ఆషాడ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

the MEDIA POWER
136.2K views
21 days ago
🚨 కుక్క మూత్ర విసర్జన వివాదం.. యువకుడి దారుణ హత్య! 📍 ఖమ్మం నగరంలో సంచలన ఘటన ఖమ్మం నగరానికి చెందిన ఉండేటి శ్రీనాథ్ (23) డెకరేషన్ పనులు చేస్తూ రంగనాయకుల గుట్టలో నివాసం ఉంటున్నాడు. గురువారం అర్ధరాత్రి శ్రీనాథ్ తన స్నేహితుడు వీరేశ్‌తో కలిసి ఆటోలో కూర్చుని ఉన్న సమయంలో.. మధు తన పెంపుడు కుక్కను బయటకు తీసుకొచ్చాడు. 🐕 ఆ కుక్క శ్రీనాథ్ కూర్చున్న ఆటో వద్ద మూత్ర విసర్జన చేయడంతో శ్రీనాథ్, మధు మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. గొడవ తీవ్రరూపం దాల్చడంతో మధు తన ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి శ్రీనాథ్‌పై విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన శ్రీనాథ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు సమాచారం. 🚔 ఈ ఘటనపై ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ⚠️ చిన్న వివాదం.. చివరకు ప్రాణం తీసింది! _________ 📲 NEWS | INTERVIEWS | ADS & COLLABORATIONS 📞 9666033449 👍 Like | 💬 Comment | ↗️ Share 🔔 Follow & Subscribe – Media Power _______ #Khammam #KhammamNews #TelanganaNews #CrimeNews #BreakingNews #TeluguNews #MurderCase #CrimeNews #MediaPower ##RAJHన్యూస్
Panduranga Reddy kappati
5.3K views
1 months ago
AI indicator
ఆషాడ మాసం సందర్భంగా.. గోరింటాకు చరిత్ర తెలుసుకుందాం ..!!``` అసలు పేరు గౌరింటాకు…! గౌరి ఇంటి ఆకు…!! గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల ఔతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈవింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాతు పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నావలన లోకానికి ఏ ఉపయోగం కలదు? అని అడుగుతుంది. అపుడు పార్వతి(గౌరి) చిన్నతనపు చపలతతో ఆచెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి. అయ్యో బిడ్డచేయి కందిపోయినది అనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైనబాధా కలుగలేదు. పైగా చాలా అలంకారంగా అనిపిస్తోందీ అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈచెట్టు,స్త్రీలగర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తనవర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈచెట్టుజన్మకు సార్ధకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లూ అందంగా తీర్చుకుంటు ఉంటారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటన కూడా‌ ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో!! నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో ఆ సందేహం చెప్పగా…. నుదుటన పండదు అంటుంది. కావాలంటే చూడండీ గోరింటాకు నుదుటన పండదు. ఇక శాస్త్రపరంగా గర్భాశయదోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంత పరుస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింతచేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం ఔతాయి. ఇక మొగుడికీ గోరింటకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందు వలన దేహంకూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్నమ్మాయికి చక్కని భర్త వస్తాడూ ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడుకదా…. పెద్దోళ్ళు ఏం చెప్పినా మరీ ఓ పది పన్నెండు మైళ్ల దూరదృష్టి తోనే చెబుతారండీ. అపోహలేం కాదు. గోరింటి ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకూ అన్నివిధాలా ఆరోగ్యం ఆనందం. సంవత్సరానికోమారు పుట్టింటికి పోతుందండోయ్ గోరింటాకు. (గౌరీ ఆకు) అంటే పార్వతి దగ్గరికి వెళ్లి ఆషాడం అంత ఉండి శ్రావణ మాసం లో వచ్చేస్తుంది.. ఆషాఢమాసంలో అక్కడున్నపుడు కూడా తనను మరచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలనీ కోరిందట. అప్పుడు అమ్మ సరే అని వరము నొసగిందట. అందుకు  ఆషాఢంలో అందరూ గోరింటాకు పెట్టుకోవాలి! పెట్టుకుంటారు కదూ...!! సర్వం శ్రీకృష్ణార్పణమస్తు @కప్పాటి పాండురంగా రెడ్డి #ఆషాడ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? #ఆషాడ స్పెషల్ #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #😃మంచి మాటలు