నేడు జగన్ పర్యటన ఇలా

P.Venkateswara Rao
575 వీక్షించారు
6 నెలల క్రితం
#ఏపీ అప్ డేట్స్..📖 #నేడు జగన్ పర్యటన ఇలా *టిడిపి కూటమిలో వణుకు.. జగన్ కు జన నీరాజనాలు..❗* Pandrala Sravanthi 10/10/2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఒకవైపు ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు ఉంటుంది.. 2024 ఎలక్షన్స్ లో వీరంతా జట్టు కట్టి జగన్ ను దారుణంగా ఓడించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేశారు. చివరికి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ జనం జగన్ ను మరిచారని, అందుకే ఆయనకు ఆ సీట్లు వచ్చాయని తెలియజేశారు.. నిజంగానే జగన్ ను జనం మరిచిపోయారా.. జగన్ ను మర్చిపోతే ఆయన బయట అడుగుపెడితే ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారు అనే వివరాలు చూద్దాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి.. ఇందులో 11 జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలిస్తే మిగతావన్నీ టిడిపి,బిజెపి, జనసేన పార్టీ లు గెలిచాయి. ఇందులో చాలా సీట్లు కొద్దిపాటి మెజారిటీతోనే గెలిచాయని చెప్పవచ్చు. ఒకవేళ జనసేన బిజెపి ఎవరికి వారే పోటీ చేస్తే అక్కడ జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చేవారు. కానీ వారంతా కలిసి జట్టు కట్టడం వల్లే జగన్ అక్కడ ఓటమిపాలయ్యారు. అలాంటి జగన్ ను ప్రజలు మొత్తం మర్చిపోయారని టిడిపి కూటమి నాయకులు అంటున్న ఈ సమయంలో తాజాగా జగన్ ర్యాలీకి వచ్చిన రెస్పాన్స్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారట. జగన్ మొత్తం 60 కిలోమీటర్లు రోడ్ షో చేసేసారు. ఈ 60 కిలోమీటర్లు ఎక్కడికక్కడ జనం ఎగబడి మరీ జగన్ కోసం ఎదురుచూశారు. జగన్ వచ్చినప్పుడు ప్రజలకు బందోబస్తు ఏర్పాటు చేయడం మానేసి జగన్ వెనకాల ఎవరు రాకుండా ఆపేడానికే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విధంగా జనాలు చీమల లాగా పుట్లకొద్ది వచ్చారు. ఉదయం 11 గంటలకు మొదలైనటువంటి జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి కి వెళ్లడానికి కొన్ని గంటల సమయం పట్టింది. నిజానికి జగన్ కాన్వాయ్ స్పీడ్ కు కనీసం 35 నుంచి 40 నిమిషాల్లో అనకాపల్లి చేరుకోవాలి. కానీ 11 గంటలకు మొదలైన జగన్ 5 గంటలకి అనకాపల్లి చేరుకున్నారు. ఈ లెక్కన జనం ఆయనను అడుగడుగునా ఎంత ఆదరించారో అర్థం చేసుకోవచ్చు. ఎన్ ఈడి జంక్షన్,వేపగుంట, పెందుర్తి ,పుత్తూరు జంక్షన్, తాళ్లపాలెం జంక్షన్ వీటిని టచ్ చేసుకుంటూ జగన్ వెళ్లారు. భారీ వర్షం లో కూడా జనం రోడ్లపై నిలబడి జగన్ పై పూలు జల్లుతూ నీరాజనాలు పలికారు. దీన్నిబట్టి చూస్తే జగన్ కు ప్రజాదారణ లేదని చంద్రబాబు అన్న మాటల్లో ఎలాంటి నిజాలు లేదని అర్థం చేసుకోవచ్చు. జగన్ పై రోజు రోజుకు ప్రేమ పెరుగుతోంది.. దీన్ని బట్టి చూస్తే మాత్రం తప్పకుండా టిడిపి కూటమి ప్రభుత్వంపై జనాలకు కాస్త విరక్తి చెందినట్టే అనిపిస్తోంది. ఆయన యాత్రకు వచ్చిన రెస్పాన్స్ చూసి టిడిపి కూటమినేతలంతా అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసిన జనాలు ఆగలేదు. మొత్తానికి జగన్ యాత్రను చూసినటువంటి అధికార పార్టీ నాయకులకు వణుకు పుట్టిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
P.Venkateswara Rao
590 వీక్షించారు
6 నెలల క్రితం
#నేడు జగన్ పర్యటన ఇలా *జగన్ వెంట ఇంతమంది జనం రావడానికి అసలు కారణమిదేనా..❓* 12.10.2025🎯 జగన్మోహన్ రెడ్డి పోయిన ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. మొత్తం 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. మరి జగన్ ఇంతగా విఫలం కావడానికి కారకులు ఎవరు.. అసలు జగన్ వెంట జనమే లేకుండా అయిపోయారా.. మరి జగన్ సభలు పెడితే ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారు.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయి ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. దీనికి కారణం టిడిపి, జనసేన, బిజెపి జట్టు కట్టి జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టేశారు. ముఖ్యంగా ఈ ముగ్గురి ఓట్లు కలిపితే ఈసారి కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ జగన్ మాత్రం ఒక్కడే సింగిల్ గా కొట్లాడి వారందరినీ వణికించారు. ఒకవేళ జనసేన సపరేట్ గా పోటీ చేసి ఉంటే మాత్రం మళ్లీ జగనే అధికారంలోకి వచ్చి ఉండేవారు. నిజం చెప్పాలంటే జగన్ కి జనాల్లో ఎక్కువగా అభిమానం ఉంది. అలాంటి జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి బయటకు వస్తే ఆయనకు జననిరాజనం పలుకుతున్నారు. అయితే దీనికి కారణం టిడిపి కూటమిలో ప్రభుత్వ పాలన జనాలకు నచ్చడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి.. తాజాగా జగన్ నర్సీపట్నం టూర్ లో భాగంగా 60 కిలోమీటర్లు యాత్ర నిర్వహించాడు. ఐదు, పది కిలోమీటర్ల దూరంలో ఉండగానే హెలికాప్టర్లో వెళ్లిపోవచ్చు కానీ ఆయన అలా చేయకుండా 60 కిలోమీటర్ల దూరం స్లోగా వెళుతూ జనాలకు దగ్గరవుతూ కలుస్తూ నవ్వుకుంటూ అభివాదం చేసుకుంటూ వెళ్లారు. 11 గంటలకు స్టార్ట్ అయిన యాత్ర నర్సీపట్నం చేరేసరికి సాయంత్రం 5 అయింది. అయితే ఈ యాత్రకు పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు. జగన్ 60 కిలోమీటర్లు ఆ విధంగా చేస్తారని టిడిపి ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. అంతమంది జనాలు వస్తారా అంత ఖాళీగా ఉంటుంది కావచ్చు దాన్ని మనం సోషల్ మీడియా ద్వారా ప్రొజెక్ట్ చేయించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిడిపి ఆశపడింది. కానీ దానికి వ్యతిరేకంగా జగన్ యాత్రలో అడుగడుగునా నీరాజనం పలికారు. దీంతో ప్రభుత్వం వణికిపోయినట్టుంది. వెంటనే ఇంటిలిజెన్స్ బ్యూరో ద్వారా అసలు అంత మంది జనం ఎక్కడి నుంచి వచ్చారు..ఎలా వచ్చారు అనేది ఆరా తీసే ప్రయత్నంలో ఉన్నారు.. నిజానికి జగన్ పాలన ఉన్నప్పుడు ప్రతిదీ లైవ్ గానే జరిగిందని ప్రజల అభిప్రాయం. ఏ పథకమైన డైరెక్టుగా ఇంటికి వచ్చేది. జగన్ హయాంలో యువత చాలా డెవలప్ అయ్యారు. ప్రశ్నించడం నేర్చుకున్నారు. జగన్ పాలనే బాగుందనే అభిప్రాయం ప్రజల్లో ఇప్పటికి కూడా ఉంది. అందుకే జగన్ యాత్ర సమయంలో భారీ వర్షం లో కూడా 60 కిలోమీటర్లు అడుగడుగునా జనాలు ఆయనకు స్వాగతం పలికారు.