేషం పెంచుతున్నారు అని భావిస్తే చర్యలు తీసుకొండి… సదరు వ్యాపారికి నష్టం వాటిల్లితే మానవతా కోణంలో ఏదైనా పథకంలో ఇన్‌క్లూడ్ చేసి, సాయం చేయండి, నిలబెట్టండి… అంతేతప్ప ప్రతిదానికీ రాజకీయాలను పులమడం దేనికి..? పొలిటికల్ షో దేనికి..? (తెలంగాణ ప్రభుత్వం దీన్ని లైట్ తీసుకుంది, తన పరిధిలో జరిగిన వివాదమే అయినా సరే… దీన్ని మరింత రచ్చ చేయడం సొసైటీకి అంతిమ నష్టం కాబట్టి… టీడీపీ, జనసేనల నుంచి ఈ సోయి కనిపించడం లేదు…) చివరకు దీన్ని తిరుమల లడ్డూకు ముడిపెట్టి చర్చలు, రాద్ధాంతం చేస్తున్నారు… అసలు దానికీ దీనికీ లింకేమిటి..? సరే, తిరుమల లడ్డూ సంగతికే వద్దాం… గతంలో ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టు స్పష్టంగా చెప్పింది… జంతువుల కొవ్వుల గురించి… కానీ సీబీఐ సిట్ మాత్రం కేవలం ‘నెయ్యి కాని నెయ్యి’ దగ్గరే ఆగిపోయింది… అంటే కేంద్రం కూడా ఇంకా ఇంకా లడ్డూ మీద దుష్ప్రచారం జరగకూడదని..! దాని విశిష్టతకు ఇంకా భంగం వాటిల్లకూడదని..! కేంద్రం భావన టీడీపీ క్యాంపుకి అర్థం కాలేదు… అందుకే పదే పదే తన సోషల్ మీడియా, మీడియా ద్వారా గాయిగత్తర వరుస కథనాలకు, పోస్టులకు దిగారు… అసలు ఈ జంతు కొవ్వుల గురించి ప్రస్తావన తెచ్చిందే చంద్రబాబు… పొలిటికల్ ఫాయిదా కోసం… అదేదో దర్యాప్తు చేయిస్తే అయిపోయేది, కానీ కావాలని జగన్‌ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడం కోసం… ఎస్, జగన్ క్యాంపు తిరుమలను భ్రష్టుపట్టించింది నిజమే… కానీ సిస్టమాటిక్‌గా చంద్రబాబు ఎక్స్‌పోజ్ చేసి, ఎస్టాబ్లిష్ చేసింది ఎక్కడ..? (ఏమాటకామాట… ఏపీబీజేపీ సంయమనం పాటిస్తోంది… ) ఈలోపు వైసీపీ క్యాంపు హెరిటేజ్ పెరుగు, పాలపై ప్రచారానికి దిగింది… అది మరో బ్లండర్… నెయ్యి కాని నెయ్యి కీ హెరిటేజ్ పెరుగుకూ ఏం లింక్..? చంద్రబాబు హెరిటేజ్ ద్రోహం చేస్తే, జగన్ లడ్డూకు చేసిన ద్రోహాలు బారాఖూన్ మాఫ్ అనుకోవాలనా..? ఈ ప్రచారంపై హెరిటేజ్ లీగల్ ఫైట్‌కు రెడీ కాగానే, తాజాగా ఇందాపూర్ సంస్థ హెరిటేజ్ అనుబంధమేననీ, ఆ నెయ్యిలో టాయిలెట్ క్లీనర్ల అవశేషాల మాటేమిటీ అని చట్టసభలో ప్రస్తావనకు తీసుకొచ్చారు… ఇదే కాదు, గతంలో చంద్రబాబు హయాంలోనే సదరు అక్రమ డెయిరీల నుంచి కోట్ల రూపాయల నెయ్యి కొన్నట్టు, టీటీడీ బ్లాక్ లిస్టు చేసినా సరే, అనతికాలంలోనే ఆ నిషేధం తొలగించినట్టు కూడా ప్రచారం మొదలెట్టారు… వెరసి టీడీపీ క్యాంప్ ఫుల్ డిఫెన్సులో పడినట్టు కనిపిస్తోంది… అబ్బే, అవి కంట్రాక్టు మాన్యుఫాక్చరింగ్ ఒప్పందాలు మినహా సదరు డెయిరీ నెయ్యి సరఫరాలతో తమకేమీ సంబంధం లేదని హెరిటేజ్ క్లారిటీలు ఇస్తోంది… అంతేకాదు, ఢిల్లీ నుంచి కూడా స్పష్టమైన సంకేతాలు అందినట్టున్నాయి… తిరుమల లడ్డూ యవ్వారాన్ని కంపు చేయడం ఇక మానేయాలని..! ప్చ్, ఏపీ రాజకీయాల్లో కాదేదీ రాజకీయాలకనర్హం… బన్ను కోవా, లడ్డూ నెయ్యి, పట్టు శాలువా, హెరిటేజ్ పెరుగు… ఎటెటో తిప్పుతున్నారు… ఏం రాజకీయాలురా బాబూ..!!
P.Venkateswara Rao
607 views
2 months ago
#తిరుమల లడ్డు ఖతమ్‌. బారా ఖూన్‌ మాఫ్‌.. *ఆపదలో అవకాశం వెదుక్కుంటా..* -బాబు తరచూ చెప్పే మాటలు లడ్డులో జంతు కొవ్వు లేదు అని సిబిఐ చెప్పాక బాత్ రూమ్ కు వాడే కెమికల్ కలిస్తే చస్తారు అని తెలిసి కూడా కావాలనే లడ్డులో వాడారు అని కొత్త ప్రచారం వెనక డైవర్షన్ పాలిటిక్స్ అవి ఏంటి అంటే .. 1) 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ 2)బాలకృష్ణ అల్లుడు విశాఖ టీడీపీ ఎంపీ భరత్ కు చెందిన గీతం కు 5 వేల కోట్ల విలువ చేసే 55 ఎకరాల భూములు 3) ఊరూపేరూ లేని ఉర్సా కు పప్పుబెల్లాలకు భూములు 4)లులు మాల్ హైదరాబాద్ గుజరాత్ లో సొంతంగా భూములు కొంటుంటే ఇక్కడ ఏపీలో 1500 కోట్ల విలువ చేసే భూములు ఇక్కడ ఉచింతంగా.. 5)రామోజీ కొడుకు వియ్యంకకడికి పోలవరం పనులు 6) జనసేన రైల్వే కోడూరు MLA ఆరవ శ్రీధర్ రాసలీలలు ఇలా ఎన్నో.. CBNDiversionPolitics🎯
P.Venkateswara Rao
610 views
2 months ago
#తిరుమల లడ్డు #ఫ్లాష్_ఫ్లాష్_ఫ్లాష్* 08-02-2026 విజయవాడ ➖➖➖➖➖➖ #తిరుమల_లడ్డు విషయంలో #కూటమి ప్రభుత్వానికి మరో షాక్* 🔥🔥🔥🔥🔥🔥 *తిరుమల లడ్డు విషయంలో జంతువుల కొవ్వు కలిశాయి అంటూ కూటమి ప్రభుత్వం మరియు ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే మీడియా చేస్తున్న ప్రచారం వలన తన మతవిశ్వాసం దెబ్బతిన్నందున నష్టపరిహారం చెల్లించాలి అంటూ విజయవాడ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసిన విజయవాడకు చెందిన #చింతా_వెంకటేశ్వర్లు* 👇👇👇👇👇👇 *ABN, TV 5,MAHA NEWS,E TV మరియు తెలుగుదేశం పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్స్ ను కూడా ప్రతివాదులుగా చేర్చిన పిటిషనర్* 📍📍📍📍📍📍 *పిటిషనర్ తరపున పిటిషన్ దాఖలు చేసిన ప్రముఖ న్యాయవాది #జడ_శ్రవణ్_కుమార్* 🫢🫢🫢🫢🫢🫢 *తిరుమల లడ్డు విషయంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చార్జిషీట్ లో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు అని నిర్ధారించినప్పటికీ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అసత్య కథనాలు ప్రసరిస్తున్నారు అన్న పిటిషనర్* *కూటమి ప్రభుత్వం అధికారికంగా అసత్య ప్రచారాలు చేయిస్తూ కోటానుకోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు అన్న పిటీషనర్* 🤭🤭🤭🤭🤭🤭 *ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో మంత్రులు అసత్య ప్రచారాలతో తన మత విశ్వాసాలు దెబ్బతీస్తున్నారు అన్న పిటీషనర్* *తిరుమల లడ్డు విషయంలో నెల్లూరులో జరుగుతున్న కేసులో తీర్పు వచ్చేంతవరకు జంతువుల కొవ్వు పై ఎటువంటి కథనాలు ప్రచురించకుండా ప్రతివాదులందరిపై ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వవలసిందిగా తన పిటిషన్ లో కోరిన పిటీషనర్* *తన మత విశ్వాసాలు దెబ్బతీసినందున ప్రతివాదులందరూ 20 లక్షలు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుని కోరిన పిటిషనర్* 👇👇👇👇👇👇 *ఈ పిటిషన్ పై విచారణ జరపనున్న విజయవాడ #సిటీ_సివిల్_కోర్టు* *సోమవారం లేదా మంగళవారం పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం* *కోర్టు ఉత్తర్వులు ఇస్తే కోటాను కోట్ల మంది భక్తుల మనోభావాలు ఇకనుంచి అయినా పరిరక్షించబడతాయి అంటున్న పిటిషనర్* *కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలతో లడ్డు విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తుంది అన్న పిటీషనర్* 🫣🫣🫣🫣🫣🫣 *సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే బాత్రూంలో వాడే రసాయనాలు లడ్డూ లో కలిపారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న పిటిషనర్* *తిరుమల లడ్డు పవిత్రతపై కూటమి ప్రభుత్వం రోజుకో రాజకీయ ప్రకటన చేస్తూ కోటానుకోట్ల మంది భక్తుల మనోభావాలు తో పాటుగా తన మనోభావాలు కూడా దెబ్బతీస్తున్నాయి అన్న పిటిషనర్* 👇👇👇👇👇👇 *తక్షణమే కూటమి ప్రభుత్వాన్ని మరియు మీడియాని నియంత్రించే ఉత్తర్వులు ఇవ్వవలసిందిగా కోరిన పిటిషనర్* *కోర్టు ఉత్తర్వులతో అయినా కోటానుకోట్ల మంది భక్తుల మనోభావాలు పరిరక్షించబడతాయి అన్న పిటిషనర్*
PSV APPARAO
832 views
2 months ago
#TTD కి అపచారం #శ్రీవారి ప్రసాదం ౼ అపచారం #తిరుమల శ్రీవారి లడ్డూ పై రాజకీయ దుమారం #తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఘోర అపచారం #తిరుమల లడ్డు నీకు క్లీన్ చిట్ ఎవరు ఇచ్చారు ? హిందువుల సెంటిమెంట్ తో ఆడుకోకు.. దేశం మొత్తం మీ కల్తీ గురించి మాట్లాడుతుంది.. దేశం ఆశ్చర్యపోతుంది.. ఇంకా నీ కల్తీ మాటలు ఆపు జగన్.. #TirumalaLaddooKalteeNijam #JaganMahaPapamNijam #ShameOnYouJagan #AntiHinduJagan #StopHurtingHindus #FekuJagan #AndhraPradesh
P.Venkateswara Rao
609 views
2 months ago
#తిరుమల లడ్డు #ఏపీ అప్ డేట్స్..📖 #పబ్లిక్ టాక్.. 🗣️ *తిరుమలపై సర్కార్ తీరు.. ప్రజాభిప్రాయం ఏంటి⁉️* FEBRUARY 6, 2026🎯 తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం రోజురోజుకూ చినికిచినికి గాలివానగా మారుతోంది. కోట్లాది మంది హిందువులు తిరుమల క్షేత్రాన్ని తమ ఆధ్మాత్మిక రాజధానిగా భావిస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించే తిరుమల శ్రీవారు రాజకీయ వివాదం కావడం ప్రతి ఒక్కరి మనసుల్ని తొలిచేస్తోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతగా కలుషితం అయ్యాయో తిరుమలేశుని వివాదం చేయడమే నిదర్శనం. అయితే పాలకులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించుకోవాలి. ప్రజలు తమకంటే తెలివైన వాళ్లనే సంగతిని గుర్తించుకోవాలి. తిరుమల శ్రీవారిని రాజకీయ అస్త్రంగా వాడుకుంటూ, చివరికి ఆ దేవుని ప్రతిష్టను కాపాడ్డానికి కఠిన చర్యలు తీసుకుంటామని అనడం పాలకులకే చెల్లింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించడంతో యావత్ దేశమంతా నివ్వెరపోయింది. ఆధారాలు లేకపోతే సీఎం హోదాలో, అందులోనూ కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా పూజించే తిరుమల లడ్డూ ప్రసాదంపై కామెంట్స్ చేస్తారా? అని ప్రతి హిందువూ తనకు తాను ప్రశ్నించుకున్నారు. మరీ ముఖ్యంగా రాజకీయంగా తమను సమాధి చేయడానికి చంద్రబాబు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని వాడుకున్నారని పసి గట్టింది . దీంతో వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, తమిళనాడుకు చెందిన సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారని, కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని సుప్రీంకోర్టుకు మొర పెట్టుకున్నారు. తిరుమల శ్రీవారి ప్రతిష్టను కాపాడేలా చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని వారు అభ్యర్థించారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై వైవీ, సుబ్రమణ్యస్వామి పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ ఆధారాలతో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపించారని, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలా చేయడం తగదని సీఎంకు సుప్రీంకోర్టు తలంటింది. ఆ తర్వాత నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరు అధికారుల్ని నియమించుకోవచ్చని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టపరిచింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సీబీఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. ఈ సిట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇద్దరు ఐపీఎస్ అధికారుల్ని నియమితులయ్యారు. సుమారు 14 నెలల పాటు సిట్ అన్ని కోణాల్లో విచారించి, ఇటీవల న్యాయస్థానానికి చార్జిషీట్లు సమర్పించింది. ఇందులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్రధానంగా చంద్రబాబునాయుడి తీవ్ర ఆరోపణలే సుప్రీంకోర్టు వరకూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందనేది జగమెరిగిన సత్యం. అందుకే సిట్ ఏం తేల్చిందో తెలుసుకోవాలన్న ఉత్కంఠ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల్లో నెలకుంది. లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, అలాగే డిప్యూటీ సీఎం అదనంగా ఆరోపించినట్టు చేప నూనె కలవలేదని సిట్ నివేదిక విస్పష్టంగా తేల్చి చెప్పింది. దీంతో కోట్లాది మంది హిందువులు సంతోషంగా, హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. తాము స్వీకరించిన లడ్డూ ప్రసాదంలో మాంసకృత్తులు లేవన్న వాస్తవం ఎంతో ఊరట ఇచ్చింది. ఇదే సందర్భంలో మరెందుకని ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంపై అనుచిత ఆరోపణలు చేశారనే ప్రశ్న హిందూ సమాజం నుంచి వెల్లువెత్తింది. ఇక్కడే చంద్రబాబుతో పాటు బలపరిచిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయంగా బద్నాం కావడం మొదలైంది. ఇదంతా రాజకీయంగా వైసీపీని నాశనం చేయకుండా స్వామివారిని అస్త్రంగా వాడుకున్నారంటూ అంత కాలం సాగుతున్న విమర్శకు బలం కలిగించింది. అధికారం, రాజకీయం కోసం కోట్లాది మంది హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రార్థించే తిరుమల శ్రీవారిని బజారుకీడుస్తారా? ఇదేం న్యాయం? అని దేశ వ్యాప్తంగా అనేక మంది మేధావులు, తటస్థులు నిలదీసే పరిస్థితి. సీబీఐ చార్జిషీట్ తోనైనా తిరుమల లడ్డూ ప్రసాద వివాదానికి ముగింపు పలుకుతారని అంతా అనుకున్నారు. అబ్బే, అలాంటిది లేదని ప్రభుత్వ పెద్దలు తేల్చి చెప్పారు. మరోవైపు చంద్రబాబు, పవన్కల్యాణ్కు మంచి బుద్ధి ప్రసాదించాలని, వాళ్లిద్దరూ క్షమాపణ చెప్పాలని వైసీపీ నుంచి డిమాండ్ రావడంతో కూటమి పెద్దల్లో తీవ్ర అసహనం మొదలైంది. రెండురోజుల క్రితం గుంటూరులో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ద్రోహిగా చంద్రబాబును నిలిపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సీబీఐ నేతృత్వంలోని సిట్ రాజకీయంగా తమ వాళ్ల ప్రమేయం లేదని తేల్చి చెప్పడాన్ని గుర్తు చేశారు. స్వామి వారి ప్రసాదంపై అవాకులు చెవాకులు పేలడం, ఆరోపణలన్నీ తప్పని సీబీఐ నిర్ధారించిన నేపథ్యంలో క్షమాపణ చెప్పాలని జగన్ డిమాండ్ చేయడాన్ని పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం, ఏపీ బీజేపీ చీఫ్, మరో ఆరేడుగురు మంత్రులు అసాధారణ రీతిలో మీడియా ముందుకొచ్చారు. దీన్ని బట్టి ప్రజల్లో తమపై నెగెటివ్ ప్రచారం పోతోందన్న ఆందోళన వారిలో స్పష్టంగా కనిపించింది. మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. “తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఆ వేంకటేశ్వరస్వామే మాకు అప్పగించారు. ఈ విషయమై ఈ రోజు నేను, పవన్కల్యాణ్, మాధవ్ కూర్చుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించాం” అని చంద్రబాబు అన్నారు. తాము మాత్రమే శ్రీవారి భక్తులమనే భావన నుంచి చంద్రబాబు బయటికి రావాలి. మంచి పరిపాలన అందించాలని ప్రజలు అపరిమిత అధికారాన్ని ఇచ్చారు. అయితే ఆ పని చేయకుండా, దారుణంగా ఓడిపోయిన వైఎస్ జగన్ను చేయడానికి ఇంకా ఏముందని కలియుగ దైవం శ్రీవారిని వాడుకుంటున్నారనే చర్చ ప్రజల్లో వుంది. కూటమి రాజకీయ, వ్యక్తిగత రాగద్వేషాలతో ప్రజలకు సంబంధం వుండదు. వారిలో అన్ని రకాల మత విశ్వాసులుంటారు. అందరూ కలిసి ఐకమత్యంగా జీవిస్తున్నారు. తిరుమల శ్రీవారిని హిందువుల కంటే ఏ మాత్రం తక్కువ కాకుండా ఇతర మతస్తులు కూడా గౌరవిస్తారు, పూజిస్తారు. ఇందులో రెండో అభిప్రాయమే లేదు. భిన్నత్వంలో ఏకత్వమే మన ప్రజాస్వామ్య అందం. పాలక, ప్రతిపక్ష పార్టీల రాజకీయాలతో ప్రజలకు సంబంధం లేదు. మనం కోరుకుంటున్నట్టు మంచి పాలన అందుతోందా? లేదా? అనేదొక్కటే ప్రజలు చూస్తారు. పాలించాలని అధికారం ఇస్తే, తిరుమల శ్రీవారిని అప్రతిష్టపాలు చేసేలా వ్యవహరిస్తున్నారంటి? అని జనం మాట్లాడుకుంటున్నారు. శ్రీవారిని ఇలవేల్పుగా చెబుతూ, మరోవైపు స్వామివారి ప్రసాదం జంతువుల కొవ్వుతోనే తయారు చేశారని నిరూపించడానికి సీబీఐ నివేదిక కాదని, చంద్రబాబునాయుడు (సీబీఎన్) కమిటీ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో గెలిపించినంత మాత్రాన, తమ ఆరోపణలన్నింటికీ ప్రజామోదం ఉందనే భావన నుంచి పాలకులు బయటపడాలి. శ్రీవారి కేంద్రంగా ఇంతకాలం సాగిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రజానీకం కోరుకుంటున్నారు. ప్రజలు విజ్ఞులని, సీబీఐ నివేదికతో ప్రసాదంలో ఏం జరిగిందో వారే తేల్చుకుంటారని పాలకులు వదిలేయాలి. అందుకు విరుద్ధంగా తమ ఆరోపణలే నిజమని నిరూపించడానికి, శ్రీవారిని వివాదంలో ముంచెత్తుతామంటే... ఇక వారిష్టం. నమ్మకాలు ఎప్పటికీ నిజాలు కావు. వాస్తవాలు మాత్రమే నిజాలవుతాయి. అందుకే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల వ్యవహారంలో సీబీఐ చార్జిషీట్కు అంత ప్రాధాన్యం. ఎందుకంటే, నెలల తరబడి ఎంతో మందిని విచారించి, ఆధారాలను బట్టి నివేదిక తయారు చేసింది. ఇంతకాలం పాలక, ప్రతిపక్షాల నుంచి వచ్చినవన్నీ తాము నిజమని నమ్మి మాట్లాడినవే. వాటితో విచారణ టీమ్కు సంబంధం ఉండదు. వాళ్లకు కావాల్సింది ఆధారాలు, వాస్తవాలు. సీబీఐ సమగ్ర విచారణ జరిపి, ఒక నివేదిక ఇస్తే, దానిపై పాలకులు అసంతృప్తి వ్యక్తం చేయడం విడ్డూరం. పైగా దాన్ని కాదని, తామొక ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం విపరీత ధోరణికి నిదర్శనమనే విమర్శ వస్తోంది. ప్రస్తుతం శ్రీవారి కేంద్రంగా సాగుతున్న అవాంఛనీయ వివాదంపై ప్రజానీకం ఏ మాత్రం సంతోషంగా లేరని గ్రహించి, ఆ తర్వాత పాలకులు ఏం చేయాలో నిర్ణయించుకోవాలి.
PSV APPARAO
670 views
2 months ago
#తిరుమల శ్రీవారి లడ్డూ పై రాజకీయ దుమారం #తిరుమల లడ్డు #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #తిరుమల తిరుపతి దేవాలయ భక్తి సమాచారం🙏 #తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారము కల్తీ చేయక, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లడ్డూ ప్రసాదం చేసావా @ysjagan ? ఏ మొఖం పెట్టుకుని, క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పుకుంటున్నావ్ ? #TirumalaLaddooKalteeNijam #JaganMahaPapamNijam #ShameOnYouJagan #AntiHinduJagan #StopHurtingHindus #PsychoFekuJagan