self only one

P.Venkateswara Rao
4.4K views
4 days ago
#🏏క్రికెట్ 🏏 #ఒకే ఒక్కడు Manav Suthar Creates History: *అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు..‼️* 08.06.2026🏏 భారత యువ ఆల్‌రౌండర్ మనవ్ సుతార్ టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్ర మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన సుతార్, ప్రపంచ క్రికెట్‌లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు బంతితో వికెట్లు పడగొట్టడమే కాకుండా, బ్యాట్‌తో విలువైన పరుగులు చేయడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటిన అతడు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు ఇది అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయానికి మనవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు. ఆఫ్ఘనిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో సుతార్ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేశాడు. 20 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్ట్ అరంగేట్రంలోనే ఆరు వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌లోనూ సుతార్ తన ప్రతిభను నిరూపించాడు. భారత్ తన ఏకైక ఇన్నింగ్స్‌లో 564/8 డిక్లేర్ స్కోరు నమోదు చేసిన సమయంలో, సుతార్ 41 బంతుల్లో 28 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం. అంతేకాకుండా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మూడు క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో మనవ్ సుతార్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అరంగేట్ర టెస్టులో 25 కంటే ఎక్కువ పరుగులు చేయడం, ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం, మూడు లేదా అంతకంటే ఎక్కువ క్యాచ్‌లు పట్టడం అనే అరుదైన త్రివిధ ఘనతను సాధించిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఇంతకు ముందు ఈ ఘనతను కేవలం ముగ్గురు మాత్రమే సాధించారు. 1895లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌కు చెందిన ఆల్బర్ట్ ట్రాట్, 1922లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అలెక్స్ కెన్నెడీ, 1977లో పాకిస్థాన్‌పై వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జోయెల్ గార్నర్ ఈ ఫీట్‌ను నమోదు చేశారు. ఆ తర్వాత దాదాపు 49 సంవత్సరాల పాటు ఎవరూ ఈ ఘనతను అందుకోలేకపోయారు. ఇప్పుడు 1824వ టెస్ట్ మ్యాచ్‌లో మనవ్ సుతార్ ఈ అరుదైన రికార్డును తిరిగి నమోదు చేశాడు. ఇదే కాకుండా, తన అరంగేట్ర టెస్టులోనే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న తొమ్మిదో భారత ఆటగాడిగా కూడా సుతార్ నిలిచాడు. గతంలో ప్రవీణ్ ఆమ్రే, ఆర్‌పీ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ వంటి భారత క్రికెటర్లు ఈ ఘనత సాధించారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన మనవ్ సుతార్, భారత క్రికెట్‌కు మరో భవిష్యత్ స్టార్‌గా అవతరించాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడి అద్భుత ప్రదర్శన ఇప్పుడు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
failureboy
1.1K views
27 days ago
Be only one kill any one love any one rule urs only one 👍 #self only one
P.Venkateswara Rao
1K views
1 months ago
#ఒకే ఒక్కడు చరిత్రను తిరగరాయాలన్నా.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలన్నా అది ఒక "మహా నేతకే" సాధ్యం! 🦁 నాడు అన్నగారు (NTR), నేడు దళపతి విజయ్. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకులు. ఒకరు 9 నెలల్లో ప్రభంజనం సృష్టిస్తే, మరొకరు 27 నెలల్లో అధికారం దిశగా అడుగులు వేస్తున్నారు. ​రాజకీయం అంటే గెలవడం మాత్రమే కాదు.. గుండెల్లో నిలవడం! ✊🔥 #NTR # #TVK #TVKVijay
P.Venkateswara Rao
619 views
1 months ago
* #ఒకే ఒక్కడు… టెన్త్ పాసయ్యాడు… టీచర్లు దీపావళి జరుపుకున్నారు…‼️* May 2, 2026🎯 తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి… ఇన్ని మార్కులు, మా ఘనత అని కార్పొరేట్ స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లు కూడా బోలెడు యాడ్స్ ఇచ్చుకుని ప్రమోట్ చేసుకుంటున్నాయి… ఇదంతా కామన్… కానీ ఒక విద్యార్థి… ఒకే విద్యార్థి ఫలితం మాత్రం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకట్టుకుంది… ఆ కథేమిటో ముందు చెప్పుకుందాం… పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం, మల్లాపూర్ జెడ్పీ హైస్కూల్‌… అందులో చదువుతున్న ఏకైక పదో తరగతి విద్యార్థి పాసయ్యాడు… తన పేరు గుంటి మధు… 429 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు…. మధు స్కూల్‌కు వెళ్లకపోయినా సరే, ఉపాధ్యాయులు పట్టుదలతో అతడి ఇంటికెళ్లి పాఠాలు చెప్పారు… మధు పాస్ కావడం తన అవసరం కాదు, అది ఉపాధ్యాయుల అవసరం… సరే, మధు ఉత్తర్ణుడు కావడంతో… ఉన్నదే ఒక్క టెన్త్ స్టూడెంట్… సో, స్కూల్ జీరో పర్సెంట్ ఫలితాల నుంచి బయటపడింది… స్కూల్‌లో పనిచేసే ఉపాధ్యాయులు ఆనందంలో ఉన్నారు…. కాదు, ఊపిరి పీల్చుకున్నారు… హమ్మయ్య, పాసయ్యావురా బాబూ, బతికించావు అనుకున్నారు… ఖుషీ అయ్యారు, స్వీట్లు కూడా పంచుకున్నారేమో తెలియదు గానీ, అసలు కథేమిటంటే..? ఆ ప్రభుత్వ స్కూల్‌లోపదో తరగతి విద్యార్థి ఒక్కడే ఉన్నాడు… అక్కడ ఏడుగురు ఉపాధ్యాయులు ఉంటే… స్కూల్‌లో విద్యార్థులు ఆరుగురే ఉన్నారు… టెన్త్‌లో ఉన్న ఒకే ఒక్కడు పాసైతే స్కూల్‌ పదోతరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లవుతుంది… అంతా మాయ, లెక్కల మాయ… ఒకవేళ మధు ఫెయిలైతే ఉత్తీర్ణత శాతం సున్నాగా ఉండేది… అందుకని ఉపాధ్యాయులు ఎలాగైనా మధును పాస్ చేయించాల్సిందేనని భీష్మ ప్రతిజ్ఞలు చేసుకున్నారు… ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు… ఒరే, బాబూ, కాస్త రోజూ స్కూల్‌కు రారా నాయనా అనడిగారు… ఎహె, వస్తే వస్తా, లేకపోతే లేదు, నా ఇష్టం అన్నాడేమో… అసలు క్లాస్ మేట్స్ లేరు అనుకున్నాడేమో, రెగ్యులర్ హాజరు ఉండేది కాదు… తీట టీచర్లది కదా,.. మధు ఇంటికే వెళ్లి పాఠాలు చెప్పేవాళ్లు… సరే, ఏదో ఆ టీచర్ల లక్ ఫలించింది… మధు 429 మార్కులతో పాసయ్యాడు… సో, మధు క్లాస్‌లో టాపర్, స్కూల్‌లో టాపర్, పదో తరగతిలో ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు… ఇక్కడ కొన్ని చేదు నిజాలు చెప్పుకోవాలి… ఏడుగురు టీచర్లు… జస్ట్, ఆరుగురు స్టూడెంట్లు… అర్థం చేసుకొండి… ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంత..? ఎందరికి ప్రయోజనం..? దగ్గరలోని వేరే హైస్కూల్‌లో విలీనం చేస్తే తప్పేముంది..? అసలు అది కాదు సమస్య… అనేకచోట్ల విద్యార్థులు బోలెడు, టీచర్లు సరిపోరు… కానీ కొన్నిచోట్ల స్టూడెంట్లు ఉండరు, టీచర్లు బోలెడు… హేతుబద్ధీకరణ ఏది..? ఏ ప్రభుత్వమైనా చేయలేని పని అది… ఖజానా మొత్తం జీతభత్యాలకే ఖర్చయిపోతోంది అని బాధపడే రేవంత్ రెడ్డి కూడా చేయలేని టాస్క్ ఇది… ఉద్యోగులతో, అదీ ప్రభుత్వ టీచర్లతో, యూనియన్లతో ఎవరూ గోక్కోరు… మరో నిజం ఏమిటంటే..? ప్రైవేటు వైపు విద్య వెళ్లిపోతూనే ఉంటుంది, ప్రభుత్వ బడి ఇంకా ఇంకా దెబ్బతింటూనే ఉంటుంది… రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్న ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూళ్లు సక్సెస్ కావడం మాత్రమే కాదు, జీరో ఎన్‌రోల్‌మెంట్, లెస్ ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్ల విలీనం కూడా ఈ సమస్యకు ఓ పరిష్కారం…!!