మన భారతదేశ చరిత్ర🇮🇳🇮🇳

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
669 views
2 months ago
*భారతీయులారా ఫేస్బుక్ మిత్రులారా మీకు ఇవి తెలుసా* 👉భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట) 👉భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య) 👉ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మనమే (సుశ్రుతుడు) 👉 విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే (అగస్త్యుడు) 👉 విమాన శాస్త్రాన్ని అందించింది మనమే (భరద్వాజమహర్షి) 👉భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన *వరాహమిహిరుడు* మనవాడే 👉గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా *అక్షరలక్ష* రాసిన *వాల్మీకి మహర్షి* మనవాడే 👉రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు 👉కాస్మోలజీ చెప్పిన కపిలుడు 👉అణువులు గురించి వివరించిన కణాదుడు 👉DNA గురించి చెప్పిన బోధిధర్మ 👉మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి 👉మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన ఉత్సమధుడు 👉సంగీతాన్ని (స.రి.గ. మ. ప) ప్రపంచానికి అందించిన స్వాతి ముని ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు🙏 *ఎందరో మహానుభావులు అందరికీ వందనములు* #తెలుసుకుందాం #🌍మన దేశచరిత్ర #🌍ఇండియన్ హిస్టరీ #మన భారతదేశ చరిత్ర🇮🇳🇮🇳 #ఇండియన్ హిస్టరీ 🇮🇳
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
702 views
2 months ago
గౌతమీపుత్ర శాతకర్ణి ఈ పేరు ఎందుకు వచ్చింది..? ఇది గోత్రం కాదు ఇది మతం కాదు ఇది మాతృ ఆధారిత రాజ్య రాజకీయ ప్రకటన గౌతమీపుత్ర శాతకర్ణి ఈ పేరు శాతవాహన చరిత్రలో సాధారణ పేరు కాదు. ఇది ఒక స్పష్టమైన రాజకీయ ప్రకటన. ముందుగా ఒక విషయం తేల్చుకుందాం. శాతవాహన కాలంలో ఈరోజు మనం అర్థం చేసుకునే విధమైన బ్రాహ్మణ గోత్ర వ్యవస్థ పితృసామ్య ఆధారిత మత వ్యవస్థ ఉన్నట్టు శాసనాల ద్వారా పురావస్తు ఆధారాల ద్వారా విదేశీ వర్ణనల ద్వారా ఎక్కడా నిర్ధారణ లేదు. అలాంటి వ్యవస్థ నిజంగా ఉన్నట్లయితే రాజు పేరు తప్పనిసరిగా తండ్రి వంశాన్ని ఆధారంగా తీసుకుని ఉండాలి. కానీ శాతవాహన శాసనాల్లో కనిపించేది అది కాదు. గౌతమీపుత్ర శాతకర్ణి అంటే గౌతమీ కుమారుడు అయిన శాతకర్ణి. ఇక్కడ తండ్రి పేరు లేదు. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది పొరపాటు కాదు. ఇది సంప్రదాయ విరుద్ధం కాదు. ఇది ఉద్దేశపూర్వకమైన రాజకీయ నిర్ణయం. శాతవాహన కాలంలో రాజ్యాధికారానికి ఒకటి కంటే ఎక్కువ వంశ శాఖలు ఒకటి కంటే ఎక్కువ వారసత్వ పోటీలు ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో తండ్రి వంశం ద్వారా హక్కు ప్రకటించడం అస్థిరంగా మారుతుంది. అందుకే రాజ్య చట్టబద్ధతను తల్లి ద్వారా ప్రకటించారు. తల్లి గుర్తింపు స్పష్టంగా ఉంటుంది. తల్లి ద్వారా వంశ సంబంధాలు రాజకీయంగా స్థిరంగా ఉంటాయి. అందుకే రాజు పేరు మాతృనామంతో వచ్చింది. ఇది కుటుంబ మాతృసామ్యం కాదు. ఇది సామాజిక మాతృసామ్యం కాదు. ఇది రాజకీయ మాతృ ఆధారిత గుర్తింపు వ్యవస్థ. ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది. “గౌతమ” అంటే బ్రాహ్మణ గోత్రం కదా అయితే ఇది గోత్రం కాదా? స్పష్టంగా చెప్పాలి. శాతవాహన కాలంలో గోత్రం అనే పితృసామ్య వ్యవస్థే లేదు. గోత్రం అంటే: తండ్రి వంశం..తల్లి పేరు రాజకీయంగా అప్రాసక్తం మొత్తం సామాజిక నియంత్రణ పితృసామ్యంపై ఆధారితం కానీ శాతవాహన శాసనాలు: తల్లి పేరును కేంద్రంగా పెట్టాయి తండ్రి పేరును పక్కన పెట్టాయి ఇది గోత్ర వ్యవస్థ నిర్వచనానికే విరుద్ధం. అందువల్ల శాతవాహన శాసనాల్లో కనిపించే గౌతమ, వాసిష్ఠ వంటి పేర్లు బ్రాహ్మణ గోత్రాలు కావు. అవి: మత గుర్తింపులు కావు, యజ్ఞ వ్యవస్థ ప్రకటనలు కావు, బ్రాహ్మణ ఆధిపత్యానికి ఆధారాలు కావు అవి కేవలం ఆ కాలంలో వాడిన వ్యక్తి లేదా వంశ గుర్తింపు సూచికలు మాత్రమే. తరువాతి శతాబ్దాల్లో ఈ పేర్లను బ్రాహ్మణ గోత్రాలుగా వ్యవస్థీకరించారు. ఆ తరువాతి నిర్మాణాన్ని తిరిగి శాతవాహన కాలానికి అంటగట్టడం చరిత్ర కాదు అధికారం కోసం చేసిన రీ-రైటింగ్. ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. శాతవాహన కాలంలో బ్రాహ్మణ పితృసామ్య వ్యవస్థ నిజంగా రాజ్యాన్ని నియంత్రించి ఉంటే మాతృనామ రాజు పేర్లు అసాధ్యమే. కానీ వాస్తవం ఏమిటంటే గౌతమీపుత్ర శాతకర్ణి వంటి పేర్లు అపవాదాలు కాదు సంప్రదాయమే. ఇది స్పష్టంగా చెబుతుంది: శాతవాహన రాజ్య నిర్మాణం బ్రాహ్మణ పితృసామ్యంపై ఆధారపడలేదు. ఈ పేరు గోత్ర గర్వం కాదు మత ప్రకటన కాదు ఇది మహిళ రాజకీయ ప్రాధాన్యతకు శాసనాల్లో లభించే స్పష్టమైన ఆధారం. గౌతమీపుత్ర శాతకర్ణి అంటే ఒక రాజు మాత్రమే కాదు ఒక వ్యవస్థ. మాతృ ఆధారిత రాజ్య చట్టబద్ధత యొక్క పేరు. #తెలుసుకుందాం #🌍మన దేశచరిత్ర #🌍ఇండియన్ హిస్టరీ #ఇండియన్ హిస్టరీ 🇮🇳 #మన భారతదేశ చరిత్ర🇮🇳🇮🇳
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
574 views
6 months ago
కళింగ యుద్ధం తరువాత అశోకుడు యుద్ధాన్ని విడిచిపెట్టి, బౌద్ధమతాన్ని స్వీకరించి, ధర్మాన్ని ప్రచారం చేయడం అందరికీ తెలిసిందే. అయితే, అశోకుడి జీవితంలో ఒక రహస్యమైన సంఘటన ఉంది, అది ఈనాటికీ ఆసక్తికరంగా ఉంది. కళింగ యుద్ధంలో జరిగిన అపారమైన ప్రాణ నష్టాన్ని చూసిన అశోకుడు, మానవాళికి విపత్తును కలిగించే జ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఆయన ఒక రహస్య సంస్థను ఏర్పాటు చేశాడని పురాణాలూ, కొన్ని కథనాలూ చెబుతాయి. అశోకుడు తొమ్మిది మంది అత్యంత తెలివైన, విశ్వసనీయ వ్యక్తులను ఎంపిక చేసి, వారికి ఒక్కొక్కరికీ ఒక ముఖ్యమైన 'విజ్ఞాన పుస్తకాన్ని' లేదా రహస్యాన్ని అప్పగించాడు. ఈ తొమ్మిది మంది తమకు అప్పగించిన జ్ఞానాన్ని రహస్యంగా ఉంచడానికి మరియు దానిని దుర్వినియోగం కాకుండా కాపాడటానికి నిరంతరం కృషి చేసేవారు. ఈ రహస్య సంఘం తరతరాలుగా కొనసాగుతూ, నేటికీ ఆ తొమ్మిది పుస్తకాలు లేదా రహస్యాలు జాగ్రత్తగా ఉంచబడుతున్నాయని నమ్మకం. ఈ తొమ్మిది పుస్తకాలలోని రహస్యాలు ప్రతి పుస్తకం ఒక ప్రత్యేకమైన విజ్ఞాన రంగానికి చెందింది. 1) యుద్ధ విజ్ఞానం (Warfare/Propaganda) 2) గురుత్వాకర్షణ (Gravity) 3) సూక్ష్మజీవశాస్త్రం (Microbiology) 4) రసవాదం (Alchemy) 5) సమాచార వ్యవస్థ (Communication) 6) సమయాన్ని నియంత్రించడం (Time Travel) 7) కాంతి విజ్ఞానం (Light) 8) ఆకర్షణ శక్తి (Hypnosis/Telepathy) 9) వస్తు నిర్మాణ శాస్త్రం (Architecture/Engineering) ఈ తొమ్మిది మంది వ్యక్తులు మరియు వారి రహస్య పుస్తకాల కథలు పూర్తిగా నిరూపించబడనప్పటికీ, ఇవి భారత చరిత్రలోని అత్యంత ఆసక్తికరమైన మరియు మిస్టరీ నిండిన అంశాలలో ఒకటిగా మిగిలిపోయింది. #తెలుసుకుందాం #history #మన భారతదేశ చరిత్ర🇮🇳🇮🇳 #మన చరిత్ర #మన దేశ చరిత్ర