🥵రోజురోజుకీ భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు🔥

బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
584 వీక్షించారు
1 రోజుల క్రితం
పెట్రోల్,డీజిల్ ధరల పెంపు సామాన్య ప్రజలకు ఓ గుదిబండ,మోయలేని భారంగా పరిణమించింది! అసలే వంట గ్యాస్ ధర పెంపుతో కుదేలైన సామాన్య,మధ్య,దిగువ తరగతి ప్రజలు ఇటీవల పెట్రోల్( 3.29),డీజిల్ ( 3.14) ధరలు పెరుగుదలతో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందన సామాన్య ప్రజల పరిస్థితి గోరుచుట్టు మీద రోకలిపోటులా తయారైంది అనే మాట అక్షర సత్యం.దీంతో దీని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై అంటే కూరగాయలు,పాలు,గుడ్లు వంటి వాటిపై చూపి తద్వారా వాటి ధరలు ఆకాశాన్ని అంటి సామాన్య ప్రజల జీవన స్థితిగతులను అగమ్యగొచరంగా, అస్థవ్యస్థంగా,అదొగతి పాలు చేస్తున్నది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగేంతవరకు స్తబ్దుగా,కాస్తంత గుంభనంగా, రహస్యంగా,దాపరికంగా ఉన్న కేంద్రప్రభుత్వం ఎప్పుడైతే అయా రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయో లేదో సత్వరమే పెట్రోల్,డీజిల్ ధరల వడ్డనకు స్వీకారం చుట్టి సామాన్య,మధ్య,దిగువ తరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులలోకి నెట్టివేసింది,వారి నడ్డి విరిచింది.అంతేకాదు ఎప్పుడైతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారో ఇక అక్కడినుంచి ఆటోవాలాల పరిస్థితి,దీనావస్థ చెప్పచాలని కాదు,ఓక వైపు సరిఅయిన గిరాకీ లేక మరోవైపు తమ కుటుంబ పోషణ సైతం వారికి ఓ గగన కుసుమమై అల్లాడిపోతున్న నేపథ్యంలో అగ్గికి వాయువు తోడైయినట్లు కేంద్రప్రభుత్వం వారు ఈ పెట్రోల్,డీజిల్ ధరలను పెంచి వారిని మరింత అగాధం లోకి,కష్టాల సుడిగుండంలోకి నెట్టివేశారు అనే మాట సత్యదూరం కాదు.అంతటితో ఆగక ఈ పెట్రోల్,డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం ప్రదానంగా నంద్యాల జిల్లాలో భాగమైన కొలిమిగుండ్ల,బనగానపల్లె,బేతంచెర్ల మండలాల్లో ఉన్న వందలాది నాపరాయి పరిశ్రమలపై పడి,తద్వారా రవాణా ఖర్చులు పెరిగి తాము భారీ స్థాయిలో నష్టపోవడం తథ్యం అని క్వారీ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఎందుకంటే ఈ మూడు మండలాల నుంచి ప్రతి రోజు వందలాది వాహనాల్లో నాపరాళ్లను,పాలిష్ స్టోన్స్ ను కర్ణాటక, తమిళనాడు,మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు.అలాగే వీటి ప్రభావం పాలిష్ ఫ్యాక్టరీలపై పడటమే కాదు వాటి ప్రభావం ప్రత్యక్షంగా,పరోక్షంగా పాలిష్ ఫ్యాక్టరీలలో పనిచేసే 40 వేల మంది కార్మికులపై పడి వారి జీవితాలు తీవ్ర సంకట పరిస్థితుల్లోకి నెట్టివేయబడతాయి.అదేమాదిరి ఈ ధరల పెరుగుదల మూలాన గనుల్లో నాపరాళ్లను వెలికితీసేందుకు వాడే డీజిల్ కోత మిషన్లపై తీవ్ర ప్రభావం చూపి వాటి వాడకం సైతం ఓ గగన కుసుమంగా,తీవ్ర సంకటంగా పరిణమిస్తుంది అనే మాట సత్యదూరం కాదు. ఏదిఏమైన అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి అనే ఓ కుంటి సాకును లేవదీసి, పెట్రోల్,డీజిల్ ధరల వడ్డన తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం వారు సెలవిస్తున్నప్పటికి దీని ప్రభావం ఎటుతిరిగి సామాన్య,మధ్య,దిగువ తరగతి ప్రజలపై తీవ్రంగా పడి వారి జీవన స్థితిగతులు కడు దుర్భరంగా మారి,వారి కుటుంబ పోషణ సైతం ఓ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలాగైనా ఈ పెట్రోల్,డీజిల్ ధరల తగ్గింపుకు సత్వరమో లేదా మున్ముందో కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం దేశవ్యాప్తంగా సామాన్య,మధ్య,దిగువ తరగతి ప్రజల నుంచి తీవ్ర నిరసన,వ్యతిరేకత వ్యక్తం అవ్వడం తథ్యం.ఏమైన కేంద్రప్రభుత్వం వారు తీసుకున్న ఈ ప్రజా వ్యతిరేఖ కఠిన నిర్ణయం మూలాన దేశావ్యాప్తంగా కూడా సామాన్య,మధ్య,దిగువ తరగతి ప్రజల పరిస్థితి మరింతగా అంటే రోజు రోజుకు ఓ కడు దుర్భరంగా, దయనీయంగా మారి వారంతా ఈ ధరల బాదుడు దాటికి రోడ్డు మీద పడే పరిస్థితి దాపురిస్తుంది అనే మాట అక్షర సత్యం.సామాన్య,మధ్య,దిగువ తరగతి ప్రజల జీవితాలు వర్ధిల్లాలి మరో పది కాలాల పాటు అత్యంత దిగ్విజయంగా! వారంతా ఈ ధరల బాదుడు అనే కష్టాల సుడిగుండం నుంచి వీలయినంత త్వరగా గట్టేక్కేలా మన కేంద్ర ప్రభుత్వం ఓ మంచి ప్రజా అమోదయోగ్యమైన సుపరిపాలన సాగించాలి! జైహింద్! మేరా హిందూస్తాన్ మహాన్!✍️✍️✍️ - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు #😱మండుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు😱