🙏 Sri mahalaxmi

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
749 views
1 months ago
"లక్ష్మీదేవికి తామర పువ్వుతో పూజ ఎందుకు చేస్తారు" 🪷🪷🪷🙏🏻పురాణాల ప్రకారం దేవతలు దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని అంటే పాలసముద్రాన్ని మథిస్తున్నప్పుడు ఆ సముద్రం నుండి అఖండమైన కాంతితో చేతిలో వికసించిన తామర పువ్వును పట్టుకుని ఒక పెద్ద తామర పువ్వుపై ఆసీనురాలై లక్ష్మీదేవి ఆవిర్భవించింది, అందుకే అమ్మవారిని పద్మప్రియ, పద్మాసని అని పిలుస్తారు పుట్టుకతోనే తామరతో ముడిపడి ఉండడం వల్ల అమ్మవారికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది, ప్రతిరోజూ లక్ష్మీదేవికి తామర పూలు తెచ్చి పూజ చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు అందుకే శాస్త్రాలలో ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం చెప్పారు, తామర పువ్వు ఎండిపోయిన తర్వాత వచ్చే గింజలతో తయారుచేసే తామర గింజల మాల సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం, తామర గింజల మాలతో లక్ష్మీ పూజ చేస్తే నిరంతరం అమ్మవారికి తామర పూలతో అర్చన చేసినంత ఫలితం దక్కుతుంది, తామర గింజలకు మనసును ప్రశాంత పరిచే గుణం ఉంది లక్ష్మీదేవి చంచలమైనది ఒకచోట స్థిరంగా ఉండదు కానీ ఈ మాల ఉన్నచోట అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది, తామర గింజలను కుబేర విత్తనాలు అని కూడా అంటారు, తామర పువ్వు ప్రత్యేకత ఏంటంటే బురదలో పుట్టినా దానికి అంటుకోకుండా నిర్మలంగా వికసిస్తుంది అదే విధంగా మనిషి కూడా లోకంలో జీవిస్తూ చెడు గుణాలకు లోనుకాకుండా పవిత్రంగా జీవించాలని ఈ పుష్పం సూచిస్తుంది.లక్ష్మీదేవి ఎవరిని వరించింది? లక్ష్మీదేవి ఒక్కసారి అందరి వైపు చూసింది. ఇంద్రుడికి అహంకారం ఉంది. రాక్షసులకు క్రూరత్వం ఉంది. బ్రహ్మకి సృష్టి బాధ్యత ఉంది. కానీ ఒక్క విష్ణుమూర్తి మాత్రం ప్రశాంతంగా, చిరునవ్వుతో, శాంత స్వరూపుడై కనిపించాడు. లక్ష్మీదేవి వెంటనే ఆ తామర పువ్వు మీద నుండి లేచి, చేతిలో ఉన్న "వరమాల" విష్ణుమూర్తి మెడలో వేసింది. అప్పటి నుండి లక్ష్మీనారాయణులు అయ్యారు. లోకానికి ధనం, ఐశ్వర్యం, సంతోషం పంచడం మొదలుపెట్టారు. 🌷 మరి కలువ పువ్వు కథ ఏంటి ? లక్ష్మీదేవికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు అంటారు: "జ్యేష్ఠా దేవి" = దరిద్రం, "అలక్ష్మి". లక్ష్మి పగలు తామర పువ్వులో ఉంటే, రాత్రి పూట జ్యేష్ఠా దేవి తిరుగుతూ ఉంటుంది. అందుకే మన పెద్దలు రాత్రి పూట "నీలి కలువ" పువ్వు లక్ష్మీదేవికి పెడతారు. అర్థం: "అమ్మా, చీకటి పడింది. జ్యేష్ఠా దేవి వస్తుంది. నువ్వు ఈ కలువ పువ్వులో కూర్చుని మా ఇంటికి కాపలా ఉండు. దరిద్రాన్ని రానివ్వకు." కలువ రాత్రి వికసిస్తుంది కదా? అంటే లక్ష్మి రాత్రి కూడా మేలుకుని మనల్ని కాపాడుతుంది అని. తామర పగలు వికసిస్తుంది = పగలు కష్టపడి పనిచేసే వాళ్లకి ధనం ఇస్తుంది. తామర = "స్థిర లక్ష్మి" - ఇంట్లో నిలిచి ఉండే ధనం. 2. కలువ = "చంచల లక్ష్మి" - వ్యాపారం, రాకపోకల వల్ల వచ్చే లాభం. రెండూ నీళ్లలో పుడతాయి. నీళ్లు ఎప్పుడూ ఒకచోట నిలవవు కదా? అలాగే డబ్బు కూడా. కానీ ఆ నీళ్లలోనే తామర, కలువ స్థిరంగా ఉంటాయి. అంటే: "అమ్మా, డబ్బు చేతులు మారినా, నా దగ్గర నిలకడగా ఉండేలా చెయ్" అని అర్థం. #మహాలక్ష్మి #శుక్రవారంపూజ #తామరపువ్వు🪷 #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #శ్రీ మహాలక్ష్మి దేవి #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2.1K views
1 months ago
#తెలుసుకుందాం #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి #శ్రీ మహాలక్ష్మి దేవి #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏 *లక్ష్మీదేవి కుంకుమపూజ ఎవరుచేయాలి* లక్ష్మీఅమ్మవారి కుంకుమ పూజ ఎవ్వరైనా చేయచ్చు, పిల్లలు చేస్తే అమితంగా ఆనందపడుతుంది. మగవారు చేస్తే వీడు నా బిడ్డ అని ఆశీర్వదిస్తుంది స్త్రీలు చేస్తే ! వారిలో..అమ్మవారు తన రూపాన్ని చూసుకుంటుంది. అవును ఆడవారు కుంకుమ పూజ చేస్తూ లక్ష్మీ సహస్త్రనామం పారాయణం చేస్తున్న సమయంలో అమ్మవారు వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది. ఏమిటి నిదర్శనం అంటారా, వశిన్యాది దేవతలకు శ్రీలక్ష్మి సహస్త్రనామం రహస్యo చెప్పమని ఆజ్ఞాపించినప్పుడు అమ్మవారు వారితో 'పలికేది మీరైన మీలో ఉండి పలికించేది నేనే" అని చెప్పారు కదా.అలాంటి లక్ష్మీసహస్రనామ పారాయణం చేస్తూ కుంకుమ పూజ చేస్తున్న స్త్రీ రూపంలో అమ్మవారు ఆనందంతో వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది. అంత కన్నా ఏమీ వరం కావాలి. అమ్మవారి రూపంగా నీ రూపాన్ని అమ్మవారు భావించగానే నీ పాపములన్ని నశించి పోతాయి నీ దేహం మనసు పవిత్రం అవుతుంది, మళ్ళీ ఏదైనా పాప కర్మలు చేసి మురికిని అంటించుకుంటున్నారు కానీ..సదా సత్ ప్రవర్తనతో ఉంటే లక్ష్మి ఉపాసన చేసే ప్రతి స్త్రీ లక్ష్మిదేవి అమ్మవారి స్వరూపాలే. ప్రతి స్త్రీ కూడా లక్ష్మి దేవి స్వరూపమే అయితే ప్రవర్తన కర్మను అనుసరించి, పాజిటివ్ ఎనర్జీ ,నెగటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది, అంటే దేవతగా ఉండాలన్నా, దయ్యంగా ఉండాలి అన్నా వారి వారి ప్రవర్తన వల్ల ఆ రూపం వారిలో మేలుకుంటుంది. ఎంత ఖర్చు పెట్టి ఎన్ని పూజలు చేయించినా నలుగురు ఆడవారి చేత లక్ష్మిదేవి కుంకుమ పూజ చేయించనిదే అక్కడ జరిగిన అమ్మవారి పూజకు ఫలితం ఉండదు. ఎంత మందిని ఒక్క చోట చేర్చి లక్ష్మి దేవి కుంకుమ పూజ చేయిస్తే ఆ కార్యానికి అంత శుభం కలుగుతుంది.🙏🙏🙏🙏🙏